వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, జూన్ 2009, మంగళవారం

విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఇంత ఆతృత ఎందుకో..?

విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఎక్కడలేని ఆతృతను ప్రదర్శించింది యుపిఏ ప్రభుత్వం. కీలకమైన అనేక మార్పులకు తెరతీసే ఫ్రొఫెసర్‌ యశపాల్‌ కమిటీ చేసిన తాత్కాలిక మధ్యంతర సిఫార్సులను వందరోజుల్లో అమలు జరుపుతామని మంత్రి కపిల్‌ సిబాల్‌ ప్రకటించేశారు. ఎంతో కాలంగా అమలుకు నోచుకోని కొఠారి కమిషన్సిఫారసుల గురించి పట్టించుకోకుండా యశ్పాల్కమిటీ సిఫారసుల అమలుకు ఎందుకింత తొందరపడుతోంది? ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుండి తప్పించుకుని ప్రయివేటు దోపిడీకి బార్లా తలుపులు తెరవడమే ప్రభుత్వ లక్ష్యమన్నది స్పష్ఠంగా తెలిసిపోయింది. ప్రజల నుండి వసూలు చేసే విద్యా సెస్సు నిధులు ప్రభుత్వం దగ్గర వున్నాయి. విద్యా రంగానికి డబ్బులు ఖర్చు చేయలేని హీన స్థితిలో ప్రభుత్వం లేదు. అయినా విద్యావ్యవస్థను అది కూడా హడావిడిగా వ్యాపారీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. ఇది ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేయడమే. యశ్పాల్కమిటీ ఉన్నత విద్యా రంగాన్ని విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలకు దీటుగా వుండాలని కోరితే యుపిఏ ప్రభుత్వం ఏకంగా మన ఉన్నత విద్యను విదేశీ వ్యాపార సంస్థలకు టోకుగా అప్పగించేందుకు పూనుకుంది. ఉన్నత విద్యను పూర్తి వ్యాపార సరుకుగా మార్చేస్తున్నది. ప్రభుత్వానికి లోకసేభలో అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు ఉంది. మా ప్రయోజనాలను కాపాడితే చాలు మిగతా మీరేంచేసుకున్నా మేం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతులెత్తుతాం అనే విధంగా మద్దతుదారులు ఉన్నారు.

1 కామెంట్‌: