వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, జులై 2009, గురువారం

విజ్ఞానశాస్త్రంపై మతదాడి-2

23 వ్యాఖ్యలు

చెరకుడు రోగాల కారణాలు, వాటి చికిత్స విషయంలో పరిశోధనా ఫలితాల నుండి విడివడి, పదార్థానికి సంబంధంలేని చికిత్సలను అంగీకరించడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి కారణం.. మనకు స్మృతుల్లోనూ, పురాణాల్లోనూ దొరుకుతుంది. వృత్తిదారులను, పురాణ రచయితల వైద్యులకు శస్త్రచికిత్సా నిపుణులను తీవ్రంగా నిరసించడమే కాదు. వారికి సంఘ బహిష్కరణ కూడా విధించారు. ఈ సందర్బంలో కింది ప్రకటనలను పరిశీలించాలి. వృత్తిదారుల్లో అగ్రేశరులైన మనువు వైద్యుని గూర్చి ఏమంటారో చదవండి. ''వైద్యునికి ఇచ్చిన ఆహారం, వైద్యుని నుండి తీసుకున్న ఆహారం చీములాగా అసహ్యామైనది. అది రక్తంలాంటిది. అంటాడు మనువు (మనుస్మృతి 214 పేజీ). అంతేకాదు...''శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు ఏ మత కర్మల్లోనూ.. చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215వ పేజీ). అంటే వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు ఎవరితో పోల్చదగ్గ వ్యక్తులు? దొంగలు, నేరస్తులతో సమానులని మనువు సెలవిచ్చి వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించాడు.

'మైత్రేయ ఉపనిషత్తు' పేర్కొన్న ధర్మ భ్రష్టుల జాబితాలో చేతిపనుల మీద జీవించేవారు, తిరుగుబోతులు, శూద్రులై కూడా చదువుకున్నవారు, నటులు, వ్యాధి నయం చేసేవారు ఉన్నారు.
ఇతర ఉపనిషత్తులు, మహాభారతం కూడా పై జాబితాను అంగీకరించాయి.
ఇంతకీ వైద్యులపై స్మృతికారులకు ఎందుకు ఇంత ద్వేషం? వ్యాధులతో గల కారణాల్ని పైన వివరించినవిధంగా పేర్కొనడమే. ''పూర్వ జన్మార్జితం పాపం.. వ్యాధిరూపేణ జాయితే'' (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి. కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు. మరి స్మృతికారులకు కోపం రాదా? అందుకే వారు వైద్యులను దొంగలను, నేరస్థులతో సమానం చేసి, వారిని సంఘ బహిష్కరణ చేశారు. చివరకు, చెరకుడు నుండి సామాన్యుని వైద్యుని వరకూ గత జన్మలోని పాపలే రోగాలకు కారణం అని అంగీకరించిన తర్వాత మాత్రమే వైద్యుల చికిత్సకు అంగీకరించారు.
(మిగతా తదుపరి టపాలో )

29, జులై 2009, బుధవారం

Supreme Court ‘no’ for panel to study EVMs

0 వ్యాఖ్యలు

Date:29/07/2009, Legal Correspondent

New Delhi: The Supreme Court on Monday declined to entertain a public interest litigation petition for a direction to appoint an expert committee to go into the working of electronic voting machines (EVMs) and submit a report to the court.

A bench of Chief Justice K.G. Balakrishnan, Justice P. Sathasivam and Justice Cyriac Joseph, while dismissing the PIL, gave liberty to the petitioners to approach the Election Commission and said it was for the Commission to consider their plea.

When the CJI asked counsel Sanjay Parikh, appearing for the petitioners V. Venkateshwara Rao and V. Laxman Reddy, associated with the Election Watch,Hyderabad, and Arunkumar Kankipati and Yagati Vasavya, experts, to approach the Commission, counsel said representation was already made and the Commission had stated that EVMs were foolproof.

The CJI said: We cant give any direction to the Election Commission. It is for the Commission to discuss such matters with all political parties and take a decision. Justice Sathasivam told counsel: We are not under-estimating the concern[s] raised in the petition but we are only saying that these issues are to be addressed to the Election Commission.

Counsel then said petitioners should be given the liberty to move the court after the Commission passed the order. The CJI said that liberty was always there.

Mr. Parikh submitted that in several democracies of the world where EVMs were being used, there were opposition and challenges before the courts. On March 3, the German Supreme Court declared that EVMs were untrustworthy and unconstitutional. It observed: Deliberate programming errors in the software perpetrate electoral fraud by manipulating the software of EVMs. He said a committee could go into the working of the EVMs. The PIL said that the petitioners had analysed the election results in various constituencies conducted with the help of EVMs and found that there was something drastically wrong with them. The petitioners also referred to the Commissions letter that out of 13.78 lakh EVMs used in the recent parliamentary elections, 9.30 lakh EVMs were old and 4.48 lakh were new machines, suggesting that improvements had been made in the EVMs.

28, జులై 2009, మంగళవారం

మైఖెల్‌ జాక్సన్‌ - కళ, కాసులు, మీడియా!

3 వ్యాఖ్యలు
మైఖెల్‌ జాక్సన్‌ మరణించి నెలరోజుల కావస్తున్నా మీడియాలో ఆయన గురించిన కథలు నిరంతరాయంగా వెలువడుతూనే వున్నాయి.ప్రపంచాన్ని ఉర్రూతలూపించిన కళా స్రష్ట ప్రతిభా పాటవాల కంటే ఆయన మరణానికి సంబంధించిన మిస్టరీపైన,వ్యక్తిగత జీవితంలో నీలి నీడలపైన ఈ కథనాలు సాగుతుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. పెట్టుబడిదారీ వ్యాపార వ్యవస్థ సహజ స్వభావాన్నీ, ప్రత్యేకించి మీడియాలో వేళ్లూనుకున్న వికృత పోకడలనూ మరోసారి కళ్లకు కట్టే సందర్భమిది.ప్రపంచ పాప్‌ సామ్రాట్‌ మైకెల్‌ జాక్సన్‌ హఠాత్తుగా మరణించాడన్న వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. కళాభిమానులందరినీ కదిలించి .ఓ కన్నీటి బొట్టు మౌనంగా జారిపోయేలా చేసింది. ఆయన ఆనారోగ్యంతోనూ అనేక సమస్యలు సంక్షోభాలతోనూ పోరాడుతున్నాడని తెలిసినా యాభై ఏళ్లకే కన్నుమూస్తాడని మాత్రం ఎవరూ అనుకోలేదు.అలాటి సమాచారం కూడా రాలేదు. తీరా అది జరిగిన తర్వాత అనేక ప్రశ్నలు సందేహాలూ తలెత్తడం సహజమే. ఎందుకంటే మైఖెల్‌ జాక్సన్‌ జీవితమూ కళా ప్రస్థానమూ కూడా ప్రపంచానికి పెద్ద వార్తలే. నలుపు తెలుపు మేళవించిన విశ్వ కళా సంచలనం ఆయన. తన చిటికెన వేలు కదిలిస్తే వేలం వెర్రిగా ఎగబడిన కోట్ల మంది సంగీతాభిమానులు ఒకవైపు.. ఆ ప్రతి కదలికనూ అక్షరాలా కోట్ల డాలర్లలోకి మార్చిన సామ్రాజ్యవాద ధనస్వామ్య సంస్కృతి మరోవైపు కళ్లముందు నిలుస్తాయి. వాటన్నిటినీ లోతుగా తర్కించడం ఇబ్బంది అనిపించినా ఆ వ్యక్తిత్వంలో పెనవేసకుపోయిన లక్షణాలివి. ఆయన అసాధారణ ప్రతిభ, కృషి ప్రప్రథమంగా స్మరించుకోవలసినవి. అవే లేకపోతే ప్రపంచం ఆయనను ఇంతగా ఆరాధించేది కాదు. ఇప్పుడు దేశ దేశాలలో కవులు,కళాభిమానులు అశ్రుతర్ఫణ చేసే వారు కాదు. అయితే ఈ ప్రపంచంపై రాజకీయ ఆర్థిక ఆధిపత్యం సాగిస్తున్న శక్తులే సాంస్కృతిక ఆధిపత్యమూ చలాయించడం కూడా ఆయన పేరు మార్మోగడానికి ఒక ప్రధాన కారణం. ఇక్కడ అసాధారణ జనాభిమానం గల మాస్‌ హీరోలూ, వారితో స్టెప్పులేయించే నృత్యదర్శకులూ ఆయనను తాము ఎలా అనుసరించిందీ ప్రకటిస్తున్నారు. ఆ అవసరం లేకుండానే రీప్లే చేస్తున్న ఆయన స్టెప్పులను చూసిన మామూలు ప్రేక్షకులు అవన్నీ తమకు చిరపరిచితమైనవని గమనించి మన వాళ్ల అనుకరణ శక్తికి నివ్వెరపోతున్నారు. తెరపైనే గాక జీవితంలోనూ ఆ పాప్‌ వరవడి ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చాలా ఛానళ్లలో డాన్సు పోటీల పేరిట పిల్లలతో కూడా పిచ్చి పిచ్చి గెంతులు వేయించడం,వాటిపై సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలూ వినిపించడం చూస్తూనే వున్నాం. దీనంతటిలోనూ ఆయన ప్రభావం సుస్పష్టం.ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన ఆదాయం విలాస వైభవ జీవితం గురించిన కథలకు అంతేలేదు. నిజానికి ప్రజలకు కావలిసింది వారి కళ తప్ప ఖాతా పుస్తకాలు కాదు. కాని వ్యాపార వ్యవస్థలో క్రికెట్‌ ఆటగాడైనా కిక్కెక్కించే పాటగాడైనా రేటును బట్టే ప్రచారం. కళాకారుల ప్రసిద్ధికి ఇవన్నీ కొలబద్దలు కావడం కూడా మార్కెట్‌ సంసృతి విశ్వరూపానికి నిదర్శనం.

పాల్‌ రాబ్సన్‌ వంటి నల్లజాతి గాయకులు, మహమ్మదాలీ వంటి క్రీడాకారుల జీవితాలకు భిన్నమైన ధోరణి జాక్సన్‌ది. నల్లజాతి గుండెచప్పుడుగా మొదలైన మైఖెల్‌ దేహ వర్ణంతో సహా శ్వేతజాతి ఆధిపత్య సాంసృతిక ప్రతీకగా మారిపోవడం వెనక ఒక పెద్ద సామాజిక సందేశమే వుంది. చివరి దశలో ఆయన ఎదుర్కొన్నసమస్యలూ, సంక్షోభాలూ కూడా కళారంగంలో చొరబడిన కాలుష్యాన్ని పట్టి చూపిస్తాయి. దీనంతటికీ వ్యక్తిగతంగా ఆయన బాధ్యుడు కాదు. అయితే నమూనాగా నిల్చి పోయాడన్నది నిజం.పాశ్చాత్య దేశాల విశృంఖలత్వానికి జాక్సన్‌ ఒక ప్రతీక. దానికి తనే ప్రచారమిచ్చాడు.విపరీత ప్రచారమిచ్చే మీడియానే వికృత కథనాలను కూడా విస్త్రతంగా వ్యాపింప చేయడం ఈ సంసృతిలో భాగం. జాక్సన్‌ ప్రతి కదలికనూ వెంటాడి వేటాడి కథలల్లి కాసులు కురిపించుకోవడం ఇందుకు పరాకాష్ట.
జాక్సన్‌ జీవితంలోని అసహజత్వానికి ఈ అసహజ అవాంఛనీయ సంసృతికి చాలా సంబంధం వుంది. బాదాకరమైనా చెప్పుకోక తప్పని నిజమిది. చెవులు చిల్లులు పడే శబ్దాన్ని చేసే మెగాస్పీకర్లు కళ్లు మిరుమిట్లుగొల్పే విద్యుద్దీపాలు వేదికపై ఆయన విగ్రహాన్ని వైభవాన్ని అనేక రెట్లు పెంచి చూపించాయి. ఇదో కళాత్మక ప్యాకేజి తప్ప కేవలం కళ కాదు.సంగీతం నాట్యం కంటే సాంకేతిక ఇంద్రజాలానిదే ఇక్కడ ఆధిక్యత. పెప్సీ ఉత్పత్తులకైనా ప్రత్యేక సంచికల అమ్మకానికైనా ఆకర్షణగా జాక్సన్‌ అక్కరకు వచ్చాడు. కథల్లో దురాశకు ప్రతిరూపాలైన రాజుల్లాగా మరుగుదొడ్లను కూడా బంగారు తాపడం చేయించుకుని అదో ప్రచారం పొందాడు. ఇదంతా అయ్యాక నల్ల రంగును భరించడం కష్టమై పోతుంది. దాన్ని వదిలించుకోవాలి. అందుకే అత్యాధునిక శస్త్ర చికిత్స. దానికి మరేదో కారణం చెప్పినా ఈ ఆకర్షణ కోణం కాదనలేని సత్యం. అంటే మనం మనంగా మనిషి మనిషిగా మన్నన పొందడం కాదు. వేషము మార్చెను భాషను మార్చెను అసలు తానే మారెను అన్నట్టుగా మారిపోవడం! అయినా అతని ఆరాటం తీరలేదు. అలా తీరదు కూడా. మన దేశంలో కూడా డబ్బు వుంటే చాలు శరీరాన్నే మార్చుకోవచ్చన్న ప్రచారాలు మహా జోరై పోయాయి. మధ్య తరగతి మనుషులు కూడా ఈ మోజులో తమను తాము కోల్పోతున్నారు. జుట్టు తెల్లగా వుంటే మొహంపై మొటిమలు మొలిస్తే ముడుతలు వస్తే జీవితమే వృధా అన్నంత నిరాశ. దాన్ని పారదోలడానికి సౌందర్య చికిత్సలు, సాధనాలు! పాలిపోయిన మొహంతో ప్రాణం లేని బొమ్మలా జాక్సన్‌ ముంబాయిలో చేసిన విన్యాసాలను అప్పట్లొ జానీలివర్‌ అద్భుతంగా అనుకరించి హాస్యం చేశాడు.చనిపోయాక పదే పదే వేస్తున్న పాత క్లిప్పింగులలో నల్లవజ్రంలా వున్న జాక్సన్‌కూ ఆఖరి దశలో ఆయన పాలిపోయిన ప్రతిరూపానికి పోలికెక్కడీ అందుకే ఆయన విఖ్యాతిలోనూ విషాదాంతంలోనూ కూడా పెద్ద సందేశం వుంది.
జాక్సన్‌ మరణానంతరం కూడా రోజుకో కథ. ఆయన కుటుంబం, సంబంధాలు, పిల్లలు, స్వలింగ సంపర్కాలు ఇలాటివాటినే ప్రపంచమంతా వెదజల్లుతున్నారు. ఆయన హత్యకు గురైనాడని దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చవలసిందే. దోషులను శిక్షించవలసిందే. నిజమైనా ఇందులో పెద్దగా చెప్పుకోవలసిందేమిటన్నది మరొకటి. ప్రపంచాన్ని ఉర్రూతలూపిన ఆయన కళా ప్రతిభ తప్ప కళంకితమైన వ్యక్తిగత పోకడలు కాదు. కాని వాటితోనే వూదరగొట్టడం హీనమైన అభిరుచులను అందుకోవడానికి తప్ప మరెందుకు పనికి వస్తుంది?జాక్సన్‌ కోసం విలపించిన వారు,గుండెలు బాదుకుని ఏడ్చిన వారు ఆయన కళా ప్రతిభను కదా ఆరాధించింది? దాన్ని కాస్తా పక్కనపెట్టి ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో ఆయన పిల్లలు ఆయనకు పుట్టారో లేదో వీటిపై విభిన్న కథనాలలో ముంచి తేల్చడం ఎవరి కోసం? ఇలాటి కథలు చెప్పుకోవడానికి జాక్సన్‌ అయినా జాంబవంతుడైనా తేడా ఏముంటుంది?అంటే సందర్భం ఏదైనా సదరు వ్యక్తి ఎవరైనా సంసృతి మార్కెట్‌లో సరుకుగా ఏది చలామణి అవుతుందన్న ఆలోచన తప్ప మరొకటి వుండనే వుండదు.చావైనా బతుకైనా ఈ వేటలో ఒకటే. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది , తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్న శ్రీశ్రీ శైలికి భిన్నంగా కొందరిని మహాకర్షనీయులుగా చేసి ఆ గోప్ప వారి చెత్త కబుర్లలో ముంచెత్తడం ఒక వ్యాపార సూత్రం. గతంలో రాజకుమారి డయానా ప్రమాద మరణం సందర్బంలో ప్రపంచ మీడియా పేపరాజ్ఞి గురించి పశ్చాత్తాపం ప్రకటించింది. ఆమె వర్ధంతి నాటికి బ్రిటిష్‌ మీడియా అధికారికంగానే ఆత్మ విమర్శ చేసుకుంది.క్షమాపణలు చెప్పింది. కాని ఫలితమేమిటి? జాక్సన్‌ విషయంలో ఆ వికృతం మరింత ఘోరంగా అక్షరాలా పైశాచికంగా పునరావృతమవుతున్నది.ఆయన ఆత్మను చిత్రించామని ఎవరో విడియో చిత్రాలు విడుదల చేస్తే విశ్వవ్యాపితంగా ప్రసారం చేయడం విజ్ఞతనూ విజ్ఞానాన్ని ఎగతాళి చేయడమే. నేటి సాంకేతిక విజ్ఞానంతో ఇలాటి చిత్రాలు తయారు చేయడం చాలా తేలికని అందరికీ తెలుసు.నిజానికి జాక్సన్‌ ప్రదర్శనలలో ఇంతకన్నా విచిత్రాలనే చూపించాడు. కాకపోతే అది కల్పన అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ సాంకేతిక ఇంద్రజాలంతో ఆయన బతికున్నట్టు చూపిస్తున్నారంటే ఎంతటి బరితెగింపు? శాస్త్ర సాంకేతిక విజ్ఞానం స్వేచ్చా స్వాతంత్రాలు తమ స్వంతమైనట్టు చెప్పుకునే అమెరికా మీడియా పోకడలు అసహ్యం పుట్టిస్తాయి. ఉద్వేగాలతో వీలైనంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ కాలం వ్యాపారం చేసుకోవడం తప్ప వాటికి వాస్తవాలతో నిమిత్తం వుండదు. తన పిల్లలను జాక్సన్‌ పిల్లలుగా ప్రచారం చేశానని హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు చెప్పడంలోనూ దాగి వుండేది ప్రచారం ద్వారా ఎక్కువ సొమ్ములు రాబట్టవచ్చునన్న అంచనానే.నీ గురించి మంచో చెడో ప్రచారం జరగడం మేలు అన్నది పాశ్చాత్య మీడియా ప్రధాన సూత్రం. దాని వికృత విశ్వరూపమే జాక్సన్‌ మరణానంతర విపరీత కథనాలు, ఆత్మ సందర్శనాలూ!

27, జులై 2009, సోమవారం

రిలయన్స్‌కు కేంద్రం ఊడిగం

2 వ్యాఖ్యలు

నయా ఉదారవాద విధానంలో భాగంగా దేశ ప్రజలకు చెందిన గ్యాస్‌ వంటి సహజ సంపదను స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించేందుకు గతంలో ఎన్‌డిఎ, ఆ తరువాత యుపిఎ ప్రభుత్వాలు ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేసి ప్రజా ప్రయోజనాన్ని బలి చేస్తున్నాయి. నూతన అన్వేషణ, లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) కింద కృష్ణా-గోదావరి బేసిన్‌లో డి6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)కు అప్పగించి, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పిఎస్‌సి), అలాగే గ్యాస్‌ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీ అనుమతించిన సూత్రం ప్రజా ప్రయోజనాలకు నష్టదాయమైనది. ఈ ఉదంతం తెలియచేస్తోంది. ఆద్యంతం ముఖేష్‌ అంబానికి చెందిన రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలా ఊడిగం చేస్తున్నదీ అంబానీ సోదరుల మధ్య గ్యాస్‌ సరఫరా, ధరలకు సంబంధించి ఇంతకుమునుపు బొంబాయి హైకోర్టులో, ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తున్న వ్యాజ్యాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి దాని కాపట్యాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగులో ఎంఎంబిటియు గ్యాస్‌ను 2.34 డాలర్లకు ఎన్‌టిపిసి విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 12 ఎంసిఎండి గ్యాస్‌ సరఫరా చేసేందుకు అంగీకరించి ఆర్‌ఐఎల్‌ ఎంపికయింది. ఆ ధరకు గ్యాస్‌ సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో ఎన్‌టిపిసికి, దానికి మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది. పోటీ బిడ్డింగులో నిర్ణయించిన ఈ ధర పిఎస్‌సిలో నిర్దేశించిన విధంగా పోటీ ప్రక్రియ ద్వారా (ఆర్మ్స్‌ లెంత్‌ సేల్‌) నిర్ణయించిన ధర అవుతుంది. అయితే, దానికి విరుద్ధంగా ఆర్‌ఐఎల్‌ ప్రతిపాదించిన మోసపూరిత సూత్రాన్ని అనుసరించి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల సాధికార కమిటి ఎంఎంబిటియుకు 4.20 డాలర్ల అధిక ధరను ఆమోదించింది. అంబాని సోదరులు ముఖేష్‌, అనిల్‌ల మధ్య వారి కుటుంబ ఆస్తుల పంపిణీ ఒప్పందంలో భాగంగా అనిల్‌కు చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు 17 ఏళ్ళ పాటు 28 ఎంసిఎండి గ్యాస్‌ను ఎంఎంబిటియుకు 2.34 డాలర్ల చొప్పున సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ అంగీకరించిది. ఆ విధంగా గ్యాస్‌ను అనిల్‌ ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు ఆర్‌ఐఎల్‌ తిరస్కరించటంతో అన్నదమ్ముల మధ్య బొంబాయి హై కోర్టులో వ్యాజ్యం నడిచింది. ఆ ఒప్పందంలో అంగీకరించిన విధంగా గ్యాస్‌ పరిమాణం, సరఫరా కాలం, ధరల ఆధారంగా ఇరు పార్టీలు నెల రోజుల్లో తగు ఏర్పాటు చేసుకోవాలని బొంబాయి హై కోర్టు జూన్‌ 15న తీర్పు ఇచ్చింది.

హై కోర్టు తీర్పుపై అన్నదమ్ములిద్దరూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీగా చేరింది. ఆర్‌ఐఎల్‌ కాంట్రాక్టరు మాత్రమేనని, మంత్రుల సాధికార కమిటీ నిర్ణయించిన గ్యాస్‌ వినియోగ విధానం ప్రకారమే గ్యాస్‌ పంపిణీ జరగాలని, ఆర్‌ఐఎల్‌, ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్‌ల మధ్య కుదిరిన కుటుంబ ఒప్పందంతో తనకు సంబంధం లేదని కేంద్రం పేర్కొంది. ఈ గ్యాస్‌, దాని ధర, పంపిణీపై అన్నదమ్ములిద్దరికి యాజమాన్య హక్కు ఏమీ లేదని పేర్కొంది. కాని, కేంద్రం విధానం అలాంటి సహజ సంపదను ప్రైవేటు గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు దోచిపెట్టేదిగా ఉంది. పిఎస్‌సిలోని నిబంధనలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన వివరణలు, మంత్రుల సాధికార కమిటీ సమావేశాల వివరాలు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టులో చేస్తున్న వాదనలకు భిన్నంగా ఉన్నాయి. మంత్రుల సాధికార కమిటీ ఎంఎంబిటియుకు 4.2 డాలర్లుగా నిర్ణయించిన ధర ప్రభుత్వం గ్యాస్‌ విలువను మదింపు చేయడానికేనని, ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో విక్రయించే ధరను ప్రభుత్వం నిర్ణయించదని ఆ వివరణల సారాంశం. అంటే ఎటువంటి నియంత్రణ లేకుండా ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌లో తనకు ఇష్టం వచ్చిన ధరకు గ్యాస్‌ను విక్రయించుకోవచ్చుననేది ఈ వివరణల సారాంశం. గ్యాస్‌ వినియోగం విధానానికి సంబంధించి, ఒకసారి ప్రభుత్వం గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులను, కర్మాగారాలను నెలకొల్పడానికి అనుమతించాక, వాటికి అవసరమైన గ్యాస్‌ కేటాయింపు చేయాలనేది నిర్వివాదాంశం. వాటిలో రాష్ట్రంలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు, ఎన్‌టిపిసి, అనిల్‌ అంబానీల ప్రాజెక్టులు కూడా ఉంటాయి. గ్యాస్‌ విలువ మదింపు నిమిత్తమే మంత్రుల సాధికార కమిటీ 4.2 డాలర్ల ధరను నిర్ణయించిందన్న వాదన ప్రకారం, ప్రభుత్వ వాటాగా రావాల్సిన గ్యాస్‌ను ఆర్‌ఐఎల్‌ అమ్మడానికి అనుమతించే పక్షంలో ఆ ధర ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాలనేది దానిలో ఇమిడి ఉన్న అంతరార్థం. ఆర్‌ఐఎల్‌ వాటాగా లభించే గ్యాస్‌ను మార్కెట్‌లో ఏ ధరకు విక్రయించినా, ఆ సంస్థ పెట్టిన పెట్టుబడిపై రెండున్నర రెట్ల మొత్తాన్ని పిఎస్‌సిలో అనుమతించిన విధంగా పొందటానికి 4.2 డాలర్ల లెక్కనే పరిగణించాలనేది ఈ వివరణలలో అంతర్లీనంగా ఉన్న మరొక అంశం. లేదా ఎంఎంబిటియుకు 4.2 డాలర్ల కన్నా అధిక ధరకు ఆర్‌ఐఎల్‌ గ్యాస్‌ను విక్రయిస్తే దానిని ఎలా సర్దుబాటు చేయాలనేది అనిశ్చితంగా ఉంటుంది. బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా ఆర్‌ఐఎల్‌ వాటా గ్యాస్‌ నుండే అనిల్‌ అంబాని గ్రూపుకు 2.34 డాలర్ల ధరకు గ్యాస్‌ సరఫరా చేస్తే తనకు వచ్చే నష్టం ఏమిటనేది కేంద్రం వివరించకుండా దాట వేయటం దాని మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నది. ఎన్‌టిపిసి-ఆర్‌ఐఎల్‌ కేసులో తన విధానం ఏమిటనేది కేంద్రం స్పష్టం చేయకుండా దాట వేస్తున్నది. గ్యాస్‌ వినియోగం, ధరల నిర్ణయంపై తనదే అధికారం అనేది కేంద్రం విధానమైతే తాను కేటాయించిన వారికే, తాను నిర్ణయించిన ధరకే గ్యాస్‌ను విక్రయించాలని స్పష్టం చేయాలి. అమలు చేయాలి. పారదర్శకంగా నిర్ధారించగల న్యాయమైన పెట్టుబడి వ్యయం, సంబంధిత క్షేత్రంలో ఉత్పత్తి చేసేందుకు లభ్యమయ్యే నిర్ధారిత గ్యాస్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల పరిమాణం ఆధారంగా, న్యాయమైన లాభంతో కూడిన విధానం వుండాలి. ఆ విధంగా స్వదేశీ గ్యాస్‌ విక్రయ ధరలను డాలర్లలో కాకుండా రూపాయిలలో కేంద్రం నిర్ణయించి, నియంత్రించాలి. అనుమతించిన గ్యాస్‌ ఆధారిత ప్రాజెక్టులు, కర్మాగారాలకు అవసరమైన గ్యాస్‌ను కేటాయించి, సకాలంలో సరఫరా జరిగేటట్లు చూడాలి. వాటి స్థాపక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా అవి పనిచేసే ఉపయోగకరమైన జీవిత కాలానికి సరిపడే విధంగా గ్యాస్‌ కేటాయింపులను, ఉత్పత్తిని, సరఫరాను నియంత్రించాలి. అలా చేయకుండా, న్యాయస్థానాలలో కేంద్రం డొంకతిరుగుడు వాదనలు చేయటం ఆర్‌ఐఎల్‌కు ఊడిగం చేయటానికే.

    24, జులై 2009, శుక్రవారం

    విమానయాన సంస్థపై విష ప్రచారం

    3 వ్యాఖ్యలు
    విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు.

    గత నెలలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఐఏ), ఎయిర్‌ ఇండియా (ఏఐ) సంస్ధలను ప్రభుత్వం విలీనం చేసింది. ఈ సందర్భంగా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) ఉద్యోగులను ఉద్దేశించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ తీవ్రంగానే బెదిరించారు. నిధులు లేవని చెపుతూ జూన్‌ నెల వేతనాలను ఆపివేశారు. ఇదే సమయంలో ఎయిర్‌ ఇండియా నష్టాలలో పడిందంటూ ప్రసారమాధ్యమం ప్రచారాన్ని అందుకున్నది. మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని చేయించింది. దాదాపు రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని పత్రికలైతే ఈ నష్టాన్ని రూ.5,000 కోట్లుగా అంచనా వేశాయి. దాదాపు 35,000 నుంచి 50,000 వరకు వున్న సిబ్బందే ఎయిర్‌ ఇండియాకు పెను భారంగా తయారయ్యారన్న ప్రచారం జరిగింది. సిబ్బందిని తగ్గించాలని, వేతనాలలో కోత విధించాలని, వేతనాలను ఇవ్వటం ఆలస్యం అయినా సర్దుకుపోవాలని కార్పొరేట్‌ ప్రసారసాధనాలు సిబ్బందికి సుద్దులు చెప్పసాగాయి.

    విలీన గారడీ
    2004-05, 2005-06 సంవత్సరాలలో లాభాలను ఆర్జించిన అనంతరం 2006-07లో నిజానికి నష్టాలు లేనేలేవు. ఉన్నదంతా విలీనం పేరుతో జరిగిన గారడీయే. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లను నాసిల్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) పేరుతో విలీనం చేస్తున్నట్లు 2007-08 వార్షిక నివేదికలో పౌర విమానయాన శాఖ పార్టమెంటుకు తెలిపింది. ఈ విలీనం కారణంగా ససంస్ధ సామర్ధ్యం పెరగటంతోపాటు భారతదేశంలోనే అతిపెద్ద సంస్ధగా రూపొందగలదని, ఆదాయం విషయంలో ప్రపంచంలోనే 31వ స్ధానంలో నిలబడగలదని ఇంకాఇంకా పలు లాభాలు ఉండగలవని ఈ నివేదికలో చెప్పుకొచ్చింది. ఇన్ని ప్రయోజనాల గురించి చెప్పిన మంత్రిత్వ శాఖ పౌర విమాన పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను విస్మరించింది. ఈ నెల 9వ తేదీన మంత్రి ఒక ప్రకటన చేస్తూ ప్రయాణీకుల తగ్గుదల, మార్కెట్‌లో పోటీ పెరగటం, ఇంధన వ్యయం పెరుగుదల వగైరాలు పెద్ద సమస్యలుగా మారాయని చెప్పారు. అయితే మంత్రిగారు ఏ ప్రాతిపదికపై ఈ విషయాలు చెప్పారు. విమానయాన సంస్ధలు రెండింటినీ విలీనం చేసేటపుడుగానీ, రూ.50,000 కోట్లు ఖర్చు చేసి 111 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నపుడుగానీ లోతైన విశ్లేషణ జరిపారా? బలము, బలహీనత, అవకాశాలు, ప్రమాదాలు ప్రాతిపదికపై విశ్లేషణ జరపాల్సి వుంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారమేకాక మార్కెట్‌ ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వగైరాలను పరిశీలించాలి. ఇవన్నీ తెలియని విషయాలేమీ కాదుగదా? తప్పుడు విధానాలతో విమానయాన సంస్ధను సంక్షోభంలోకి నెట్టివేసి వాస్తవాలకు పాతర వేసినవాళ్ళే ఇప్పుడు ఉద్యోగులపై బాధ్యతను నెట్టివేస్తున్నారు. విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు. 2007-08 సంవత్సరానికిగాను నాసిల్‌ మొట్టమొదటి వార్షిక నివేదికను తయారు చేసిన 15 నెలల తరువాత ప్రకటించారు. అకస్మాత్తుగా రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లుగా ఈ పత్రం తెలియచేస్తున్నది. అసలు ఈ పత్రాన్ని ప్రవేశపెట్టటంలో అసాధారణమైన జాప్యం ఎందుకు జరిగినట్లు? దీని తరువాతిదైన 2008-09 బ్యాలెన్స్‌ షీటు ఎక్కడ ఉన్నది? ఈ నెల 9వ తేదీన మంత్రిగారు ఒక ప్రకటన చేస్తూ ఈ ఏడాది నష్టం రూ.5,000 కోట్లు ఉండగలదని చెప్పారు. ఇవేమీ ఆడిట్‌ చేసి చెప్పిన లెక్క కాదు. కేవలం అంచనాలతో చెప్పినది మాత్రమే. బ్యాలెన్స్‌ షీట్‌ను చూడకుండా కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, ప్రభుత్వం కలసి ఉద్యోగులే నష్టాలకు కారణమని చెపుతున్నాయి.ఒకప్పుడు ఆకాశాన్నంటిన ఇంధనం ధరలు ఇప్పుడు నేలకు దిగిరావటంతో సర్‌ఛార్జ్‌ తగ్గే అవకాశం వచ్చిందని, మొత్తంమీద మున్ముందు సంస్ధకు లాభాలు రాగలవని గత డిసెంబరులో యాజమాన్యం చెప్పింది. కాని ఆరు నెలలు తిరగకముందే ప్లేటు మార్చింది. ''చూడండి మేము దివాళా తీశాము. వేతనాల చెల్లింపుకు మాదగ్గర మూల ధనం కూడా లేదు. సిబ్బందిని తగ్గించక తప్పదు.....'' అంటూ యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. ఈ పరిస్థితిలో సంస్ధను ''నిర్వహించటమో లేక నాశనం'' కావటమో తేల్చుకోవలసి ఉంటుందని మంత్రి చెపుతున్నారు. ''నాశనం'' అంటే కొత్తగా దిగుమతి చేసుకుంటున్న 111 విమానాలతోపాటు విమానయాన సంస్ధను ప్రైవేటీకరించటమన్న మాట.

    విలీనం తరువాత జరిగిందేమిటి?
    ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసిన తరువాత 2007-08లో రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నష్టం 2008-09లో రూ.5000 కోట్లకు పెరగవచ్చునని కూడా తెలిపింది. విమాన సంస్ధలో ప్రధానమైనది ఇంధన వ్యయం.2008లో బారెల్‌ సగటు ధర 94.85 డాలర్లుకాగా, 2009లో ఇది 51.85 డాలర్లుగా ఉన్నది. అంటే 2009 జనవరి నుంచి జూన్‌ వరకు సంస్ధకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే విషయమన్నమాట. ఇంతకుముందు ప్రకటించిన బాలెన్స్‌ షీటు ప్రకారం 2007-08లో సిబ్బంది వ్యయం మొత్తం వ్యయంలో 18.4 శాతం. లాభాలు ఆర్జిస్తున్న సెయిల్‌, భెల్‌ తదితర సంస్ధలతో పోలిస్తే ఈ వ్యయం హేతుబద్దమైనదే. విలీనానికి ముందు రెండు సంస్ధలు లాభాలలో నడిచాయి. కాని విలీనం తరువాత ఒక్కసారిగా నష్టాలు వచ్చాయి. 2005-06లో రెండు సంస్ధల ఆదాయం కలిపి రూ.15031 కోట్లు. 2007-08లో అంటే, విలీనం తరువాత స్వల్పంగా పెరిగి రూ.15257 కోట్లకు చేరింది. వ్యయం విషయానికి వస్తే రూ. 14923 కోట్ల నుంచి రూ.17,854 కోట్లకు పెరిగింది. ఇంతగా పెరగటానికి కారణమేమిటి? ఈ కాలంలోనే సిబ్బంది 1260కి తగ్గిపోయింది. ఇంధన వ్యయం కూడా తగ్గింది. కాగా వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఉన్నది. 2005-06లో రూ.105 కోట్లు వడ్డీ చెల్లించగా 2007-08లో ఈ మొత్తం రూ.701 కోట్లకు పెరిగింది.విమానయాన సంస్ధను సక్రమంగా నడపాలంటే సిబ్బందికి నీతులు చెప్పటమేకాక, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా చేసినపుడు మాత్రమే విమానయాన సంస్ధ గతంలోవలెనే లాభాల బాట పడుతుంది.

    23, జులై 2009, గురువారం

    దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి?

    8 వ్యాఖ్యలు
    దేవుడు ఉన్నాడని కొందరు అంటారు. లేడని కొందరు అంటారు. ఇంతకూ దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి? పూనకాలు వచ్చినవారు కేవలం నటిస్తున్నారా?
    - డి.కార్తీక్‌, 9వ తరగతి, బాలభారతి పాఠశాల, ఆదిలాబాదు.


    'దేవుడి'ని నమ్మేవారే వివిధ రకాలుగా భాష్యం చెబుతారు. ఈ విశ్వం మొత్తంలో ఉన్న క్రమానుగతినే మనం 'దేవుడు' అంటాము - అని కొందరంటారు. 'క్రమాను గతి' తెలుగు వ్యాకరణం ప్రకారం 'నపుంసకలింగా'నికి సంబంధించిన పదం. కాబట్టి 'దేవుడు' అంటూ పుంలింగాన్ని ఆపాదించకుండా 'దైవం' అని ఆ క్రమానుగతిని వారు పేర్కొంటే ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరంలేదు. విశ్వంలో క్రమానుగతి తప్పకుండా ఉంది. 'దైవం' అనే పదం ఆ క్రమానుగతికి మరో పర్యాయపదం అని మనమూ, ప్రపంచంలోని అందరూ సర్దుకుపోగలము. ఈ విషయంలో కరుడుగట్టిన నాస్తికవాదులకు కూడా అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
    మానవజాతికి, ఇతర జీవజాతులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మానవుడే ఆలోచిస్తాడు. క్రమమేమిటో, అక్రమమేమిటో గుర్తిస్తాడు. సాధారణ విషయాలేవో, అసాధారణ విషయాలేవో పసిగడతాడు. తన ప్రాణానికి, తనతోటి బృందపు సంక్షేమానికి ప్రమాదం వాటిల్లినపుడు ప్రమాదం కల్గించే అంశాలనే మార్చి ప్రమాదరహితంగా రూపొందిస్తాడు. ఆ క్రమంలో తనకర్థంగాని వాటిపట్ల, అసాధారణ విషయాలైన గ్రహణాలు, తోకచుక్కలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, తుపానులు, ఇంద్రధనస్సులు, ఉరుములు, మెరుపులు వంటి అరుదైన సంఘటనలపట్ల విస్మయము, సంభ్రమము, భయాందోళనలు చెందేవాడు. ప్రతి మానవ కార్యక్రమంలో మనిషి ప్రయత్నపూర్వక హస్తమున్నట్లే ఇలా అరుదుగా సంభవించే సంఘటనల పట్ల కూడా ఎవరో మానవాతీతవ్యక్తి లేదా శక్తి ప్రమేయం ఉండవచ్చునని ఊహించాడు. ప్రజల్లో సహజంగా ఉండే ఇలాంటి సందిగ్ధతను, సందేహాలను, 'దేవుడు', 'దయ్యం', 'పూజలు', సంతుష్టిపరిచే 'పబ్బాలు', 'మొక్కులు', 'బలులు', 'అప్పగింతలు', 'త్యాగాలు', 'ఆలయ నిర్మాణాలు', అనే తంతుతో పాలకవర్గాలు మొగ్గలోనే తుంచి అక్కడికక్కడ సర్దిచెప్పేవి. ఈ విధమైన తాత్కాలిక ఉపశమనంతో సర్దిచెప్పడం వల్ల ప్రజల హేతువాద దృక్పథం, తార్కిక విశ్లేషణ, సంపూర్ణ సత్యాన్వేషణాసక్తి రాటుదేలేవి కావు. క్రమేపీ 'దేవుడు', 'దయ్యం' భావాలు ప్రజల్లో ఉంటే పాలకవర్గాలకు మరింత ఊతంగా ఉండేలా సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితులు నెలకొన్నాయి. గత చరిత్ర అంతా ఈ విధంగానే నడిచింది. మానవజాతిలో ఏర్పడిన భౌగోళిక, భాషా పరిణామాలకు అనుగుణంగానే 'దేవుడు' అనే భావనలు, రూపాలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, స్వరూపాలు మారుతూ వచ్చాయి. మానవాతీతశక్తులు, ఏది కావాలంటే అది చేయగల మహా మహా అద్భుత కార్యకలాపాలు 'దేవుడి'కి ఆపాదించడం జరిగింది. 'దేవుడు' పాలకులకు మొదటి మిత్రుడయ్యాడు. పాలితులకు సర్దిచెప్పే సలహాదారుడయ్యాడు. యథాతథ సమాజ రూపానికి దన్నుగా నిలిచాడు. మార్పు అవసరంలేని పరిస్థితికి ఆలంబనగా తోడయ్యాడు. మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సుఖానికి, దుఃఖానికి కారణ భూతుడయ్యేలా అదే మనిషి నమ్మే పరిస్థితికి చేరుకున్నాడు.

    శక్తి సామర్థ్యాలు, రూపురేఖలు, జన్మ వృత్తాంతాలు ఆయా సమాజాల్లోని మానవ సమూహాల అభిరు చుల కనుగుణంగా 'దేవుడు', 'దైవభావన' రావడం వల్ల దేవుళ్ళు చాలామందయ్యారు. అది ఏ మానవ సమూహమైనా, వర్గ సమాజంగా ఉన్నంతవరకు ఆ దేవుడి రూపురేఖలు, ఇతర శక్తియుక్తులు, ప్రతిభలు వేర్వేరుగా ఉన్నా ఆయావర్గ సమాజాల్లో పాలకవర్గానికి బలాన్ని చేకూర్చే దేవుళ్ళుగానే వర్ధిల్లారు. వివిధ సంస్కృతులు, అలవాట్లు, భాషలు, దైవభావనలు ఉన్న మానవులు సార్వత్రిక సమస్యల పట్ల ఐక్యమవుతున్న సందర్భాలలో అదే పాలకవర్గాలు ఆయా జాతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి వారి దేవుళ్ల భావాల మధ్య అనైక్యతను సృష్టించేవారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు. నేటికీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. మనిషి కష్టాలకు కారణాలు వర్తమాన ప్రపంచంలోనే, నిజజీవితంలోనే ఉన్నాయనీ, ఆ కష్టాల నివృత్తికి సమిష్టిగా పరిష్కారమార్గాలను అన్వేషించాలనీ మానవులందరూ తెలుసుకున్న రోజు 'దేవుడి' భావన ప్రజలకు అవసరం ఉండదు.

    పేదరికం, దుఃఖం, వేదన, అనారోగ్యం, ఆకలి, దప్పిక, అవిద్య, క్రూరత్వం, అమానుషత్వం ప్రకృతిలో సహజమైనవి కావు. అవి ప్రకృతిలోని క్రమత్వానికి సాక్ష్యాలు కానేకావు. క్రమత్వానికి, సర్వశక్తి సంపన్నతకు ఆలవాలమైన దేవుణ్ణి నమ్మే ప్రతి సామాజికవర్గం తమ వేదనల్ని, కష్టాల్ని పోగొట్టమని వేడుకోని రోజు ఉండదు. కొన్నివేల సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి పేరు పేరునా ప్రార్థిస్తున్నారు. పదే పదే పూజలు చేస్తున్నారు. కానీ వేదనలు, నొప్పులు, అకాలమరణాలు, క్రూరమైన సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు మెజారిటీ మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. గత జన్మ పాపులుగా వారికో స్టిక్కరేసి 'మీ ఖర్మ ఇంతే' అని వారిని గిరాటేస్తున్నారు. 'చేసేది, చేయించేది, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, బాధపడేది, బాధపెట్టించేది, దుఃఖించేది, దుఃఖాన్ని కల్గించేది ఆ దేవుడేనని కష్టాల బయటున్న వారు అంటుంటే అర్థంచేసుకోలేని దయనీయపుటజ్ఞానపు మత్తులో ప్రజలుంటున్నారు. వేదన, మనోవేదన రెండింటినీ భరించేకంటే తాత్కాలిక ఉపశమనంగా మనోవేదనను మరిపించేలా విషపూరితం కాని మత్తు ద్రవ్యంగా 'దేవుడి భావన', 'దేవుడి దయ', 'దైవేచ్ఛ', 'దేవుడి లీలలు' వంటి భావజాలాలు ఉపకరిస్తున్నాయి.

    క్రమత్వానికి ఆపాదించబడిన దైవభావన కేవలం ఊహలకే పరిమితమయిపోయింది. కోరికలు తీర్చేవాడిగానూ, దుష్టులని కొందరిని తయారుచేసి వారిచేత దుష్టకార్యక్రమాలను తానే చేయించి ఆ బాధలు పడేవారిని తానే తన దగ్గరకు 'దేవా రక్షించు' అని రప్పించుకొని మళ్లీ తానే దుష్ట సంహారం చేసే అర్థంగాని మనసున్నవాడిగానూ దేవుడు కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలకు కనిపించని బంధువు అయ్యాడు.

    'దేవుడు ఉన్నాడా?' 'లేడా?' అన్న ప్రశ్నకు సమాధానం వెదికి తలబద్దలు కొట్టుకొనేకన్నా మనిషే మానవ చరిత్రను నడిపాడనీ, మనిషే దేవాలయాలను నిర్మించాడనీ, మనిషే విగ్రహాలను రూపొందించాడనీ, మనిషే పురాణ గ్రంథాల్ని రచించాడనీ, మనిషి అప్రమత్తంగానే శ్రమద్వారా, ప్రయత్న పూర్వకంగా చేసిన కార్యక్రమాలే మానవ జీవితాన్నీ, నాగరికతనీ, సంస్కృతినీ, వేదాంతాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ రూపొందించాయన్న తిరుగులేని సత్యాన్ని అందరం నమ్ముదాము.

    దేవుడి మీద నమ్మకానికీ, పూనకాలకూ సంబంధం ప్రత్యక్షంగా ఏమీ లేదు. నువ్వన్నట్లు చాలా మంది పూనకందార్లు ఏదారీ లేక పూనకపు దార్లు తొక్కుతున్నారు. హిస్టీరియా జబ్బుతో కొందరు, బాధలు వెళ్లగక్కుకోవడానికి మరికొందరు పూనకాలను పూనుకుంటున్నారు.

    విజ్ఞానశాస్త్రంపై మతదాడి-1

    72 వ్యాఖ్యలు

    ప్రాచీనకాలంలోనే భారతదేశం విజ్ఞానశాస్త్రానికి నిలయమైంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి అనేక మహత్తర పరిశోధనా ఫలితాలను అందించారు. శాస్త్రాలకే మూలశాస్త్రంగా ఉన్న గణితశాస్త్రంలో 'సున్నా'ను అందించిన ఘనత మనవారిదే. అన్ని ఆకుల ఔషధ గుణాలను ఔపోశనపట్టిన చెరకుడు మన ప్రాచీన వైద్యశిఖామణి. భూమి - చంద్రుల వ్యాసార్థలను, గ్రహాల చలనాల ద్వారా వచ్చే గ్రహణాలను లెక్కించిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మనవారే. విజ్ఞానశాస్త్ర పరిశోధనల కారణంగా మన భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. వారందరూ భారతీయ శాస్త్రవేత్తలను ఆచార్యులుగా అంగీకరించారు. అదే సమయంలో మతనాయకులు దురదృష్టవశాత్తుగా ఆ శాస్త్రవేత్తలపై తీవ్ర దాడి చేసి, వారి నోటితోనే 'విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాల'కంటే మతనాయకుల 'ప్రవచనాలు' సరైనవని చెప్పించారు. దీన్ని ధృవపరచుకోడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఆచార్య చెరకుడు వైద్య శాస్త్రంలో నిష్ణాతుడు. ఈయన 'చెరకు సంహిత' అనే వైద్య శాస్త్ర మహాగ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం ప్రథమ భాగంలోనే ఇలా అంటాడు. 'శరీర ధర్మాలను మాత్రమే కాక, ప్రతిభ, తెలివితేటలు కూడా ఆహారం నుంచే వస్తాయి (చెరకు సంహిత 80వ పేజీ). ఇంకొంచెం ముందుకు వెళ్లి వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యతలను ఇలా వివరిస్తాడు. ''పదార్థానికి సంబంధించిన వివిధ రకాల జ్ఞానం మాత్రమే వైద్యశాస్త్రానికి అవసరం. చికిత్సా విధానంలో పదార్థాన్ని దాటిపోవడాన్ని ఊహించలేం'' (చెరకు సంహిత 174వ పేజీ). వివిధ రోగాల చికిత్సకు ఏఏ పదార్థాలు వాడాలో గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు వివిధ రోగాలకు, ఆవుకు సంబంధించిన పదార్థాలు ఎలా వాడాలో వివరించారు. ''గోమాంసంతో తయారుచేసిన పులుసును వరుస తప్పి వచ్చే జ్వరానికి, క్షయకు, నీరసానికి మందుగా ఉపయోగించాలి. ఆవు కొవ్వును బలహీనతకు, కీళ్లవాతానికి మందుగా వాడాలి. ఆవు మాంసాన్ని పొగవేస్తే శ్వాసకోశ వ్యాధులు, ఆవు కొమ్ముల్ని కాల్చి, ఆ గాలిని పీలిస్తే కఫ రోగాలు పోతాయి'' అని తెలిపారు (పై గ్రంథం 186-187 పేజీలు). చికిత్సా విధానానికి పదార్థానికి గల సంబంధాన్ని గూర్చి ప్రథమంలోనే ఇంతగా వివరించిన ఆ మహా వైద్యులు ఆ తర్వాత భాగంలో రోగాలకు అధిభౌతిక కారణాలు ఉంటాయని, వాటి చికిత్సకు పదార్థం అవసరం లేదని అంటాడు. ఉదా: ''కుష్టు రోగానికి కారణాలు ఏమిటి?'' అని ప్రశ్నించి... ''దైవ ద్రోహం, పాపకార్యాలు చేయడం. గత జన్మలోని పాపాలు కుష్టురోగానికి కారణాలు.' అని పేర్కొంటాడు. (పై గ్రంథం 298వ పేజీ). 'దీనికి చికిత్స ఏమిటి?'' అని ప్రశ్నించి.. ''దేవతలు, దేవదూతలను సేవించి, ఈశ్వరుడు, అతని భార్య ఉమను భక్తితో పూజించడం అని సమాధానం ఇస్తాడు'' (అదే పుస్తకం 298 పేజీ). (మిగతా తదుపరి టపాలో http://vasavya.blogspot.com/2009/07/1.html )

    22, జులై 2009, బుధవారం

    భారత్‌-అమెరికా ఉమ్మడి ప్రకటన హానికరం

    1 వ్యాఖ్యలు
    అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటన అనంతరం భారత్‌-అమెరికా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరచాలని కోరుతోంది. '21వ శతాబ్దంలో ప్రపంచ సౌభాగ్యాన్ని, సుస్థిరతను పెంపొందించేందుకు' సంబంధాల్లో మార్పులు రావాలంటూ గొప్పగా మాట్లాడినప్పటికీ అందులోని అంశాలు, కుదుర్చుకొన్న ఒప్పందాలు నిజంగా భారత ప్రయోజనాలకేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అమెరికా పరికరాల తుది వినియోగ నియంత్రణపై ఉభయ పక్షాలూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అలాంటి ఒప్పందం అమెరికా సరఫరా చేసే పరికరాలను ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేసేందుకు వీలుకల్పిస్తుంది. భారత్‌తో పెరుగుతున్న సైనిక సహకారం అమెరికా ప్రయోజనాలకు కీలకమైంది. భారత్‌ వందల కోట్ల డాటర్ల సైనిక పరికరాలు కొనుగోలు చేయాలని అది భావిస్తోంది. తుది వినియోగ నియంత్రణ ఒప్పందం అనేది 'అణు సహకార రంగంలో భారత్‌, అమెరికా సంతకాలు చేసి ఒప్పందంలో చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం' అని హిల్లరీ భారత పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి ఫిలిప్‌ జె క్రాలే పత్రికలకు తెలిపారు. అణు ఒప్పందం భారత్‌ను అమెరికాకు జూనియర్‌ భాగస్వామిని చేస్తుందని, ఒప్పందంలోని నిబంధనలు సైనికంగా భారత్‌ను అమెరికాకు కట్టుబడేట్లు చేస్తాయి.
    తుది వినియోగ నియం త్రణ ఒప్పందం భారత సైనిక దళాలు పెంటగాన్‌కు మరింతగా లోబడి ఉండేలా చేస్తుంది. భారత్‌-అమెరికా అణు ఒప్పందంతో దానికి సంబంధం లేదని హిల్లరీ చెబుతున్నప్పటికీ భారత్‌కు అణుశుద్ధి, రీప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకుండా చేసే దిశగానే అమెరికా కదులుతోంది.
    ఇటీవలి జి-8 నిర్ణయం దీన్నే ధృవీకరించింది. ఇంకా అమెరికా సరఫరా చేసే వినియోగించిన ఇంధన సరఫరా ఒప్పందాన్ని భారత్‌ చేసుకోవలసి ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం గతంలో 10 వేల మెగావాట్ల అణు రియాక్టర్లు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేసింది. ఈ అణు ఒప్పందాన్ని ప్రపంచ అణు వ్యాప్తి నియంత్రణ పరిధిలోకి తేవాలని అమెరికా భావిస్తోంది. ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకూ అమెరికా అణు రియాక్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోరాదని సిపిఎం పునరుద్ఘాటించింది. భారత విధాన నిర్ణయాల్లో అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండాలని ఆ ఉమ్మడి ప్రకటన స్పష్టంగా తెలిపింది. దీన్ని ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంలోనూ, భారత్‌-అమెరికా ఉమ్మడి సిఇఓ వేదికలోనూ రూపొందించబోతున్నారు. ఈ లాబీయింగ్‌ వేదికలకు అనుగుణంగానే ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఉన్నత విద్య, తదితర రంగాల్లోకి ఎఫ్‌డిఐని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం మరింతగా అనుమతించబోతోంది. అదే సమయంలో ఇరాన్‌ పట్ల శత్రు వైఖరిని చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి ఒత్తిడి తేవడం జరిగింది. ఇరాన్‌తో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒప్పందాన్ని పక్కకు పెట్టడంతో ఇరాన్‌ను మరింతగా ఒంటరిపాటు చేయాలని అమెరికా కోరుకుంటోంది. అలాంటి ఒత్తిళ్ళను ప్రతిఘటించాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. డబ్ల్యుటిఓపై దోహా విడల చర్చలను ప్రస్తావిస్తూ వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై భారత్‌ తన వైఖరిని విడనాడాలనే ఒత్తిళ్ళకు తలొగ్గరాదు. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏమీ తీవ్ర చర్యలు తీసుకోకుండానే భారత్‌ను తగ్గించాలంటున్న వాతావరణ మార్పు చర్చల్లో అమెరికా డిమాండ్‌ను అంగీకరించరాదు. ఈ ఏకపక్ష సంబంధాన్ని పటిష్టపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించాల్సింది



    9, జులై 2009, గురువారం

    ప్రణబ్‌ బడ్జెట్‌ అసలు రంగు

    2 వ్యాఖ్యలు
    వాస్తవం ఏమంటే ఈసారి బడ్జెట్‌ తాను చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా చెప్పలేదు. వాటన్నింటికీ ముసుగు వేసింది. పైగా తన బడ్జెట్‌ అంతా సాధారణ ప్రజల కోసమే అన్నట్లుగా పోజు పెట్టింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు, సామాజిక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించానని చెప్పింది. దానికి మొట్టమొదటి ఉదాహరణగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది బడ్జెట్‌ కేటాయింపు కన్నా 140 శాతం అధికంగా కేటాయించినట్లు ఘనంగా చెప్పుకుంది. 2008-09 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి పథకానికి రు.14,400 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రు.39,100 కోట్లకు పెంచారు. ఇలా చెప్పడం ప్రజలను దారుణంగా మోసం చేయడమే. ఇప్పటికే 2008-09 లో సవరించిన అంచనాల ప్రకారం రు.36,750 కోట్లు ఖర్చు పెట్టింది. దానిపై అదనంగా కేటాయించింది రు.2,350 కోట్లు మాత్రమే. శాతంగా చూస్తే అది నామ మాత్రమే. పైగా దినసరి కూలి రు.80 నుండి రు.100 కి పెంపు సైతం ఈ పెంపుదలకే పరిమితమయింది.

    పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆహార భద్రత అంశంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఆహార భద్రత కోసం ఒక చట్టాన్నే తీసుకొస్తున్నట్లు బడ్జెట్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ హడావిడి చేసింది. కాని ఇప్పుడు దాని ముసాయిదా వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంది చూసి అభిప్రాయాలు చెప్పండని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ఈ ముసాయిదా చట్టరూపంలోకి ఎప్పుడు మారుతుందో, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో?

    పేదరిక రేఖ దిగువన ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల చొప్పున, కేజీ రు.3కు తిండి గింజలను అందజేేయాలన్నది ఈ బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. కాని ఇప్పుడు కేంద్రం పేదల్లో పేదలకు అంత్యోదయ కార్డు ద్వారా కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని కేజీ రు.2 చొప్పున ఇస్తున్నది. నూతన పథకం అమల్లోకి వస్తే ఈ అంత్యోదయ కార్డు హోల్డర్లకు కోటాను 25 కేజీలకు తగ్గిస్తారా, ధరను కేజీకి రు.3కు పెంచుతారా అన్న సందేహాలు భయపెడుతున్నాయి. పైగా అనేక రాష్ట్రాలలో పేదలకు కిలో రెండు రూపాయలు, కిలో రూపాయి బియ్యం పథకాలు అమల్లో ఉన్నాయి. కేంద్రం కొత్త పథకంతో వీటి తీరుతెన్నులు ఎలా మారతాయి అన్న విషయం కూడ అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ స్థానే సార్వత్రిక ప్రజాపంపిణీని ప్రవేశపెట్టాలి. కాని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు.

    ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి ఎంతో కొంత ఆహారాన్ని సమకూర్చేది సమగ్ర శిశుఅభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌). ఇలాంటి పథకం దేశవ్యాపితంగా అందరు బాలలకు అమలు కావడం లేదు. దీన్ని సార్వజనీనం చేయాలని సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ అమలు జరగలేదు. దీనికోసం కనీసం రు.12,000 కోట్లు ఏడాదికి అవసరం అవుతాయని అంచనా. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది సుమారు రు.6,000 కోట్లు మాత్రమే. అందరికీ అమలు చేయాలన్న లక్ష్యాన్ని 2012లో చేరతామని మాత్రం బడ్జెట్‌లో చెప్పారు.

    విద్యారంగం పరిస్థితీ ఇదే విధంగా ఉంది. విద్యాహక్కు బిల్లు పార్లమెంటులో ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీని ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలందరికీ స్కూలు విద్య తప్పనిసరిగా అందించాలి. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఎలిమెంటరీ విద్యకు ఈ ఏడాది కేటాయింపులను రు.19,488 కోట్లనుండి రు.19,682 కోట్లకు మాత్రమే పెంచింది. సెకండరీ విద్యకు కొంచెం మెరుగ్గా రు.2,000 కోట్లు అదనంగా కేటాయించింది. కాని ప్రభుత్వం అసలు మోజు ఉన్నత విద్యపైనే ఉంది. దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది బేరానికి పెట్టాలని ఉబలాటపడుతున్నది. ఈ రంగానికి కేటాయింపులను రు.6,800 కోట్లనుండి, రు.9,600 కోట్లకు పెంచింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని బాగా పెంచాలని చెప్పిన బడ్జెట్‌, కేటాయింపులను మాత్రం ఆ విధంగా పెంచలేదు. గత బడ్జెట్‌తో పోల్చుకున్నపుడు ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెంపుదల రు.1500 కోట్లు మాత్రమే. వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి ఈ బడ్జెట్‌లో రు.11,307 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రు.9,600 కోట్లు. వ్యవసాయాన్ని ఎత్తి కుదేస్తానంటున్న ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనకు కేటాయింపును రు. 2,960 కోట్ల నుండి, రు.3,241 కోట్లకు అంటే కేవలం రు.281 కోట్లు మాత్రమే పెంచింది.

    రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లాంటి పెట్టుబడులను సక్రమంగా అందించడానికి, పండిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాల్సి ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వానికి పట్టినట్లు లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఉదారంగా ఇవ్వాలని మాత్రం ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కాని అసలు ఎలాంటి వ్యవస్థాగత రుణాలు అందని రైతులు కనీసం 40 శాతం ఉన్నారన్న సంగతి ఆయన మరచిపోయారు. రైతులకే నేరుగా ఎరువుల సబ్సిడీ అందిస్తామన్న పేరుతో ఉన్న వెసులుబాటుకే మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నది.

    పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది అధిక ధరల తాకిడితో. ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం
    ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయన్న పేరుతో బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు పెట్రోలు, డీజిలు ధరలను పెంచి కూర్చుంది. పెట్రోలు, డీజిలు ధరలను అంతర్జాతీయ ధరలతో సంపూర్ణంగా అనుసంధానం చేయడం లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇంధనం ధరలు పెరిగితే వాటి ప్రభావం మిగతా అన్ని ధరలపైనా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థ్ధిక సంక్షోభం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. పారిశ్రామిక రంగంలో సుదీర్ఘకాలంగా ప్రతికూల అభివృద్ధి నమోదవుతున్నది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరికి ఉపాధి కల్పించడం గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించదు. ఈ ఏడాది బడ్జెట్‌ వ్యయం మొత్తం రు.10 లక్షల కోట్లు దాటినప్పటికీ, దానిలో ప్రణాళికా వ్యయం కేవలం రు. 3 లక్షల కోట్లు మాత్రమే. అంటే అత్యధిక భాగం అనుత్పాదకంగా ఖర్చవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సైతం కాదని ద్రవ్య లోటును జిడిపిలో 6.8 శాతానికి పెంచారు. ద్రవ్యలోటు రు.4లక్షల కోట్లకు పైగానే ఉంది. ప్రణాళికా వ్యయాన్ని మించి ద్రవ్యలోటు ఉంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆదాయాన్ని సమకూర్చుకొని దాని అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి. అది చాలనపుడు లోటు బడ్జెట్‌కు పాల్పడి, ఆ నిధులను ఉత్పాదకంగా ఖర్చుపెట్టవచ్చు. కాని ఇప్పుడు ప్రణాళికేతర వ్యయానికి సైతం లోటు బడ్జెట్‌పై ఆధారపడాల్సిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది.


    ఉన్నత స్థాయి కార్పొరేట్‌ ఉద్యోగులు, సిఇఓలకు పన్ను పరిధిలోకి రాకుండా సమకూర్చే వేతనేతర సదుపాయాలను ఫ్రింజ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అంటారు. ఇలాంటి వాటిపై పన్ను ఎత్తివేసినా కార్పొరేట్‌ వర్గం సంతృప్తి చెందలేదు. బడాపెట్టుబడిదారులు ప్రభుత్వంపై కినుక వహించిన ప్రధాన అంశం ఒకటుంది. అది ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఎంత మేరకు అమ్మనున్నారన్న విషయాన్ని ఈ బడ్జెట్‌లో స్పష్టంగా ప్రకటించకపోవడం. ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని సందేహానికి తావులేకుండా మరుసటి రోజు వివరించారు. ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం గురించి ప్రకటించడానికి బడ్జెట్‌ తగిన చోటు కాదని, అయినప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వం 51 శాతం వాటాలను మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా వాటిని 'ప్రజల భాగస్వామ్యం' కోసం అందుబాటులో అంటే అమ్మకానికి ఉంచుతామని ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు. బడ్జెట్లో అన్నీ ప్రకటించకూడదన్న వైఖరి వివిధ కీలక రంగాలలో ఎఫ్‌డిఐని అనుమతించడానికీ వర్తిస్తుందని భావించవచ్చు. ఎఫ్‌డిఐ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం పట్ల కొంతమంది ఆశ్చర్యం ప్రకటించారు. వాణిజ్య వర్గాలు కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించమంటుంటే, దానికి బదులు మినిమమ్‌ అల్టర్నేట్‌ టాక్స రేటును 10 నుండి 15 శాతానికి పెంచడం పట్ల కార్పొరేట్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

    ఏం చేసినా మొత్తం ప్రత్యక్ష పన్నుల రాబడిలో నికర పెరుగుదల ఏమీ లేదని బడ్జెట్‌లో ప్రభుత్వం చూపించింది. ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని రు.2లక్షలకు పెంచాలన్నది న్యాయబద్ధమైన డిమాండు కాగా కేవలం రు.10 వేలు మాత్రం పెంచి రు.1,60,000లకు ప్రభుత్వం సరిపుచ్చింది. 2 లక్షలకు పెంచితే క్రిందిస్థాయి ఉద్యోగులు లాభపడతారు. దీనికి బదులుగా ఆదాయపు పన్నుపై అందరికీ వర్తించే సర్‌చార్జీని మాత్రం తొలగించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్పుల ప్రకారం రు.2లక్షల వార్షికాదాయం లభించే వ్యక్తికి కేవలం రు.1,030 రాయితీ లభిస్తే, రు.50 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి రు.1,45,745లు రాయితీ లభిస్తున్నది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పు ద్వారా ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలనుకుంటున్నదో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. మొత్తంగా బడ్జెట్‌ సాధారణ ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్లు చూపాలని ప్రయత్నించింది. కానీ, ఆయత్నాలేవీ ఫలించలేదు. తన అసలు ఉద్దేశాలు అమలు చేయడానికి బడ్జెట్‌ సరైన చోటుకాదని ప్రభుత్వం చెప్పడం పట్ల పెట్టుబడిదారులు సంతృప్తి చెందుతారు. వారు ఆశిస్తున్న రాయితీలు తప్పక పొందుతారు. ప్రజలు మాత్రం అదనపు భారాలకు సిద్ధం కావలసి ఉంటుంది.

    8, జులై 2009, బుధవారం

    మెట్రోపై భంగపాటు

    3 వ్యాఖ్యలు
    భాగ్యనగర ప్రజానీకానికి ట్రాఫిక ఇక్కట్లను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించటానికి వీలుగా మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో వున్న మెట్రో రైలును ఆచరణలోకి తెస్తానని గంభీర వచనాలు పలికిన ప్రభుత్వం మరోసారి భంగపడింది.8,500 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ 2007లో చెప్పింది. అందుకోసం తమ వాటాగా 1640 కోట్లు ఇవ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ ధనయజ్ఞం సాగిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలును ప్రభుత్వ రంగం ద్వారా కాకుండా ప్రైవేటు వారికి అప్పగించాలని, తద్వారా ప్రయోజనాలు పొందాలని ఆశించింది. 2007లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లుగా అంచనా వ్యయాన్ని నిర్ధారించినప్పటికి యేడాది తిరగకముందే దానిని 15వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు చెల్లించడం కాక వారే ప్రభుత్వానికి ఎదురిచ్చేట్టు మైటాస్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2008 జులైలో జరిగిన ఒప్పందం ప్రకారం మైటాస్‌ కన్సార్టియమ్‌ 34 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వానికి రు.30,311 కోట్లు ఇవ్వాలని ఆ ఒప్పందం. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం మైటాస్‌ కన్సార్టియమ్‌కు 269 ఎకరాల భూమిని అప్పంగించాలి. తద్వారా 2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు, కట్టడాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లతో సహా వివిధ వాణిజ్య కార్యకలాపాలను మైటాస్‌ నిర్వహించుకుంటుంది. ఈ ఒప్పందం మోసపూరితమైనదని ప్రజలకు, ప్రజల ఆస్తులకు నష్టదాయకమైనదని లోకం కోడై కూసింది. భారత మెట్రో రైలు పితామహుడిగా పేరుగాంచిన శ్రీధరన్‌ విస్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఒప్పందంలో జరిగిన లోపాలను సవరించుకోవడం లేదా అందుకు సంబంధించిన విషయాలను చర్చిండమో చేయవల్సిన ప్రభుత్వం ఏకంగా ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని రంకెలు వేసింది. నిండు కుండ తొణకదన్నట్లు శ్రీధరన్‌ తాను చెప్పింది వాస్తవమని, అందుకు తాను కట్టుబడి వుంటానని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తోక ముడించింది.
    ప్రపంచమంతా నివ్వెరపోయిన రీతిన 'సత్యం' కుంభకోణం ఈ ఏడాది జనవరిలో వెల్లడైంది. దానితో మైటాస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించి కైంకర్యం చేసుకున్నారన్నది జగద్విదితం. హైద్రాబాద్‌ మెట్రోతో పాటు జలయజ్ఞం ప్రాజెక్టులు, మచిలీపట్నం పోర్టు కూడా మైటాస్‌ చేపట్టడానికి ఒప్పందాలు కుదిరాయి. సత్యం కుంభకోణం నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను చేపట్టడం సాధ్యమా కాదా అన్నది ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ పరిశీలించి నిర్దారణకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా మైటాస్‌తో అధికారులు పలుమార్లు చర్చించారు. మెట్రోకు సంబంధించి రెండుసార్లు వాయిదాలు కోరినా ఫైనాన్షియల్‌ క్లోజర్‌,ఆర్ధిక సామర్థ్యంలను మైటాస్‌ కన్సార్టియమ్‌ చూపలేకపోయింది. అందుకని మెట్రోపై మైటాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి రామనారాయణరెడ్డి ప్రకటించారు.
    మనదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థను కలకత్తాలో నిర్మించారు. అది విజయవంతం అయ్యాక ఢిల్లీలో కూడా ప్రభుత్వ రంగంలో చేపట్టారు. మెట్రో వ్యవస్థ పెరుగుతున్న మహానగరాల్లో ప్రజలకు చౌకగా, వేగంగా రవాణా సౌకర్యం కల్గించటమే కాక వాతావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా అదుపు చేస్తుంది. సాంకేతికంగా ఆధునాతనమైనది, రిస్కుతో కూడుకున్నది కనుక ప్రజలకు భద్రతతో ముడిపడిన ఈ వ్యవస్థను ప్రభుత్వం నిర్మించడం, నిర్వహించడం చాలా అవసరం.అందుకు భిన్నంగా ముంబైలో మెట్రో రైలు ఒప్పందాన్ని ప్రైవేటు సంస్థతో చేసుకోగా అది విఫలమైంది. ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ రీత్యా మెట్రో రైలులాంటి మౌలిక వ్యవస్థలు ప్రభుత్వం చేతుల్లో ఉండడం ఆవశ్యం. కాని ప్రైవేటును నెత్తికెక్కించుకునే సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను, భద్రతను పణంగా పెడుతున్నాయి. మెట్రో రైలు ఒప్పందంలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది జనవాక్యం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీధరన్‌ లాంటి ప్రఖ్యాత టెక్నోక్రాట్‌ అభిప్రాయాన్ని తుంగలో తొక్కడమే కాక ఎదురుదాడికి దిగింది.జరిగిన పరిణమాలను పరిశీలిస్తే శ్రీధరన్‌ మాటలు ఎంతటి సత్యాలో ఎవరికయినా బోధపడుతుంది. జాప్యం మూలంగా మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం పెరిగి పోతున్నది.భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వీలున్నంత తొందరంగా మెట్రో రైలు నిర్మాణం జరగాలి. అదీ ప్రభుత్వ రంగంలోనే జరిగితే ప్రజలకు శ్రేయస్కరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం, శ్రీధరన్‌ సూచించిన పద్ధతిలో మెట్రోను చేపట్టడం మంచిది.కేంద్ర పట్టణాభివృధ్ధిశాఖను నిర్వహిస్తున్నది తెలుగువాడు. యుపిఎకు అత్యధిక మందిని సమకూర్చిన రాష్ట్రంగా మనకు ఆపాటి ప్రయోజనం కూడా జరగకపోతే ఇంకెందుకు?ప్రభుత్వం చురుకుగా కదిలి కేంద్ర అనుమతిని,నిధులను సాధించాలి. మొట్రో ఉదంతం నుండి వైయస్‌ ప్రభుత్వం గుణపాఠం తీసుకోవాలి.

    ఆర్థిక సంక్షోభంతో బాణీ మార్చిన ఐఎల్‌సి

    0 వ్యాఖ్యలు
    గత నెలలో అంతర్జాతీయ శ్రామిక సదస్సు (ఐఎల్‌సి) జెనీవాలో జరిగింది. ఇదేదో మహత్తరమైన సంఘటన కానప్పటికీ ప్రపంచ పెట్టుబడిదారీ విధానం కూకటి వేళ్లతో సహా కదలిపోతున్న తరుణంలో ఈ సదస్సు జరగటం విశేషం. అంతేకాక స్వేచ్ఛా మార్కెట్‌వాదాన్నీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్ధను ఊబిలో దింపిన నయా ఉదారవాద ప్రపంచీకరణనూ ప్రోత్సహిస్తున్న వారిపట్ల ప్రపంచ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ సదస్సు చోటుచేసుకున్నది. ఇలాంటి స్ధితిలో ప్రపంచ పెట్టుబడిదారీ నాయకత్వం ఎలా స్పందించేదీ ఊహించటం కష్టమేమీ కాదు. గత ముప్పై ఏళ్ళుగా, అంటే, రీగన్‌-థాచర్‌ల కాలం నుంచి పెట్టుబడిదారులు వల్లిస్తున్న నినాదాలు నిలిచిపోయాయి. 'వ్యాపారం చేసే బాధ్యత ప్రభుత్వానిది కాదు', పెట్టుబడిదారీ విధానానికీ, స్వేచ్ఛా మార్కెట్‌ వ్యవస్ధకూ 'ప్రత్యామ్నాయం లేదు', 'ప్రభుత్వమనేది ఒక సమస్యగా ఉన్నదేగాని పరిష్కారంగా లేదు', 'అన్ని సమస్యలనూ మార్కెట్‌ పరిష్కరించగలదు', అంటూ చాలా కాలంగా చెప్తున్న బడాయిలను ప్రస్తుతం పక్కన పెట్టారు. సమాజ పురోగతికి ప్రపంచీకరణ ఒక్కటే ఏకైక మార్గమంటూ పెట్టుబడిదారీ కిరాయి మనుషులు ఇంతకుముందు ఎల్లెడెలా ప్రచారం చేశారు. కుప్పకూలిన అమెరికన్‌ బ్యాంకులు, జర్మన్‌ బ్యాంకులు మార్కెట్‌ను ఎందుకు ఆశ్రయించలేదు?

    ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటూ జూన్‌ 15న జరిగిన ప్లీనరీ సమావేశంలో లూలా డి సెల్వా అడిగిన ప్రశ్నకు సమాధానమే కరువైంది. గత శతాబ్ది 8, 9 దశాబ్దాలలో పేదదేశాలు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలకు అనేకానేక పరిష్కారాలను సూచించిన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు ప్రస్తుతం అమెరికా, జపాన్‌, ఐరోపాలకు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నదని కూడా ప్రశ్నించారు. దీనితో సమావేశ హాలులో ఉన్నవారు మిన్నుముట్టేలా హర్షధ్వానాలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్ధనూ, రాజకీయాలను శాసిస్తున్న నయా ఉదారవాదులపట్ల వారికున్న ఆగ్రహం అలాంటిది. అమెరికన్‌ బ్యాంకర్‌లను ముఠానాయకులు అన్నపుడు కూడా ఇలాంటి హర్షాతిరేకాలే వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ సైతం అమెరికాను, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను పరోక్షంగా ఎత్తిపొడిచాడు. ''అంతర్జాతీయ ఆర్థిక సంస్ధలు ఇతరులకు పాఠాలు చెప్పటమేకాక, తాము కూడా నేర్వాలని'' ఆయన అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికాయే కారణమంటూ లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలు విమర్శిస్తుంటే అమెరికా ప్రతినిధులు మౌనం దాల్చారు. గతంలో జరిగిన ఐఎల్‌సీ సమావేశాలకూ ఇప్పుడు జరిగిన దానికీ చాలా తేడా ఉన్నది.

    గత సమావేశాలలో ప్రపంచీకరణనూ, నయా ఉదారవాదాన్నీ విమర్శించడమే నేరంగా భావించారు. మార్కెట్‌ను సాక్షాత్తు భగవంతునిగా భావించటం జరిగింది. శ్రామికవర్గాన్ని దారుణమైన దోపిడీకి, అణచివేతకూ గురిచేశారు. చివరకు ఐఎల్‌ఓ సైతం ప్రపంచీకరణను సమర్ధించింది. మారిన నేటి పరిస్థితిలో ఐఎల్‌ఓ అనవసరమని చేప్పేవరకు సంపన్న దేశాల నాయకులు వెళ్ళారు. శ్రామికుల వేతనాల గురించీ, పని పరిస్థితుల గురించీ మార్కెట్‌ తగు జాగ్రతలు తీసుకోగలదని వారి చెప్పుకొచ్చారు. కాని ఇంతలో ఎంతమార్పు? ఐఎల్‌ఓకు ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, శ్రామికుల ఇక్కట్లను తొలగించే మార్గాలను అన్వేషించాలని జి-20 దేశాల సదస్సు కోరింది. ఈసారి జరగనున్న జి-20 సమావేశాలకు ఐఎల్‌ఓను ఆహ్వానించాలన్న ప్రతిపాదన వచ్చింది. డబ్ల్యుటిఓలో ఐఎల్‌ఓ వాణి వినిపించాలని సర్కోజీ వ్యాఖ్యానించారు. ఇదియిలా ఉండగా ఐఎల్‌ఓ చివరి నిముషంలో తన అజెండాను మార్చి, ఆర్థిక సంక్షోభాన్ని దానిలో చేర్చింది. దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వాలకూ, యాజమాన్యాలకూ ప్రాతినిధ్యం వహించేవారేకాక కార్మిక ప్రతినిధులు కూడా దాదాపు 200 మందికి పైగా ఉన్నారు.

    భారత్‌ నుంచి అర్ధేందు దక్షి (సిఐటియు), థంపన్‌ థామస్‌ (హెచ్‌ఎంఎస్‌), ఉదరు పట్వర్ధన్‌ (బిఎంఎస్‌)లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దాదాపు ప్రతిరోజు సమావేశమవుతుంటుంది. పలు రంగాలకు చెందిన వారు కూడా ఈ కమిటీ చర్చలలో పాల్గొంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐఎల్‌సీ సమావేశం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను, ప్రపంచీకరణ విధానాలనూ ఆక్షేపించింది. ప్రస్తుత సంక్షోభానికి కారణమైన వారెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంతేకాక వారిని వెనకేసుకు వచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. కార్మిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న సంగతి ఆకస్మికంగా ఐఎల్‌ఓకు గుర్తుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు కూడా తన బాణీని మార్చింది. ఆదాయ పంపిణీ, పంపిణీ యంత్రాంగం, సామాజిక భద్రత వగైరాల గురించీ, ఐఎల్‌ఓతో సమన్వయం గురించీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రస్తావించారు. అనేక మంది ఉపాధిని కోల్పోవటం, ఆదాయాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదల వగైరాలతో పలు దేశాలలో తీవ్రమైన పరిస్థితులు నెలకొనడంతో పైన పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తంమీద ప్రపంచ నాయకులు నిరాశలో కూరుకుపోయారు.

    ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చటానికిగాను వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు వస్తున్నాయంటూ ఒకవైపున ప్రసారసాధనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు సహనంతో ఉండాలని, త్వరలోనే ఉద్యోగాలు లభించగలవని, ఆదాయాలు పెరగగలవని నమ్మబలుకుతున్నారు. మరోవైపున, కార్మిక లోకంలో విశ్వాసాన్ని పెంచవలసిందిగా ఐఎల్‌ఓను కోరుతున్నారు. ఐఎల్‌ఓ కూడా వీరి ఆకాంక్షలను నెరవేర్చేటందుకై తాను చేయగలిగింది చేయటానికి సిద్ధంగా ఉన్నది. సంక్షోభాన్నుంచి బయట పడుతున్నట్లుగా తెలియచేసే ఒక పత్రాన్ని అది తయారు చేసింది. సంక్షోభానంతర ప్రపంచం విభిన్నంగా ఉండగలదని అది చెప్పుకొచ్చింది. అయితే, 'ఆర్థిక వ్యవస్ధ పునరుజ్జీవాన్ని పొందిన పలు సంవత్సరాల తరువాత మాత్రమే ఉపాధి పరిస్థితి మెరుగుపడగలదంటూ ముక్తాయింపు నిచ్చింది. ఆర్థికవ్యవస్ధ కోలుకున్న అనంతరం అంటే, పెట్టుబడి తిరిగి తన స్థితిని పొందిన అనంతరం ఉద్యోగాలు మరలా లభ్యం కాగలవని ఐఎల్‌ఓ అభిప్రాయం. అయితే కనీస వేతనాలు, సమావేశ హక్కు, లైంగిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వగైరాల సంగతేమిటన్నదే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.

    నిరుద్యోగులను ఆదుకునేందుకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందంటూ శ్రామిక బృందాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులు దివాళా తీస్తే సంక్షోభ నివారణ పథకాలు వర్తిస్తాయి. ఎగుమతిదారులు దెబ్బతింటే ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఉద్యోగాలను కోల్పోయిన కార్మికుల సంగతేమిటి? ప్రభుత్వాలుగానీ, యాజమాన్యాలుగానీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. ఆర్థిక రంగం మంచి ఊపులో ఉన్నపుడే కార్మికులకు వారికి దక్కవలసింది దక్కలేదు. అటువంటపుడు సంక్షోభం సమయంలో ఏమి లభిస్తుంది? కార్మికులకు అనుకూలమైన విధానాలను చేపట్టవలసిందిగా కార్మికవర్గ నాయకులు అడుగుతున్నారు. లేనిపక్షంలో ఆర్థిక సంక్షోభం సామాజిక అశాంతిగా మారే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి కూడా సరియైన సమాధానం లేదు. ఉపాధి పథకాలంటూ ప్రవేశపెట్టటమేగాని వాటికి ఆర్థిక కేటాయింపులు ఏమీలేవు. యాజమాన్య వర్గాలు ఇలాంటి వాటిని పట్టించుకోవు. వారికి లాభాలు ప్రధానం. అంతేగాని కార్మికుల బాగోగులు వారికి అనవసర విషయం. కనుకనే ఆర్థిక సంక్షోభం తలయెత్తినప్పటికీ శ్రామిక లోకాన్ని ఆదుకునే విధానాలు కరువయ్యాయి.

    ఇప్పటి వరకు ఐఎల్‌ఓలో భారత్‌కు ఎలాంటి ప్రాధాన్యతా ఉండేదికాదు. కాని ఈసారి సమావేశాల్లో భారత్‌కు విశేష ప్రాధాన్యత లభించింది. అందుకు కారణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.నిజానికి ఈ చట్టాన్ని ఆమోదించటానికి భారత ప్రభుత్వానికి చాలా కాలం పట్టింది. వామపక్షాల ఒత్తిడితో మాత్రమే ఈ చట్టం ఆమోదాన్ని పొందింది. నిజ ఆర్థికవ్యవస్ధకు ప్రాధాన్యతను ఇవ్వటంతోపాటు దేశీయంగా డిమాండును పెంచే చర్యలను తీసుకున్నందుకుగాను చైనాను సమావేశం అభినందించింది. లైంగిక సమానత, ఎయిడ్స్‌ సమస్యల గురించి కూడా ఐఎల్‌ఓ పరిణగనలోకి తీసుకున్నది. స్త్రీ పురుష సమానత్వం గురించి ఐఎల్‌ఓ ఎప్పటి నుంచో చెపుతున్నది. కాని ఇవన్నీ నీటిమీది రాతలుగానే మిగిలి పోతున్నాయి. కార్మికులకు సంబంధించిన విషయాలకు కూడా ఇదే దురవస్ధ పడుతున్నది. సమావేశాలు జరుగుతున్నపుడే మరిన్ని ఉద్యోగాలు పోవటం గురించి, సమ్మెలు వగైరాల గురించి వార్తలు వెలువడ్డాయి. నిన్నమొన్నటి వరకు ప్రపంచీకరణ, స్వేచ్ఛా మార్కెట్‌ గురించి మాట్లాడిన వారే ఇప్పటి ఐఎల్‌సి సమావేశంలో కార్మికవర్గ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగమే.

    ఆమ్‌ అద్మీనా? విశేష్‌ ఆద్మీనా?!

    0 వ్యాఖ్యలు
    వివిధ కంపెనీల బృందాలకు పన్నుల్లో రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించిన ప్రభుత్వ ధోరణి చూస్తుంటే దీనిని అదొక విధానంగానే పెట్టుకున్నదని అర్థమవుతుంది. ఈ బడ్జెట్‌లో అది కల్పించిన పన్ను రాయితీలు పెట్రోలియం, పెట్రో కెమికల్స్‌ రంగంలోని ఒకానొక కంపెనీల బృందానికి అపారమైన లాభాలు సమకూర్చిపెడుతోంది. అందుకే దీనిని ఆమ్‌ ఆద్మీ బడ్జెట్‌ అనే కన్నా కొందరు విశేష్‌ ఆద్మీలు లేదా గ్రూపు బడ్జెట్‌ అనడమే సరైనది.

    యుపిఏ ప్రభుత్వం తిరిగి రెండోసారి ఎన్నికైన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ఇది. ప్రభుత్వం ఉద్దేశాలేమిటో చూచాయగా ఈ బడ్జెట్‌ ద్వారా తెలియజేయవచ్చని భావించారు. ఆ సంకేతాలు ఎలా వుండబోతున్నాయనే దానిపై రకరకాల వాదనలు వెలువడ్డాయి. ద్వారా తన ఉద్దేశాలను ఈ బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం తన ఉద్దేశాలివీ అని సంకేతాలిస్తుందని అయితే ఆ సంకేతాలేమిటన్నదానిపై పరిపరి విధాలుగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు వెలుపలినుంచి ఇచ్చే మద్దతుపై ఆధారపడాల్సిన అగత్యం యుపిఏ ప్రభుత్వానికి ఇక లేదు గనుక మార్కెట్‌ అనుకూల, కార్పొరేట్‌ అనుకూల విధానాలన్నిటిని ఇప్పుడు యథేచ్ఛగా అమలు చేయగలదని, బడా వ్యాపార వాణిజ్య వర్గాలు కోరుతున్నట్లుగా ప్రయివేటీకరణను పెద్దయెత్తున చేపడుతుందని, పన్నులు మరింత తగ్గిస్తుందని, ఆర్థిక సరళీకరణను వేగవంతం చేయగలదని కొందరు వాదించారు.ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటి అమలుకు పూర్తిగా కట్టుబడి వుండాలని, ఇటీవలి ప్రజాతీర్పు అంతస్సారమిదేనని,యుపిఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధి పెంపు, అందరికీ ఆహార భద్రత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత, ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుదల, విద్యా హక్కుకు గ్యారంటీ వంటి అనేక హామీలను ఆమ్‌ఆద్మీపై గుప్పించింది. ఇవి అత్యంతావశ్యకమే కాదు, వీటికి తగినన్ని నిధులు కేటాయించి సమర్ధవంతంగా అమలు చేస్తే దానివల్ల అనేక ఫలితాలొస్తాయి. ఇటువంటి చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఒక సానుకూల మార్పును తీసుకు రావచ్చు.

    ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న సంకేతాలేవీ అంతగా కానరాలేదు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించారు. (చేదు గుళికలకు చక్కెర పూత పూసినట్లు ప్రైవేటీకరణకు 'ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం' అని ముద్దు పేరు పెట్టారు). అయితే ఈ ప్రక్రియ ద్వారా ఎంత

    6, జులై 2009, సోమవారం

    పెట్టుబడుల ఉపసంహరణ ఎవరి కోసం

    3 వ్యాఖ్యలు
    ''పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా వనరుల కొరతను అధిగమించటమే ప్రభుత్వ లక్ష్యం అయినట్లయితే అది వివేకంతో కూడుకున్న చర్యకాబోదు. ద్రవ్య లోటు 2 లక్షల కోట్ల రూపాయలనుకున్నట్లయితే మీకున్న మొత్తం ఆస్తులను రెండేళ్ళలో అమ్మివేయగలరు. మరి మూడవ సంవత్సరం ఏమిచేస్తారు? కనుకనే మీమౌలిక లక్ష్యాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి కచ్చితమైన జవాబును కోరుతున్నాము. ఇది కేవలం పెట్టుబడికి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. గత పదేళ్ళలో ఈ విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. ఏ లక్ష్య సాధన కోసం పెట్టుబడుల ఉపసంహరణ? ఇది కేవలం బడ్జెట్‌ వ్యత్యాసాలను పూరించటానికేనా? సాధారణ వినియోగ వ్యయ అవసరాలను తీర్చటం కోసం పెట్టుబడుల ఉపసంహరణ వివేకమవుతుందా? ద్రవ్యలోటును తగ్గించుకునే ఇతర మార్గాలను మీరు అన్వేషించలేరా?

    పై ప్రశ్నలను లేవనెత్తింది ఎవరోకాదు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా వున్న ప్రణబ్‌ ముఖర్జీ సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం రాజ్యసభలో ఈ ప్రశ్నలను లేవెనెత్తారు. అప్పటిలో ఆయన ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నారు. 2001 ఫిబ్రవరి 27వ తేదీన అంటే ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం తన బడ్జెట్‌ను సమర్పించటానికి కొన్ని గంటలముందు బాల్కో పెట్టుబడుల ఉపసంహరణపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఆయన పైవిధంగా ప్రశ్నలను సంధించారు. ఇప్పటివరకు ఇవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అన్ని పార్టీలు మాట్లాడాయి. కాని ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

    అలాంటపుడు ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం తక్షణమే పిలుపు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఐదేళ్ళ అనంతరం ''వామపక్షాల ఆటంకం'' తొలగిపోయినందుకేనా? పైన ప్రస్తావించిన ''వైదుష్యాన్ని'' ఎనిమిదేళ్ళ క్రితం కాంగ్రెసు ప్రదర్శించింది. అప్పటిలో ప్రతిపక్షంగా ఉండటానికిగాను కాంగ్రెసుకు వామపక్షాల అవసరం ఏమాత్రం లేదుగదా! ముఖర్జీ ఉపన్యాసంలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
    ''ఒప్పందానికి కట్టుబడి ఉండండి: ప్రభుత్వానికి ఫిక్కీ సూచన'' అన్న విషయాన్ని నేను వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాను. మొత్తం ప్రైవేటు రంగంగా ఉండటాన్నే వారు అభిలషిస్తారు. ప్రతిచోటా మార్కెట్‌ ఆర్థికవ్యవస్ధ ఉండాలని కోరుకుంటారు. ఈరోజే కాదు సర్వేసర్వత్రా వారు ఈ డిమాండును చేస్తూనే ఉంటారు.

    ఇదీ అసలు సంగతి. పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నదెవరు? ఫిక్కీతోపాటు సిఐఐ, అసోచెమ్‌ వంటి పారిశ్రామిక సంస్ధలు పెట్టుబడుల ఉపసంహరణను కోరుతున్నాయి. 2001లో అరుణ్‌ శౌరికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ సంస్ధలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్నాయి. అంతేగాని ప్రభుత్వ రంగ యజమానులైన ఈ దేశ ప్రజలు కాదు.

    షేర్‌మార్కెట్‌ ద్వారా ప్రజల యాజమాన్యం?
    దేశ ప్రజలు, పార్లమెంటుకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పార్లమెంటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రజల యాజమాన్యాన్ని ప్రజలెన్నుకున్న పార్లమెంటు కాపాడుతుంది. పార్లమెంటు ద్వారా రక్షణ పొందే ప్రజల యాజమాన్యాన్ని షేర్‌ మార్కెట్‌ ద్వారా కొద్దిమంది ప్రజల యాజమాన్యంగా మార్చరాదు. దశలవారీగా ప్రైవేటీకరించే క్రమాన్ని మరుగుపరచేటందుకుగాను ప్రజా యాజమాన్యం అంటూ తప్పుడు పేరును పెడుతున్నారు. 1991-1996 మధ్య కాంగ్రెసు ప్రభుత్వం ఉన్నపుడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగే ఉన్నారు. నవరత్నాలలో ఒకటన భెల్‌ వాటాలను తెగనమ్మేటందుకు ఆ సమయంలోనే శ్రీకారం చుట్టారు.

    5, జులై 2009, ఆదివారం

    శాస్త్రీయత ముసుగుతో దోపిడి - కృత్రిమ వర్షాలు

    4 వ్యాఖ్యలు
    శాస్త్రీయత లేకున్నా ఐదేళ్లలో 150 కోట్లు ధారాదత్తం, ఈ ఏడాది 30 కోట్లు
    మేఘమధనం టెండర్‌ను ఈసారి కూడా అగ్ని ఏవియేషన్స్‌ సంస్థే దక్కించుకోనుంది. నాలుగైదేళ్లుగా ఆ సంస్థపై ఎన్ని ఆరోపణలొచ్చినప్పటికీ దానికే కాంట్రాక్టును కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్‌ టెండర్లు పిలిచామంటున్నా ప్రభుత్వం రూపొందించిన నియమాలు అగ్నికి అనుకూలంగా రూపొందించినట్లు సమాచారం. అందువల్ల ప్రతి ఏడాదీ కాంట్రాక్టును ఆ సంస్థ స్వంతం చేసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అగ్నిని దృష్టిలో పెట్టుకొనే నిబంధనలు తయారు చేస్తున్నారన్న విమర్శలొచ్చాయి.
    కృత్రిమ వర్షాలు పడతాయన్న గ్యారంటీకానీ, అసలా విషయానికి సరైన శాస్త్రీయతకానీ లేవని నిపుణులంటున్నారు. కొన్నేళ్లుగా మేఘమధనం చేస్తున్నా దానివల్ల ఎక్కడ వర్షాలు పడ్డాయో స్పష్టంగా నిరూపితం కాలేదు. ఫలానచోట వర్షం కురిసిందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అటువంటి వ్యవస్థ మనవద్ద లేదు. అయినా కొన్ని సంవత్సరాల్లో మధనానికి 150 కోట్లు ఖర్చు చేసింది. కోట్ల రూపాయల ప్రజాధానాన్ని 'అగ్ని'కి తగలేస్తోంది. ఈ సీజన్‌లో కృత్రిమ వర్షాలు కురిపించడానికి బడ్జెట్‌లో 30 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిని ఖర్చు చేయడానికి 'అగ్ని'ని ఎంచుకున్నారు.
    ఆ కంపెనీకే ఎందుకు?
    ఖరీఫ్‌, రబీ సీజన్లలో మేఘమధనం జరపడానికి గ్లోబల్‌ టెండర్లు పిలిచారు. జూన్‌ 29న టెండర్లు తెరిచారు. మూడు కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. అగ్ని ఏవియేషన్స్‌, శ్రీ ఏవియేషన్స్‌, సైకాన్‌ కనస్ట్రక్షన్స్‌ టెండర్లు వేశాయి. ఆ మూడింటిలో అగ్నిని ఎంపిక చేశారని తెలిసింది. ఈ నెల 15 నుండి మధనాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. జెఎన్‌టి యూనివర్శిటీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అగ్నిపై గతంలో పలు ఆరోపణలొచ్చాయి. సరిగ్గా మధనం చేయకుండా కోట్ల రూపాయల బిల్లులు స్వాహా చేసేందుకు సచివాలయంలోని ఒక ఐఎఎస్‌ అధికారికి గతంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఆ పని చేసిన అగ్ని ప్రతినిధిని ఆ అధికారి తన కార్యాలయం నుండి మెడపట్టి గెంటించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా రెండు మూడేళ్లు ఆ సంస్థే మధనం చేసింది. అనావృష్టి ప్రాంతాల అభివృద్ధి శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అప్పట్లో మారెప్పకు అప్పగించారు. మధనం ఆ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వేరే శాఖ మంత్రి పెత్తనం చేశారని మారెప్ప గతంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నితో నేరుగా ఒక కేబినెట్‌ మంత్రికి సంబంధాలున్నాయని ఆయన పలుమార్లు ఇష్టాగోష్టిలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే మంత్రి అగ్నికి టెండర్‌ ఇప్పించడానికి లాబీయింగ్‌ చేశారని సమాచారం. ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని తెలిసింది. ఆసియాలో మధనం చేయగల సత్తా, అందుకు అవసరమైన మౌలిక వసతులు దానికే ఉన్నాయని, అందువల్ల అగ్ని మళ్లీ ఎంపికైందని ప్రచారంలో పెట్టారు.
    అన్నీ అనుమానాలే
    మధనంపై ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. దానికి శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడా కృత్రిమ వర్షాలు లేవని తేల్చారు. పడుతున్నవాటి స్థాయిని 10 నుండి 15 శాతం వరకూ పెంచే పరిజ్ఞానం మాత్రమే కొంతమేరకు అభివృద్ధి చెందిందని నిపుణులు పేర్కొన్నారు. మధనానికి అనుకూలమైన మేఘాలు ఉంటేనే ఆ మేరకైనా సాధ్యమవుతుంది. ఉష్ణవాహక మేఘాలను రాడార్‌ సాయంతో గుర్తించి ప్రయోగం చేస్తున్నారు. శీతల మేఘాలను మధించే టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ప్రయోగం చేసిన మేఘం ఫలానచోట వర్షిస్తుందన్న గ్యారంటీలేదు. అయినా గడచిన ఐదేళ్లలో 150 కోట్లు మధనానికి ఖర్చు చేశారు. అగ్నికి ధారాదత్తం చేశారు. క్లవుడ్‌ సీడింగ్‌వల్ల సీజన్‌లో సగటున 17 శాతం అదనంగా వర్షాలు పడ్డాయని ప్రచారం చేసినా ఆ లెక్కకు సరైన శాస్త్రీయతలేదు. ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న శ్రీకాకుళం-ఆదిలాబాద్‌ ప్రాంతంలో సాలీన 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో మధనంవల్ల ప్రయోజనంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో కొంత ఉపయోగం ఉండవచ్చు. అగ్ని ఏనాడూ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మధనం చేయలేదని ఆరోపణలున్నాయి. ఏకకాలంలో రెండు మూడు విమానాలను ఉపయోగిస్తామని ముందు చెప్పినా అవి పూర్తిస్థాయిలో ఏనాడూ అందుబాటులోకి రాలేదు. మూడు రాడార్‌ స్టేషన్లు కావాలని అంటున్నా అతీగతిలేదు. ముఖ్యంగా అనంతపురంలో ఒకదాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధుల సమస్య చెప్పనే అక్కర్లేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆర్థికశాఖ కొర్రీలతో సమయానికి నిధుల్లేక అదనుకు ప్రయోగం జరగట్లేదు. ఏవియేషన్‌ మంత్రిత్వశాఖ నుండి విమానం ఎగరడానికి సకాలంలో అనుమతి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేయట్లేదు. ఇన్ని ఇబ్బందులున్నా ఐదేళ్లకూ ఒకేసారి టెండర్లు పిలవాలని సిఎం అధికారులకు సూచించడం గమ నార్హం. సీజన్‌ ముంచుకు రావడంతో ఈ ఒక్క ఏడాదికి హడా విడిగా టెండర్లు పిలిచారు. వర్షాల కోసం వరుణ యాగాలు, మధనం అంటున్నా రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. గత ఏడాదికి చెల్లించాల్సిన 30 కోట్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఆర్థిక శాఖలో ఫైలు పెండింగ్‌లో ఉందని అధికా రులు తెలిపారు. బకాయిలతో పాటు, కొత్త టెండర్‌కు అడ్వాన్స్‌ చెల్లింపుపై ఆర్థికశాఖ ఆమోదం లభించలేదు. ఇవన్నీ పూర్తయ్యే సరికి సీజన్‌ ముగుస్తుందని, మంచి వర్షాకాలంలో ప్రయోగం చేసి తమ వల్లే వర్షాలు పడ్డాయని ప్రచారం చేసి అగ్నికి కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

    4, జులై 2009, శనివారం

    రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర వైఖరి

    2 వ్యాఖ్యలు
    కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ తన మంత్రిత్వ శాఖకు చెందిన 100 రోజుల ప్రణాళికను విడుదల చేస్తూ అదే సమయంలో పలు ప్రకటనలను చేశాడు. ఆయన ప్రతిపాదించిన చర్యల్లో ఒకటేమంటే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలనటం లేదా దానిని ఐచ్చికంగా ఉంచటం. అదేవిధంగా, విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్థం ఒకే బోర్డు కింద అఖిల భారత స్ధాయిలో 12వ తరగతి పరీక్షల నిర్వహణ. అంతకుముందు ఆయన 'ఉన్నత విద్య పునరుద్ధరణ-పునరుజ్జీవం' అన్న అంశంపై యశ్‌పాల్‌ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమలు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

    పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎమర్జన్సీ సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. తదనంతర కాలంలో ఈ రంగానికి సంబంధించి పలు చర్యలను చేపట్టటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకృతం చేసింది. రాష్ట్రాలకు దీనిలో నామమాత్రపు జోక్యం మాత్రమే మిగిలింది. అయితే పాఠశాల విద్యకు సంబంధించి ఆయా రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక, భౌగోళిక తదితర అంశాల ప్రాతిపదికపై పాఠ్యాంశాలను రూపొందించే విశిష్టమైన హక్కు రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్ర బోర్డుల ద్వారా పాఠశాల పరీక్షలు జరుగుతాయి. కనుక పరీక్షలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఏకపక్షంగా ప్రకటన చేయటమంటే, అది రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించటం, పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్రాల అధికారాలను లాగివేయడమే అవుతుంది. అఖిల భారత స్ధాయిలో 12వ తరగతికి ఒకే బోర్డు అధ్వర్యంలో పరీక్షలను నిర్వహించటమంటే వివిధ రాష్ట్రాలలోని వైవిధ్యానికి పాతర వేయడమే అవుతుంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న సంస్కృతికీ, పరిస్థితులకూ అనుగుణంగా పాఠశాల స్ధాయిలో విద్యా బోధనకుగాను రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని లాగివేయడమే అవుతుంది. ఈ ప్రతిపాదనలు ఆచరణలోకి వచ్చినట్లయితే పాఠశాల స్ధాయిలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్రా లేకుండా పోతుంది.

    3, జులై 2009, శుక్రవారం

    నమ్మకాన్ని సొమ్ము చేసుకొంటున్న టాటా

    3 వ్యాఖ్యలు

    ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాగ్రూప్‌ గతకొద్ది వారాలుగా ఇంటిని చక్కదిద్దుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు సాగించింది. 2006, 2007ల్లో టాటా మోటార్‌ కంపెనీ ఆంగ్లో-డచ్‌ స్టీల్‌ కంపెనీ 'కోరస్‌'ను, విలాసవంతమైన కార్ల బ్రాండు ''జగార్‌'', ''లాండ్‌ రోవర్‌''లను కొన్నది. టాటా గ్రూపు మోయలేని భారాన్ని నెత్తికెత్తుకొంటోందని ఆర్థిక నిపుణులు అప్పుడే వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్‌ రంగం ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలో ఈ బ్రాండ్లను కొనటానికి టాటాలు చెల్లించిన ధర ఎక్కువగా వుందన్న విమర్శలు కూడా వచ్చాయి.
    అంతర్జాతీయ సంక్షోభంతో ఈ సంస్థలు నష్టాలు చవిచూడడంతో ఒక అంచనా ప్రకారం టాటా గ్రూపు అప్పు మొత్తం 2009 నాటికి లక్ష కోట్లు రూపాయలకు చేరింది. గత సంవత్సరం కంటె ఇది 30వేల కోట్లు ఎక్కువ. కోరస్‌, జగార్‌లు నష్టాలబారిన పడ్డాయి. వీటిని పూడ్చడానికి కొత్తగా నిధులు సమకూర్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టాటాగ్రూపుపై వచ్చిన విమర్శలు సహేతు కమని తేలిపోయింది. కానీ అప్పట్లో టాటాలు ఈ విమర్శలను కొట్టివేశారు. మారిన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారని, టాటా గ్రూప్‌ అంతర్గత శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పుకొన్నారు.

    విమర్శకుల వాదనలను మీడియా, ప్రభుత్వం కూడా ప్రక్కన పెట్టింది. ఈ కొనుగోలును, దీనితో పాటు జరిగిన ఇతర విదేశీవ్యాపార సంస్థల కొనుగోలును మీడియా ఆకాశానికి ఎత్తింది. అంతర్జాతీయమార్కెట్‌లో భారతీయ కంపెనీల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా ఈ కొనుగోళ్లను చూపించారు. భారీగా వున్న విదేశీమారక ద్రవ్యనిల్వలు ప్రభుత్వానికి ధైర్యానిచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ కొనుగోళ్ళకి ప్రోత్సాహానిచ్చింది. సరళీకృత ఆర్థిక విధానాల అమలు తరువాత ప్రభుత్వానికి, ప్రయివేటు పెట్టుబడికి పెరుగుతున్న సమన్వయానికి ఇది ఒక ఉదహారణ.


    ఈ కొనుగోలు అనంతరం కొన్ని నెలలలోనే ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. ఆటోమొబైల్‌, స్టీల్‌రంగాల్లో అమ్మకాలు, ఆదాయాలు అనుకున్నదానికంటే బాగా పడిపోయాయి. ఉన్న అప్పును తీర్చలేక రీఫైనాన్స్‌ చేయించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మే 2009 నాటికి టాటాగ్రూపు జగార్‌ కోసం రూ.15000కోట్లు , కోరస్‌ కోసం రూ.22500 కోట్లు అదనంగా అప్పు చేయాల్సి వచ్చింది. గతవారం వరకు రీఫైనాన్స్‌ విధివిధానాల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలను పరిశీలిస్తే టాటా గ్రూపు తిమ్మిని బమ్మిగా చేయడంలో దిట్టగా మారిందనేది అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితులలోను కోరస్‌, జగార్‌ కంపెనీలను మూసివేయకుండా చూడాలని బ్రిటన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. బ్రిటన్‌ ప్రభుత్వ అసహాయ స్థితిని ఆసరాగా తీసుకుని టాటా మోటర్స్‌ రూ.3500కోట్ల అప్పుకు బ్రిటన్‌ ప్రభుత్వం నుండి గ్యారంటీ తీసుకుంది. మరో రూ.2380కోట్లు యూరోపియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక నుండి అప్పుతీసుకుంది.


    టాటాలు కొనుగోలు చేసిన కోరస్‌ స్టీల్‌ కంపెనీ టాటాగ్రూపు సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేని దుస్థితిలో ఉంది. ఇప్పటికే టాటాలు రూ.21000 కోట్లు కోరస్‌ను కొనడానికి అప్పుతీసుకున్నారు. రీపైనాన్స్‌ చేయ వల్సిన పరిస్థితులలో రూ.1400కోట్లు మాతృ సంస్థ సహాకారంతో అప్పు తీర్చడానికి కోరస్‌ సిద్దపడింది. మాతృసంస్థను చూసే కోరస్‌కు రీపైనాన్స్‌ చేయడానికి రుణదాతలు సిద్ధపడు తున్నారు. జగార్‌ కంపెనీ నష్టాలను పూడ్చడానికే రూ.7000 కోట్లు టాటా గ్రూపు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వీటి ప్రభావం టాటాగ్రూప్‌పై పడింది.
    ఈ పరిస్థితులను అధిగమించటానికి, నిధులు సంపాదించడానికి టాటాగ్రూపు అనేక మార్గాలను అన్వేషించింది. దేశంలోని టాటాగ్రూప్‌ బ్రాండ్‌కి ఉన్న ప్రతిష్టను ఉపయోగించుకుంది. కంపెనీ రుణభారాన్ని షేర్‌హోల్లర్లపై నెట్టింది. టాటాస్టీల్‌ షేర్లను అమ్మడం, షేర్‌మార్కెట్‌, ఫిక్సడ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ద్వారా రూ.5000 కోట్ల నిధులను సమీకరించి తనకున్న అప్పును టాటా మోటర్స్‌ కొంత తీర్చగలిగింది. టాటాగ్రూప్‌ భారతదేశ ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంది. రెండు విదేశీ కంపెనీలను కొనేటప్పుడే అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం టాటాగ్రూప్‌కు కావల్సిన సహాయం చేస్తానని తెలియజేశారు. స్టేట్‌బ్యాంక ఆఫ్‌్‌ ఇండియా ఇతర పది బ్యాంకులతో కలిపి ఒక సిండికేట్‌గా ఏర్పడి దాదాపు రూ.4,200 కోట్ల రూపాయలను బాండురూపంలో టాటాకు నిధులు సేకరించిపెట్టింది. ఆర్థిక మంత్రి అండదండలు లేకుండా బ్యాంకులు ఈ రకంగా చేయవు. ప్రభుత్వరంగ బ్యాంకులు సహాయంచేయడం వలన, అంతర్జాతీయ బ్యాంకుల నుండి కూడా మంచి మద్దతు లభించింది. ఆ విధంగా జగార్‌ కంపెనీ కోసం తీసుకున్న రూ.5 వేల కోట్ల రూపాయల అప్పును రీపైనాన్స్‌ చేయడం సాధ్యపడింది.


    టాటామోటర్స్‌ ఏప్రిల్‌ 2009న పీపుల్స్‌ కార్‌ ''నానో'' విడుదలచేసింది. 16రోజుల బుకింగ్‌ సమయంలో 2లక్షల కార్లు బుక అయ్యాయి. వీటికి డిపాజిట్‌ అమౌంట్‌గా రూ.2500 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది ఒక రకంగా ప్రజల నుండి లోన్‌ తీసుకోవడం. 2010 చివరికి టాటాలు లక్ష కార్లు మాత్రమే వినియోగదార్లకిస్తారు. మిగిలిన లక్ష కార్లకోసం 2011 వరకు ఆగవల్సిందే ఈ కాలంలో వినియోగదారులకు కొంత వడ్డీ కూడా ఇస్తారు. మొత్తం మీద తమ బ్రాండ్‌ను ఉపయోగించుకొని సంక్షోభ సమయంలో గట్టెక్కడానికి ప్రజలనుండి టాటా నిధులు సేకరించగలిగింది. కోరస్‌, జాగర్‌ కంపెనీ కొనుగోలు నిర్ణయం తప్పయినప్పటికి కొనుగోలు ద్వారా ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడడానికి తన బ్రాండును, ప్రభుత్నాన్ని, ప్రజలను టాటాగ్రూప్‌ ఉపయోగించుకుంది.

      ఉద్దేశపూర్వకంగానే గాజా విధ్వంసం

      0 వ్యాఖ్యలు
      గాజాపై జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలకు పాల్పడిందని, నిర్లక్ష్యంగా దాడులు జరిపిందని, ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసిందని ఒక స్వతంత్ర మానవహక్కుల నివేదిక తెలిపింది. అత్యంత శక్తివంతమైన ఆయుధాల ప్రయోగం వల్ల వందలాది మంది మరణించగా, సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. హమాస్‌ రాకెట్‌ దాడులు కూడా యుద్ధ నేరాలేనని, వారు పౌరులకు ప్రమాదకరంగా ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. అయితే తన ప్రవర్తన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పింది. కొందరు పౌరులు మరణించిన మాట వాస్తవమేనన్న ఇజ్రాయిల్‌ తాను విచక్షణారహితంగా, పెద్ద ఎత్తున దాడులు జరిపాననే విమర్శను మాత్రం తిరస్కరించింది. 2008 డిసెంబర్‌ 27 నుంచి 2009 జనవరి 17 వరకూ 22 రోజుల పాటు ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధంలో 14 వందల మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో మూడు వందల మంది పిల్లలు, 115 మంది మహిళలు సహా మొత్తం తొమ్మిది వందల మంది పౌరులున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 117 పేజీల నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయిల్‌ దళాలు ఆరోగ్య రక్షణ అందకుండా పదేపదే అడ్డుకోవడం వల్ల అనేక ప్రాణాలు పోయాయని ఆ నివేదిక చెప్పింది.

      ఓట్లేసినందుకు ప్రతిఫలం

      2 వ్యాఖ్యలు
      ఎన్నికలకు ముందు పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించిన యుపిఎ ప్రభుత్వం అవి కాస్తా పూర్తయ్యాక రేట్లను భారీగా పెంచి సామాన్య ప్రజలపై మోయలేనిభారం మోపింది. ఓట్ల కోసం ప్రజల కాళ్లావేళ్లా పడిన కాంగ్రెస్‌ కేవలం పాస్‌ మార్కులతో గద్దెనెక్కి కొద్దిపాటి ఏమరపాటు కోసం కూడా ఆగకుండా తనకు ఓట్లేసినందుకు ప్రతిఫలంగా క్రూరమైన బహుమానం కట్టబెట్టింది. ఆర్థిక మాంద్యం అష్టదిగ్బంధనంలో దేశం చిక్కుకున్న తరుణంలో రోజురోజుకూ వేలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్న సమయంలో పెరిగిన పెట్రో భారం గోరుచుట్టుపై రోకలిపోటు. ద్రవ్యోల్బణం పెరగడంవల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అది తగ్గినా ధరలు చుక్కలు చూస్తుండటంపై కిమ్మనట్లేదు. ఇప్పటికే ఆకాశాన్ని చూస్తున్న ధరలు ప్రెట్రోవడ్డనతో మరింత ఎగబాకుతున్నాయి. పెట్రోల్‌ లీటరుకు నాలుగు రూపాయలు, డీజిల్‌ లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచి తక్షణం అవి అమల్లో పెడుతున్నామని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి మురళీదేవరా బుధవారం ప్రకటించారు. మరికొద్ది గంటల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతుండగా పెట్రో ఛార్జీలు పెంచడం పార్లమెంట్‌ను అవమానపడరచడమే అవుతుంది. చట్టసభలకు జవాబుదారుగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు.

      2, జులై 2009, గురువారం

      పేదలు పప్పు ముఖం చూడగలరా?

      0 వ్యాఖ్యలు
      ధరలను తగ్గిస్తామని చెప్పిన వైఎస్‌ సర్కార్‌ తన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఎన్నికలకు ముందు నెలకు 97 రూపాయలకు అందచేస్తున్న నిత్యావసర వస్తువులను ఇప్పుడు కేవలం 75 రూపాయలకే అందిస్తూ వైఎస్‌ సర్కార్‌ ఇప్పుడు తన ఖాతాలో మరో 'ఘనత'ను జమ చేసుకుంది. మంచం చాలకపోతే కాళ్లు నరికితే సరి అన్న సలహా పాటించిన ఫలితమే ఇది. జనం చెబుతున్నట్లుగా మార్కెట్లో అతినాసిరకం కందిపప్పును కిలో 30రూపాయలకు అందచేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు దాని ధరను ఏకంగా 45 రూపాయలకు పెంచేశారు. కిలోకు బదులు అరకిలోకు తగ్గించారు. ధరను కూడా పెంచింది. పామాయిల్‌, కందిపప్పు సరఫరా చేసినందుకు ఏడాదికి నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మొత్తాన్ని దాదాపు ఐదోవంతుకు కోతకోశారు. కందిపప్పుపై సబ్సిడీ భరించలేనిదిగా తయారైందని పౌరసరఫరాలశాఖ కొత్త మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కందిపప్పు మొదటి రకం వెల 2006 మే నెలలో కిలో 33 రూపాయలు ఉంది. ఇప్పుడు మొదటి రకం రు.58.37, రెండవరకం రు.51.67 ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ నివేదించింది. ప్రభుత్వమే ఏకంగా తానిచ్చే పప్పుధరను పదిహేను రూపాయలు పెంచింది. లక్షకోట్లరూపాయల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వమే రాయితీ ధరలకు ఒక కిలో కందిపప్పు కూడా ఇవ్వలేకపోతే పేదలు పప్పు ముఖం చూడగలరా?

      1, జులై 2009, బుధవారం

      పాపం మమతా బెనర్జీ!

      0 వ్యాఖ్యలు
      మమతా బెనర్జీ లాల్‌ఘర్‌ ఆపరేషన్‌ రద్దు చేయాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణులు భద్రతా దళాలకు మంచినీళ్లు ఇస్తున్నారంటూ మీడియా చెబుతోందని కాని అది అబద్ధమని, వారంతా సిపిఎంకు చెందిన వ్యక్తులని అన్నారు. అంతా నాటకమని, ముందుగా వేసుకున్న పథకమని, మావోయిస్టులు ఇళ్లుతగలబెడుతున్నారనే వార్తలు అవాస్తవమని మమత అన్నారు. ఛత్రధర్‌ మహతోను కలిసిన మేధావులపై కేసు పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. లాల్‌ఘర్‌ అరాచకాల్లో ప్రధాన దోషులు వీరే. దీన్నిబట్టి మమతకు మావోయిస్టుల పట్ల ఉన్న దృక్పథాన్ని, సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యకలాపాల కారణంగా మావోయిస్టుల వ్యూహాలపై చీకట్లు కమ్ముకున్నాయి. వారి తుపాకుల శక్తి తగ్గిపోయింది. మావోయిస్టులకు మద్దతు విషయంలో డొల్లతనం బయటపడింది. మమత ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని నిన్న ఛత్రధర్‌ మహతో ప్రశ్నించారు. మమత ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు కాబట్టి లాల్‌ఘర్‌ అరాచకాల బాధ్యత నుంచి ఆమె తప్పించుకోలేరు. మంగళవారం భద్రతా దళాలు కాంతాపహరి నుంచి కూంబింగ్‌ ప్రారంభించాయి. దళాలు పక్కా సమాచారం ఆధారంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. సాధారణ ప్రజలు వీరికి సహకరిస్తూ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌ స్క్వాడ్‌ సభ్యులు స్థానిక కేడర్‌ను వారి మానాన వారిని వదిలేసి జార్ఖండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. భద్రతా దళాలు లాల్‌ఘర్‌ ప్రాంతంలో మరో నెల రోజుల పాటు ఉంటాయి. రాష్ట్ర పోలీసులు ఇక్కడి ప్రజల భద్రత కోసం శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకోనున్నారు.