వీలుంటే నా నాలుగు లంకెలు ...

27, ఆగస్టు 2011, శనివారం

సుష్మాస్వరాజ్ - నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు

14 వ్యాఖ్యలు
  • కనీసం సుష్మాస్వరాజ్ గారు అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ గారు వైఎస్‌ఆర్ కి కుప్పలుకుప్పలుగా రాసిన  బహిరంగ ఉత్తరాలు గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? ఆంటే దత్తాత్రేయగారి బహిరంగ ఉత్తరాలు ఉట్టిట్టివేనా?  వైఎస్‌ఆర్ చాలా నిజాయితీ పరుడని వారి అధిష్టానానికి అంతర్గతంగా తెలియజేశారా?
  • చనిపోయిన వారి గురించి చట్టం మాట్లాడకూడదంటే, భోఫోర్స్ కుంభకోణం గురించి చనిపోయిన రాజీవ్‌గాంధి పేరు మీరు మాటమాటికి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
  • నాటి ఎమర్జన్సీ కాలంలో జరిగిన అరాచకాలనూ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకండి ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా చనిపోయారుగా.
  • సుష్మారాజ్ గారి ఉపన్యాసం "నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు" అన్నచందంగా వుంది.
  • అదీనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం లోకపాల్‌పై చర్చిస్తానికి, సందర్భరహితంగా వైఎస్‌ఆర్ అవినీతిని సమర్థిస్తూ, జగన్ అక్రమ వ్యాపారాలపై సిబిఐ దాడులను ఖండించడం అంటే... బరితెగించడమే అధికారం కోసం.

"The late YSR name in the FIR registered against Jagan in the alleged illegal wealth case is a clear example of the CBI being used for the selfish gains of the congress party."

విడ్డూరం:
  • మతుండి మాట్లాడుతున్నారో లేదో కూడా అనుమానం రాక మానదు. జలయజ్ఞం పనులలో చాలా అవినీతి జరిగిందనంటలో అతిశోయక్తి ఏమీవుండదేమో... అంతెందుకు, ఒక్కపట్టి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు నూరుకు పైగా బహిరంగ ఉత్తరాలు అప్పటి  రాయడం అందరికీ తెలిసినదే. ఆయన బ్రతికే వుండుంటే, కోర్టులూ యింత క్రీయాశీలంగా వుంటే, సిబీఐ యింత చలాకీగా వుండి వుంటే వైఎస్‌ఆర్ మొదటి ముద్దయే అనండంలో ఎవరకీ సందేహముండకర్లా! ఆంటే వైఎస్‌ఆర్ కాలంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో వున్న భాజపా అనవసర రాధాంతం చేసిందని ఒప్పుకుంటున్నారా? 
  • యిక జగన్ ఆస్తులు అన్యూహంగా పెరగడం, సాక్షిలో జలయజ్ఞం గుత్తేదార్ల అక్రమ పెట్టుబడుల గురించి భాజాపా మాజీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్యనాయిడుగారు ఎన్నిసార్లు విమర్శించి వున్నారో ఆయినికే గుర్తుండి వుండదు. అంటే భాజపా కి జగన్ గురించి బాగాతెలిసే వుండి కూడా "తప్పుడు ఆర్థిక నేరారోపణ" అని సుష్మాస్వరాజ్ గారు ఏలా అనగలిగారో?

    ఏదోరకంగా దేశంలో అధికారమే పరామావధిగా కాంగ్రేస్ పార్టీని మించి అవినీతి/అలౌకిక విధనాలతో సమతూగ గలిగే ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నీరూపించుకుంది యింకొకసారి పార్లమెంటు సాక్షిగా ఈరోజు.

    అలౌకిక విధానం
    కాంగ్రేస్:    మైనారిటీ మతస్థుల ఓట్లపై పిల్లి మొగ్గలు
    భాజాపా:  మెజారిటి  మతస్థుల ఓటర్లను ఏకంచేసి గుత్తంగా వారికి మళ్ళించుకోవడం

    అవినీతి:
    కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు..
    భాజపా: (నాకు గుర్తున్నవాటిలో కొన్ని..)
    • ఎల్.కె.అద్వాని - 1.8 అమెరికా డాలర్ల హవాలా కుంభకోణం
    • ప్రమోద్ మహాజన్ అంబానీల  స్నేహం - టెలికం రంగంలో అంబానీలకు గుత్తంగా లైసెన్స్‌లు కట్టబెట్టి దేశంలోనే అంబానీలను అత్యంత దనవంతులను చేసింది.
    • దక్షణ భారత దేశంలో ఏలాగైనా అధికారం చేపట్టాలని,  దక్షణ భారత దేశంలో మతతత్వానికి ఓట్లు పడవని ఒకటీ,రెండు సీట్లకంటే ఎక్కవరావని గ్రహించిన భాజపా, అవినీతికి కొమ్ముకాసి మైనింగ్ మాఫియా అయిన గాలి బ్రదర్స్ ని చేరదీసి వారి అవినీతి సొమ్ముతో కర్నాటకాని హస్తగతం చేసుకోకలిగింది. గాలి సోదర్లూ, యడ్యూరప్ప అవినీతి చేస్తున్నాడని తెలిసినా వారిని సిగ్గులేకుండా వెనకేసుకొచ్చింది కేవలం అధికార దాహార్థం.
    • యిప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమలు చేయాలునుకుంటుంది. సుష్మాస్వరాజ్ కు గాలి బ్రదర్శ్ నమ్మిన బంట్లని అందరకీ తెలిసిందే. వారి యింట్లో జరిగే చిన్నపాటి కార్యక్రమాలకు సైతం ఆమె హాజరు తప్పనిసరి. అదేవిధంగా గాలి సొదర్లు, జగన్ మధ్య లింకు గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరి త్రికోణపు బంధంతో యిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపాలని ప్రయత్నంగా కనబడుతుంది.

    25, ఆగస్టు 2011, గురువారం

    అవినీతి కేసులకు చిరునామ - రామ్ జేఠ్మలాని: బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి

    9 వ్యాఖ్యలు
    రామ్ జేఠ్మలాని
            మన దేశంలో బయటకు వచ్చే అవినీతి శాతం చాలా  తక్కువ, వచ్చినా విచారణ అంఖం పూర్తి చేసుకొని కోర్టులవరకూ వచ్చేవి నామ మాత్రం. అటువంటి వాటిలో హైకోర్టులను దాటుకొని సుప్రీంకోర్టుకు వచ్చేవి బహు స్వల్పం.  అయితే అతిపెద్ద భారీ కుంభకోణం అయినా లేక ఏమైన సంచలన కేసయితే మాత్రం ప్రాస్‌క్యూషన్‌కి వ్యతిరేకంగా వాదిస్తానికి ఒక గంటకు లక్షలలో వసూలు చేస్తూ చేపట్టిన కేసులో నీతి, న్యాయం, ధర్మం, సామాజిక స్పృహ, దయ, జాలి లేకపోయినా పర్వాలేదు ఈ 88 సంవత్సరాల పేరొందిన సుప్రీమ్ కోర్టు న్యాయవాది రామ్ జేఠ్మలాని. న్యాయం ఎక్కడవుందో అక్కడ వాలిపోయి చట్టం ముందు అడ్డంగా అన్యాయానికి వకల్తా పుచ్చుకొని వాదించడం యితనిని మించినవారు ఎవరూలెరనుకుంటా.. అందుకనేమో అంత "డిమాండ్"

            అతని జీవితంలో ఎన్నో విధాలుగా కోర్టులను తప్పుదారి పట్టించి వున్నాడో ఈ మహానుభాహుడు! ఎందుకంటే, యితను చేపట్టిన కేసులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగక మానదు...

    మచ్చుగా కొన్ని జేఠ్మలాని వాదించిన బడా అవినీతి కేసులు (చాలావరకు ఓడిపోయినవే)..

    • నేను ఈ పెద్దమనిషి ఇందిరా గాంధి హత్యా నింధితుల తరుపున వకల్తా పుచ్చుకున్నపట్టినుండి గమనిస్తూనే వున్నా. కేసు ఫలితం: ఓటమి, ఊరిశిక్ష. కాకపోతే చాలా సంవత్సరాలు పాటు సాగదీయగలిగాడు.
    • హర్షద్‌ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ (రూ. 4,000 కోట్లు).  కేసు ఫలితం: ఓటమి, శిక్ష ఖరారు. కారాగారంలోనే నిండితుడి మరణం.
    • కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోనం:  కేసు ఫలితం: ఓటమి, సంవత్సరంపాటు కఠినగారగార శిక్ష.
    • హజీ మస్తాన్ మిర్జా (ముంబాయి అండర్ వరల్డ్ డాన్):  కోర్టులలో కేసులు నడుస్తుండగానే హత్యకాబడ్డాడు.
    • అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి నిందుతుడు): కేసు ఫలితం: ఓటమి. ఉరి శిక్ష ఖరారు
    • లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
    •  జెస్సికలా హత్య కేసు (మను శర్మ): ప్రజల నుండి అంతర్ఖాల ద్వారా/సంక్లిప్త సమాచారాల ద్వారా/వార్తా చానళ్ళ ద్వారా వచ్చిన వత్తిడి వలన మను శర్మ, వికాస యాదవ్ & అమర్‌దీప్ సింగ్ ప్రస్తుతం తీహార్ చెరసాలలో వున్నారు
    • సొహ్రాబుద్దిన్ బూటకపు ఎన్‌కౌంటర్ (అమిత్ షా): గుజరాత్ లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాని గుజరాత్ లో అడుగు పెట్టకుండా సుప్రీం తీర్పు...
    •  అమిత్ జోగి (ఛతిస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు) ముడుపుల కేసు: ఓటమి, జైలుపాలు.
    • 2G కుంభకోణం (కనిమోలి): కనీసం బెయిల్ కూడా యిప్పించే స్థితిలో లేడు ఈ లాయరు సార్!
    • వై.ఎస్.జగనమోహన్ రెడ్డి -   చీటింగ్, అక్రమ పెట్టుబడుల కేసు: ఈరోజే వాదనలు మెదలు సుప్రీంలో.. కనీసం వీరి వాదనలు వినే స్థితిలోనే లేదు..
    • యింకో చాలా ఆసక్తి కలిగే కేసు... మాజీ కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అవినీతి కేసు. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త ఎంతో సవివరంగా ఆధారాలతో నిరూపించిన యితని అవినీతికి వకల్తా పుచ్చుకొని కర్నాటక హైకోర్టు కు బయలు దేరారు. ఏమవుతుందో చూడాలి.
    మీకింకా ఏమైనా అనుమానమా? పైన చెప్పిన అన్ని కేసుల పరిష్కారం ఏమయిందో చూసిన తరువాత కూడా!

    రామ్‌ జేఠ్మలాని కోరుకొనేవి:
    • పేరు ప్రఖ్యాతలు - మంచికో.. చెడుకో..(ఉచిత పబ్లిసిటి)
    • సంపద - బడా కుంభకోణాలలో అయితే రాబడి బాగా వుంటుంది (గంటకు లక్షల్లో). 
    • పై రెండిటికి సమర్థన:  భారత రాజ్యాంగంలోని..సహజ న్యాయసూత్రాలు అందరికి అందివ్వాలని (క్రూరులైనా, దుర్మార్గులైనా, ఉగ్రవాదులైనా, మతవాదులైనా ఒక్కటే)
    యింకో విచిత్రమేమిటంటే, భారతీయ జనతా పార్టీ కూడా యితని విషయంలో వింత ప్రవర్తన... 2004 ఎన్నికలలో అటల్ బిహారీ వాజపేయ్ కి వ్యతిరేకంగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన యితనిని, 2010 లో భాజాపా తరుపున రాజ్య సభకు పంపింది యిటువండి వాడిని.

    దక్షణ  భారతంలో బారీ అవినీతి కేసులన్నింటినీ  యితనే వాదిస్తున్నాడన్నమాట..
    • కనిమోళి టీవీ - అక్రమ పెట్టుబడులు (తమిళనాడు)
    • మైనింగ్ కుంభకోణం (కర్నాటక)
    • ఛీటింగ్, అక్రమ పెట్టుబడులు - సాక్షి, సండూర్ ( ఆంధ్రప్రదేశ్)

    నా ఉధేశం ప్రకారం యిటువంటి వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, అతను తన క్లైంట్స్‌ని రక్షించుకొనుటకు ఎన్నిసార్లు తప్పుడు వాదనలు, అబద్దాల, కోర్టులను తప్పిదారి పట్టంచి వుండోచ్చు!

    24, ఆగస్టు 2011, బుధవారం

    భిన్నత్వంలో... ఏకత్వం... అంటే యిదే మన... భారతదేశం..

    2 వ్యాఖ్యలు
    ఈ ఫోటో ఎవరు ఎక్కడ తీసారో తెలియదు గాని (బహుశా, మొన్న కృష్ణాష్టమికి బడులలో పెట్టిన వస్త్రాదరణ పోటీలకనుకుంట), ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వున్న ఈ ఫోటో నిజంగా భారతదేశంలో వున్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిభింబం...


    ఫేస్‌బుక్ సౌజన్యంతో

    22, ఆగస్టు 2011, సోమవారం

    అవినీతిని నిర్భయంగా సమర్థిస్తానికి మూల కారణాలు...

    12 వ్యాఖ్యలు
    కొతమంది అవినీతి అని తెలిసినా ఎందుకు సమర్ధిస్తున్నారని ఆలోచిస్తే నాకు తట్టిన కొన్ని మూల విషయాలు యివి...

    1. వారి వల్ల ఆర్థిక లభ్ది పొందినవారు.

    2. "పెయిడ్" మేధావి వర్గం (ఉదాహరణ: విలేకర్లు, రాజకీయ విశ్లేషకులు).

    3. కులగజ్జి కలవారు.

    4. వారి వల్ల ఏమైనా భవిష్యత్తులో  రాజకీయంగా/ఆర్థికంగా ఏమైనా వ్యక్తిగత ఉపయోగం వుంటుందేమో అనే ఉద్ధేశం కలవారు.

    5. వ్యక్తి ఆరాధన/మూఢాభిమానం, రాజకీయ అజ్ఞానం (ప్రజాస్వామ్యం పై అవగాహానా రాహిత్యం, రాజరక వ్యవస్థలోని బానిస మనస్థత్వం)
     
    6. వారి అవినీతిలో భాగస్వామ్యులు...

    పై కారణాలతో అవినీతి ని సమర్థిస్తూ  దిగువతెలిపిన సమర్థనలు వినిపిస్తున్నాయి...

    1. సంపాదించుకుంటే తప్పేమిటి, అందరూ సంపాదించుకుంటున్నారుగా?
    2. తెలివితేటలు వున్నయి కాబట్టి సంపాదించుకున్నాడు.. మీకావకాశం లేదు కాబట్టి ఈ ఏడుపు.
    3. పలనావాడి అవినీతి కంటే మావాడిది చాలా చిన్నదనే సరిపెట్టుకోవడం.
    4. వాళ్ళ ఎంత దోపీడీ చేసినా పట్టించుకోరా? కేవలం మావాడిపైనేనా?
    5. యిన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? (అంటే, వారిది అవినీతి అని నమ్మినా, ఎప్పటికీ తనవారికి మినహాయింపు యివ్వాలని ఉద్ధేశం)
    6. యిది రాజకీయ కుట్ర అని ఎదురుదాడి చేయడం


    మీరు జతచేయండి యింకేమయనా వుంటే...

    21, ఆగస్టు 2011, ఆదివారం

    ఎడ్డం.. అంటే.. తెడ్డం.... ఆంధ్ర ప్రజ... అవినీతిని బలపరుస్తూ ఉధ్యమం!

    5 వ్యాఖ్యలు
    2G/కనిమొలి/బోఫోర్స్ వంటి స్కాములతొ విసుగుపోయి, అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఉధ్యమబాట పడితే, మన ఆంధ్రాలో మాత్రం సిబీఐ దాడులకు నిరసనగా ప్రదర్శనలు, రాజీనామాలు బహిరంగ దోపిడీని బలపరుస్తూ! హవ్వ!

    నాకో పాతవిషయం గుర్తుకోస్తుంది...ఇందిరా గాంధి పెట్టిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశమంతా తుడిచి పెట్టుకొని పోతే, మన ఆంధ్రాలో మాత్రం ఆమెకు/కాంగ్రేసుకు అఖండ విజియాన్ని యిచ్చాము..

    ప్రజలను ఏమీ అనలేము కదా! ప్రజలను ఏమైనా అంటే మనమీద మనం ఉమ్మేసుకున్నట్లే! కాబట్టి... నోరెల్ల బెట్టి చూడలసిందేనా?

    16, ఆగస్టు 2011, మంగళవారం

    తీహార్ చరసాలలో అన్నాహజారేనినీ, కనిమొలినినీ, రాజానీ, కల్మాడీనీ ఈ కాంగ్రేస్ ప్రభుత్వం ఒకే గదిలో పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో!!

    2 వ్యాఖ్యలు

    బ్రదర్ అనిల్‌కుమార్: నీ మహిమతో/ప్రార్ధనతో వైఎస్‌ఆర్ ని ఎందుకు కాపాడుకోలేక పోయావు?

    13 వ్యాఖ్యలు
    నీకు అంత శక్తిని ఆ ప్రభువు ఏసు యిచ్చిన యెడల ఆ రోజు నీవు "కమాండ్" చేసి ఆ మాయదారి వర్షాన్ని ఎందుకు ఆపలేక పోయావు?

    (ఫేస్‌బుక్ సౌజన్యంతో) ఈవీడియో ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వుంది.

    బ్రదర్ అనిల్‌కుమార్! నీ శక్తిని చూస్తుంటే నీ బావమరిది వాదనలో నిజముందనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డిది సహజమరణం కాదని రెండేళ్ళయినా నెత్తినోరూ కొట్టుకుంటుంటే. కొంపదీసి నువ్వేవర్షాన్ని ఆదేశించావా ఆరోజు వర్షాన్ని పావురాలగుట్టలో కుమ్మేయ్యమని...

    ఫాదర్ అనిల్‌ కుమార్ ఈ విడియోలో చెప్పినవి ( ఆ ప్రభువు అంతటి శక్తిని ఈ బ్రదర్‌కి ధరాదత్తం చేసిన యెడల) నిజమని నమ్మిన యెడల దిగువ తెలిపిన వాటికి (మచ్చుక కొన్ని మాత్రమే) నువ్వే జవాబుదారుడుగా భావించాలి...

    ౧. మామను కావాలనే కాపాడుకోలేకపోయాడు (వర్షాన్ని అపకుండా). వర్షం ఆరోజు కురవకపోతే హెలెకాప్టర్ దుర్ఘటన జరిగేదే కాదు కదా.

    ౨. మామ ప్రయాణిస్తున్న హెలెకాప్టర్‌ మీదకి కావాలనే వర్షం కురవమని ఆదేశించి వుండవచ్చు.

    ౩. రైతుల వర్షాలు లేక్ ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు కురవకుండా ఆజ్ఞాపించి వుండవచ్చు).

    ౪. రైతులు అధిక వర్షాలు/వరదలు వలన ఆత్మహత్యలకు కారకుడు (వర్షాలు అధికంగా కురవమని ఆజ్ఞాపించి వుండవచ్చు).

     ఎవరి దగ్గర ఏమైనా మహిమలు/దైవశక్తి/అతీతశక్తులు వున్నాయని చెప్పుకోనేవారిని జైళ్ళలో పెట్టే రాజ్యాంగ సవరణ చేయ్యాలి. వారు బాబాలైనా, ఫాస్టర్స్ అయినా!

    14, ఆగస్టు 2011, ఆదివారం

    స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...

    6 వ్యాఖ్యలు
    64 సంవత్సరాలు నిండిన స్వతంత్ర భారతంలో రాజకీయ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారందరకీ అభినందనలు...
    దేశానికి/ప్రజలందరికీ ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చిందా అనేది నాకు సందేహమే!
    ఇటీవల "కేబుల్స్" లో బయటపడిన విషయాలు చూస్తుంటే, ఎవరు విదేశాంగ మంత్రి, ఎవరు ఆర్ధిక మంత్రో ఆమెరికాతో మంతనాలు చెయ్యకుండా మనపాలకులు వున్నారంటే కనీసం రాజకీయ స్వాతంత్ర్యాన్నీ కోల్పోతున్నమేమోననిపిస్తుంద...