వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, ఏప్రిల్ 2011, శనివారం

హిందూత్వవాదులారా కళ్ళుతెరవండి!

51 వ్యాఖ్యలు
     యిప్పటి అంచనాల ప్రకారం, సాయిబాబా ట్రస్ట్ విరాళాలు/సంపాదన లో ఒకటి లేక రెండు శాతం కన్నా ప్రజావశరాలకోసం ఖర్చుచేసినట్లు లేదు. దాతలు (భక్తులు కానివారుకూడా సమాజసేవకోసం ఉపయోగపడతాయని) యిచ్చిన విరాళాలను సమాజసేవకోసం కాకుండా స్థిర చర ఆస్తులగా మలుచుకొని ఆసోమ్మును బ్యాంకులో వేసుకుంటే వచ్చేవడ్డీకన్నా తక్కువమోత్తంలోనే 'సమాజసేవ‌' వున్నట్లు అర్ధంచేసుకోవడానికి ఆడిటర్‌కూడా అవసరం లేదు. ఐదారు జిల్లాలలో (మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి) ఈ సేవా కార్యక్రమాలను మొత్తం లోకకల్యాణము నెరవేర్చడంగా చిత్రీకరించడం చాలా దారుణం. రాబడి గాని, ఖర్చు గాని లెక్కాలేదు తొక్కలేదు. ప్రతీపైసాకి లెక్కవుందంటారు కాని చూపరు. ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి  తెలుపుతుంటామంటారు. ప్రభూత్వమూ ప్రజలకు తెలపదు. ప్రభుత్వముకు అంతా భాద్యతే వుంటే ప్రశాంతి నిలయంలో 1993 నాటి కాల్పుల కేసుపై యిప్పటికీ చార్జ్‌షీట్ పెట్టకుండా వుండేదా? కాల్పులు, చనిపోవడం మిధ్యకాదుకదా!

    ట్రస్ట్‌ దగ్గర వున్న సొమ్ము బాబా మహిమలతో సృష్టించినది కాదు ప్రజల డబ్బే. సాయిబాబా కష్టపడి సంపాదించినది కాదు. కేవలం విరాళాలతో సేకరించినదేననటం ఎవరూ కాదనలేనటువంటి నిజం. నిజంగా మహిమలుంటే విరాళాలు సేకరించడం దేనికి? మహిమలతో గాలినుంచి బంగారం సృష్టించేబదులు, పేదప్రజలకు కనీసం ఒకపూట ఆకలి తీర్చలేకపోయారు? అకాలవర్షాలతో రైతన్న నష్టాలబారి చేసుకున్న ఆత్మహత్యలను ఆపలేకపోయరు కనీసం బాబాగారు అవతారపురుషిడిగా ప్రకటించుకున్నరుకదా వర్ణుడితో చెప్పి ఆపించవచ్చుకదా!

     ఇటువంటి నీచపు సామ్రాజ్యాన్ని హిందూ ధార్మికతతో ముడిపెడుతున్న వారు హిందూత్వవాదులు కాదు వారు కుహానా హిందూత్వవాదులే. యిది నాస్థికులుగాని/వామపక్షవాదులుగాని హిందూత్వంపై చేస్తున్న దాడికాదు. హిందూధార్మిక బావజాలంతో /బాబాల పేరుతో అమాయక ప్రజలతో వ్యాపారం చేసుకుంటున్న వారే.

20, ఏప్రిల్ 2011, బుధవారం

సాయిబాబా! భక్తులకోసం కనీసం కళ్ళుతెరవాలి!

3 వ్యాఖ్యలు
బాబాగారి దయనీయమైన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మానవత్వం కలిగినవారికెవరికైనా ఆందోళనకరమే. కాని కొంతమంది భక్తులు మాత్రం మానవులకు బాబాగారి పెట్టిన ఒక పరిక్షని నీచపు మాటలు మాట్లాడుతున్నారు.  మోన్నటివరకూ వీలుకుర్చీలో పాకుంటూ, యిన్ని రోజులు చావుబతుకులమధ్య సామాన్య మానవుడవలే కష్టాలు పడుతుంటే, కడుపుతర్రుక్కుపోతుంది ఏ మనిషికైనా.

బాబా, సాయి బాబా, నీ శరీరానికి పడుతున్న కష్టం ఓ మానవ జీవిగా చూడలేకపోతున్నారు నీ భక్తులు కానివారుకూడా. కొంతమంది నీభక్తులైతే నిద్రాహారాలు మాని కుసించినసిస్తున్నారు. కనీసం వారికోసమైనా నీవు లేవాలే. నిల్చోని పరిగెత్తాలే (సారీ, నిలబడమనడం కూడా అత్యాశే అనుకుంటా) కనీసం కళ్ళుతెరువు బాబా. నీ అసలైన మహిమలు చూపించ్చే సమయం ఆసన్నమైనది. నీ మహిమలు నమ్మని జీవులకు కూడా కనువిప్పుకలుగుతుంది. లేకపోతే నిన్ను, నీమహిమలను నమ్మిన భక్తులకు నోటిమాట రాదు బాబా.

(కామెంట్స్ వ్రాయాలునుకుంటే ఒక షరతు! బాబా గారి మహిమలు గురించి మాత్రమే వ్రాయండి. బాబాగారు చేసిన 'సేవలు‌' మీ మీబ్లాగ్గులో విస్త్రుతంగా విశ్లేషించుకోండి)

10, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

2 వ్యాఖ్యలు
దీనికి కొనసాగింపుగా(click) ఈ దిగువ కామెంట్‌ని రాజేష్ జి(click) దాచిపెట్టాడు(పబ్లిష్ చెయ్యలేదు) ప్రస్తుతానికి!
శ్రీకర్ గారు...
మీ కామెంట్స్ చాలా బాగున్నాయ్! మీ వివరణ బాగుంది మిగతా బ్లాగర్ల లాగ వితండవాదనలు, ఆక్రోశం, నిరాశతో, వెకిలి రాతులు, జగుత్సాకరవిగా కాకుండా. కాకపోతే మీవాదనతో నేను పూర్తిగా ఏకీభవించను అదివేరే విషయం.

ఒకరిద్దరు కామెంటేటర్లు పరాయిదేశాన్ని నిసిగ్గుగా పొగుడుతూ మాతృ దేశాన్ని చిన్నచూపుగా, వెకిళి రాతలు (ఆమెరికా లేక పోతే మనము లేము అనేరీతిలో) వ్రాసిన వారికి జవాబు చెప్పకుండా మీలాంటి వారిలాగ వుండలేకపోయా! నా భావ ప్రకటనలో ఒక చిన్న పొరపాటు జరిగినది. కాకపోతే నా కామెంట్స్ మొత్తం ప్రవాసాంధ్రులందరికి వర్తిస్తాయి అని గమనించలేకపోయా. పరాయిదేశానికి వలస వెళ్ళడం తప్పుకాదు. వెళ్ళడం వలన లాభాలు వున్నాయి అదేవిధంగా నష్టాలు వున్నాయని వేరే చెప్పక్కర్లేదు. నావల్ల బాధకలిగిన ప్రవాసాంధ్రులందరికి క్షమాపణలు(కేవలం మాతృదేశఅభిమానులకు, ఆమెరికా కుటిలనీతిని రుర్తెరిగిన వారికి మాత్రమే).

>>>పైన రాసినవి చదివిన తరువాత ఎవరి ప్రోత్సాహం తో ఎవరు హిందూ మతం మీద ఎవరు బురద జల్లుతున్నారో గమనించండి... మీరు హేతువాదులలో ఎటువంటి కేటగిరిలోకి వస్తారొ నాకు తెలియదు.. కెరీర్ ఇచ్చి ప్రోత్సహించటం లేదు. వారికి వారే స్వచ్చందం గా చర్చలో పాల్గోంట్టున్నారు
****
నాకు ఏ సంఘంలోనూ సభ్యత్వం లేదు. ఆధారరహిత వాదన, మీరు ఊహించుకుంటుంన్నట్లు ఎవరూ నన్ను ప్రోత్సహించటంలేదు. డబ్బులూ యివ్వడంలేదు. అంటే మీభావాలకు వ్యతిరేకమయితే, స్పాన్సర్షిప్ కామెంట్స్ అనేనా మీ ఉద్ధేశం?


>>>తీవ్రంగా విమర్సిస్తూ రాసే వారిలో నాకు తెలిసిన ఒకరిద్దరు గురించి చదవండి
****
నీతులు చాలామంది చెబుతారు. ఆచరణలోకి వచ్చేసరికి చాలామంది తుస్సుమంటారు(ఏ వాదం చేసేవారైనా). ధైవత్వం నమ్మినవారు తప్పుచెయ్యరనా మీ ఉద్ధేశం? ఒకరెద్దరేమి లక్షలమంది వుంటారు. మా తాత ముత్తాతలు,తల్లితండ్రులు ఆస్థికులు, నేను భక్తుడను కాను. అంటే వారి ఆస్థికత్వం తప్పని దీని అధారంగా నిర్ధారించలేము కదా. అట్లానే పలానా వ్యక్తి కొడుకే ఇట్లా రాశాడు అట్లా రాశాడు అనే ఆధారంతో విమర్శించడం తగదు.

>>>కాని బ్లాగుల్లో రాసేవారు చాలా దేశాలు తిరిగి, చూసి, ఎంతో ఆలోచించి ఒక విశాల దృక్పధం తో రాస్తున్నారని అని గమనించండి/తెలుసుకోండి.
****
యిది అర్థరహితం. నేను కూడా చాలాదేశాలు చూశాను అని మీకు నిరూపిస్తే నా వాదనలన్నీ నిజమని మీరు ఒప్పుకుంటారా? విశాల దృక్పధం అనేది కేవలం యిప్పుడున్న కాలేజి చదువులతో 100% తెచ్చుకొని క్యాంపస్ లో సెలెక్టయినంత మత్రాన రాకపోవచ్చు. పెరిగిన వాతావరణం ముఖ్యం. ఎంత చదివారని, ఎంత సంపాదిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కడవున్నరని కాదు. ఖండాంతరాల నుండి వచ్చే ప్రతీ వేగు విశాల దృక్పధం తోరాసేదేనా?


>>>జపాన్ వర్సస్ అమెరికా హార్డ్వేర్ గురించి
ఇక పవీణ్ అడిగినదానికి నన్ను సమాదానం అడుగుతున్నారు. ప్రవీణ్ మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు. నా థృష్ఠిలో ఆమెరీకా అయిన, జపాని అయినా, చైనా అయిన, పాకిస్తాన్ అయినా ఒక్కటే! విశ్వశాంతి వర్ధిల్లాలి! దుర్మార్గం నశించాలి.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

సాయిబాబా పరిస్థితి పై HRC కలుగజేసుకోవాలి...

16 వ్యాఖ్యలు
హెల్త్ బులిటెన్ తొ పాటు కనీసం వీడియో క్లిపింగ్స్ బయటపెట్టాలి!
 బాబాగారు కదలలేని ప్రస్తుత స్థితిలో ట్రస్ట్ సభ్యులు గాని మరెవరైనా నిర్భంధించే అవకాశము లెకపోలేదు (వేలకోట్ల రూపాయిల వ్యవహారమిది, బాబాగారు దేవుడని కోందరు నమ్మవచ్చు, కానీ ట్రస్ట్ సభ్యులందరూ దేవుళ్ళు కాదుకదా! వాళ్ళలో స్వార్ధపరులుంటే. ఏవో గోడవలని కూడావింటున్నాం). వీరు కల్పిస్తున్న అనవసరపు టెన్‌షన్‌ వలన వేలాది మంది పోలీసులు, మంత్రివర్యుల బస వంటి కారాణాలుచేత ప్రజాధణం ఖర్చవుతుంది కూడా.

దేవుడయినా కాకపోయినా సాయిబాబా మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఒక మనిషిని సమాజానికి కనబడకుండా అయోమయ్యానికి గురిచేస్తున్న పుటపర్తి కోటరీ పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం (HRC) కలుగజేసుకోని అతని యోగ క్షేమాలు తెలిపి అనవసరపు రాధాంతాన్ని, అనవసరపు ప్రజాదనఖర్చును కాపాడాలి. అంతే కాకుండా అతని భక్తులకు కూడా మేలు చేసినవారవుతారు ఒకరకంగా.


7, ఏప్రిల్ 2011, గురువారం

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

11 వ్యాఖ్యలు
హవ్వ హవ్వ! ఆడలేక మద్దెలదరువు అన్నట్లు.

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! (Click here) ఈ టపాకు సమాధానం....

మీ టపా సాయిబాబా గారి ప్రస్తుత పరిస్థితి గురించి రాసారు. మీరు రాసిన దానిపైన మాత్రమే కామెంట్స్ వ్రాసాను. కొన్ని సందేహాలు తెలిపాను...
బాబాగారి శరీరం ఇప్పుడు కష్టంలో వుందా? లేక శిష్య బృందం చెపుతున్నట్లు డాక్టర్ల పరిజ్ఞాణాన్ని పరీక్షీంచుతున్నారా? బాబాగారు పెట్టిన ఈ పరక్షలో (జగన్నాటక సూత్రదారి కదా) డాక్టర్లు నెగ్గుతారా? నెగ్గరా? నెగ్గితే ఏమవుతుంది? నెగ్గగపోతే ఏమవుతుంది?
పైదానికి సమాధానము చెప్పటనికి ఇప్పటివరకు సాహసించని మీరు, ఈ విషయంతో ఏటువంటి సంబందం లేని ఎవరో మధ్యలో వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను అడిగినదానికి సమదానం ఇస్తను అంటున్నారు.  దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?
>>> పైన నే ఉదాహరిచిన నవీన మూఢనమ్మకాలమీద మీరే౦ పోరాటం చేసారో చెప్పండి?
ఇక్కడ చర్చలో పాల్గోన్నవారంతా వారు నమ్మిన సిద్ధాంతాలపై పోరాటాలు చేసినవారైనా? ఇదేమైన ఈ వేగుకు కండిషన్ వుందా? మీరు వేసిన టపాకు ఈ ప్రశ్నకు  ఏమైన సంబదం వుందని భావిస్తున్నారా?
>>>ఆస్థికత్వం/దేవుడుల ప్రసక్తి లేకుండా తమకంటూ ఓ సిద్ధాంతం రూపొందిచ్చుకోవచ్చు
వరెవ్వ! ఎంత తెగింపు? ఆస్థికులంతా సాయిబాబాని కలియుగ దేవుడుగా నమ్ముతున్నట్లు మీరు ఎలా నిర్దారణకు వచ్చారు? సాయిబాబా చెడుని వేలెత్తి చెబుతున్నవారంతా నాస్తికులేనా?

దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?

సత్య సాయిబాబా ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల చరలో/కబంద హస్తాలలో బందీగా వున్నారా?

9 వ్యాఖ్యలు

నాకు బాబాగారి మహిమలు మరియు వారి దైవత్వము మీద యించైనా నమ్మకము లేదు. అయితే వారిగొడవ మనకెందుకులే అనుకుందామంటే కుదరడం లేదు, నాకు మీడియా ఫోబియా మరి. మన మీడియా ఎప్పటిలాగే ఈ వార్తను హైజాక్ చేసేసింది వాళ్ళ రేటింగ్స్ కోసమని. ఫుంకాలు ఫుంకాలుగా కథానాలు ప్రసారం చేసెస్తున్నాయి అసలు విషయం ప్రక్కనపెట్టి.

అసలు విషయంపై నాకో సందేహము కలుగుతోంది. రోగి ని (వారిని నమ్మిన వారికి 'రోగీ అని సంభోదిస్తే కోపమొస్తుందేమో! కాని వైద్యులు చికిత్స చెస్తున్నందున మరియు రోగ నిర్దారణ జరగడం వలన మెడికల్ సైన్స్ పరి భాషలో రోగి అనడంలో తప్పులేదు అనుకుంటా!) ఎవ్వరకి చూపించకపోవటం చేత  (మన ముఖ్యమంత్రికి సైతం) వారు  ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల  చరలో  కిడ్నప్/కబంద హస్తాలలో బందీగా వున్నారా అనే ధర్మ సందేహము కలుగుతుంది. ఇది నాఆరోపణ కాదు, కేవలం నా సందేహము మాత్రమే. ఎందుకంటే, ఈవ్యవహారం సుమారు నలభై వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తులకు వారసత్వముతో ముడిపడివుంది.
సందేహాలకు కారణాలు..
1. క్యాబినేట్ మంత్రులు ఇద్దరు అక్కడే తిష్టవేసారు. ఓకరేమో వారి ఆరోగ్యం కుదిటపడింది అంటారు, యింకొకరేమో యింకా వారి ఆరోగ్యం ఆందోళనకరంగానే వుందంటారు ఒకే సమయంలో.
2. పొంతన లేని అనుమానస్పదపు మెడికల్ బులిటెన్లు.
3. కానరాని ట్రస్ట్ సభ్యులు.
4. రెండు లారీల పూలు తెప్పించారని, స్టేడియంలో  వేదికతో పాటు మెటల్ బారికేడ్లు మరియు స్టేడియంకి "లోపలకి", "వెలుపలకి" ద్వారాలు సిద్ధం చేసారాని మీడియాలో కథనాలు.
5. పొంతనలేని వాదనలతో వారి శిష్యరిక బౄందం, బాబాగారు అతను చెప్పినట్లే 95 సంత్సరాలు బతికే వుంటారు అని కొందరు, లేదు వారికి ఈ మానవజాతి దేహం ఏప్పుడు కావాలంటే అప్పుడు వదిలే అవకాశం వుంది అని మరికోందరు.
6. ముఖ్యమంత్రి గారు పుట్టపర్తి వెళ్ళడానికి చాల హడావిడి చేసారు, కాని వెళ్ళడం రద్దయింది, కారణం మాత్రం చెప్పలేదు.
7. మీడియాను అనుమతించక్కర్లేదు, కనీసం బాబాగారి ప్రస్తుత ఫోటోగాని, వీడియో గాని విడుదల చేయకపోవడం. ఫోటోలు,విడియోలు వల్ల వైరస్ సోకదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు జరిగినప్పుడు లైవ్ విడియోలు కుడా తీస్తుంటారు.


నా సందేహము ఏమిటంటే, ట్రస్ట్ ఆస్తిపాస్తుల/పంపకాల వ్యవహారం తేలేవరకు, ప్రభుత్వం లోని పెద్దలు గాని ట్రస్ట్ సభ్యులుగాని ప్రస్తుత బాబా గారి మంచి/చేడు చెప్పరేమో?

బాబాగారు కూడా ఎవరు కాదన్నా అవునన్నా మానవ దేహం కలిగి వుండటం చేత, రాష్ట్రంలో ఒక రొగి ఆరోగ్యం/భద్రత  పై యింత గందరగోళం జరుగుతుండటం వలన మానవ హక్కుల సంఘం స్వచ్ఛందం (సుమొటో)గా కేసు తీసుకొని, అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని  ప్రస్తుత యథార్ద స్థితిని తెలపమని కోరితే, వారి భక్తులకు, వారి దేహ సమకాలికులకు సందేహము నివౄత్తి చేసినట్లువుతారు.

ఏదిఏమైన, వారు కోలుకోని ప్రజలకు కనబడాలని ఆశిద్దాం.