వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా? కుట్ర సిద్ధాంతకర్తల వాదనలు ఏమిటి? వాటికి నాసా జవాబులు ఏమిటి?

0 వ్యాఖ్యలు

అపోలో మిషన్Image copyrightNASA

1969 జులై 20.. కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ - ఇద్దరూ అమెరికా వ్యోమగాములు - అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్‌ను చంద్రుడి మీద దించారు.
కొన్ని గంటల తర్వాత.. చంద్రుడి మీద నడిచిన మొట్టమొదటి మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిలిచారు. ఆ సంఘటనను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో అదొకటి.
చంద్రుడి మీదకు మనుషులు వెళ్లారనటానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నా కూడా.. కొంతమంది దీనిని విశ్వసించరు.
చంద్రుడి మీదకు వెళ్లటం కట్టుకథ అనే వాళ్లని 'కుట్ర సిద్ధాంతకర్తలు'గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే.. అదంతా నాసా ఆడిన నాటకమని వాళ్లు నమ్ముతారు.
ఈ కుట్ర సిద్ధాంతకర్తల వాదనలను కొట్టివేయటానికి.. శాస్త్రవేత్తలు, నాసా నిపుణులు తరచుగా ఆధారాలు ముందుపెట్టాల్సి వస్తుంది.
మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవాళ్లు చూపే కొన్ని కారణాలు.. అవి ఎలా తప్పో చెప్పే వివరాలు ఇవి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES

నింగిలో నక్షత్రాలు లేవు

అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద నుంచి తీసిన ఫొటోలలో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు మద్దతుగా ప్రస్తావిస్తుంటారు కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు.
'చంద్రుడి మీద గాలి లేదు. దానర్థం.. ఆకాశం నల్లగా ఉంటుంది. కానీ.. నక్షత్రాలు లేకపోవటం విచిత్రమైన విషయం' అని కొందరు అంటుంటారు.
దీనికి జవాబు ఏమిటంటే.. నక్షత్రాలు ఉన్నాయి.. కానీ అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నాయి.
మనం ఏదైనా ఫొటో తీసేటపుడు.. ఫోకస్ దేని మీద ఉండాలో మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి.. కెమెరా చంద్రుడి మీద ఉన్న వ్యోమగాముల మీద ఫోకస్ చేస్తుంది కానీ.. నక్షత్రాల మీద కాదు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది.

అపోలో మిషన్Image copyrightNASA

జెండా రెపరెపలు

చంద్రుడి మీద అమెరికా జెండా చాలా ప్రఖ్యాతి గాంచింది. ఆ క్షణంలో తీసిన ఫొటోల్లో ఆ జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే.. చంద్రుడి మీద గాలి లేదు కాబట్టి గాలి వీచే అవకాశం ఉండదని.. అలాంటపుడు జెండా ఎలా రెపరెపలాడుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు.
వాస్తవం ఏమిటంటే.. ఆ జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అది కదలటం లేదు. ఆ జెండాను చంద్రుడి ఉపరితలం మీద పాతినపుడు.. జెండా కదిలి ఉంటుంది. అలా వంగిన రూపం అలాగే ఉండి ఉంటుంది.
వీడియోల్లో కూడా జెండా ముందుకు, వెనుకకు గాలిలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. వ్యోమగాములు ఆ జెండాను నాటుతున్నపుడు.. చంద్రుడి మట్టి మీద రంధ్రం సరిగ్గా చేయటానికి వ్యోమగాములు దానిని ముందుకు వెనుకకు తిప్పారు. దానివల్ల జెండాలో కదలికలు ఏర్పడ్డాయి.

అపోలో మిషన్Image copyrightNASA
చిత్రం శీర్షికభూమి చుట్టూ ఉండే అలెన్ బెల్టులు అని పిలిచే భారీ అణుధార్మిక వలయాలను 1958లో గుర్తించారు

అది అసాధ్యం కాదు

కొంతమంది అంతరిక్ష నౌకను.. చంద్రుడి మీదకు ప్రయాణాలను విశ్వసించరు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలెన్ బెల్టులు అనే భారీ అణుధార్మిక వలయాల వల్ల అసలు ఆ ప్రయాణమే అసాధ్యమని వారు నమ్ముతారు.
మనుషులు ఈ వలయాలను దాటి వెళ్లలేరని.. అలా వెళ్తే ప్రాణాంతక మోతాదులో అణుధార్మికతకు గురౌతారని వాదిస్తుంటారు.
కొన్ని గంటల వ్యవధిలో 200 నుంచి 1,000 'రాడ్ల' అణుధార్మికతకు గురైనప్పుడు మాత్రమే అణుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది.
అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు.. ఈ వాన్ అలెన్ వలయాల పరిధిలో రెండు గంటల కన్నా తక్కువ సమయమే ప్రయాణించారు. కాబట్టి.. వాళ్లు కేవలం 18 రాడ్ల అణుధార్మికతకు గురై ఉంటారని అంచనా. అది సురక్షితమైన పరిమితి లోపలే ఉంది.
అంతరిక్ష నౌకకు సరైన రక్షణ ఉండేలా నాసా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి.. 12 రోజుల ప్రయాణంలో సగటు అణుధార్మిక మోతాదు 0.18 రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్-రే తీసుకున్నపుడు గురయ్యే అణుధార్మికతతో సమానం.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికచంద్రుడి మీద నుంచి 382 కిలోల రాళ్లను భూమికి తెచ్చారు

చంద్రుడి రాళ్లు

ఇక చంద్రుడి మీదకు మనిషి వెళ్లివచ్చాడు అనటానికి మరో సాక్ష్యం.. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీది నుంచి రాళ్లు తీసుకురావటం.
వాళ్లు చంద్రుడి మీద నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిని చాలా దేశాలతో పంచుకున్నారు. దశాబ్దాల పాటు వాటి మీద అధ్యయనాలు జరిగాయి.
ఆ పరీక్షలన్నీ కూడా.. ఆ రాళ్లు నిజంగా చంద్రుడి మీది నుంచే వచ్చాయని నిర్ధారించాయి.

అపోలో మిషన్Image copyrightNASA

చంద్రుడి మీద పాదముద్రలు

చంద్రుడి మీదకు వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యాయో ఇప్పడు కూడా అంతరిక్షం నుంచి కనిపిస్తుంటాయి. అంతేకాదు.. చంద్రుడి ఉపరితలం మీద నడిచిన వ్యోమగాముల పాదముద్రలను కూడా అంతరిక్షం నుంచి చూడవచ్చు.
భూమి ఉపరితలం మీద.. పాదముద్రలను కానీ ఇతర గుర్తులు కానీ గాలులతో, వర్షాలతో.. లేదంటే వాతావరణం, సముద్రాలు, జీవం ఉన్న గ్రహాల మీద సంభవించే ఉపరితల కార్యకలాపాలతో సులభంగా చెరిగిపోతాయి.
అయితే.. చంద్రుడి మీద ఇటువంటి పరిస్థితులేవీ లేవు. అందువల్ల అక్కడ పాదముద్రలు ఇంకా అలాగే ఉన్నాయి.
2009 సంవత్సరం నుంచీ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న నాసా లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్.. అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాలనూ ఫొటోలు తీసింది.
ఆ ఫొటోల్లో అపోలో అంతరిక్ష నౌక దిగిన కచ్చితమైన ప్రదేశాలే కాదు.. చంద్రుడి మీద అన్వేషణ జరుపుతూ సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
చైనా, ఇండియా, జపాన్‌లు స్వతంత్రంగా చంద్రుడి మీదకు ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలు కూడా.. అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES/ SPACE FRONTIERS

చంద్రుడి మీద వదిలివచ్చిన పరికరాలు

చంద్రుడి మీదకు వెళ్లింది కేవలం వినోదం కోసం కాదు. శాస్త్రపరిశోధనలకు ఒక పెద్ద అవకాశమది.
చంద్రుడి గురించి మరింత తెలుసుకోవటం కోసం అనేక సాంకేతిక పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో కొన్నిటిని చంద్రుడి మీదే వదిలిపెట్టి వచ్చారు.
అలా వదిలి వచ్చిన పరికరాల్లో రెట్రోరిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. ఈ లూనార్ రిఫ్లెక్టర్లు.. 1969 నుంచి భూమికి - చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా కొలవటానికి వీలుకల్పించాయి. వాటిలో చాలా రిఫ్లెక్టర్లు ఈనాటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అపోలో 11, 14, 15 వ్యోమగాములతో పాటు.. సోవియట్ ల్యూనోకోడ్-2 రోవర్ కూడా నెలకొల్పిన ప్రాంతాల నుంచి ఈ రిఫ్లెక్టర్లు లేజర్లను పంపిస్తూ ఉన్నాయి.
మరో ప్రయోగం లూనార్ సర్ఫేస్ మాగ్నెటోమీటర్ (ఎల్ఎస్ఎం). చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలవటానికి దీనిని డిజైన్ చేశారు. చంద్రుడి ఉపరితలం మీద అయస్కాంతీకృత లక్షణాలు ఉన్నాయని.. కానీ ఆ అయస్కాంతతత్వం చంద్రుడి చుట్టూ ఒకే తరహాలో లేదని అది నిర్ధారించింది.
ఈ ప్రయోగాలతో పాటు ఇతర ప్రయోగాలతో సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.


9, జూన్ 2019, ఆదివారం

ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందా?

0 వ్యాఖ్యలు
మన పిల్లలకి శాస్త్రీయ ఆధారాలు లేని భారతం, బైబిల్, ఖురాన్ ల గురించి చెప్పక పోయిన ఫర్వాలేదు కానీ ఈ విషయం చెప్పి తీరాలి, పిల్లల్లో శాస్త్రీయ ధృక్పథం అలవర్చండి..
👇

ప్రశ్న: ఈ భూమ్మీద మొదట కోతి పుట్టిందని, దాన్నుంచే మానవుడు పుట్టాడని విన్నాను. అదే నిజమేనా? మరి ఈ నాటి కోతులు ఇంకా కోతులలాగానే ఎందుకున్నాయి? అసలు ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ ప్రాణులు ఎట్లా ఏర్పడ్డాయి ?
"""""""""""""""""""""""""""""""""""""""""""""

జవాబు : ఈ భూమ్మీద మొదట, అంటే భూమి ఏర్పడ్డ సుమారు *550 కోట్ల సంవత్సరాల క్రితం ఏ జీవీ లేదు.* అపుడు ఈ భూమ్మీద కోతులు, కొంగలు ఇతర (చిన్నా పెద్దా) ప్రాణులు, కొండలూ, గుట్టలూ, నదులూ, సముద్రాలూ, వాతావరణం మొదలైనవేవీ ఇక్కడ లేవు.

ఆదిలో ఈ భూమి, కేవలం ఓ చిన్న సూర్యుడిలాగా, స్వతహాగా కాంతినిచ్చే ఓ బుల్లి నక్షత్రంలాగా వాయువు, దుమ్మూ, ధూళి రూపంలోనే వుండేది.

అది క్రమేపీ తనలో ఉన్న కేంద్రక ఇంధనాల (Nuclear Fuel) యిన హైడ్రోజన్‌, డ్యూటీరియం వంటి వాయువులు కేంద్రక సంలీన చర్యల *(Nuclear Fusion reactions)* ద్వారా పెద్ద పెద్ద పరమాణువులుగా మారాయి. ఆ క్రమంలో ద్రవరూప పదార్థం సలసల మరుగుతూ ఏర్పడింది.

ఉష్ణం, శక్తి ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే ఉండిపోవు. అధిక శక్తి ప్రాంతం నుంచి అల్పశక్తి ప్రాంతం వైపు శక్తి ప్రసరించడం సహజ లక్షణం. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం *(Zero Law of Thermo dynamics)* అంటారు.

కాలక్రమేణా ఉష్ణాన్ని, కాంతి శక్తిని పోగొట్టుకున్న భూమి గోళరూపంలోకి (ఘనాకృతికి) మారింది. ఆ సందర్భంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి వాయురూప నత్రజని, నీటి ఆవిరి ఏర్పడ్డాయి. ఇవి భూమిపై వాతావరణాన్ని ఏర్పర్చాయి. పై పొరలో బురబుర, సలసల మరిగే ద్రవ, ఘన రూప నేల ఉవ్వెత్తున ఎగిరిపడే లావా ఉప్పెనలు, ఆ పై భాగాన అతి వేడిగా ఉన్న వాయు వాతావరణం.. *ఇదీ దాదాపు 500 కోట్ల సంవత్సరాల క్రితపు భూమికీ వున్న భౌతిక రూపం.*

శక్తి వికరణం చెందేకొలదీ ఉష్ణోగ్రత తగ్గి నీటి ఆవిరి వర్షంగా మారింది. ఈ వర్షం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది. ఆ *చల్లదనానికి లావా లాగా ఎగిసిన ఉప్పెనలు కొండలుగా మారాయి.*

*లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. అవే సముద్రాలుగా మారాయి.* కొండల మీద పడ్డ వాన నేల పొరల్ని రాసుకొంటూ భూమ్యాకర్షణ వల్ల (పల్లం వైపు) సముద్రాలవైపు పయనించింది. ఇవే నదులుగా మారాయి.

*సముద్రంలోని నీరు తిరిగి ఆవిరి కావడం, నేలపైకి మేఘాలుగా రావడం, వర్షంగా మారడం, నదీనదాలు నిండడం వంటి నీటి చక్రం స్థాపితం అయ్యింది.*

ఆ క్రమంలో వేడి వేడిగా వున్న నేల ప్రాంతం నుంచి రకరకాల రసాయనిక ధాతువులు సముద్రాల్లో చేరాయి. అపుడక్కడ ఉన్న ఉష్ణోగ్రత, రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో కాకతాళీయంగా (ముందే ఎవరో సృష్టికర్త రాసి పెట్టినట్టు కాకుండా) DNA, RNA వంటి అరీశ శకలాలు ఏర్పడ్డాయి.

DNA, RNA లాంటి సంక్లిష్ట అణువులు ఏర్పడ్డాయంటే అంతకన్నా తేలికయిన కార్బన్‌ డయాక్సైడ్‌, నత్రజని సమ్మేళనాలు, సేంద్రియ, నిరింద్రియ పదార్థాలు (Organic and Inorganic Compounds) కూడా ఏర్పడ్డాయనే అర్థం. కొన్ని ప్రత్యేక అనుకూల పరిస్థితుల కారణాన DNA  లేదా RNA వేలిక చుట్టూ తైల అణువుల పొర (lipid layer)  అధ్యణు రసాయనిక ప్రక్రియల (Supramolecular chemical processes) ద్వారా స్వక్రమానుగత పొర (Self Assembled Monolayer) గా ఏర్పడింది. ఇదే తొలి జీవకణం.

ఈ తొలి జీవకణానికి స్వపునరుత్పత్తి (self replication) లక్షణం వుంది. ఇలాంటి దశల మధ్య కాలవ్యవధి సంవత్సరాలు, ఒక మనిషి జీవితకాలం వంటి స్థాయిలో ఉండదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమానుగత చర్యలు పర్యవసానంగా వుంటుంది. అంటే కొద్దికొద్దిగా పరిమాణాత్మకంగా *(Quantitatively)* మార్పులు చెందుతూ వ్యవధిలో ఓ సందర్భ దశలో గుణాత్మక *(Qualitative)* మార్పులు చెందడం ద్వారా సంభవించాయి.

ఇలాంటి *తొలి జీవకణాలకు కాలక్రమేణా జీవులకున్న లక్షణాలు పరిపుష్టి చెందాయి.* DNA/ RNA లో వున్న రసాయనిక క్రమం జన్యుస్థాయి (Genetic Rule) ని సంక్రమం చేశాయి.
ఇలాంటి కణాలు *కొన్ని కోట్ల సంవత్సరాల గతితార్కిక సైద్ధాంతిక ప్రక్రియల ద్వారా వృక్షజాతులుగా, మరికొన్ని జంతు జాతులుగా పరిణామం చెందాయి.*

ఎముకలు లేని (అకశేరుక) జీవుల (Invertibrate animals) యుగం కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు సాగింది. అందులో కొన్నింటిలో జీవ రసాయనిక మార్పులు జరిగి భూమ్మీద సంచరించేలా సకశేరుక (ఎముకలున్న) జంతువులు (Vertibrate animals) రూపొందాయి.

*ఆ క్రమంలో కేవలం కోటి, 5 కోట్ల సంవత్సరాల పూర్వమే పాలిచ్చే జంతువులు (Primates) ఏర్పడ్డాయి.*

కోతులు రూపొంది యిప్పటికి రెండు మూడు కోట్ల సంవత్సరాలు కూడా మించదు. ఈ జాతుల్లోని కొన్ని పరిణామక్రమంలో మానవ శరీరంలోకి పరిణమించాయి. మానవుడు లాంటి క్షీరద జీవి (Mamnal) రూపొంది కోటి 20 లక్షల సంవత్సరాలకు మించదు.

*కాబట్టి కోతులు మొట్ట మొదట ఏర్పడలేదు.* అవి ఈ మధ్యే జీవ పరిణామ క్రమంలో రూపొందాయి. ఇపుడున్న కోతుల జాతి నుండే మానవుడు ఆవిర్భవించాడని అనుకోవడం సరికాదు. *వీటి జాతి వేరు. మానవుల జాతి వేరు.*

వ్యాసకర్త..
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక.

18, మే 2019, శనివారం

మోడీ జీ మూసుకొని కూర్చో..

0 వ్యాఖ్యలు
మోడీ జీ మూసుకొని కూర్చో..

నీకు డైలాగ్స్ లేవు.

మొన్ననే ఛాన్సిస్తే మబ్బులు, డిజిటల్ కెమెరాలు, ఈమెయిల్ అని గబ్బు లేపినవ్..

-అమిత్ షా

13, మే 2019, సోమవారం

‘మేఘావృతమైనప్పుడు రాడార్‌ పని చేయదని, అలాంటి సమయంలో దాడులు చేస్తే శత్రువులు పట్టుకోలేరన్న మోదీ'

0 వ్యాఖ్యలు
‘మేఘావృతమైనప్పుడు రాడార్‌ పని చేయదని, అలాంటి సమయంలో దాడులు చేస్తే శత్రువులు పట్టుకోలేరన్న మోదీ'

ఒక దేశ భక్తుడని చెప్పుకునే వ్యక్తి యిలానేనా మాట్లాడేది??

1. యుద్ద తంత్రాలను ఒక ప్రధవి లో వుండి భహిర్గతం చేస్తాడా, అదీను ఎన్నికల సభలో?

2. యిది మన వాయుసేన కెపాసిటిని తక్కువ ఆంచనా /చులకన చేయడమే కదా!

3. వాయుసేనలో రాడార్స్ పై ఎన్నో ఏళ్ళనుండి పనిచేస్తూ, అవి తయారు చేస్తున్న వారికి తెలియని విషయం ఈ బూటకపు డిగ్రీ హోల్డర్ కు తెలిసిందా? మెఘాలు వున్నప్పుడు రాడార్ పని విధానం ఎలా వుంటుందో ఎవరికి యితను చెప్పె వరకు తెలియదా?

4. ఎలక్షన్ కోడు ప్రకారం సైనిక పరమైన విషయాలు చర్చించ వద్దని చాల క్లియర గా వుంది. అటువంటప్పుడు, ఏకంగా సైనిక రహస్యాలను బయటపెటకు చెప్పొచ్చా?

తక్షణం ఈ ఫేక్ చౌకీదార్ ని  ఎన్నికల కమీషన్  ఎన్నికల నుండి బహిష్కరించాలి.. వైమానిక దళం ఈ ఫేకుని రహస్యాలు బయట పెట్టిన నేరానికి గాను  మార్షల్ చెయ్యాలి..

భక్తులూ మీ దేశ భక్తిని చాటుకొనే సమయం అసన్నమైంది..

వాసవ్య యాగాటి
2019-05-13

27, అక్టోబర్ 2018, శనివారం

0 వ్యాఖ్యలు
ఎయిర్ పోర్టులో భద్రతా లోపాలు...

  • ఎంతో పగడ్భందీ భద్రత పహారాలో వుండే వినామాశ్రయాలలో కొట్టోచ్చిన భద్రతా లోపం గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచిత్రంగా వుంది..
    • రాష్ట్ర పోలీసులేమో ఘటన మా పరిదిలోది కాదని ప్రకటన...
    • ఏయిర్ ఏవియేషన్ వారేమో ప్రయాణికుల భద్రత మా పరిధి కాదని వారి ప్రకటన..
    • CISF వారేమో, చెక్ ఇన్ దగ్గర మాత్రమే మేము చెక్ చేస్తామని ప్రకటన. లాంజ్ రూమ్స్ లో మేము చెక్ చేయమని ప్రకటన..
  • విశాఖపట్నం ఎయిర్ పోర్టు పగలు ప్రజల కోసం, రాత్రిపూట నావికాదళం కోసం వాడుతున్న అత్యంత భద్రత కలిగిన విమానాశ్రయం.
    • డిఫెన్స్ పరిధిలో వున్న ప్రాంతంలో, ఉధ్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు ఏమయ్యాయి?
    • వివిఐపి లు బసచేసే ప్రాంతం లో కూడా ప్రయివేటు వ్యక్తులను ఎలా అనుమతిస్తారు?
  • రాజ్యాంగ పదవి లో వున్న వ్యక్తి (ప్రతిపక్ష నేత అంటే క్యాబినేట్ మంత్రి హోదా) పై దాడి జరిగితే విమానాశ్రయాల అధికారులు తీరు చాలా పేలవంగా వుంది. అత్యవసర పరిస్థితులలో యిలాగానే ప్రవర్తించేది?
    • దాడిలో వాడిన కత్తికి సైనేడ్ వంటి విషపూరిత రసాయినాలు పూసి వుంటే?
    • మెడికల్ ఎగ్జామినేషన్ (విషపూరితమో కాదో తెలియకుండా) చేయకుండా 10 నిమిషాలలో ఎలా పంపించి వేశారు?
    • విమాన ప్రయాణ సమయంలో విక్టిమ్ కి ఏమైనా జరిగితే భాద్యత ఎవరిది?
    • మొత్తం ప్రాతంని CISF కంట్రోల్ లోకి తీసుకోకుండా (దాడి చేయడానికి మరి యింకేవరైనా వుండి వుండొచ్చుకాదా!) అంత సింపుల్ గా (విడియోలలో మనం చూశాము) ఎలా తీసుకువెళ్లారు?


రాజకీయ దివాళాకోరు వాదనలు...
  • దాడి జరిగిన మరుక్షణమే వైకాపా ముఖ్యులు యిది చంద్రబాబు జగన్ ను చంపడానికి కుట్ర అని ప్రచారం స్టార్ట్ చేయడం
  • తెదేపా ముఖ్యులేమో యిది జగనే తనకు తాను సింపతీ కోసం చేయుంచుకున్నాడని ఎదురుదాడి చేయడం
  • భాజపా ముఖ్యులు సైతం దీనిలో చంద్రబాబు కుట్ర దాగి వుందని, బయటయితే కష్టం అని విమానాశ్రయంలోనే హత్యాయత్నం చేశారాని ప్రచారం..
  • యిది శాంతిభద్రతల లోపం, రాష్ట్ర పరిస్థితులు చేయిదాటిపోయాయి కేంద్రం స్పందించాలని వైకాపా, భాజపా డిమాండ్
  • మీడియా... రాష్ట్రంలో ఎక్కడ గొడవలు, అరాచాకాలు జరగక పోయినా రాయసీమలో లూటిలు, బస్సు దహానాలు జరుగుతున్నాయని లైవ్ లొ తప్పుడు ప్రచారాలు..
  • డిజిపి... యింకా దర్యాప్తు మొదలు కాక మునుపే తీర్పు ఎలా చెబుతారు? దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానని, అభిమానంతో నే దాడి జరిగిందని ఎలాచెబుతారు? పోలీసులన్నాక దర్యాప్తు రెండు, మూడు లేక అంతకన్నా ఎక్కువ కోణాలలో జరగాలి, జరుగుతుంది.. ధర్యాప్తు జరగక ముందే మీడియాకు తెదేపా అనుకూలంగా చెప్పడం భాధ్యత కాదు..
  • అపరేషన్ గరుడ: అదో పనికిమాలిన వాదన.. ఆదే నిజమని మీకు తెలిస్తే, ప్రతిపక్ష నాయకుడికి ముందుగానే భద్రతా పరమైన హెచ్చరికలు జారీచేసారా? కావలనే ప్రతిపక్ష నాయకుడనే ఊరుకున్నారా? ముందే కనిపెట్టిన అతనికి అవార్డు యిస్తున్నారా? లేక ఈ ప్లాన్ కి అతనే సూత్రధారి అని అనుకోవాలా? అతని చెప్పినవన్ని ఏమి జరగక పోయినా మొత్తం అతని చెప్పిన స్క్రిప్ట్ మాదిరే జరుగుతుందని ఎందుకు జనాను మభ్యపెడుతున్నారు??


తెదేపా వాదన: జగన్ తనకు తానే హాత్యాయత్నం చేయించుకున్నాడు..

అంత పగడ్భందీ గా సెక్యూరిటీ, కెమెరాలు, హత్యాయత్న డ్రామా చేయడానికి వచ్చిన వ్యక్తి తప్పించుకొని పోయే అవకాశమే లేనటువంటి ప్రదేశంలోనే ప్లాన్ చేస్తారా? హత్యాయత్నం చేసినవాడు దొరకడా, నాలుగు తన్నితే నిజం చెప్పడా? యిది జరిగే పనేనా?

తెదేపా వాదన: ఈ హాత్యాయత్నం మోదీ కుట్రలో భాగమే


ఎన్నొ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్ర ప్రతిపక్షనేతని అదీకూడా కట్టుదిట్టమైన భద్రత వున్న స్థలంలో చంపించే అవకాశం వుంటుందా? కేసు రాష్ట్ర పోలీసులు తీసుకుంటారు.. ధర్యాప్తులో బయట పడవా? ఐటీ దాడులు, రాజకీయ అవకాశాలు, వివిధ పార్టీ నాయకుల లోపాయకారి ఒప్పందాలు మోదీ ఆధ్వర్యంలొ జరుగుతూవుండవచ్చు.. కానీ యిటు వంటి బహిరంగ హత్యా ప్రయత్నాలకు కేంద్ర పాల్పడే అవకాశం వుందా?

చంద్రబాబు: జగన్ ను పరామర్శించడం తప్పు


చంద్రబాబు నాయుడు తనకి తను తన వ్యాల్యూని తగ్గించుకొనే వ్యాక్య అది. అత్యంత దిగుత్సాకరం కూడా.. కుట్ర అవ్వొచ్చు, స్వయంకృతం కావొచ్చు... దాడి నిజం, గాయం నిజం.. మానవతా విలువలువున్న వారెవరైనా, ముఖపరిచయస్తులెవరైనా పరామర్శించడం ఎలా తప్పువుతుంది??

జగన్: నేను ఏపి పోలీసులకు వాంగ్మూలం యివ్వను, నమ్మకం లేదు
  • ఒక ప్రక్క తనకు పోలీసుల భద్రత సరిపోవడం లేదు, యింకా పెంచమని సమయం వచ్చినప్పుడల్లా వైకాపా గొడవ చేస్తుంది.. మరి అప్పుడు ఏపి పోలీసులపై నమ్మకం వుంటుందా?
  • భాద్యతాయుతమైన (రాజ్యాంగ పరమైన) పదవిలో వుండి వైజాగ పోలీసులకు సహకరించడం ఎలా సమర్థనీయం? రేపు జగనే సీఏం అయితే, వేరే రాష్ట్ర పోలీసులను తెపిస్తారా?
  • శాసన సభకు వెళ్లరు, పార్లమెంటుకు వెళ్లరు, ఆల్ పార్టీ మీటింగులకు వెళ్లరు, పోలీసుల పై నమ్మకం లేదు.. మరి ప్రజాస్వామ్యం పై నమ్మకం వుందా? జగనే గెలిస్తే ప్రజాస్వామ్యం బ్రతికి వుంటుందా?


జివిఎల్ నరసింహారావు (భాజపా): సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి, చంద్రబాబుదే భాద్యత

  • అయ్యా జివిఎల్ గారు, సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పించింది సిటింగ్ జడ్జ్స్ ని కమిటిలకు వాడుకోవొద్దని.. (జరిగే పని కాదు అని తెలిసినా!)
  • వైకాపా కన్నా మీరే ఎక్కువ గా తెదేపా ని టార్గెట్ చేశారు ఈ విషయంలో.. తెదేపా నే జగన్ ను చంపాలని చూస్తుందని ఎటువంటి ఆధారాలు లేకుండా డిల్లీ నుండి దాడి చేస్తున్నారు.. చంపాలనుకునేవారు చిన్న కత్తితో, కత్తికి ఎటువంటి విషం రాయకుండా చంపుతారా??
  • కేంద్ర ఐబీ దగ్గర ఏమైన ఆధారాలు వుంటే బయటపెట్టి వాదిస్తే బాగుంటుంది.. ఆలా కాకుండా, ఈ సంఘటనతో రాష్ట్రం అతలాకుతలం అయితే అధికారం మీచేతులకు తీసుకోవచ్చనే మీ ఆలోచన, ఆవేశం టివి చూస్తున్న వారందరికి అర్థం అవుతుంది..
  • ఎక్కడ అధికారం లేకపోతే అక్కడ అరాచాకాలు సృష్టిస్తానికి మీరు పడే తాపత్రయం కేరళ్, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రలలో చూస్తున్నాము..


వాసవ్య యాగాటి
2018-10-27
0 వ్యాఖ్యలు
నీ పాలన లోనే... 
వాసవ్య యాగాటి
2018-10-24
ప్రపంచ వ్యాప్తంగా RBI కి వున్న పరిపతి పోయే నీ పాలనలోనే..

దేశ ప్రజలకు బ్యాంకులపై వున్న నమ్మకం పోయే నీ పాలనలోనే...

1000 నోటు రద్దు చేసి 2000 నోటు ప్రవేశపెట్టడంతో నల్లడబ్బు చలామణి సులువు చేసే నీ పాలనలోనే...

రూపాయి విలువను అధః పాతాళంకు పోయే నీ పాలనలోనే..

సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టి ​​ఏడ్చె నీ పాలనలోనే...

నకిలీ వీడియోలు సృష్టించి విద్యార్థులపై దేశద్రోహ దొంగ కేసులు పెట్టించె నీ పాలనలోనే...

సిబిఐ ఆఫీసును సిబిఐ చేతనేే సీజు చేసే పరిస్ఠితి వచ్చే నీ పాలనలోనే...

నీకు ఎదురు నిలిచే మీడియాపై సిబిఐ, ఐటి ద్వారా ఉక్కుపాదము మోపె నీ పాలనలోనే...

అన్యాయాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను కుక్కలను కాల్చి నట్లు కాల్చినా ధర్యాప్తు సంస్థలు నోరుమెదపనే లే నీ పాలనలోనే...

ధనవంతుల లక్షల కోట్ల అప్పుల రద్దులో చరిత్ర సృష్టించే నీ పాలనలోనే...

దేశ సంపద దోచి విదేశాలకు పారిపోయిన వారికి వీసాలను సైతం సిఫార్సు చేసే నీ పాలనలోనే...

అత్యధిక సొమ్ము ప్రజలనుండి చమురు ద్వారా గుంజె నీ పాలనలోనే...

మానభంగాలు చేసిన వారికి మద్దతుగా ఊరేగింపులు సైతం చేసే నీ పాలనలోనే..

నిన్ను ఎదురించిన రాష్ట్రప్రభుత్వాలను సైతం అల్లకొల్లోలం చేసే నీపాలనలోనే...

అవినీతి పరులు హాయిగా నిద్రపోయే నీ పాలనలోనే...

ప్రజల/ప్రభుత్వ ఆస్తులను ఆదానీ/అంబానీలకు అప్పనంగా అప్పచెప్పే నీ పాలనలోనే..

రిలయన్స్ జియో కోసం ట్రాయ్ చట్టాలను సమూలంగా మా
ర్చే నీపాలనలోనే...

ఒక్క క్లాస్ రూమ్ కూడా లేని జియో యూనివర్శిటికి వేలకోట్ల రూపాయల గ్రాంట్ యిచ్చే నీ పాలనలోనే...

హిందుస్థాన్ ఎరోనాటికల్స్ ను అనిల్ అంబానీల కొరకు గొంతు పిసికి చంపే నీ పాలనలోనే...

ఎర్రకోటను సైతం నీ ఆత్మీయుల కొరకు తాకట్టు పెట్టే నీ పాలనలోనే..

ధక్షణ భారత ప్రజల పై వివక్ష పెంచే నీ పాలనలోనే...

దేశ భక్తి అంటే నిన్ను వ్యక్తిగతంగా కీర్తించడమే అనే భావన నీ భక్తులలో కల్పించే నీ పాలనలోనే..

యింకేమని పొగాడలే.. ఈ పేజి సరిపోదాయె నిన్ను పొగడదానికి...

వాసవ్య యాగాటి
2018-10-24

20, జులై 2018, శుక్రవారం

రాఫెల్ యుద్ధవిమానాలు - మోదీ

0 వ్యాఖ్యలు
  • రాఫెల్ యుద్ధవిమానాల విలువను 16వేల కోట్ల రూపాయల మేర పెంచారు, కారణం చెప్పరు..

  • 45,000 కోట్ల విలువచేసే రాఫెల్ కాంట్రాక్ట్ ని ఒక్క విమానం కూడా తయారు చేసిన అనుభవం లేని 30,000 కోట్ల నష్టాలలో వున్న రిలయన్స్ కు యిచ్చారు..​​​

  • బెంగుళూరులో ఎంతో అనుభవం మంచి యువకులున్న HAL కి కాకుండా, రియలన్స్ కి ఎందుకు యిచ్చారో చెప్పరు..

  • రాఫెల్ ఒప్పందాలలో ఎటువంటి సిక్రేట్స్ లేవని చెప్పిన ఫ్రాన్స్ దేశం, అలాంటప్పుడు ఈ ఒప్పంద విషయాలను ఎందుకు సీక్రేట్ గా ప్రభుత్వం వుంచిందో చెప్పలి..

యివి మోదీని రాహుల్ అడిగిన సూటి ప్రశ్న ఈరోజు పార్లమెంటులో, ఈ నిజాయితీ పరుడైన మన ప్రధాని గారు సాయంత్రం ప్రసంగంలో జవాబు చెప్పుతారో లేక ఎప్పటిలాగే ఈ విషయం డిఫెన్స్ కి సంబధించిందని కుప్పగెంతులేస్తారో చూడాలి...

వాసవ్య యాగాటి
20-07-2018 1:00PM

13, జులై 2018, శుక్రవారం

అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటన

0 వ్యాఖ్యలు
అమిత్ షా కేవలం ఒక్క రోజు పర్యటనలో ఎంత బిజీ అంటే విమానశ్రయంలో భాజపా లీడర్స్ ని కలిసే టైమ్ లేనంత...

మరి కలిసింది ఎవరిని??

1. ఒక స్టార్ హోటల్ లో RSS  & హిందూ ధార్మిక సంఘాల లీడర్స్ ని.. (తెలంగాణాలో మత కలహాలకు సృష్టించైనా ఒక రెండు సీట్లు తెలంగాణాలో తెచ్చుకోవాలనే.. పరిపూర్ణాంద స్వామి ఎపిసోడ్ అదే!)

2. ఒక పవర్ బ్రోకర్ మరియు మీడియా మొఘల్ గా భావించే వ్యక్తిని...(మీడియాను మ్యానేజ్ చేయడానికి)

తెలుగు ప్రజలు, తస్మాత్ జాగ్రత్త. ఎంత యింపార్టెంట్ పని కాకపోతే స్పెషల్ ఫ్లైట్ లో అంత దూరం నుంది యిక్కడకు వస్తాడు...

వాసవ్య యాగాటి..
2018-07-13

11, జులై 2018, బుధవారం

0 వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలుకు ప్రయత్నాలు - దీంతో తెలిపోతుంది భాజపా కు మిత్రులెవరో, శత్రులెవరో......

10, జులై 2018, మంగళవారం

0 వ్యాఖ్యలు

కత్తి మహేష్ - మనోభావాలు - చట్టాలు


మత మౌడ్యాన్ని, మతోన్మాదాన్ని, మత రాజకీయాలన్ని వ్యతిరేకించాలి తప్ప,

మతాల్ని, మతం నమ్మే వారి మనోభావాలను దెబ్బతగిలేలాగ మాట్లాడటం మంచిది కాదు (ప్రస్తుత చట్టాల ప్రకారం అది నేరం కూడా).

ఈ సున్నితమైన గీతను అర్థంచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.. దానివల్ల మతోన్మాద శక్తులకు అసంకల్పిత అవకాశం ఇవ్వడమే... కత్తి మహేష్ విషయంలో జరిగింది అదే!!!

మనదేశంలో "మనోభావాలు" దెబ్బతిన్నాయి అని ఎవరైనా అన్నారంటే, దానర్థం అరాచకం చేయడానికి సిధ్దంగా ఉన్నారని భావించాలి...

పరిపూర్ణంద స్వామి కూడా దానికో ఉదాహరణ. 2019 లో నిజమాబాద్ నుండి బిజిపి ఎమ్మెల్యే గా పోటీచేయాలని భావిస్తున్న ఈ స్వామి, ఏమి చేస్తే ఓట్లు పెరుగుతాయో తెలియదా?

చాలా ఆశ్రమలలో మహిళలపై అఘాత్యాలు జరిగినప్పుడు హిందూమత ఉద్ధరుడైన ఈ స్వామి ఏమైనట్లు??? అటువంటి ఆశ్రమల ముందు ప్రదర్శనలు చేయలేదే? నేనొక వీడియో చూసా ఈ స్వామి జి కూడా జీసస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.. అసవుద్దీన ఒవైసి కూడా అంతే, మరి కత్తి మహేష్ విషయంలోనే  కోర్టులు కాకుండా పోలీసులే శిక్షలు వేశారు...

అంతంత మాత్రంగా ఉన్న భావ ప్రకటన స్వేఛ్చను కూడా ఇటువంటి కారణాలు చూపి హరించేస్తారు పాలకులు..

కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, శిక్షలు ప్రభుత్వాలు పోలీసులు ద్వారా ఇచ్చేస్తాయి.. 



రాముడే దిగొచ్చినా లైంగిక వేధింపులు ఆపలేడు - వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ 


తన రాజకీయ చేతకాని తన్నాని శ్రీరామ చంద్రుడి ప్రతిభ ను సైతం తాకట్టు పెట్టిన ఈ హిందూ మతతత్వ పార్టీ ఎమ్మెల్యే కు నగర బహిష్కరణ శిక్ష వద్దా ఓ హిందూ సోదరా?

మనోభావాలు దెబ్బతినలేదా?

ఎందుకు??  ఎందుకు???

వాసవ్య యాగాటి
2018-07-10

9, డిసెంబర్ 2013, సోమవారం

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?

0 వ్యాఖ్యలు
ఉదాహరణ 1:
హైదరాబాద్ తో 60 సంవత్సారాల 6 కోట్ల సీమాంధ్రవాసుల అనుబంధం (వృత్తి, విద్య, సాంఘిక పరంగ ) మానోభావాలంటే పట్టించుకున్న నాదుడే లేడు.

కాని, 60 సంవత్సారల క్రితం గోదావరి జిల్లాలో భాగమైన భద్రాచలం మాత్రం ఖమం జిల్లా వాసుల బంధం 'పవిత్ర' మైనది.  భద్రాచలాన్ని విడదీస్తే శవాలు గుట్టలవుతాయి!

ఉదాహరణ 2:
భౌగోలికంగా ఖమ్మంకు దగ్గరా, పరిపాలనా ప్రకారం ప్రజలకు సౌకర్యం అంటారు. అదే బాగా వెనకబడిన అనంతపురం, కర్నూలు హైదరాబాదికి దగ్గరవుతాయి రేపు ఏర్పడబోయే నూతన క్యాపిటల కన్నా అంటే మాకు 10 జిల్లాల తెలంగానే కావాలి.. యింకా ఎంతమంది తెలంగాణా బిడ్డలు చావాలి అని యిండైరెక్టుగా అమాయక ప్రజల బలి దనాలను సైతం ప్రేరేపిస్తారు.

ఉదాహరణ 3:
జగన్ వర్గం (అప్పటికి కాంగ్రేస్ ఎమ్మేల్యేలు) రాష్ట్ర శాసన సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పేడితే, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం మద్ధతు యివ్వలేదనటానికి కారణం తెలుగుదేశం-కాంగ్రేస్ మ్యాచ్ ఫిక్సింగని తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపి /కోదండరాం విరుచుకు పడ్డారు.

ఇప్పుడు అదే కాంగ్రేస్ ఎంపీ లు పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టితే, ప్రధాన ప్రతిపక్షం అయిన భజపా ఈ తీర్మానానికి బలపరచక పోతే కాంగ్రేస్-భజపా కుమ్మక్కు అయినట్లానా? తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపీ అనగలదా?


యిలా ఎన్నో వున్నయి..
నాకు తెలంగాణా యిచ్చినా, యివ్వకపోయినా నాకంటూ ఏమీ లాభనష్టాలు లేవు.  తెలంగాణ రాష్ట్రం అవసరమా కాదా అనేది యిక్కడ చర్చ కాదు.. కాని చేసే వాదనలో పస వుండాలి కదా? లాజిక్ / న్యాయం మిస్ అవ్వకూడదు కదా?    ప్రజల  మానోభావాలే ('సెంటిమెంటు') రాజకీయ శాస్త్రానికి పరమావధి అనుకుంటె అంతకంటే పొరపాటు యింకొకటి లేదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు తమ దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే!

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?

14, ఆగస్టు 2013, బుధవారం

కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం ముసుగులు తొలగిపోతున్నాయ్..

0 వ్యాఖ్యలు
ఈ రోజు టివి 9 న్యూస్ వాచ్ లో 'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి
కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం యొక్క ముసుగులు క్రమేనా  తొలగిపోతున్నాయి.  నిన్న 'కోదండరాం' నేడు,   'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి

కోస్తా ఆంధ్రలో జరుగుతున్న ఉధ్యమాన్ని ఉక్కుపాదం తొ ఆనిచివేయలేదేమిటని డి.జి.పి నిలదీసిన కోదండరాం. నేడు టివి 9 లో ప్రొ॥ చక్రపాణి , సీమాంద్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉధ్యోగుల సమ్మెపై మాట్లాడుతూ, ఈ సమ్మె వల్ల ఏమీ లాభం ఉండదు. మీకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు, మీరు రిటైర్ అయినా సరే మీకు ఫించను సెటెల్ అవ్వదు, మీకు కెరీర్ లో రి మార్క్ ఉండిపోతుందని ఉధ్యోగులను భయపెట్టాలని ప్రయత్నించడం చూస్తుంటే, వీరు ఏ వర్గ స్వభావంతో పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. అధికారంలో వున్న పెట్టుబడీ దారులు కూడా సరిగ్గా యిలానే మాట్లాడతారు ఎవరైనా సమ్మె చేస్తే! మరి యిదే ఉపోద్ఘాతం తెలంగాణ ఉధ్యోగులకు 'సకల జనుల సమ్మెలో" మీరు ఎందుకు వివరించలేదు?

జనాలకు మరీ అంత మతి మరుపు వుందనుకుంటే ఎట్లా? తెలంగాణ ఉధ్యమాలలో అసలు అరాచకాలు జరగలేదు, శాంతియుతంగా జరిగాయి అంటే, మీరు మేధావులు ఏంచెప్పినా నిజమే చెప్పుతారని జనులు నమ్ముతారని మీరు భ్రమ్మల్లో వున్నట్లే...  ట్యాంక్ బండపై శ్రీశ్రీ విగ్రహం కూల్చినా తప్పు పట్టని మీరుఇందరాగాంధీ విగ్రహాలు ధ్వంసం ని మీరు చాలా తీవ్రంగా ఖండించడం, తెలంగాణలో ఒక్క ఇందిరా గాంధి విగ్రహమూ కూల్చనట్ట్లు మీరు నటించడం చూస్తుంటే మీకు వున్నది అతితెలివని తెలుస్తుంది.  గత నాలుగు సంవత్సరాలలో "తార్నాక" సెంటర్లో "పెట్ర్లోల్" బంకులను, చుట్టు ప్రక్కల ప్రవేటు కార్లను ఎన్ని సార్లు ధ్వంసం చేశారో ఎవరికి తెలియదు? అంతెందుకు, హైదరబాద్ లో షాంపింగ్ మాల్స్ కి వున్న నెట్స్ (వల)ను తీసే ధైర్యం ఎవరికైనా వుందా? అంటే యింకా భయం భయం గానే వుంది, తెలంగాణా వాదులతో ఏమవుతుందో నని.

నేను ఫ్రొవెసర్ ని మీరు నేను చెప్పేది వినాలి, మీరు చెప్పేది నేను విన్నక్కర్లేదు అని వితండ వాదం తో,  మితి మీరిన అహంభావంతో, అక్కడ వున్నవారినందరినీ శాసించాలనుకోవడం, విశ్లేషకుడిగా తన పరిది మీరి మాట్లాడటం,  ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ రోజు టివి9 లో మాట్లాడిన తీరు కడు గర్హనీయం.

మోత్తానికి ఈ మెధావి వర్గం అంతా తెలంగాణా పెట్టుబడీ దారి వర్గానికి "కూరలో కర్వేపాకు" మాత్రమే! సామన్య ప్రజలకు వీరు ఎంత అన్యాయంచేశారో ఎప్పుడు తెలుస్తుందో.. చిన్న చిన్న రాష్ట్రాలతో ఏదేదో సాధించేయ్యొచ్చనే భ్రమలో వీరు "ఫాసిస్ట్" గా మారుతున్నారు.. ఒక కె.సి.అర్  మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు.

చిన్న రాష్ట్రాలతో దోపీడి వర్గానికే అనుకూలం అని తెలిసి వచ్చే రోజు ముందు ముందు వుంది!!

24, జూన్ 2013, సోమవారం

"జ్యోతిష్యం" ఒక శాస్త్రమా? లేక మూఢనమ్మకమా?

1 వ్యాఖ్యలు
ఒకే సమయంలో వందలాది మంది (విమాన, రైలు, బస్సు, వరద ప్రమాదాలలో) చనిపోవడమంటే, చనిపోయినవారి అందరి జాతకాలు ఒకేలాగ తగలడ్డనట్లేనా? వారి వారి ఆ వార ఫలాలు "జ్యోతిష్యం"  లో అ విధంగానే చెప్పబడి/వ్రాయబడి   వుంటాయా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారయితే, మంచి చేడు చూసుకోకుండా ప్రయాణాలు చేయరు. మరి ఉత్తారాఖండలో యింత ఘోరం ఎలా జరిగింది? 

ఉదయం లెచినదగ్గర నుండి, టివీ, రేడియో, పత్రికలలో ఒకటే ఊదరదంపు  "జ్యోతిష్యం"/వార ఫలాల కార్యక్రమాలు.. ఈ వారం ఫలానా జాతకం కలవారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని ఉపోద్ఘాతాలు. మరి క్రిత వారఫలాలలో యింత మంది జాతకాలు ఒకేలాగ వున్నాయా? కాని, చనిపోయిన వారందరు వేరు వేరు నక్షత్ర, రాశుల లో జన్మించిన వారై వుండును.  అదేవిధంగా, చనిపోయిన వారిలో పాపులు, పుణ్యులు కూడా వుందురు. మరి అందరి జాతకాలు ఒకేవిధంగా ముగించడం అంటే, "జ్యోతిష్యం"  ఒక మూఢనమ్మకం అని "శాస్త్రం" కానేకాదని ఋజవవుతుంది.

-- వాసవ్య యాగాటి 24.06.2013

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ప్రత్యేక తెలంగాణ వాద మితృలకు ఒక సూటి ప్రశ్న...

18 వ్యాఖ్యలు
మిత్రపక్షాలు కాదన్నా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారే మన కాంగ్రేస్ ప్రధాని, అటువంటిది ప్రధాన ప్రతిపక్షమైన భాజప సపోర్ట్ యిస్తున్నా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టని ఈ కాంగ్రేస్ పార్టీ ఢిల్లీ పెద్దల గుమ్మం దగ్గర  చెప్పు లా  పడివున్న కెసిఆర్ మీకు నాయకుడా లేక తెలంగాణ ద్రోహా?

కొడుకు కెటిఆర్ ని బొత్స దగ్గరకి ఎందుకు పంపినట్లు? అతను ఆంథ్రప్రాంతానికి సంబంధించిన వాడు కాదా? ఏమా రహస్య ఒప్పందాలు. యిది ఏమైనా చీకటి వ్యాపార సంబంధాలా?

గమనిక:  కెసిఆర్ అభిమానులు మరియు అతని ఉధ్యమాన్ని సపోర్ట్ చేసినవారు మాత్రమే స్పందించగలరని మనవి. ఎందుకంటే కెసిఆర్ ని వ్యతిరేకించే వాళ్ళు తలో కామెంటు వేసినా గూగుల్ బ్లాగ్ ఓవర్‌లోడ్ అవుతుందేమో...

22, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రధానికి నా బహిరంగ లేఖ...చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవసరమా?

27 వ్యాఖ్యలు
చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పై నిన్న ప్రధాని నన్ను(ప్రజలను) ఉధ్దేశించి మాట్లాడిన తరువాత  ప్రధానికి నా బహిరంగ లేఖ..


ప్రధాని ఉపన్యాస సారాంశం..

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.

అసలు సమస్య అదేకదా ప్రధాని గారు.. మీరు ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల ఫలితమే కదా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి చేరింది. ఆంటే యిప్పటి వరకూ జరిగిన సంస్కరణలు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే ఉపయోగ పడినవని మీ పరొక్ష అంగీకారమా? సంస్కరణలు ఆ జాతి ని ఉద్దరించాలి గాని పరాయి దేశాలకు జాతిని తాకట్టు పెట్టడం కాదు.


2. విదేశి పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి...

విదేశి పెట్టుబడి దారులేమానా శారీరిక / మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘిక అసమానతలకు లోనవుతున్నవారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనమీద నమ్మకాన్ని వారికి ఎందుకు కలింగించాలి?
వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..


3. చైనాను చూసి నేర్చుకోవాలి...

మీరేనా మాట్లాడింది? చైనా ఆర్థిక సంస్కరణలపై చలాసార్లు విమర్శించిన మీరు యిన్నాలకు కళ్ళు తెరిచారా? లేక యిన్నాల్లు మోసంచేశారా?

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ కంపెనీల పై విధానం...
a. చాలా వరకు వసతులు రాయతీలు / ఉచితం గా కల్పించడం జరుగుతుంది (భూమి, నీరు, కరెంటు..)
b. కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి.
c. కంపెనీలో అన్ని రంగాలలో స్వదేశీ కార్మికుల కే ఉద్యోగం కల్పించాలి. చాలా క్లిష్టమైన రంగంలో చైనా కార్మికులు లేకపోతే వారికి ట్రైనింగ్ యిచ్చి వారినే ఉద్యోగంలోకి తీసుకోవాలి...

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ పెట్టుబడుల ఆహ్వానం పై విధానం...
a. ఆ కొత్త పెట్టుబడులతొ దేశానికే మైనా శాస్త్రసాంకేతికి పరిజ్ణాణం వచ్చేదయి వుండాలి..
b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..

పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?

 ఆమెరికా పెట్టుబడీ దారుల వ్యూహం పలించినట్లు వుంది.. టైమ్స్ పత్రక ద్వరా మీరు అసమర్థులు అనే విషయంతొ మిమ్ములను బాగానే రెచ్చగొట్టారు.. మిరు కోరుకొనే ప్రంపచ స్థాయి ఆర్థిక వేత్త బిరుదు వంటివి నోబుల్ బహుమతైనా సరే మీతెలివి తేటలను బట్టి యివ్వరు.. వాళ్లకు మీరు ఎంత వరకు ఉపయోగపడ్డారు మీజాతిని ఎంత వరకు వాళ్ళకు తాకట్టు పెట్టారు అనేవే వారికి కొలమానం.

 మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!

క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..

మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...

మన సాఫ్ట్‌వేరు రంగ మితృలకు అర్థమయ్యే ఉధాహరణ:

ఒక DELL Laptop కొనాలంటే  హైదరాబాద్ లో అయితే ఏమి చేస్తాము? యిప్పుడున్న స్వదేశీ సంస్థలైన ఏదైనా షాపింగ్ మాల్ కో వెళ్ళి, లేక సికింద్రాబాద్ లో చెన్నెయ్ ట్రేడ్ సెంటర్ కో వెళ్ళి లాప్‌టాప్ కొంటాం..
ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి  చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).

ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం  డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)

కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...