వీలుంటే నా నాలుగు లంకెలు ...

1, జులై 2009, బుధవారం

పాపం మమతా బెనర్జీ!

మమతా బెనర్జీ లాల్‌ఘర్‌ ఆపరేషన్‌ రద్దు చేయాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణులు భద్రతా దళాలకు మంచినీళ్లు ఇస్తున్నారంటూ మీడియా చెబుతోందని కాని అది అబద్ధమని, వారంతా సిపిఎంకు చెందిన వ్యక్తులని అన్నారు. అంతా నాటకమని, ముందుగా వేసుకున్న పథకమని, మావోయిస్టులు ఇళ్లుతగలబెడుతున్నారనే వార్తలు అవాస్తవమని మమత అన్నారు. ఛత్రధర్‌ మహతోను కలిసిన మేధావులపై కేసు పెట్టడాన్ని ఆమె వ్యతిరేకించారు. లాల్‌ఘర్‌ అరాచకాల్లో ప్రధాన దోషులు వీరే. దీన్నిబట్టి మమతకు మావోయిస్టుల పట్ల ఉన్న దృక్పథాన్ని, సంబంధాలను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యకలాపాల కారణంగా మావోయిస్టుల వ్యూహాలపై చీకట్లు కమ్ముకున్నాయి. వారి తుపాకుల శక్తి తగ్గిపోయింది. మావోయిస్టులకు మద్దతు విషయంలో డొల్లతనం బయటపడింది. మమత ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని నిన్న ఛత్రధర్‌ మహతో ప్రశ్నించారు. మమత ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు కాబట్టి లాల్‌ఘర్‌ అరాచకాల బాధ్యత నుంచి ఆమె తప్పించుకోలేరు. మంగళవారం భద్రతా దళాలు కాంతాపహరి నుంచి కూంబింగ్‌ ప్రారంభించాయి. దళాలు పక్కా సమాచారం ఆధారంగా కూంబింగ్‌ చేస్తున్నాయి. సాధారణ ప్రజలు వీరికి సహకరిస్తూ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌ స్క్వాడ్‌ సభ్యులు స్థానిక కేడర్‌ను వారి మానాన వారిని వదిలేసి జార్ఖండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. భద్రతా దళాలు లాల్‌ఘర్‌ ప్రాంతంలో మరో నెల రోజుల పాటు ఉంటాయి. రాష్ట్ర పోలీసులు ఇక్కడి ప్రజల భద్రత కోసం శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకోనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి