వీలుంటే నా నాలుగు లంకెలు ...

24, జులై 2009, శుక్రవారం

విమానయాన సంస్థపై విష ప్రచారం

విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు.

గత నెలలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఐఏ), ఎయిర్‌ ఇండియా (ఏఐ) సంస్ధలను ప్రభుత్వం విలీనం చేసింది. ఈ సందర్భంగా నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) ఉద్యోగులను ఉద్దేశించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ తీవ్రంగానే బెదిరించారు. నిధులు లేవని చెపుతూ జూన్‌ నెల వేతనాలను ఆపివేశారు. ఇదే సమయంలో ఎయిర్‌ ఇండియా నష్టాలలో పడిందంటూ ప్రసారమాధ్యమం ప్రచారాన్ని అందుకున్నది. మంత్రిత్వ శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని చేయించింది. దాదాపు రూ.7,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని పత్రికలైతే ఈ నష్టాన్ని రూ.5,000 కోట్లుగా అంచనా వేశాయి. దాదాపు 35,000 నుంచి 50,000 వరకు వున్న సిబ్బందే ఎయిర్‌ ఇండియాకు పెను భారంగా తయారయ్యారన్న ప్రచారం జరిగింది. సిబ్బందిని తగ్గించాలని, వేతనాలలో కోత విధించాలని, వేతనాలను ఇవ్వటం ఆలస్యం అయినా సర్దుకుపోవాలని కార్పొరేట్‌ ప్రసారసాధనాలు సిబ్బందికి సుద్దులు చెప్పసాగాయి.

విలీన గారడీ
2004-05, 2005-06 సంవత్సరాలలో లాభాలను ఆర్జించిన అనంతరం 2006-07లో నిజానికి నష్టాలు లేనేలేవు. ఉన్నదంతా విలీనం పేరుతో జరిగిన గారడీయే. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లను నాసిల్‌ (ఎన్‌ఏసిఐఎల్‌) పేరుతో విలీనం చేస్తున్నట్లు 2007-08 వార్షిక నివేదికలో పౌర విమానయాన శాఖ పార్టమెంటుకు తెలిపింది. ఈ విలీనం కారణంగా ససంస్ధ సామర్ధ్యం పెరగటంతోపాటు భారతదేశంలోనే అతిపెద్ద సంస్ధగా రూపొందగలదని, ఆదాయం విషయంలో ప్రపంచంలోనే 31వ స్ధానంలో నిలబడగలదని ఇంకాఇంకా పలు లాభాలు ఉండగలవని ఈ నివేదికలో చెప్పుకొచ్చింది. ఇన్ని ప్రయోజనాల గురించి చెప్పిన మంత్రిత్వ శాఖ పౌర విమాన పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను విస్మరించింది. ఈ నెల 9వ తేదీన మంత్రి ఒక ప్రకటన చేస్తూ ప్రయాణీకుల తగ్గుదల, మార్కెట్‌లో పోటీ పెరగటం, ఇంధన వ్యయం పెరుగుదల వగైరాలు పెద్ద సమస్యలుగా మారాయని చెప్పారు. అయితే మంత్రిగారు ఏ ప్రాతిపదికపై ఈ విషయాలు చెప్పారు. విమానయాన సంస్ధలు రెండింటినీ విలీనం చేసేటపుడుగానీ, రూ.50,000 కోట్లు ఖర్చు చేసి 111 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నపుడుగానీ లోతైన విశ్లేషణ జరిపారా? బలము, బలహీనత, అవకాశాలు, ప్రమాదాలు ప్రాతిపదికపై విశ్లేషణ జరపాల్సి వుంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారమేకాక మార్కెట్‌ ఇబ్బందులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వగైరాలను పరిశీలించాలి. ఇవన్నీ తెలియని విషయాలేమీ కాదుగదా? తప్పుడు విధానాలతో విమానయాన సంస్ధను సంక్షోభంలోకి నెట్టివేసి వాస్తవాలకు పాతర వేసినవాళ్ళే ఇప్పుడు ఉద్యోగులపై బాధ్యతను నెట్టివేస్తున్నారు. విమానయాన సంస్ధకు అవసాన దినం సమీపించిందంటూ కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, యాజమాన్యం, మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక, 'నిర్వహణ లేదా వినాశనం ప్యాకేజీ' కింద వేతనాలు కోరకుండా పనులను చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నారు. కాని లాభ నష్టాలకు సంబంధించిన వార్షిక బ్యాలెన్స్‌ పత్రాన్ని మాత్రం ప్రకటించటం లేదు. 2007-08 సంవత్సరానికిగాను నాసిల్‌ మొట్టమొదటి వార్షిక నివేదికను తయారు చేసిన 15 నెలల తరువాత ప్రకటించారు. అకస్మాత్తుగా రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లుగా ఈ పత్రం తెలియచేస్తున్నది. అసలు ఈ పత్రాన్ని ప్రవేశపెట్టటంలో అసాధారణమైన జాప్యం ఎందుకు జరిగినట్లు? దీని తరువాతిదైన 2008-09 బ్యాలెన్స్‌ షీటు ఎక్కడ ఉన్నది? ఈ నెల 9వ తేదీన మంత్రిగారు ఒక ప్రకటన చేస్తూ ఈ ఏడాది నష్టం రూ.5,000 కోట్లు ఉండగలదని చెప్పారు. ఇవేమీ ఆడిట్‌ చేసి చెప్పిన లెక్క కాదు. కేవలం అంచనాలతో చెప్పినది మాత్రమే. బ్యాలెన్స్‌ షీట్‌ను చూడకుండా కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం, ప్రభుత్వం కలసి ఉద్యోగులే నష్టాలకు కారణమని చెపుతున్నాయి.ఒకప్పుడు ఆకాశాన్నంటిన ఇంధనం ధరలు ఇప్పుడు నేలకు దిగిరావటంతో సర్‌ఛార్జ్‌ తగ్గే అవకాశం వచ్చిందని, మొత్తంమీద మున్ముందు సంస్ధకు లాభాలు రాగలవని గత డిసెంబరులో యాజమాన్యం చెప్పింది. కాని ఆరు నెలలు తిరగకముందే ప్లేటు మార్చింది. ''చూడండి మేము దివాళా తీశాము. వేతనాల చెల్లింపుకు మాదగ్గర మూల ధనం కూడా లేదు. సిబ్బందిని తగ్గించక తప్పదు.....'' అంటూ యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. ఈ పరిస్థితిలో సంస్ధను ''నిర్వహించటమో లేక నాశనం'' కావటమో తేల్చుకోవలసి ఉంటుందని మంత్రి చెపుతున్నారు. ''నాశనం'' అంటే కొత్తగా దిగుమతి చేసుకుంటున్న 111 విమానాలతోపాటు విమానయాన సంస్ధను ప్రైవేటీకరించటమన్న మాట.

విలీనం తరువాత జరిగిందేమిటి?
ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసిన తరువాత 2007-08లో రూ.2226 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నష్టం 2008-09లో రూ.5000 కోట్లకు పెరగవచ్చునని కూడా తెలిపింది. విమాన సంస్ధలో ప్రధానమైనది ఇంధన వ్యయం.2008లో బారెల్‌ సగటు ధర 94.85 డాలర్లుకాగా, 2009లో ఇది 51.85 డాలర్లుగా ఉన్నది. అంటే 2009 జనవరి నుంచి జూన్‌ వరకు సంస్ధకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే విషయమన్నమాట. ఇంతకుముందు ప్రకటించిన బాలెన్స్‌ షీటు ప్రకారం 2007-08లో సిబ్బంది వ్యయం మొత్తం వ్యయంలో 18.4 శాతం. లాభాలు ఆర్జిస్తున్న సెయిల్‌, భెల్‌ తదితర సంస్ధలతో పోలిస్తే ఈ వ్యయం హేతుబద్దమైనదే. విలీనానికి ముందు రెండు సంస్ధలు లాభాలలో నడిచాయి. కాని విలీనం తరువాత ఒక్కసారిగా నష్టాలు వచ్చాయి. 2005-06లో రెండు సంస్ధల ఆదాయం కలిపి రూ.15031 కోట్లు. 2007-08లో అంటే, విలీనం తరువాత స్వల్పంగా పెరిగి రూ.15257 కోట్లకు చేరింది. వ్యయం విషయానికి వస్తే రూ. 14923 కోట్ల నుంచి రూ.17,854 కోట్లకు పెరిగింది. ఇంతగా పెరగటానికి కారణమేమిటి? ఈ కాలంలోనే సిబ్బంది 1260కి తగ్గిపోయింది. ఇంధన వ్యయం కూడా తగ్గింది. కాగా వడ్డీల చెల్లింపులో పెరుగుదల ఉన్నది. 2005-06లో రూ.105 కోట్లు వడ్డీ చెల్లించగా 2007-08లో ఈ మొత్తం రూ.701 కోట్లకు పెరిగింది.విమానయాన సంస్ధను సక్రమంగా నడపాలంటే సిబ్బందికి నీతులు చెప్పటమేకాక, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా చేసినపుడు మాత్రమే విమానయాన సంస్ధ గతంలోవలెనే లాభాల బాట పడుతుంది.

3 కామెంట్‌లు:

  1. nijame i agree with u.........
    mind lekunda edo chestaaru danikosam marala employes meeda padataaru

    especially corporate media chetta ...vallaki asalu companies lo em chestaro kooda teleeni journlists vuntaaru em raastaro enduku raastaro teleedu just they want to increase their sales and ratings thats it...........

    mana blogs lo vunnaru journlist maha medhaavulu....

    రిప్లయితొలగించండి
  2. కట్టెలు కాల్చి బొగ్గులమ్ముకోవడం అంటే ఇదే.

    రిప్లయితొలగించండి