వీలుంటే నా నాలుగు లంకెలు ...

11, అక్టోబర్ 2010, సోమవారం

సిగ్గు, లజ్జ లేని అధికార దాహం తొ భాజాపా/కాంగ్రెస్ నాయకత్వం...

2 వ్యాఖ్యలు
వెంకయ్యనాయుడు గారు ఇలా సెలవిచ్చారు... "కర్నాటకాలొ జరిగిన ముఖ్యమంత్రి విశ్వాసతీర్మాన విజయం  ప్రజాస్వామ్య విజయం" ఇంకనయం "రామ రాజ్యం" గెలుపు అనలేదు .

విప్ / ఓట్టింగ్ జరగకుండా పార్టీ ఫిరాయుంపుల చట్టం వర్తిస్తుందా? మూడోవొంతు సభ్యులు వేరే కుంపటి పెట్టుకునే అవకాశము ప్రస్తుత చట్టం కలిపిస్తుంది. స్వపక్షంలో అసమతి మూడొంతులు వుందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? ఏవిధంగా  నిర్ణయించాలి?  ఎప్పుడు నిర్ణయించాలి? పార్టీ ఫిరాయుంపుల చట్టం స్వతంత్ర  సభ్యులకు ఎలా వర్తిస్తుందో బొత్తిగా బోదపడటం లేదు. ఇప్పుడు కర్నాటకాలో 11 మంది స్వపక్ష సభ్యులను ఐదగురు స్వతంత్రుల శాసనసభ సభ్యత్వం రద్దుచేసారు. అదికూడా విశ్వాస పరీక్షకు ముందు. ఇది ప్రజాస్వమ్యం కు పరాకాష్టంగా భావించొచ్చేమో! రేపు మరే శాసనసభలోనో విపక్ష సభ్యులను కూడా అనర్హత వేటు వేసి ఓట్టింగ్ జరిపించవచ్చేమో (స్వతంత్ర శాసన సభ్యులను అనర్హత వేటు వేసిన మాదిరిగా)!  ఎన్నికలప్పుడు ఎన్నికల అభ్యర్దులను నిలబేట్టేటప్పుడు వారికి పార్టీపై నిబద్దత వుందా లేదా అనేది కాకుండా, కేవలం గెలుపు గుర్రలు అనిచెప్పి ఎంత అవినీతి పరుడైనా, ఎంత అసాంఘిక  శక్తికైనా సీటు ఇచ్చినందుకు ప్రతిఫలమే ఈ ఫిరాయింపులు. మా శాసనసభ్యులను ప్రలొభ పెడుతున్నారు అని ప్రతిపక్షం పై ఏడుపు ఎందుకు? ప్రలొభపడేవాడు వుంటే ప్రలోభ పెట్టేవారూ వుంటారు. క్రితం సారి, ఈ భాజాపాయే కదా కాంగ్రేసు వారిని ప్రలొభ పెట్టి రాజీనామ చేయించి ఎన్నికలుకు వెళ్ళింది.

అవినీతికి మారుపేరైన జనార్ధన రెడ్డి సహాయంతో పాలన కొనసాగిస్తుండటం, భాజాప ని దేశవ్యాప్తంగా రామ పాలన సాధిస్తనికేనా? బాజాప అసలిరంగు ఈ అధికార దాహంతో బయటపడినందుకు దేశప్రజలు ఆనందపడాలి.  యిక కాంగ్రెస్ పార్టీ అధికారదాహం గురించి చెప్పె అంత వయసు నాకు లెదు.. ఎందుకంటే, 125 సంవత్సరాల నుండి దేశ ప్రజలు చూస్తూనే వున్నరు. అయినా వారికే ప్రజలు పట్టం గడుతున్నారు. అందుకేనేమో భాజాపా ధీమా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెసినా ఫర్వాలేదు అనుకుంటుంది.. కుహానా ప్రజాస్వామ్య వాదులంటే వీరుకాక మరెవరైనా వుంటారా?
 వెంకయ్యనాయుడు గారి ఉద్దేశం లోని ఈ ప్రజాస్వామిక విజయాన్ని చూసి మనం సిగ్గుపడదాం! ఎందుకంటే మనకు సిగ్గు లజ్జ వున్నాయి కదా.  

15, సెప్టెంబర్ 2010, బుధవారం

'యువరాజు' కోసమే ఈ నాటకం?

4 వ్యాఖ్యలు
పర్యావరణం, భూసేకరణ, ఆహార హక్కు చట్టం, మావోయిస్టుల సమస్య తదితర అంశాలపై ఇటీవలి కాలంలో యుపిఎలోని కేంద్ర మంత్రులే భిన్న వాదనలు ముందుకు తెచ్చారు. సోనియా నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌ఎసి (జాతీయ సలహా మండలి) సభ్యులు కూడా పలు అంశాలపై మన్మోహన్‌ సర్కారు వైఖరిని బహిరంగంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుపిఎ, కాంగ్రెస్‌ మధ్య...వ్యక్తిగతంగా సోనియా, మన్మోహన్‌ మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం ఊపందుకుంది. పలు ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ అంశంపైనే ఇటీవల ఎక్కువగా కేంద్రీకరించాయి. వాస్తవానికి 'విభేదాల' పేరుతో కాంగ్రెస్‌ ప్రస్తుతం కీలకమైన అంతర్నాటకానికి తెరలేపింది.
'జెఎంఎంతో కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బిజెపిలో విభేదాలున్నాయన్న మాట అవాస్తవం. ఇదంతా ఆ పార్టీ ఆడుతోన్న నాటకం. ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తోన్న ప్రయత్నం ' అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ ఇటీవల బిజెపిపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల్లో తప్పొప్పులను పక్కనబెడితే, ప్రస్తుతం కాంగ్రెస్‌ కూడా అటువంటి నాటకానికే తెర లేపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయంటూ ఢిల్లీ రాజకీయ శ్రేణుల్లో ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ' మరో ఏడాదిలో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు...ఉప ప్రధానిగా ప్రణబ్‌ ముఖర్జీ బాధ్యతలు చేపడతారు... మన్మోహన్‌ త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాష్ట్రపతి అభ్యర్థ్ధిగా నిలబడతారు...2012 యుపి ఎన్నికల అనంతరం రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మధ్యంతర ఎన్నికలకు వెళుతుంది...' అంటూ తాజా పరిస్థితిని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు.
విభేదాలు నిజమేనా ?
పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదరికాన్ని పెంపొందించడం సరికాదని ఇటీవల ప్రధాని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనదని ఆ తర్వాత రెండ్రోజులకు సోనియా సూత్రీకరించారు. పర్యావరణం, భూసేకరణ, ఆహార హక్కు చట్టం, మావోయిస్టుల సమస్య తదితర అంశాలపై ఇటీవలి కాలంలో యుపిఎలోని కేంద్ర మంత్రులే భిన్న వాదనలు ముందుకు తెచ్చారు. సోనియా నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌ఎసి (జాతీయ సలహా మండలి) సభ్యులు కూడా పలు అంశాలపై మన్మోహన్‌ సర్కారు వైఖరిని బహిరంగంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుపిఎ, కాంగ్రెస్‌ మధ్య...వ్యక్తిగతంగా సోనియా, మన్మోహన్‌ మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం ఊపందుకుంది. పలు ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ అంశంపైనే ఇటీవల ఎక్కువగా కేంద్రీకరించాయి. వాస్తవానికి 'విభేదాల' పేరుతో కాంగ్రెస్‌ ప్రస్తుతం కీలకమైన అంతర్నాటకానికి తెరలేపింది. ఎన్‌డిఎ హయాంలో వాజ్‌పేయి-అద్వానీ (ఆర్‌ఎస్‌ఎస్‌) శిబిరాలు పలు అంశాలపై భిన్న వైఖరులను వినిపించేవి. విమర్శించే అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకపోవడం...ప్రజాసంబంధ విషయాల్లో పార్టీలోనే తీవ్ర అభిప్రాయ భేదాలున్నాయన్న అభిప్రాయాన్ని కలిగించడం...అంతిమంగా ప్రజలను అయోమయానికి గురిచేయడం ఈ వ్యూహం లక్ష్యం. కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్టీ వ్యూహం వెనుక రెండు నిర్దిష్ట లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి : సోనియాను పేదల పక్షపాతిగా నిరూపించడం. రెండు : రాహుల్‌ను భావి ప్రధానిగా అందరిచేతా అంగీకరింప చేయడం.
ఆయుధం ఎన్‌ఎసి !
ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ వివాదం నేపథ్యంలో 2006లో ఎన్‌ఎసి ఛైర్మన్‌ పదవికి, ఎంపీ స్థానానికీ సోనియా రాజీనామా చేశారు. రారుబరేలీ నుండి ఎంపీగా తిరిగి గెలుపొందినప్పటికీ మళ్లీ ఆమె ఎన్‌ఎసి బాధ్యతలు స్వీకరించలేదు. 2009లో యుపిఎ-2 అధికారంలోకి వచ్చాక కూడా ఎన్‌ఎసి పునర్వ్యవస్థీకరణ జరగలేదు. మూడు నెలల క్రితమే సోనియా సారథó్యంలో ఎన్‌ఎసికి కొత్త రూపునిచ్చారు. ఆహార భద్రత, మహిళా రిజర్వేషన్లు, పంచాయతీ రాజ్‌ సంస్కరణలు తదితర అంశాలపై కాంగ్రెస్‌ పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించడమే ఎన్‌ఎసి లక్ష్యమని నాడు ప్రచారం జరిగింది. వాస్తవానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉంటూనే సోనియా ఆ పని చేయవచ్చు. గతంలో అలా చేశారు కూడా. సోనియా అంగీకారంతో సంబంధం లేకుండా, ఆమె ఆదేశాలను అమలు చేయకుండా మన్మోహన్‌ పనిచేస్తారని ఏ ఒక్కరూ భావించడం లేదు. మరి ఎన్‌ఎసి అవసరం ఏమిటి ? సోనియాను ఆమ్‌ఆద్మీ పక్షపాతిగా చూపించేందుకు ప్రయత్నించడమే ! ఒకవైపు మన్మోహన్‌ సర్కారు సంస్కరణల పంథాలో దూసుకుపోతుంటే...సోనియా నేతృత్వంలోని ఎన్‌ఎసి ప్రజల మౌలిక హక్కుల గురించి, సంస్కరణల ప్రభావం గురించి మాట్లాడుతుంది. ఇదే కాంగ్రెస్‌ వ్యూహం. గత కొద్ది వారాలుగా ఎన్‌ఎసి సభ్యులకు, పలువురు కేంద్ర మంత్రులకు మధ్య నడుస్తోన్న మాటల యుద్ధమే ఇందుకు నిదర్శనం. ప్రధాని మన్మోహన్‌ అమెరికాకు సన్నిహితుడన్న ప్రచారం మొదటి నుంచీ ఉంది. అణు ఒప్పందం నేపథ్యంలో ఈ భావన మరింత మందిలో దృఢపడింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా, పేదల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే వేదికగా ఎన్‌ఎసిని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం మొత్తానికీ సోనియానే సూత్రధారి అన్న ప్రచారం ఈ పాటికే ఊపందుకుంది. ఇటువంటి మరికొన్ని పథకాలు, సంక్షేమ చట్టాలు త్వరలో సోనియా ముద్రతో బయటికి రాబోతున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి. 2014 ఎన్నికల నాటికి ఆమ్‌ఆద్మీ సంరక్షకురాలిగా సోనియా నిలబడాలంటే ఎన్‌ఎసి మరింత క్రియాశీలంగా పనిచేయాలన్నది పార్టీ భావన. మన్మోహన్‌ సంస్కరణల వల్ల ప్రభుత్వంపై పెరిగే అసంతృప్తిని తగ్గించుకోవడానికి ఎన్‌ఎసిని ఆయుధంగా వినియోగించుకునేందుకూ పార్టీ వ్యూహ రచన చేస్తోంది.
రాహుల్‌కు రహదారులు...
ఒరిస్సాలో వేదాంత సంస్థ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిని నిరాకరించడం దేశ వ్యాపారవర్గాలను, సంస్కరణలను బలపరిచే శక్తులను ఆశ్చర్యపరిచింది. నిరాశకూ గురి చేసింది. ప్రాజెక్టుకు అనుమతిని నిరాకరించాలని యువనేత రాహుల్‌గాంధీ ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేయడం...ప్రాజెక్టుకు కేంద్రం ఎర్రజెండా చూపడం రెండ్రోజుల వ్యవధిలోనే జరిగిపోయాయి. గిరిజన హక్కుల కోసం సైనికుడిలా నిలబడతానంటూ ఒరిస్సా గిరిజనులకు ఆ తర్వాతి రోజే రాహల్‌ హామీనిచ్చారు. వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునేందుకే రాహుల్‌ ఈ తతంగమంతా నడిపారని చెప్పడానికి రాజకీయ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. సైనికుడిగా మారి ఎవరిపై పోరాటం చేయనున్నారో రాహుల్‌ కూడా వివరించలేదు. మన్మోహన్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ ప్రపంచానికి మొగ్గు చూపుతుంటే...సోనియా, రాహుల్‌ ఆమ్‌ఆద్మీ సంక్షేమం కోసం పరితపిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలే ఇటీవల ప్రచారం ప్రారంభించారు. ' మన్మోహన్‌ అమెరికా ఎజెండా స్థానంలో, ఆమ్‌ఆద్మీ ఎజెండా అమలు కావాలంటే సోనియానే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలి....ఆమె ప్రధాని పదవిని ఈపాటికే త్యాగం చేశారు కాబట్టి యువనేత రాహుల్‌ గాంధీ దేశ పగ్గాలు చేపట్టాలి ' స్థూలంగా ఇదీ ప్రస్తుతం కాంగ్రెస్‌ శ్రేణులే సాగిస్తోన్న ప్రచార సారాంశం. ఇటీవల కోల్‌కతాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సిపిఎం ప్రభుత్వంపైన, మార్క్సిజంపైన రాహుల్‌ విమర్శలు చేశారు.
రష్యాలో మాదిరిగానే బెంగాల్లోనూ ఒక్క రోజులోనే కమ్యూనిస్టులు కనుమరుగవుతారని జ్యోతిష్యమూ చెప్పారు. అమెరికన్‌ వ్యూహకర్తలకు, దేశంలోని బడా కార్పొరేట్‌ అధిపతులకూ తనపై నమ్మకం కలిగించడమూ ఈ వ్యాఖ్యల వెనుక ఒక లక్ష్యమన్న వాదనా వినబడుతోంది. 2014లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడం, రాహుల్‌ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం కాంగ్రెస్‌ ఆడుతోన్న ఈ నాటకం భవిష్యత్తులో మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ' అణు పరిహార బిల్లు ఆమోదం పొందడం కోసం బిజెపి అగ్రనేతల గడప తొక్కడానికి కూడా మన్మోహన్‌ సిద్ధపడ్డారు. అమెరికా మెప్పు కోసం చూపిస్తోన్న శ్రద్ధలో సగమైనా దేశ ప్రజలపై చూపితే బాగుంటుంది ' అంటూ కాంగ్రెస్‌ నేత ఒకరు ఇటీవల కొందరు మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ఇటువంటి మాటలు తన చెవికి చేరితే మన్మోహన్‌కు అప్పుడప్పుడూ కోపం రావడము...కాంగ్రెస్‌ అదిష్ఠానంపై అలగడమూ సహజమే కదా ?!
...డి.జయప్రకాష్‌

25, ఆగస్టు 2010, బుధవారం

అణు పరిహార బిల్లు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతున్న ప్రభుత్వం

2 వ్యాఖ్యలు
అమెరికన్‌ సప్లయర్స్‌ ప్రయోజనాలు కాపాడేందుకు బిజెపి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతోంది. అణు ప్రమాద పరిహారం రు. 1500 కోట్ల పరిమితి పెట్టడమంటే భోపాల్‌ బాధితులకు ఇచ్చిన 47 కోట్ల డాలర్ల పరిహారం కన్నా తక్కువ చెల్లించమని అడగడం కాదా? అందుకే ఈ అణు పరిహార బిల్లును అడ్డుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. ఇటువంటి నికృష్టమైన బిల్లును ఆమోదించవద్దని పార్లమెంటు సభ్యులపై ప్రజలు పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావాలి. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పార్లమెంటు ఇలాగే ఆమోదించినట్లైతే భారత్‌ - అమెరికా అణు ఒప్పంద సుదీర్థ చరిత్రలో అదొక విషాద ఘట్టంగా మిగిలిపోతుంది.
అణు పరిహార బిల్లు ఇప్పుడు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వెళ్ళింది. దానికి కొన్ని సవరణలు చేర్చారు. ఈ బిల్లు ప్రధాన ధ్యాస అంతా ఏదైనా అణు ప్రమాదం సంభవించినప్పుడు సరఫరా దారులను కాపాడడమే గాక, ఆ మేరకు చట్టాన్ని మరింత పటిష్టపరిచేదిగా వుంది. దురదృష్టవశాత్తూ బిజెపి వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిల్లులోని ఈ అంశాన్ని చూడ నిరాకరించడమో లేక విదేశీ సప్లయర్స్‌ను కాపాడాలన్న ఉద్దేశమో కానీ ప్రభుత్వంతో వ్యూహాత్మకంగా ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రాజ్యసభలో ఇప్పుడు మెజారిటీ చేకూరింది. అలాగే ఈ బిల్లు ఆమోదానికి కూడా అడ్డులేకుండా చూసుకుంది. ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రతిక్షాలేమైనా వున్నాయి అంటే అవి వామపక్షాలు మాత్రమే. ఈ అణు పరిహార బిల్లులో ప్రధాన అంశాలు ఏమిటి? ఇప్పటికే విస్తృతంగా వచ్చిన వార్తా కథనాలను బట్టి అణు ప్రమాదం జరిగినప్పుడు చెల్లించాల్సిన పూర్తి పరిహారాన్ని 300 ఎస్‌డిఆర్‌లకు అంటే రు.2,500 కోట్లకు పరిమితం చేశారు. ఇది ఆపరేటరు, ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించినది మాత్రమే. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే నష్టం రు. 2,500 కోట్లకు దాటినా ఈ పరిమితికి మించి ఒక్క పైసా కూడా అదనంగా బాధితులకు చెల్లించరన్నమాట. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో ఏమైందో మనం చూశాము. విషవాయువుల లీక్‌ కన్నా మరింత ఎక్కువ నష్టం అణు ప్రమాదం వల్ల వాటిల్లే అవకాశముంది. అప్పుడు చెల్లించే మొత్తం నష్టపరిహారం 47 కోట్ల డాలర్లు ఏ మూలకూ చాలవు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నది.ఇది భోపాల్‌ పరిహారం కన్నా తక్కువేనని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇప్పుడు అంగీకరిస్తున్నది. అలాగే పార్లమెంటులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు భోపాల్‌ గ్యాస్‌ వినాశనాన్ని వివిధ దశల్లో చూసినవే. అయినా దాని నుంచి అవి ఎలాంటి గుణపాఠాలు తీసుకోలేదు. ఈ అంశంపై వామపక్షాలు, అలాగే ప్రజా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఆందోళనను స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వం తన బాధ్యతలను తాను నిర్వర్తించగలగాలన్నా ఈ ప్రమాద పరిహారంపై కృత్రిమ పరిమితి తొలగించడం మినహా మరో దారి లేదని చెప్పారు. అణు నష్ట పరిహారానికి పరిమితి విధించడమంటే అర్థమేమిటి? అణు కర్మాగారాలలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదాల్లో 30 కోట్ల ఎస్‌డిఆర్‌లకు మించదని ప్రభుత్వం చెప్పదలచుకున్నదా? అలాగే అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుండదు. ప్రభుత్వం ఇలా పరిమితులు విధిస్తూ పోతే ఏ నష్టాలకైనా పరిహారం చెల్లించగలదా? ఇతరులెవరూ ఇలా నష్ట పరిహారంపై ఎలాంటి పరిమితులు పెట్టనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టాలి అని వామపక్షాలు వాదిస్తున్నది కరెక్టు. అణు ప్రమాదం జరిగితే ప్రజలెదుర్కొనే అన్ని సమస్యలకు ప్రభుత్వమే అంతిమంగా బాధ్యత వహించాల్సి వుంటుంది. గనుక ప్రభుత్వం తన బాధ్యతలపై తానే కృత్రిమంగా పరిమితులు విధించుకోజాలదు అని వామపక్షాలు వాదిస్తున్నాయి.

ఇక్కడ ఉత్పన్నమయ్యే మరో ప్రశ్న ఏమిటంటే దీంట్లో ఆపరేటర్‌ బాధ్యత ఏమిటి? మొదట రూపొందించిన అసలు బిల్లులో అణు విద్యుత్‌ రంగంలోకి ప్రయివేటు ఆపరేటర్లు ప్రవేశించే అవకాశం వుందని పేర్కొన్నారు. అయితే మొత్తం బాధ్యతలో వీరి బాధ్యత చాలా స్వల్పంగా మాత్రమే వుంటుందని చెప్పారు. అణు బాధ్యతలో ఆపరేటర్లకు పరిమితులు విధించడమంటే ప్రయివేటు పెట్టుబడికి రాయితీలు ఇవ్వడంగానే చూడాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇప్పుడు రెండు సవరణలను ముందుకు తెచ్చింది. మొదటిది, ఈ బిల్లును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే పరిమితం గావించడం, రెండవది, అణు పరిహార పరిమితిని రు.1500 కోట్లకు పెంచడం. చాలా స్వల్ప బాధ్యత మాత్రమే వహించే ప్రయివేటు రంగం అణు విద్యుత్‌ రంగంలో ప్రవేశించే అవకాశాలకు అడ్డుకట్ట వేసే దిశగా స్థాయీ సంఘం తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినది. అయితే ప్రభుత్వమే యజమానిగా వున్నప్పుడు పస్తుత బిల్లులో ప్రత్యేకంగా ఆపరేటర్‌ పరిహార పరిమితి ఎందుకు విధించినట్లు? ఇక్కడే అసలు కిటుకంతా వుంది. ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్‌ 17ను గనుక మనం చూస్తే ఆపరేటర్‌ మాత్రమే సప్లయర్‌ నుంచి పరిహారం కోరగలడు. అయితే ఆ పరిహారం కూడా సప్లయిర్స్‌కు వాస్తవంగా విధించిన పరిమితులలోపే పొందగలడు తప్ప అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా కూడా తీసుకోలేడు. ప్రభుత్వ బాధ్యత కూడా అణు ఆపరేటర్‌గా పరిహారాన్ని వున్న పరిమితుల మేరకు చెల్లిస్తుందే తప్ప ప్రభుత్వంగా ఎలాంటి బాధ్యత వహించదు. ఈ బిల్లులో సప్లయర్‌ చెల్లించే పరిహారంపై 1500 కోట్ల మేర పరిమితి విధించారు. అంటే నష్టం 1500 కోట్లు దాటితే ప్రభుత్వమే చెల్లించాల్సి వుంటుంది. ఎందుకంటే సప్లయర్‌ నుంచి రు.1500 కోట్ల కు మించి పరిహారం వసూలు చేయరాదని బిల్లు స్పష్టంగా చెబుతోంది. ఒరిజినల్‌ బిల్లులోని సెక్షన్‌ 17 సప్లయర్‌ బాధ్యతకు సంబంధించి ఏం చెప్పిందో చూడండి.17. అణు విద్యుత్‌ సంస్థ ఆపరేటర్‌ నష్ట పరిహారాన్ని అణు సరఫరాదారు నుంచి ఎప్పుడు కోరవచ్చో ఈ సెక్షన్‌లోని సబ్‌ క్లాజ్‌ (ఎ)లో ఇలా చెప్పడం జరిగింది. సెక్షన్‌ 17(ఎ) ఏం చెబుతోందంటే ఆపరేటర్‌ సప్లయర్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టులో పేర్కొన్న దాన్ని బట్టే ఈ హక్కు వినియోగం ఆధారపడి వుంటుంది.

17(బి) అణు ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లేక సప్లయర్‌ సరఫరా చేసిన సామగ్రి, పరికరాల్లో పూర్తి నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక వారు అందించే సేవల్లో లోపం వల్ల జరిగిందా లేక తన ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్న దానిని బట్టి పరిహార చెల్లింపు ఆధారపడుతుంది.
ఈ రెండు సెక్షన్లు వేటికవి స్వతంత్రంగా వ్యవహరించాలని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సెక్షన్‌ 17 బలహీనంగా వున్నదని, దీనిని పటిష్టపరచాల్సి వుందని పేర్కొంది. శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి కూడా ఇదే విధంగా అభిప్రాయపడినట్లు ఆ నివేదిక పేర్కొంది.ఒక వేళ ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక సప్లయర్‌ వైపు నుంచి జరిగిన నిర్లక్ష్యమే కారణమా అన్నది నిరూపించడం చాలా కష్టంతో కూడుకున్నది. అలాంటప్పుడు ఆ సామగ్రిని, పరికరాలను సరఫరా చేసిన సప్లయర్‌ ఎలాంటి బాధ్యత వహించాలి అనేదానికి సంబంధించి స్పష్టంగా పేర్కొనాల్సి వుంది. కానీ, సెక్షన్‌ 17(బి) ని పరిశీలిస్తే సప్లయర్‌ సరఫరా చేసిన అణు సామగ్రిలో లోపమందని తేలినా అతను తప్పించుకుపారిపోయేందుకు ఈ క్లాజు ఆసరా ఇస్తున్నది.

అసలు ఈ ఉద్దేశపూర్వకం (ఇంటెంట్‌) అన్న పదాన్ని క్లాజు 17(బి)లో చేర్చడంలో ఆంతర్యమేమిటన్నది ప్రశ్న. ఇంటెంట్‌ అనే పదాన్ని సాధారణంగా నేరాలు, పన్ను చట్టాలలో ఉపయోగిస్తారు. దానిని తీసుకొచ్చి అణు పరిహార చెల్లింపు కేసుల్లో వాడడం ఏ విధంగానూ సరికాదని శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి వాదించారు. దాంతో పార్లమెంటరీ కమిటీ క్లాజ్‌ 17(బి)ని ఇలా సవరించాలని సూచించింది.''ఈ అణు ప్రమాదం నిర్మాణ, డిజైన్‌ల లోపం పర్యవసానంగా కానీ, నాసిరకం సామగ్రి సరఫరా వల్ల కానీ, సేవల్లో లోపం వల్ల కానీ, సప్లయర్‌ వైపు నుంచి మెటీరియల్‌, పరికరాలు, సేవలు అందించడంలో నిర్లక్ష్యం యొక్క ఫలితమే''ఈ సిఫారసు చేసిన తరువాత అసలు వక్రీకరణ చోటు చేసుకుంది. పార్లమెంటరీ కమిటీి సమర్పించిన చివరి ముసాయిదాలో 17(ఎ), 17(బి) క్లాజులను కలుపుతూ మరియు (అండ్‌) అన్న పదాన్ని చేర్చారు. దీనివల్ల 17(ఎ) క్లాజు వర్తించినప్పుడే 17(బి) క్లాజు వర్తిస్తుందని చెప్పింది. అంటే ప్రమాదానికి బాధ్యత వహిస్తామంటూ ముందుగానే లిఖిత పూర్వక ఒప్పందం చేసుకోవాలన్నది షరతు. ఒరిజినల్‌ బిల్లులోని వాటి కన్నా దారుణమైన నిబంధనలు స్థాయీ సంఘం నివేదికలో వచ్చి చేరాయి. ఉద్దేశ పూర్వకంగా , పూర్తి నిర్లక్ష్యం వంటివి చేర్చాక సప్లయర్‌ నుంచి ఆపరేటర్‌ పరిహారం పొందే హక్కును వినియోగించుకోవడం చాలా కష్టమవుతుంది. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎలాంటి ''ఉద్దేశం'' లేనప్పుడే దీనిని వెనక్కి తీసుకుని క్లాజ్‌ 17ని పటిష్ట పరచాలి. లేకుంటే పరిహారం కోరే హక్కు వినియోగానికి సంబంధించి ఆపరేటర్‌కు, సప్లయర్‌కు మధ్య కుదిరే కాంట్రాక్టు అగ్రిమెంటుకు అంతగా విలువ లేకుండా పోతుంది. ఈ క్లాజ్‌ను పటిష్ట పరచాల్సిన అవసరముందని అంగీకరించి కూడా ఎందుకిలా చేశారు? దీనికి సమాధానం చాలా సింపుల్‌. యుపిఏ-2 ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది. కాంట్రాక్టులో లేనప్పుడు పరిహార చట్టం వర్తించకుండా చూడాలన్న అమెరికన్‌ సప్లయర్ల డిమాండ్‌కు అనుగుణంగానే దీనిని మార్చేసింది. క్లాజ్‌ 17పై అమెరికన్‌ కంపెనీలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. మొదట వున్న క్లాజ్‌ 17 ప్రకారం కాంట్రాక్టులో పేర్కొన్న దానికి మించి పరిహారం కోరే న్యాయపరమైన హక్కుకు ఆస్కారముండేది. అమెరికన్‌ కంపెనీల ఒత్తిడి ఫలితంగా దీనిని ఇప్పుడు కాంట్రాక్టు అగ్రిమెంటులో పేర్కొన్నదాని వరకే అని పరిమితి విధించింది. నష్ట పరిహారంపై రు. 1500 కోట్ల పరిమితి విధించడానికి కూడా ఇదే కారణం. సప్లయర్‌ బాధ్యత అనేది అమెరికాకు చిరాకు కలిగిస్తున్న అతి ముఖ్యమైన అంశం. కాబట్టి ఆ క్లాజ్‌ కోరలు పీకేసే ప్రయత్నం చేస్తున్నారు. అణు పరిహారానికి సంబంధించి సిఎస్‌సి ( కన్వెన్షన్‌ ఆన్‌ సబ్‌ కన్వెన్షన్‌) పేరుతో ఒక నియమావళిని తీసుకొచ్చి భోపాల్‌ తరువాత ఎక్కడైనా మళ్లీ భారీ ప్రమాదాలు జరిగితే పరిమిత పరిహారం తో అమెరికన్‌ కంపెనీలను బయటపడేసే విధంగా అమెరికా చూసుకుంటున్నది. అమెరికన్‌ అణు సప్లయర్స్‌ లాబీ ప్రతినిధి ఒమర్‌ బ్రౌన్‌ 1999లో ఒక సమావేశంలో మాట్లాడుతూ భారత్‌లో కేసుల విచారణ వల్ల లీగల్‌ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని, గనుక భోపాల్‌ తరహాలో అమెరికన్‌ కంపెనీలకు సంబంధించిన ఏ వివాదమైనా అమెరికన్‌ కోర్టుల్లో విచారణకు అనుమతించాలని కోరారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా భారత్‌ అమెరికా చేతిలో సాధనమైన సిఎస్‌సి నిబంధనలకు కట్టుబడి అణు పరిహార బిల్లును తెస్తానని హామీ ఇచ్చి వచ్చింది. 2008 సెప్టెంబరు10న అప్పటి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్‌ మీనన్‌ అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి విలియం బర్న్స్‌కు రాసిన లేఖలో సిఎస్‌సికి కట్టుబడే అణు పరిహార బిల్లు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీని వల్ల అమెరికన్‌ అణు కంపెనీలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య అణు వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుందని అందులో విశదీకరించారు. ఇప్పుడు సమస్యంతా అణు పరిహార బిల్లు ఆశయాలు, లక్ష్యాలపై కన్నా సిఎస్‌సిలో చేరడంపైనే వచ్చింది. సిఎస్‌సి అనేది అణు సప్లయర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించినదే తప్ప మరొకటి కాదు.
ఈ పరిస్థితుల్లో అమెరికన్‌ సప్లయర్స్‌ ప్రయోజనాలు కాపాడేందుకు బిజెపి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతోంది. అణు ప్రమాద పరిహారం రు. 1500 కోట్ల పరిమితి పెట్టడమంటే భోపాల్‌ బాధితులకు ఇచ్చిన 47 కోట్ల డాలర్ల పరిహారం కన్నా తక్కువ చెల్లించమని అడగడం కాదా? అందుకే ఈ అణు పరిహార బిల్లును అడ్డుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. ఇటువంటి నికృష్టమైన బిల్లును ఆమోదించవద్దని పార్లమెంటు సభ్యులపై ప్రజలు పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావాలి. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పార్లమెంటు ఇలాగే ఆమోదించినట్లైతే భారత్‌ - అమెరికా అణు ఒప్పంద సుదీర్థ చరిత్రలో అదొక విషాద ఘట్టంగా మిగిలిపోతుంది.

Copy & Past from ప్రబీర్‌ పుర్కాయస్థ 

31, మే 2010, సోమవారం

ఈ ఐదిగురి పాపం ... జనానికి శాపం...

3 వ్యాఖ్యలు
1.  చాలా త్వరగా లేదా కాస్త ఆలస్యంగా ముఖ్యమంత్రి పదవి చేబట్టడానికి వీలుగా తన రాజకీయ ప్రాబల్యం విస్తరించుకోవాలనే ఒక యువ నాయకుడి మొండితనపు వ్యూహం...

2.  అనుకోని విషాద పరిస్థితుల్లో అందివచ్చిన ముఖ్యమంత్రి స్థానాన్ని వీలైనంతకాలం నిలబెట్టుకోవాలనే ఒక వృద్ధనేత ఉద్దేశపూర్వక ఊగిసలాట విధానం..

3. స్వంతంగా మెజార్టీ లేని కేంద్ర ప్రభుత్వం, అత్తెసరు మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడేమవుతుందోననే అనిశ్చితిలో అధిష్టానపు అచేతన ఆజమాయిషీ...

4. ప్రాంతంపై తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవడంలోనే అస్తిత్వం వుందనుకునే నేతల దుందుడుకు ధోరణులు, ఇంకా అనేక అవకాశవాదాలు,అవగాహనా లోపంతో ఆవేశ కావేశాలు...

5. ఇవన్నీ ఎలా వున్నా ప్రజల శ్రేయస్సుకు స్వతంత్రంగా వ్యవహరించలేని పాలనా, పోలీస్‌ యంత్రాంగం నిశ్చేతనత్వం....

 ఇవి తప్పా యింకా ఇంకేమయినా కారణాలు ఉన్నాయంటారా? (పూర్తి పాఠం)