వీలుంటే నా నాలుగు లంకెలు ...

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

103 వ్యాఖ్యలు
భారతదేశ శ్రామికులేకాక, అమెరికా శ్రామికులైనా, పాకిస్తాన్ శ్రామికులైనా మరేదేశ శ్రామికులైనా, ప్రపంచంలో వున్న శ్రామికులందరూ ఏకమై ఈ భూర్జువా భూస్వామ్యవర్గంపై సాయుధ పోరాటంతో సమసమాజం స్థాపించాలని భారతదేశ అతివాద కమ్యూనిస్ట్‌ల ఒక్కపటి అజెండా!

ప్రపంచ శ్రామికులారా ఏకంకండి!
తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

యిది యిప్పటి ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం. పోనీ తెలుగు (తెలంగాణ Vs తెలంగాణేతర) శ్రామికులు తన్నుకు చచ్చినా ఏమైనా విప్లవం వస్తుందా అంటే అదీ కాదు.

* దసరా పూట సెలవులు వచ్చేవి శ్రామికులకా? పరిశ్రామాధిపతులకా? యింత గొడవలు జరుగుతున్న సందర్భంలో పరిశ్రామాధిపతులు రిస్క్ రీసుకొని ప్రయాణాలు పెట్టుకోరు.. వారికి కావలసినప్పుడు సెలవులు తీసుకుంటారు. ఎంతోకాలంగా సెలవలకోసం వేచి చూస్తూ తల్లి తండ్రులదగ్గరకు పండగ వంకతోనైనా చూసి వస్తానికి వీలు చేయడం అంటే నా దృష్టిలో మానవత్వం లోపించడమే అవుతుంది.

* బస్సులపై జన్మస్థలాలకు దసరా సెలవలకు వెళ్ళేవారు బడుగులూ, మధ్య తరగతి జీవులు కాదా? - హైదారాబాద్ నుండి ఖరీదైనా కార్లలోనో, విమానాలలో వెళ్ళే బడా పారిశ్రామికాధిపతులకు ఏటువంటి ఆసౌకర్యం కలిగించనటువంటి ఈ రోకోలు ఎవరిపై ఎవరికోసం?

* నిన్న ఓ టీవీ ఛానల్‌లో C.P.I (ML) & పౌరహక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రెండు ప్రాంతాల ప్రజలు కొట్టుకొనేలా ప్రభుత్వమే కుట్రపన్నడంవలన ఈ పరిస్థితి దాపురించిందని వాధించారు. ప్రభుత్వాలు కుట్రపన్నుట సహజం అనుకుందాం. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ముందే తెలిసినా ఈ మేధావులకు, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా? లేక ఎలాగూ పాపం ప్రభుత్వానిదే కదా, ప్రజల మధ్య చిచ్చుతో చలికాగుతాగుతామనా?

* ప్రజలలో వ్యక్తిగత  రాగ ద్వేషాలాను రోజు రోజుకు పెంచుతూ, అమ్మనా బూతులూ తిడుతూ అదే తెలంగాణ సంస్కృతి అంటూ చేసే నాయకుడి తోక పట్టుకోని, తెలంగాణాలొ ఎంతో కొంత తమ క్యాడర్‌ని పెంచుకోవచ్చులే అనే తపనే తప్ప యింకొకటి కాదనిపిస్తుంది. మీడియా మొఘల్ మరియు ఆర్.ఎఫ్.సి అధినేత పై కట్టలు తెచ్చుకోనే ఆవేశంతో పాటలు, అదే తెలంగాణాలో మరో గులాబి మీడియా మొఘల్ పై సాఫ్ట్ కార్నర్!

 
* ఆంథ్రప్రాంత బడా పారిశ్రామికులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత బడావ్యాపారుల ఊసే వీరికి అక్కర్లేదు.. ఆంథ్రప్రాంతవాసులందరూ (ప్రజలందరూ) దోపిడీదారులూ / బడా వ్యాపారవేత్తలనే తలతిక్క విమర్శలకు వీరి స్పందన కరువు.. ఎవరైన గట్టిగా అడిగితే పెద్ద్ క్లాస్ పీకుతారు.. పలానా సందర్భంలో మేము ఖండించాము.. ఆంథ్రప్రాంతవాసులందరినీ దోపిడీ దారలనడం ఖండనార్హమని. కానీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సందర్భంలోను లౌడు స్పీకర్లలో చెప్పిన దాఖలాలు లేవు. తన్ని తరమండి, లుంగీలు ఊడపీకమని పిప్లవ సాహిత్య పంథాలో కవులు పులలో రూపంలో రెచ్చగొట్టడం అందరికీ తెలిసినదే...

* దోపిడీ వర్గంపై పోరుమాని, కేవలం తెలంగాణా ప్రాంతంకి ముఖ్యమంత్రి పదివి దక్కితే చాలు (పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో) తెలంగాణా ప్రజల జీవితాలు స్వర్గయుగంలోకి వెళ్ళిపోతాయి అనే భ్రమలు కల్పించడం ఏ సిథాంతం ప్రకారం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమే...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి సహజ లక్షణమయిన సాంఘీక అసమానతలను ఆసరాగా, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంలేక పోయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకపోయినా, వర్గపోరు మరిచి వ్యక్తిగత రగద్వేషాలను నూరిపోయిడం (వేరే ప్రాంత బడుగు మధ్య తరగతి జీవులపై కూడా) ద్వారా తెలంగాణ ప్రాంతం క్యాడర్ లో వచ్చు ఈ చైతన్యం వాపే అవుతుంది తప్ప బలుపు కాదని గ్రహిస్తే మంచిది. అంతే కాకుండా ఈ ఉధ్యమం ఏ సిథ్దాంత ప్రాతిపదికన చేసున్నదీ తెలియదు. కేవలం ఆంధ్రప్రాంతం వారిని తన్ని తరిమితే ఉధ్యోగవకాశాలు, అన్ని కష్టాలు తెలంగాణా వారికి తీరిపోతాయి అనే ఊహాజనిత భావంతో ప్రేరేపించి జనులను రచ్చగొట్టడం తప్ప యింకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలోని దోపిడీకి గురవుతున్నవారు వుండరనా వీరి అర్థం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు మూసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వంపై యిప్పుడు చేస్తున్న పోరాటాలు కొనసాగించ మంటారా? క్లారిటిగా ప్రజలకు వివరిస్తే బాగుండు.

ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన  ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!

ప్రత్యేక తెలంగాణా అవసరమా, కదా అనే ఆంశంపై రాసిన వ్యాసం కాదు.. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం  కోసం అలుపెరగకుండా పోరాడుతున్న కామ్రేడ్ల ఆలోచనా పంథాన్ని అవగహానా కోసం రాస్తున్నది....

27, ఆగస్టు 2011, శనివారం

సుష్మాస్వరాజ్ - నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు

14 వ్యాఖ్యలు
  • కనీసం సుష్మాస్వరాజ్ గారు అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ గారు వైఎస్‌ఆర్ కి కుప్పలుకుప్పలుగా రాసిన  బహిరంగ ఉత్తరాలు గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? ఆంటే దత్తాత్రేయగారి బహిరంగ ఉత్తరాలు ఉట్టిట్టివేనా?  వైఎస్‌ఆర్ చాలా నిజాయితీ పరుడని వారి అధిష్టానానికి అంతర్గతంగా తెలియజేశారా?
  • చనిపోయిన వారి గురించి చట్టం మాట్లాడకూడదంటే, భోఫోర్స్ కుంభకోణం గురించి చనిపోయిన రాజీవ్‌గాంధి పేరు మీరు మాటమాటికి ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
  • నాటి ఎమర్జన్సీ కాలంలో జరిగిన అరాచకాలనూ ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకండి ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా చనిపోయారుగా.
  • సుష్మారాజ్ గారి ఉపన్యాసం "నవ్విపోదురు జనులు నాకేంటి సిగ్గు" అన్నచందంగా వుంది.
  • అదీనూ పార్లమెంటు ప్రత్యేక సమావేశం లోకపాల్‌పై చర్చిస్తానికి, సందర్భరహితంగా వైఎస్‌ఆర్ అవినీతిని సమర్థిస్తూ, జగన్ అక్రమ వ్యాపారాలపై సిబిఐ దాడులను ఖండించడం అంటే... బరితెగించడమే అధికారం కోసం.

"The late YSR name in the FIR registered against Jagan in the alleged illegal wealth case is a clear example of the CBI being used for the selfish gains of the congress party."

విడ్డూరం:
  • మతుండి మాట్లాడుతున్నారో లేదో కూడా అనుమానం రాక మానదు. జలయజ్ఞం పనులలో చాలా అవినీతి జరిగిందనంటలో అతిశోయక్తి ఏమీవుండదేమో... అంతెందుకు, ఒక్కపట్టి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు నూరుకు పైగా బహిరంగ ఉత్తరాలు అప్పటి  రాయడం అందరికీ తెలిసినదే. ఆయన బ్రతికే వుండుంటే, కోర్టులూ యింత క్రీయాశీలంగా వుంటే, సిబీఐ యింత చలాకీగా వుండి వుంటే వైఎస్‌ఆర్ మొదటి ముద్దయే అనండంలో ఎవరకీ సందేహముండకర్లా! ఆంటే వైఎస్‌ఆర్ కాలంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో వున్న భాజపా అనవసర రాధాంతం చేసిందని ఒప్పుకుంటున్నారా? 
  • యిక జగన్ ఆస్తులు అన్యూహంగా పెరగడం, సాక్షిలో జలయజ్ఞం గుత్తేదార్ల అక్రమ పెట్టుబడుల గురించి భాజాపా మాజీ జాతీయ అధ్యక్షుడైన వెంకయ్యనాయిడుగారు ఎన్నిసార్లు విమర్శించి వున్నారో ఆయినికే గుర్తుండి వుండదు. అంటే భాజపా కి జగన్ గురించి బాగాతెలిసే వుండి కూడా "తప్పుడు ఆర్థిక నేరారోపణ" అని సుష్మాస్వరాజ్ గారు ఏలా అనగలిగారో?

    ఏదోరకంగా దేశంలో అధికారమే పరామావధిగా కాంగ్రేస్ పార్టీని మించి అవినీతి/అలౌకిక విధనాలతో సమతూగ గలిగే ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నీరూపించుకుంది యింకొకసారి పార్లమెంటు సాక్షిగా ఈరోజు.

    అలౌకిక విధానం
    కాంగ్రేస్:    మైనారిటీ మతస్థుల ఓట్లపై పిల్లి మొగ్గలు
    భాజాపా:  మెజారిటి  మతస్థుల ఓటర్లను ఏకంచేసి గుత్తంగా వారికి మళ్ళించుకోవడం

    అవినీతి:
    కాంగ్రేస్: అవినీతి గురించి యిక్కడ రాసేంత టైమ్ నాకులేదు..
    భాజపా: (నాకు గుర్తున్నవాటిలో కొన్ని..)
    • ఎల్.కె.అద్వాని - 1.8 అమెరికా డాలర్ల హవాలా కుంభకోణం
    • ప్రమోద్ మహాజన్ అంబానీల  స్నేహం - టెలికం రంగంలో అంబానీలకు గుత్తంగా లైసెన్స్‌లు కట్టబెట్టి దేశంలోనే అంబానీలను అత్యంత దనవంతులను చేసింది.
    • దక్షణ భారత దేశంలో ఏలాగైనా అధికారం చేపట్టాలని,  దక్షణ భారత దేశంలో మతతత్వానికి ఓట్లు పడవని ఒకటీ,రెండు సీట్లకంటే ఎక్కవరావని గ్రహించిన భాజపా, అవినీతికి కొమ్ముకాసి మైనింగ్ మాఫియా అయిన గాలి బ్రదర్స్ ని చేరదీసి వారి అవినీతి సొమ్ముతో కర్నాటకాని హస్తగతం చేసుకోకలిగింది. గాలి సోదర్లూ, యడ్యూరప్ప అవినీతి చేస్తున్నాడని తెలిసినా వారిని సిగ్గులేకుండా వెనకేసుకొచ్చింది కేవలం అధికార దాహార్థం.
    • యిప్పుడు అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌కి కూడా అమలు చేయాలునుకుంటుంది. సుష్మాస్వరాజ్ కు గాలి బ్రదర్శ్ నమ్మిన బంట్లని అందరకీ తెలిసిందే. వారి యింట్లో జరిగే చిన్నపాటి కార్యక్రమాలకు సైతం ఆమె హాజరు తప్పనిసరి. అదేవిధంగా గాలి సొదర్లు, జగన్ మధ్య లింకు గురించి వేరే చెప్పక్కర్లేదు. వీరి త్రికోణపు బంధంతో యిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపాలని ప్రయత్నంగా కనబడుతుంది.

    25, ఆగస్టు 2011, గురువారం

    అవినీతి కేసులకు చిరునామ - రామ్ జేఠ్మలాని: బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి

    9 వ్యాఖ్యలు
    రామ్ జేఠ్మలాని
            మన దేశంలో బయటకు వచ్చే అవినీతి శాతం చాలా  తక్కువ, వచ్చినా విచారణ అంఖం పూర్తి చేసుకొని కోర్టులవరకూ వచ్చేవి నామ మాత్రం. అటువంటి వాటిలో హైకోర్టులను దాటుకొని సుప్రీంకోర్టుకు వచ్చేవి బహు స్వల్పం.  అయితే అతిపెద్ద భారీ కుంభకోణం అయినా లేక ఏమైన సంచలన కేసయితే మాత్రం ప్రాస్‌క్యూషన్‌కి వ్యతిరేకంగా వాదిస్తానికి ఒక గంటకు లక్షలలో వసూలు చేస్తూ చేపట్టిన కేసులో నీతి, న్యాయం, ధర్మం, సామాజిక స్పృహ, దయ, జాలి లేకపోయినా పర్వాలేదు ఈ 88 సంవత్సరాల పేరొందిన సుప్రీమ్ కోర్టు న్యాయవాది రామ్ జేఠ్మలాని. న్యాయం ఎక్కడవుందో అక్కడ వాలిపోయి చట్టం ముందు అడ్డంగా అన్యాయానికి వకల్తా పుచ్చుకొని వాదించడం యితనిని మించినవారు ఎవరూలెరనుకుంటా.. అందుకనేమో అంత "డిమాండ్"

            అతని జీవితంలో ఎన్నో విధాలుగా కోర్టులను తప్పుదారి పట్టించి వున్నాడో ఈ మహానుభాహుడు! ఎందుకంటే, యితను చేపట్టిన కేసులు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగక మానదు...

    మచ్చుగా కొన్ని జేఠ్మలాని వాదించిన బడా అవినీతి కేసులు (చాలావరకు ఓడిపోయినవే)..

    • నేను ఈ పెద్దమనిషి ఇందిరా గాంధి హత్యా నింధితుల తరుపున వకల్తా పుచ్చుకున్నపట్టినుండి గమనిస్తూనే వున్నా. కేసు ఫలితం: ఓటమి, ఊరిశిక్ష. కాకపోతే చాలా సంవత్సరాలు పాటు సాగదీయగలిగాడు.
    • హర్షద్‌ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ (రూ. 4,000 కోట్లు).  కేసు ఫలితం: ఓటమి, శిక్ష ఖరారు. కారాగారంలోనే నిండితుడి మరణం.
    • కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోనం:  కేసు ఫలితం: ఓటమి, సంవత్సరంపాటు కఠినగారగార శిక్ష.
    • హజీ మస్తాన్ మిర్జా (ముంబాయి అండర్ వరల్డ్ డాన్):  కోర్టులలో కేసులు నడుస్తుండగానే హత్యకాబడ్డాడు.
    • అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి నిందుతుడు): కేసు ఫలితం: ఓటమి. ఉరి శిక్ష ఖరారు
    • లాల్ కృష్ణ అద్వాని (1.8 కోట్ల అమెరికన్ డాలర్ల హవాలా కుంభకోణం): ఫలితం: డైరీ ఒక్కటే సాక్ష్యంగా పరిణగించలేమని కేసు కొట్టివేయ బడినది.
    •  జెస్సికలా హత్య కేసు (మను శర్మ): ప్రజల నుండి అంతర్ఖాల ద్వారా/సంక్లిప్త సమాచారాల ద్వారా/వార్తా చానళ్ళ ద్వారా వచ్చిన వత్తిడి వలన మను శర్మ, వికాస యాదవ్ & అమర్‌దీప్ సింగ్ ప్రస్తుతం తీహార్ చెరసాలలో వున్నారు
    • సొహ్రాబుద్దిన్ బూటకపు ఎన్‌కౌంటర్ (అమిత్ షా): గుజరాత్ లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాని గుజరాత్ లో అడుగు పెట్టకుండా సుప్రీం తీర్పు...
    •  అమిత్ జోగి (ఛతిస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు) ముడుపుల కేసు: ఓటమి, జైలుపాలు.
    • 2G కుంభకోణం (కనిమోలి): కనీసం బెయిల్ కూడా యిప్పించే స్థితిలో లేడు ఈ లాయరు సార్!
    • వై.ఎస్.జగనమోహన్ రెడ్డి -   చీటింగ్, అక్రమ పెట్టుబడుల కేసు: ఈరోజే వాదనలు మెదలు సుప్రీంలో.. కనీసం వీరి వాదనలు వినే స్థితిలోనే లేదు..
    • యింకో చాలా ఆసక్తి కలిగే కేసు... మాజీ కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అవినీతి కేసు. మైనింగ్ కుంభకోణంలో లోకాయుక్త ఎంతో సవివరంగా ఆధారాలతో నిరూపించిన యితని అవినీతికి వకల్తా పుచ్చుకొని కర్నాటక హైకోర్టు కు బయలు దేరారు. ఏమవుతుందో చూడాలి.
    మీకింకా ఏమైనా అనుమానమా? పైన చెప్పిన అన్ని కేసుల పరిష్కారం ఏమయిందో చూసిన తరువాత కూడా!

    రామ్‌ జేఠ్మలాని కోరుకొనేవి:
    • పేరు ప్రఖ్యాతలు - మంచికో.. చెడుకో..(ఉచిత పబ్లిసిటి)
    • సంపద - బడా కుంభకోణాలలో అయితే రాబడి బాగా వుంటుంది (గంటకు లక్షల్లో). 
    • పై రెండిటికి సమర్థన:  భారత రాజ్యాంగంలోని..సహజ న్యాయసూత్రాలు అందరికి అందివ్వాలని (క్రూరులైనా, దుర్మార్గులైనా, ఉగ్రవాదులైనా, మతవాదులైనా ఒక్కటే)
    యింకో విచిత్రమేమిటంటే, భారతీయ జనతా పార్టీ కూడా యితని విషయంలో వింత ప్రవర్తన... 2004 ఎన్నికలలో అటల్ బిహారీ వాజపేయ్ కి వ్యతిరేకంగా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన యితనిని, 2010 లో భాజాపా తరుపున రాజ్య సభకు పంపింది యిటువండి వాడిని.

    దక్షణ  భారతంలో బారీ అవినీతి కేసులన్నింటినీ  యితనే వాదిస్తున్నాడన్నమాట..
    • కనిమోళి టీవీ - అక్రమ పెట్టుబడులు (తమిళనాడు)
    • మైనింగ్ కుంభకోణం (కర్నాటక)
    • ఛీటింగ్, అక్రమ పెట్టుబడులు - సాక్షి, సండూర్ ( ఆంధ్రప్రదేశ్)

    నా ఉధేశం ప్రకారం యిటువంటి వారిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, అతను తన క్లైంట్స్‌ని రక్షించుకొనుటకు ఎన్నిసార్లు తప్పుడు వాదనలు, అబద్దాల, కోర్టులను తప్పిదారి పట్టంచి వుండోచ్చు!

    24, ఆగస్టు 2011, బుధవారం

    భిన్నత్వంలో... ఏకత్వం... అంటే యిదే మన... భారతదేశం..

    2 వ్యాఖ్యలు
    ఈ ఫోటో ఎవరు ఎక్కడ తీసారో తెలియదు గాని (బహుశా, మొన్న కృష్ణాష్టమికి బడులలో పెట్టిన వస్త్రాదరణ పోటీలకనుకుంట), ఫేస్‌బుక్ లో బాగా చలామణిలో వున్న ఈ ఫోటో నిజంగా భారతదేశంలో వున్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిభింబం...


    ఫేస్‌బుక్ సౌజన్యంతో