వీలుంటే నా నాలుగు లంకెలు ...

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

త్వరగా గడ్డకట్టేది చల్లటి నీళ్లా.. వేడి నీళ్లా?

0 వ్యాఖ్యలు
నీరు
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?... ఆగండాగండి.
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.
రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.
ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.
Media captionనీటి గురించి మీకు తెలియని విషయాలు
మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.
తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.
శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.
నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.
మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.
ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.
గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా నీళ్లు ప్రవహించగలవు. అందువల్లే మన శరీరంలోని పై భాగంలో ఉన్న మెదుడుకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
భూమి నుంచి మొక్కలు నీటిని గ్రహిస్తున్నాయి. మరో విషయం... మన సౌరవ్యవస్థలో చాలా చోట్ల నీటి ఆనవాళ్లు ఉన్నాయి.
నీటితో ఉన్న గ్రహం మనదొక్కటే అని ఇన్నాళ్లు భావించాం.
కానీ, నిజానికి సౌర వ్యవస్థ నీటితోనే ఉంది. చంద్రుడు, అంగాకరకుడు, ప్లూటో గ్రహాల్లోనూ నీటి ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల కనిపెట్టాం.
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.
నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.

Source: BBC Telugu

అపోలో 11: చంద్రునిపై మనిషి కాలుమోపి 50 ఏళ్లు... తర్వాత మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు

0 వ్యాఖ్యలు
అపోలోImage copyrightGETTY IMAGES
"మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు" చంద్రుని మీద కాలుమోపిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్న మాట ఇది.
చంద్రుని మీద మానవుడు తొలిసారి కాలుమోపి యాభై ఏళ్లవుతోంది. 1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగుపెట్టారు. శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయం అది.
మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపిన ఒక మైలురాయిగా అది నిలిచిపోయింది.
ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అపోలో ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు 200 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది.
ఆ ప్రాజెక్టు ఫలితం మరెన్నో విజయాలకు, ఆవిష్కరణలకు నాంది పలికింది. ఆ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సాంకేతికత ప్రస్తుతం మనకు నిజజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. అందులో కొన్నింటిని చూద్దాం.
డస్ట్‌బస్టర్ అనే తొలి వాక్యూమ్ క్లీనర్Image copyrightB&D
చిత్రం శీర్షికడస్ట్‌బస్టర్ అనే తొలి వాక్యూమ్ క్లీనర్ 1979లో మార్కెట్‌లోకి వచ్చింది.

1. వాక్యూమ్ క్లీనర్

బ్లాక్ అండ్ డెకర్ అనే అమెరికన్ సంస్థ 1961లో ఓ డ్రిల్లింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. అదే సంస్థ అపోలో స్పేస్‌క్రాఫ్ట్ కోసం నాసాకు ఒక ప్రత్యేక డ్రిల్‌ను తయారు చేసి ఇచ్చింది.
ఆ డ్రిల్ కోసం ప్రత్యేక ఇంజిన్, బ్యాటరీలను రూపొందించడం ద్వారా పొందిన అనుభవంతో బ్లాక్ అండ్ డెకర్ సంస్థ ఆ తర్వాత పలు రకాల ఉపకరణాలను తీసుకొచ్చింది. అందులో 1979లో వచ్చిన తొలి కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ 'డస్ట్‌బస్టర్' ఒకటి.
30 ఏళ్లలో 15 కోట్ల డస్ట్‌బస్టర్ వాక్యూమ్ క్లీనర్లు అమ్ముడుపోయాయి.
బజ్ ఆల్డ్రిన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికబజ్ ఆల్డ్రిన్

2. ఆధునిక గడియారాలు

అపోలో లాంటి అంతరిక్ష ప్రాజెక్టులకు సమయంలో కచ్చితత్వం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఒక్క సెకను అటు ఇటు అయినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది.
అందుకే, నాసాకు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే గడియారాలు అవసరమయ్యాయి. ఆ అవసరం కారణంగానే అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే అత్యాధునిక గడియారాలు రూపుదిద్దుకున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అపోలో 11 మిషన్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ తోటి వ్యోమగామి, చంద్రుడిపై నడిచిన బజ్ ఆల్డ్రిన్ ధరించిన "పాత రకం" చేతి గడియారానికి భారీ ప్రాచుర్యం లభించింది.
స్విమ్మింగ్ పూల్Image copyrightGETTY IMAGES

3. శుభ్రమైన నీరు

అపోలో అంతరిక్ష నౌకలో ఉపయోగించిన నీటి శుద్దీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం నీటి వనరుల్లో బ్యాక్టీరియా, వైరస్‌లను, ఆల్గేలను చంపడానికి ఉపయోగిస్తున్నారు.
అపోలో మిషన్‌ కారణంగా క్లోరిన్-ఫ్రీ నీటి శుద్ధీకరణ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సిల్వర్ అయాన్లను నీటిలోకి పంపి బ్యాక్టీరియాను, ఆల్గేలను నశింపజేస్తారు.
ఈ సాంకేతికతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈత కొలనులు, నీటి ఫౌంటెయిన్లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
స్పేస్ సూట్Image copyrightGETTY IMAGES

4. మన్నికైన షూలు

చంద్రునిపై నడిచే సమయంలో అపోలో సిబ్బందికి రక్షణ కల్పించేందుకు 1965లో రూపొందించిన మోడల్ సూట్లనే ప్రస్తుత వ్యోమగాములు కూడా వినియోగిస్తున్నారు.
అంతేకాదు, ఆ స్పేస్ సూట్ల తయారీ కోసం వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం బూట్ల తయారీలోనూ అనేక మార్పులకు ప్రేరణగా నిలిచింది. దాని ఫలితంగానే గత కొన్ని దశాబ్దాల కాలంలో అత్యంత సౌకర్యవంతమైన, మన్నికైన, చెమటను శోషించుకోగల బూట్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
అగ్నిమాపక దళంImage copyrightGETTY IMAGES

5. అగ్ని నిరోధక బట్టలు

1967లో నాసా శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అమెరికా అంతరిక్ష కార్యక్రమాన్ని గందరగోళానికి గురిచేసింది.
కానీ, ఆ ఘటన తర్వాత నాసా అత్యాధునిక అగ్ని-నిరోధక దుస్తులను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆ రకం దుస్తులను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
అప్పట్లో వ్యోమగాముల విశ్రాంతి కోసం వినియోగించిన శీతలీకరణ వ్యవస్థనే ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తోంది. ప్రస్తుతం మల్టిపుల్ స్క్లెరోసిస్ రోగులతో సహా అందరికీ ఉపయోగపడుతోంది.
గుండెImage copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికనాసా అభివృద్ధి చేసిన సాంకేతికతను స్ఫూర్తిగా తీసుకుని డీఫిబ్రిలేటర్స్ పరికరాలను తయారు చేస్తున్నారు

6. గుండె వైద్యం

గుండె ప్రమాదకరస్థాయిలో అసాధారణ వేగంతో కొట్టుకునేవారికి వైద్యం అందించేందుకు డీఫిబ్రిలేటర్స్ అనే పరికరాలను ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. అపోలో ప్రయోగ సమయంలో నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఈ పరికరాలలో వాడుతున్నారు.
మొదటిసారిగా 1980లలో ఈ పరికరాలు వాడుకలోకి వచ్చాయి.
ఫ్రీజ్ డ్రైయింగ్ విధానం అపోలో తర్వాత పెద్దఎత్తున వినియోగంలోకి వచ్చింది.Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికఫ్రీజ్ డ్రైయింగ్ విధానం అపోలో తర్వాత పెద్దఎత్తున వినియోగంలోకి వచ్చింది

7. ఆహార భద్రత

చంద్రుడి మీద కాలుమోపాలన్న తపనలో, స్పేస్ క్రాఫ్ట్‌లో స్థలాన్ని ఆదా చేసేందుకు, వాటిని వీలైనంత తేలికగా తయారు చేసేందుకు నాసా అనేక మార్గాల గురించి ఆలోచించాల్సి వచ్చింది.
ఆ క్రమంలో వ్యోమగాముల రక్షణ అవసరాలతో పాటు, వారు తినే ఆహారంపై కూడా పరిశోధనలు జరిగాయి.
అందుకు ఒక పరిష్కారం కనుగొన్నారు. అదే ఫ్రీజ్- డ్రైయింగ్ ప్రక్రియ. అందులో తాజాగా వండిన ఆహార పదార్థాల నుంచి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలకు కాసిన్ని వేడి నీళ్లు కలిపి తినేయొచ్చు.
ఈ విధానం అపోలో వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడింది.
గ్రీసులో శరణార్థి బాలికకు స్పేస్ బ్లాంకెట్ కప్పారు.Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికగ్రీసులో శరణార్థి బాలికకు కప్పిన స్పేస్ బ్లాంకెట్

8. సర్వైవల్ బ్లాంకెట్

ఎండ నుంచి అపోలో స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలను రక్షించేందుకు నాసా స్పేస్ బ్లాంకెట్‌ (షైనింగ్ ఇన్సులేటర్)ను వాడింది. ప్లాస్టిక్, ఫిల్మ్, అల్యూమినియంతో దానిని తయారు చేసింది.
ప్రస్తుతం అత్యవసర సమయాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న సర్వైవల్ బ్లాంకెట్లు ఆ స్పేస్ బ్లాంకెట్‌ను స్ఫూర్తిగా తీసుకుని వాడుతున్నవే.
అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఈ కవర్లను చుడతారు. శరీరం నుంచి ఉష్ణం కోల్పోకుండా ఈ కవర్ కాపాడుతుంది.
అంటే, నాసా సాంకేతిక పరిజ్ఞానం అత్యవసర దుప్పట్లను సృష్టించడానికి ఉపయోగపడింది. పరుగు పందేలు జరిగినప్పుడు కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
రోగులు, సిబ్బంది పరిస్థితులను మెరుగుపరచడానికి ఆసుపత్రుల్లోనూ సాంకేతికతను వినియోగిస్తారు.
Source: BBC Telugu

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా? కుట్ర సిద్ధాంతకర్తల వాదనలు ఏమిటి? వాటికి నాసా జవాబులు ఏమిటి?

0 వ్యాఖ్యలు

అపోలో మిషన్Image copyrightNASA

1969 జులై 20.. కమాండర్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ - ఇద్దరూ అమెరికా వ్యోమగాములు - అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్‌ను చంద్రుడి మీద దించారు.
కొన్ని గంటల తర్వాత.. చంద్రుడి మీద నడిచిన మొట్టమొదటి మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిలిచారు. ఆ సంఘటనను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో అదొకటి.
చంద్రుడి మీదకు మనుషులు వెళ్లారనటానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నా కూడా.. కొంతమంది దీనిని విశ్వసించరు.
చంద్రుడి మీదకు వెళ్లటం కట్టుకథ అనే వాళ్లని 'కుట్ర సిద్ధాంతకర్తలు'గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే.. అదంతా నాసా ఆడిన నాటకమని వాళ్లు నమ్ముతారు.
ఈ కుట్ర సిద్ధాంతకర్తల వాదనలను కొట్టివేయటానికి.. శాస్త్రవేత్తలు, నాసా నిపుణులు తరచుగా ఆధారాలు ముందుపెట్టాల్సి వస్తుంది.
మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవాళ్లు చూపే కొన్ని కారణాలు.. అవి ఎలా తప్పో చెప్పే వివరాలు ఇవి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES

నింగిలో నక్షత్రాలు లేవు

అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద నుంచి తీసిన ఫొటోలలో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు మద్దతుగా ప్రస్తావిస్తుంటారు కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు.
'చంద్రుడి మీద గాలి లేదు. దానర్థం.. ఆకాశం నల్లగా ఉంటుంది. కానీ.. నక్షత్రాలు లేకపోవటం విచిత్రమైన విషయం' అని కొందరు అంటుంటారు.
దీనికి జవాబు ఏమిటంటే.. నక్షత్రాలు ఉన్నాయి.. కానీ అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నాయి.
మనం ఏదైనా ఫొటో తీసేటపుడు.. ఫోకస్ దేని మీద ఉండాలో మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి.. కెమెరా చంద్రుడి మీద ఉన్న వ్యోమగాముల మీద ఫోకస్ చేస్తుంది కానీ.. నక్షత్రాల మీద కాదు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది.

అపోలో మిషన్Image copyrightNASA

జెండా రెపరెపలు

చంద్రుడి మీద అమెరికా జెండా చాలా ప్రఖ్యాతి గాంచింది. ఆ క్షణంలో తీసిన ఫొటోల్లో ఆ జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే.. చంద్రుడి మీద గాలి లేదు కాబట్టి గాలి వీచే అవకాశం ఉండదని.. అలాంటపుడు జెండా ఎలా రెపరెపలాడుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు.
వాస్తవం ఏమిటంటే.. ఆ జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అది కదలటం లేదు. ఆ జెండాను చంద్రుడి ఉపరితలం మీద పాతినపుడు.. జెండా కదిలి ఉంటుంది. అలా వంగిన రూపం అలాగే ఉండి ఉంటుంది.
వీడియోల్లో కూడా జెండా ముందుకు, వెనుకకు గాలిలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. వ్యోమగాములు ఆ జెండాను నాటుతున్నపుడు.. చంద్రుడి మట్టి మీద రంధ్రం సరిగ్గా చేయటానికి వ్యోమగాములు దానిని ముందుకు వెనుకకు తిప్పారు. దానివల్ల జెండాలో కదలికలు ఏర్పడ్డాయి.

అపోలో మిషన్Image copyrightNASA
చిత్రం శీర్షికభూమి చుట్టూ ఉండే అలెన్ బెల్టులు అని పిలిచే భారీ అణుధార్మిక వలయాలను 1958లో గుర్తించారు

అది అసాధ్యం కాదు

కొంతమంది అంతరిక్ష నౌకను.. చంద్రుడి మీదకు ప్రయాణాలను విశ్వసించరు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలెన్ బెల్టులు అనే భారీ అణుధార్మిక వలయాల వల్ల అసలు ఆ ప్రయాణమే అసాధ్యమని వారు నమ్ముతారు.
మనుషులు ఈ వలయాలను దాటి వెళ్లలేరని.. అలా వెళ్తే ప్రాణాంతక మోతాదులో అణుధార్మికతకు గురౌతారని వాదిస్తుంటారు.
కొన్ని గంటల వ్యవధిలో 200 నుంచి 1,000 'రాడ్ల' అణుధార్మికతకు గురైనప్పుడు మాత్రమే అణుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది.
అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు.. ఈ వాన్ అలెన్ వలయాల పరిధిలో రెండు గంటల కన్నా తక్కువ సమయమే ప్రయాణించారు. కాబట్టి.. వాళ్లు కేవలం 18 రాడ్ల అణుధార్మికతకు గురై ఉంటారని అంచనా. అది సురక్షితమైన పరిమితి లోపలే ఉంది.
అంతరిక్ష నౌకకు సరైన రక్షణ ఉండేలా నాసా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి.. 12 రోజుల ప్రయాణంలో సగటు అణుధార్మిక మోతాదు 0.18 రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్-రే తీసుకున్నపుడు గురయ్యే అణుధార్మికతతో సమానం.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షికచంద్రుడి మీద నుంచి 382 కిలోల రాళ్లను భూమికి తెచ్చారు

చంద్రుడి రాళ్లు

ఇక చంద్రుడి మీదకు మనిషి వెళ్లివచ్చాడు అనటానికి మరో సాక్ష్యం.. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీది నుంచి రాళ్లు తీసుకురావటం.
వాళ్లు చంద్రుడి మీద నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిని చాలా దేశాలతో పంచుకున్నారు. దశాబ్దాల పాటు వాటి మీద అధ్యయనాలు జరిగాయి.
ఆ పరీక్షలన్నీ కూడా.. ఆ రాళ్లు నిజంగా చంద్రుడి మీది నుంచే వచ్చాయని నిర్ధారించాయి.

అపోలో మిషన్Image copyrightNASA

చంద్రుడి మీద పాదముద్రలు

చంద్రుడి మీదకు వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యాయో ఇప్పడు కూడా అంతరిక్షం నుంచి కనిపిస్తుంటాయి. అంతేకాదు.. చంద్రుడి ఉపరితలం మీద నడిచిన వ్యోమగాముల పాదముద్రలను కూడా అంతరిక్షం నుంచి చూడవచ్చు.
భూమి ఉపరితలం మీద.. పాదముద్రలను కానీ ఇతర గుర్తులు కానీ గాలులతో, వర్షాలతో.. లేదంటే వాతావరణం, సముద్రాలు, జీవం ఉన్న గ్రహాల మీద సంభవించే ఉపరితల కార్యకలాపాలతో సులభంగా చెరిగిపోతాయి.
అయితే.. చంద్రుడి మీద ఇటువంటి పరిస్థితులేవీ లేవు. అందువల్ల అక్కడ పాదముద్రలు ఇంకా అలాగే ఉన్నాయి.
2009 సంవత్సరం నుంచీ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న నాసా లూనార్ రీకన్నియసాన్స్ ఆర్బిటర్.. అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాలనూ ఫొటోలు తీసింది.
ఆ ఫొటోల్లో అపోలో అంతరిక్ష నౌక దిగిన కచ్చితమైన ప్రదేశాలే కాదు.. చంద్రుడి మీద అన్వేషణ జరుపుతూ సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
చైనా, ఇండియా, జపాన్‌లు స్వతంత్రంగా చంద్రుడి మీదకు ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలు కూడా.. అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.

అపోలో మిషన్Image copyrightGETTY IMAGES/ SPACE FRONTIERS

చంద్రుడి మీద వదిలివచ్చిన పరికరాలు

చంద్రుడి మీదకు వెళ్లింది కేవలం వినోదం కోసం కాదు. శాస్త్రపరిశోధనలకు ఒక పెద్ద అవకాశమది.
చంద్రుడి గురించి మరింత తెలుసుకోవటం కోసం అనేక సాంకేతిక పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో కొన్నిటిని చంద్రుడి మీదే వదిలిపెట్టి వచ్చారు.
అలా వదిలి వచ్చిన పరికరాల్లో రెట్రోరిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి. ఈ లూనార్ రిఫ్లెక్టర్లు.. 1969 నుంచి భూమికి - చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితంగా కొలవటానికి వీలుకల్పించాయి. వాటిలో చాలా రిఫ్లెక్టర్లు ఈనాటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అపోలో 11, 14, 15 వ్యోమగాములతో పాటు.. సోవియట్ ల్యూనోకోడ్-2 రోవర్ కూడా నెలకొల్పిన ప్రాంతాల నుంచి ఈ రిఫ్లెక్టర్లు లేజర్లను పంపిస్తూ ఉన్నాయి.
మరో ప్రయోగం లూనార్ సర్ఫేస్ మాగ్నెటోమీటర్ (ఎల్ఎస్ఎం). చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలవటానికి దీనిని డిజైన్ చేశారు. చంద్రుడి ఉపరితలం మీద అయస్కాంతీకృత లక్షణాలు ఉన్నాయని.. కానీ ఆ అయస్కాంతతత్వం చంద్రుడి చుట్టూ ఒకే తరహాలో లేదని అది నిర్ధారించింది.
ఈ ప్రయోగాలతో పాటు ఇతర ప్రయోగాలతో సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.