వీలుంటే నా నాలుగు లంకెలు ...

9, ఆగస్టు 2009, ఆదివారం

విజ్ఞానశాస్త్రంపై మతదాడి-3


ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుని రచన ''బ్రహ్మ సిద్ధాంతాన్ని'' పరిశీలిద్దాం. ఈయన గ్రహణాన్ని గూర్చి తన గ్రంథం మొదట్లో ఇలా రాశాడు. కొంతమంది గ్రహణానికి రాహువు శిరస్సు కారణం కాదని భావిస్తారు. ఇది చాలా బుద్ధిలేని ఆలోచన. ఎందుకంటే రాహువే గ్రహణానికి కారణం. రాహువు శిరస్సు వల్ల గ్రహణం కలగకపోతే బ్రాహ్మణులు పాటించే పూజలు మొదలైన ఆచారాలు భ్రమలు కావాలి. ప్రజలు ఈ ప్రసిద్ధ ఆచారాలను అనుసరిస్తున్నారు. కాబట్టి వరాహమిహిరుడు అను రచయితలు ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించడం మానుకోవాలి.'' గ్రంథం మొదట్లో ఈ భావనను వెలువరించిన రచయిత, కొన్ని అధ్యయనాల తర్వాత గ్రహణానికి కారణం 'సూర్య-చంద్ర-భూమి' సిద్ధాంతాన్ని ప్రవచిస్తాడు. చంద్రుని వ్యాసార్థాన్ని, భూమి నీడ వ్యాసార్థాన్ని లెక్కగడతాడు. ఇలా పరస్పర విరుద్ధ భావాలను రచయిత ఒకే గ్రంథంలో ఎందుకు ప్రకటించాడు? దీని కారణాన్ని 11వ శతాబ్దానికి చెందిన మధ్య ఆసియా యాత్రికుడు 'ఆల్‌ బెరూనీ' ఇలా ఊహిస్తాడు. ''బ్రహ్మగుప్తుడు గ్రహణాల విషయంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వెలువరించడానికి కారణం అతని భద్రతకు ఉన్న ప్రమాదమే అయి ఉంటుందని నా విశ్వాసం. అతని విజ్ఞానం, బుద్ధి కుశలత, నిండు యవ్వనం ఆ ప్రమాదం ముందు ఎందుకూ పనిరాకుండా పోయాయి. బ్రహ్మ సిద్ధాంతం రాసేనాటికి అతని వయస్సు 30 సంవత్సరాలే.'' బ్రహ్మగుప్తుడు ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలను వెలువరించడానికి ఆల్‌బెరూనీ పేర్కొన్నట్లు నిండు యవ్వనంలో ఉన్న అతనిపై మతనాయకులు వత్తిడి కాకుండా, వేరే కారణాన్ని ఊహించగలమా?' మరో ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఖగోళశాస్త్రాలపై తాను రచించిన 'బృహత్‌ సంహిత' అనే గ్రంథంలో గ్రహణాల వంటి అంశాలను సూర్య-భూమి-చంద్ర సిద్ధాంతంతో వివరిస్తాడు. అయితే, దానిలో ఒక అధ్యాయం పూర్తిగా మతనాయకులు ప్రవచించే మూఢనమ్మకాల వివరణకే కేటాయిస్తాడు. దీనిలో పురుషాంగానికి, పిల్లల పుట్టుకకు ఉన్న సంబంధాన్ని వర్ణించలేని భాషలో అసహ్యాంగా రాస్తాడు (గృహసంహిత 68వ పేజీ). ఏమిటీ అశాస్త్రీయ, అశ్లీల రాతలు? మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఈ విషయాలను ఎందుకు రాయవలసి వచ్చింది? మత నాయకుల భావాలు అవి ఎంత అశాస్త్రీయమైనా, వాటిని చేర్చకపోతే తన గ్రంథం వెలుగుచూడని పరిస్థితేనా దీనికి కారణం? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రాచీన కాలంలోనే కాదు.. నేడు కూడా మతోన్మాదులు శాస్త్ర విషయాల ప్రచారం అంటేనే భయపడిపోతున్నారు. దీనిని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఉదాహరణకు: ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పి.ఎం.భార్గవ 1975-77 మధ్య 'సైన్స్‌ పద్ధతి' అనే ఒక ఎగ్జిబిషన్‌ను తయారుచేశాడు. దాని ఆవిష్కరణ జరగక మునుపే వందలాది చిత్రాలను, పరిశోధనా పరికరాలతో కూడిన ఆ ఎగ్జిబిషన్‌ను కొందరు సంఘపరివార్‌ వాలంటీర్లు అతికొద్ది సమయంలో (1978 ఆగస్టులో) తరలించారు. ఆ విధంగా జాతీయస్థాయిలో ఈ ప్రదర్శనను అడ్డుకొన్నారు. ఫలితంగా, ఈ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు తరలించబడింది. ఆ హడావిడిలో అత్యంత విలువైన అనేక సైన్స్‌ పరికరాలు ధ్వంసమయ్యాయి. (ఏంజెల్స్‌, డెవిల్స్‌ అండ్‌ సైన్స్‌-పి.ఎం.భార్గవ, చందనా చక్రవర్తి 155 నుండి 169వ పేజీ). విజ్ఞాన శాస్త్ర పద్ధతి అంటే మతోన్మాదులకు ఎంత భయమో ఇది తెలుపుతుంది.

4 కామెంట్‌లు:

  1. అల్ బిరూనీ కూడా దేవుడిని నమ్మేవాడు. సైన్స్, మతం వేర్వేరు విషయాలని వాదించేవాడు.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత8/09/2009 10:04:00 PM

    ఇందుమూలం గా నాకు ఎమీ అర్థ మైందనటె మీకు ఆఫిసులో పని లేక చెత్తని అంతా పోగు చేసి బ్లాగు నింపుతున్నారు. ఒక్కసారి మీరు ఎమైనా ఎదైనా కనుగొనీ ఉంటె ఆ విషయాలను మాతో పంచుకునేది.

    రిప్లయితొలగించండి
  3. nuvvu panikoche vishayaalu emaina unte cheppu...

    రిప్లయితొలగించండి