వీలుంటే నా నాలుగు లంకెలు ...

5, ఫిబ్రవరి 2022, శనివారం

Constitution: రాజ్యాంగ సవరణ/మార్పు అనైతికమా?

రాజ్యాంగం ఏమైనా మత గ్రంథమా?

తప్పులున్నాయని/అసమానతలు వున్నాయి అని తెలిసినా పవిత్రంగా చూసుకోవడానికి? అదేమన్నా పైనుండి ఊడిపడిందా? రాజ్యాంగం అనేది దేశప్రజలందరీ ఓ కామన్ ఎగ్రిమెంట్.. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.. దానిలో తప్పేంటి? ఉదాహరణకు, ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కార్పోరేట్ అవినీతి, దోపిడికి హద్దులు లేకుండా పోయింది, దానికి కారణం రాజ్యాంగం తప్పుకాదు అని కొందరన్నొచ్చు.. కానీ అధికారం లో వున్న వారికి రాజ్యాంగం అమలు చేయకుండా వుండే వెసులుబాటు రాజ్యాంగం లో వుండ బట్టే కదా దేశంలో యింత అవినీతి పెరగడానికి కారణం.. అలానే, ప్రస్తుత రాజ్యంగం వివిధ రాష్ట్రాల మధ్య కేంద్రం వివిక్ష ధోరణి అవలబించకుండా కట్టడి చెయ్యడానికి కుదరడం లేదు. అలా చాలానే వున్నాయి..

మరి ఇలానే కంటున్యూ చెయ్యాలా?

లౌకిక ప్రజతంత్ర సమాన హక్కులను రాజ్యంగంలో వుంచకూడదు అని ఎవరైన అంటే తప్పు అవుతుంది గాని, రాజ్యాంగంలో వున్న లొసులుగులు తీసేయ్యాలి అంటే అహ్వానించాల్సిందే… మరి ఈ అసమానతలను ఇలానే కంటున్యూ చెయ్యలసిందేనా? రాజ్యాంగ సవరణ అంటే అదేదో అంబెద్కర్ ని అవమానించినట్లు అంబెద్కర వాదులు, బిజెపి వారు ఎలా ముద్ర వేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..

కెసిఅర్ అన్నదాంట్లో స్పస్టత లేదు, రాజ్యాంగం లో ఏ అంశాలు మార్చాలో అతను చెప్పనేలేదు.. సో .. ఖండించడంలో అర్థం లేదు.. రాజ్యాంగంలో కొన్ని అంశాలు అమలులో లొసుగులు వున్నాయి.. అవి సరి చెయ్యడానికై మార్చుదాం అని కూడా అని వుండచ్చు కదా? అటివంటి మార్పులనూ కూడా వ్యతిరేకిద్దామా?

అసలు జరగవలసిన చర్చను దారి మళ్లిస్తానికి బిజెపి వేసిన ఎత్తుగడ?

కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అసమానతల పాలనలో గత 8 సంవత్సరాలలో తెలంగాణా ఎలా నష్ట పోయిందో కుండ బద్దలు కొట్టినట్లయి జనాలకు బాగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు (గత 7 బడ్జట్ లను, మోడీ చేసిన అన్నింటిని సపోర్ట్ చేసాడు అదే వేరే విషయం, అది అతని రాజకీయ ఎత్తుగడ కావచ్చు). ఈ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో బిజెపి లేదు.. దాంతొ ‘అంబెద్కర్’ కి అవమానం పేరుమీద రచ్చ చేస్తుంది.. ఆ వలలో అంబెద్కర్ వాదూలు పడటం విచారకరం.. విచిత్రం ఏమిటంటే 2002 సం వరకు బిజెపి అసలు మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్నీ గుర్తించలేదు. వాజెపెయి అయితే రాజ్యంగం మార్పు పై ఒక కమిటీ కూడా వేసాడు, మరి అప్పుడు అంబెద్కర్ ని అవమానించడం కనబడని బిజెపికి ఇప్పుడు ఎలా కనబడుతుంది?

మార్పు అనివార్యం, మార్పును అహ్వానించాల్సిందే..

సామాజిక దృక్పథం, సామాజిక అవగాహన, జీవ పరిణామక్రమాలు డార్విన్, మార్క్స్ చెప్పినట్లు నిరంతరం మారుతూనే వుంటాయి. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాలిసిందే! అంబెద్కర్ అధ్యక్ష వహించిన కమిటి రచించిన మన రాజ్యాంగం లో స్పష్టంగా 2/3 మెజారిటి వుంటే రాజ్యాంగం ని మార్చుకోవచ్చు అని రాసివుంది.. రాజ్యాంగం మార్చొద్దు అని ఎవరైనా అంటే వారు నిజమైన అంబెద్కర్ ద్రోహులవుతారు..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అల్వేస్ అనే భావన నుండి భయట పడాలి.. సామాజికి మార్పును ఎవరు ఆపినా ఆగేది కాదు!

వాసవ్య యాగాటి..
2022-02-05

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి