వీలుంటే నా నాలుగు లంకెలు ...

18, మే 2011, బుధవారం

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు.

ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బెంగాల్లో వామపక్షాలకు కోటీ 96 లక్షల ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల కంటే ఇవి 11 లక్షలు అధికం. వామపక్ష కూటమి 41 శాతానికి పైగా ఓట్లను సాధించింది. 2009 ఎన్నికల అనంతరం చేపట్టిన దిద్దుబాటు చర్యల వల్లే పార్టీ ఓట్లు పెరిగాయి. ఐతే ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికల్లో 34 లక్షల ఓట్లు అధికంగా లభించాయి. మార్పు కోరుకున్న ప్రజల మనసులను మేం పూర్తిగా మార్చలేకపోయాం. ప్రజలతో మరింతగా మమేకమై, వారి హక్కుల రక్షణ కోసం సిపిఎం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది ' అని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోనే రాష్ట్రంలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు.

1 కామెంట్‌:

  1. అజ్ఞాత5/18/2011 05:46:00 PM

    Left lost all its credibility. People rejected it every where. They are surviving by appeasing minorities and allowing illegal minorities from Bangladesh.

    Internet shattered the myth of Left. Before Internet the Left controlled the Media fooled the people.

    రిప్లయితొలగించండి