వీలుంటే నా నాలుగు లంకెలు ...

18, మే 2011, బుధవారం

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

1 వ్యాఖ్యలు
శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు.

ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బెంగాల్లో వామపక్షాలకు కోటీ 96 లక్షల ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల కంటే ఇవి 11 లక్షలు అధికం. వామపక్ష కూటమి 41 శాతానికి పైగా ఓట్లను సాధించింది. 2009 ఎన్నికల అనంతరం చేపట్టిన దిద్దుబాటు చర్యల వల్లే పార్టీ ఓట్లు పెరిగాయి. ఐతే ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికల్లో 34 లక్షల ఓట్లు అధికంగా లభించాయి. మార్పు కోరుకున్న ప్రజల మనసులను మేం పూర్తిగా మార్చలేకపోయాం. ప్రజలతో మరింతగా మమేకమై, వారి హక్కుల రక్షణ కోసం సిపిఎం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది ' అని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోనే రాష్ట్రంలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు.

30, ఏప్రిల్ 2011, శనివారం

హిందూత్వవాదులారా కళ్ళుతెరవండి!

51 వ్యాఖ్యలు
     యిప్పటి అంచనాల ప్రకారం, సాయిబాబా ట్రస్ట్ విరాళాలు/సంపాదన లో ఒకటి లేక రెండు శాతం కన్నా ప్రజావశరాలకోసం ఖర్చుచేసినట్లు లేదు. దాతలు (భక్తులు కానివారుకూడా సమాజసేవకోసం ఉపయోగపడతాయని) యిచ్చిన విరాళాలను సమాజసేవకోసం కాకుండా స్థిర చర ఆస్తులగా మలుచుకొని ఆసోమ్మును బ్యాంకులో వేసుకుంటే వచ్చేవడ్డీకన్నా తక్కువమోత్తంలోనే 'సమాజసేవ‌' వున్నట్లు అర్ధంచేసుకోవడానికి ఆడిటర్‌కూడా అవసరం లేదు. ఐదారు జిల్లాలలో (మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి) ఈ సేవా కార్యక్రమాలను మొత్తం లోకకల్యాణము నెరవేర్చడంగా చిత్రీకరించడం చాలా దారుణం. రాబడి గాని, ఖర్చు గాని లెక్కాలేదు తొక్కలేదు. ప్రతీపైసాకి లెక్కవుందంటారు కాని చూపరు. ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి  తెలుపుతుంటామంటారు. ప్రభూత్వమూ ప్రజలకు తెలపదు. ప్రభుత్వముకు అంతా భాద్యతే వుంటే ప్రశాంతి నిలయంలో 1993 నాటి కాల్పుల కేసుపై యిప్పటికీ చార్జ్‌షీట్ పెట్టకుండా వుండేదా? కాల్పులు, చనిపోవడం మిధ్యకాదుకదా!

    ట్రస్ట్‌ దగ్గర వున్న సొమ్ము బాబా మహిమలతో సృష్టించినది కాదు ప్రజల డబ్బే. సాయిబాబా కష్టపడి సంపాదించినది కాదు. కేవలం విరాళాలతో సేకరించినదేననటం ఎవరూ కాదనలేనటువంటి నిజం. నిజంగా మహిమలుంటే విరాళాలు సేకరించడం దేనికి? మహిమలతో గాలినుంచి బంగారం సృష్టించేబదులు, పేదప్రజలకు కనీసం ఒకపూట ఆకలి తీర్చలేకపోయారు? అకాలవర్షాలతో రైతన్న నష్టాలబారి చేసుకున్న ఆత్మహత్యలను ఆపలేకపోయరు కనీసం బాబాగారు అవతారపురుషిడిగా ప్రకటించుకున్నరుకదా వర్ణుడితో చెప్పి ఆపించవచ్చుకదా!

     ఇటువంటి నీచపు సామ్రాజ్యాన్ని హిందూ ధార్మికతతో ముడిపెడుతున్న వారు హిందూత్వవాదులు కాదు వారు కుహానా హిందూత్వవాదులే. యిది నాస్థికులుగాని/వామపక్షవాదులుగాని హిందూత్వంపై చేస్తున్న దాడికాదు. హిందూధార్మిక బావజాలంతో /బాబాల పేరుతో అమాయక ప్రజలతో వ్యాపారం చేసుకుంటున్న వారే.

20, ఏప్రిల్ 2011, బుధవారం

సాయిబాబా! భక్తులకోసం కనీసం కళ్ళుతెరవాలి!

3 వ్యాఖ్యలు
బాబాగారి దయనీయమైన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మానవత్వం కలిగినవారికెవరికైనా ఆందోళనకరమే. కాని కొంతమంది భక్తులు మాత్రం మానవులకు బాబాగారి పెట్టిన ఒక పరిక్షని నీచపు మాటలు మాట్లాడుతున్నారు.  మోన్నటివరకూ వీలుకుర్చీలో పాకుంటూ, యిన్ని రోజులు చావుబతుకులమధ్య సామాన్య మానవుడవలే కష్టాలు పడుతుంటే, కడుపుతర్రుక్కుపోతుంది ఏ మనిషికైనా.

బాబా, సాయి బాబా, నీ శరీరానికి పడుతున్న కష్టం ఓ మానవ జీవిగా చూడలేకపోతున్నారు నీ భక్తులు కానివారుకూడా. కొంతమంది నీభక్తులైతే నిద్రాహారాలు మాని కుసించినసిస్తున్నారు. కనీసం వారికోసమైనా నీవు లేవాలే. నిల్చోని పరిగెత్తాలే (సారీ, నిలబడమనడం కూడా అత్యాశే అనుకుంటా) కనీసం కళ్ళుతెరువు బాబా. నీ అసలైన మహిమలు చూపించ్చే సమయం ఆసన్నమైనది. నీ మహిమలు నమ్మని జీవులకు కూడా కనువిప్పుకలుగుతుంది. లేకపోతే నిన్ను, నీమహిమలను నమ్మిన భక్తులకు నోటిమాట రాదు బాబా.

(కామెంట్స్ వ్రాయాలునుకుంటే ఒక షరతు! బాబా గారి మహిమలు గురించి మాత్రమే వ్రాయండి. బాబాగారు చేసిన 'సేవలు‌' మీ మీబ్లాగ్గులో విస్త్రుతంగా విశ్లేషించుకోండి)