వీలుంటే నా నాలుగు లంకెలు ...

14, ఆగస్టు 2013, బుధవారం

కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం ముసుగులు తొలగిపోతున్నాయ్..

0 వ్యాఖ్యలు
ఈ రోజు టివి 9 న్యూస్ వాచ్ లో 'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి
కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం యొక్క ముసుగులు క్రమేనా  తొలగిపోతున్నాయి.  నిన్న 'కోదండరాం' నేడు,   'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి

కోస్తా ఆంధ్రలో జరుగుతున్న ఉధ్యమాన్ని ఉక్కుపాదం తొ ఆనిచివేయలేదేమిటని డి.జి.పి నిలదీసిన కోదండరాం. నేడు టివి 9 లో ప్రొ॥ చక్రపాణి , సీమాంద్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉధ్యోగుల సమ్మెపై మాట్లాడుతూ, ఈ సమ్మె వల్ల ఏమీ లాభం ఉండదు. మీకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు, మీరు రిటైర్ అయినా సరే మీకు ఫించను సెటెల్ అవ్వదు, మీకు కెరీర్ లో రి మార్క్ ఉండిపోతుందని ఉధ్యోగులను భయపెట్టాలని ప్రయత్నించడం చూస్తుంటే, వీరు ఏ వర్గ స్వభావంతో పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. అధికారంలో వున్న పెట్టుబడీ దారులు కూడా సరిగ్గా యిలానే మాట్లాడతారు ఎవరైనా సమ్మె చేస్తే! మరి యిదే ఉపోద్ఘాతం తెలంగాణ ఉధ్యోగులకు 'సకల జనుల సమ్మెలో" మీరు ఎందుకు వివరించలేదు?

జనాలకు మరీ అంత మతి మరుపు వుందనుకుంటే ఎట్లా? తెలంగాణ ఉధ్యమాలలో అసలు అరాచకాలు జరగలేదు, శాంతియుతంగా జరిగాయి అంటే, మీరు మేధావులు ఏంచెప్పినా నిజమే చెప్పుతారని జనులు నమ్ముతారని మీరు భ్రమ్మల్లో వున్నట్లే...  ట్యాంక్ బండపై శ్రీశ్రీ విగ్రహం కూల్చినా తప్పు పట్టని మీరుఇందరాగాంధీ విగ్రహాలు ధ్వంసం ని మీరు చాలా తీవ్రంగా ఖండించడం, తెలంగాణలో ఒక్క ఇందిరా గాంధి విగ్రహమూ కూల్చనట్ట్లు మీరు నటించడం చూస్తుంటే మీకు వున్నది అతితెలివని తెలుస్తుంది.  గత నాలుగు సంవత్సరాలలో "తార్నాక" సెంటర్లో "పెట్ర్లోల్" బంకులను, చుట్టు ప్రక్కల ప్రవేటు కార్లను ఎన్ని సార్లు ధ్వంసం చేశారో ఎవరికి తెలియదు? అంతెందుకు, హైదరబాద్ లో షాంపింగ్ మాల్స్ కి వున్న నెట్స్ (వల)ను తీసే ధైర్యం ఎవరికైనా వుందా? అంటే యింకా భయం భయం గానే వుంది, తెలంగాణా వాదులతో ఏమవుతుందో నని.

నేను ఫ్రొవెసర్ ని మీరు నేను చెప్పేది వినాలి, మీరు చెప్పేది నేను విన్నక్కర్లేదు అని వితండ వాదం తో,  మితి మీరిన అహంభావంతో, అక్కడ వున్నవారినందరినీ శాసించాలనుకోవడం, విశ్లేషకుడిగా తన పరిది మీరి మాట్లాడటం,  ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ రోజు టివి9 లో మాట్లాడిన తీరు కడు గర్హనీయం.

మోత్తానికి ఈ మెధావి వర్గం అంతా తెలంగాణా పెట్టుబడీ దారి వర్గానికి "కూరలో కర్వేపాకు" మాత్రమే! సామన్య ప్రజలకు వీరు ఎంత అన్యాయంచేశారో ఎప్పుడు తెలుస్తుందో.. చిన్న చిన్న రాష్ట్రాలతో ఏదేదో సాధించేయ్యొచ్చనే భ్రమలో వీరు "ఫాసిస్ట్" గా మారుతున్నారు.. ఒక కె.సి.అర్  మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు.

చిన్న రాష్ట్రాలతో దోపీడి వర్గానికే అనుకూలం అని తెలిసి వచ్చే రోజు ముందు ముందు వుంది!!

24, జూన్ 2013, సోమవారం

"జ్యోతిష్యం" ఒక శాస్త్రమా? లేక మూఢనమ్మకమా?

1 వ్యాఖ్యలు
ఒకే సమయంలో వందలాది మంది (విమాన, రైలు, బస్సు, వరద ప్రమాదాలలో) చనిపోవడమంటే, చనిపోయినవారి అందరి జాతకాలు ఒకేలాగ తగలడ్డనట్లేనా? వారి వారి ఆ వార ఫలాలు "జ్యోతిష్యం"  లో అ విధంగానే చెప్పబడి/వ్రాయబడి   వుంటాయా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారయితే, మంచి చేడు చూసుకోకుండా ప్రయాణాలు చేయరు. మరి ఉత్తారాఖండలో యింత ఘోరం ఎలా జరిగింది? 

ఉదయం లెచినదగ్గర నుండి, టివీ, రేడియో, పత్రికలలో ఒకటే ఊదరదంపు  "జ్యోతిష్యం"/వార ఫలాల కార్యక్రమాలు.. ఈ వారం ఫలానా జాతకం కలవారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని ఉపోద్ఘాతాలు. మరి క్రిత వారఫలాలలో యింత మంది జాతకాలు ఒకేలాగ వున్నాయా? కాని, చనిపోయిన వారందరు వేరు వేరు నక్షత్ర, రాశుల లో జన్మించిన వారై వుండును.  అదేవిధంగా, చనిపోయిన వారిలో పాపులు, పుణ్యులు కూడా వుందురు. మరి అందరి జాతకాలు ఒకేవిధంగా ముగించడం అంటే, "జ్యోతిష్యం"  ఒక మూఢనమ్మకం అని "శాస్త్రం" కానేకాదని ఋజవవుతుంది.

-- వాసవ్య యాగాటి 24.06.2013

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ప్రత్యేక తెలంగాణ వాద మితృలకు ఒక సూటి ప్రశ్న...

18 వ్యాఖ్యలు
మిత్రపక్షాలు కాదన్నా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారే మన కాంగ్రేస్ ప్రధాని, అటువంటిది ప్రధాన ప్రతిపక్షమైన భాజప సపోర్ట్ యిస్తున్నా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టని ఈ కాంగ్రేస్ పార్టీ ఢిల్లీ పెద్దల గుమ్మం దగ్గర  చెప్పు లా  పడివున్న కెసిఆర్ మీకు నాయకుడా లేక తెలంగాణ ద్రోహా?

కొడుకు కెటిఆర్ ని బొత్స దగ్గరకి ఎందుకు పంపినట్లు? అతను ఆంథ్రప్రాంతానికి సంబంధించిన వాడు కాదా? ఏమా రహస్య ఒప్పందాలు. యిది ఏమైనా చీకటి వ్యాపార సంబంధాలా?

గమనిక:  కెసిఆర్ అభిమానులు మరియు అతని ఉధ్యమాన్ని సపోర్ట్ చేసినవారు మాత్రమే స్పందించగలరని మనవి. ఎందుకంటే కెసిఆర్ ని వ్యతిరేకించే వాళ్ళు తలో కామెంటు వేసినా గూగుల్ బ్లాగ్ ఓవర్‌లోడ్ అవుతుందేమో...

22, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రధానికి నా బహిరంగ లేఖ...చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవసరమా?

27 వ్యాఖ్యలు
చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పై నిన్న ప్రధాని నన్ను(ప్రజలను) ఉధ్దేశించి మాట్లాడిన తరువాత  ప్రధానికి నా బహిరంగ లేఖ..


ప్రధాని ఉపన్యాస సారాంశం..

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.

అసలు సమస్య అదేకదా ప్రధాని గారు.. మీరు ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల ఫలితమే కదా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి చేరింది. ఆంటే యిప్పటి వరకూ జరిగిన సంస్కరణలు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే ఉపయోగ పడినవని మీ పరొక్ష అంగీకారమా? సంస్కరణలు ఆ జాతి ని ఉద్దరించాలి గాని పరాయి దేశాలకు జాతిని తాకట్టు పెట్టడం కాదు.


2. విదేశి పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి...

విదేశి పెట్టుబడి దారులేమానా శారీరిక / మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘిక అసమానతలకు లోనవుతున్నవారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనమీద నమ్మకాన్ని వారికి ఎందుకు కలింగించాలి?
వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..


3. చైనాను చూసి నేర్చుకోవాలి...

మీరేనా మాట్లాడింది? చైనా ఆర్థిక సంస్కరణలపై చలాసార్లు విమర్శించిన మీరు యిన్నాలకు కళ్ళు తెరిచారా? లేక యిన్నాల్లు మోసంచేశారా?

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ కంపెనీల పై విధానం...
a. చాలా వరకు వసతులు రాయతీలు / ఉచితం గా కల్పించడం జరుగుతుంది (భూమి, నీరు, కరెంటు..)
b. కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి.
c. కంపెనీలో అన్ని రంగాలలో స్వదేశీ కార్మికుల కే ఉద్యోగం కల్పించాలి. చాలా క్లిష్టమైన రంగంలో చైనా కార్మికులు లేకపోతే వారికి ట్రైనింగ్ యిచ్చి వారినే ఉద్యోగంలోకి తీసుకోవాలి...

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ పెట్టుబడుల ఆహ్వానం పై విధానం...
a. ఆ కొత్త పెట్టుబడులతొ దేశానికే మైనా శాస్త్రసాంకేతికి పరిజ్ణాణం వచ్చేదయి వుండాలి..
b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..

పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?

 ఆమెరికా పెట్టుబడీ దారుల వ్యూహం పలించినట్లు వుంది.. టైమ్స్ పత్రక ద్వరా మీరు అసమర్థులు అనే విషయంతొ మిమ్ములను బాగానే రెచ్చగొట్టారు.. మిరు కోరుకొనే ప్రంపచ స్థాయి ఆర్థిక వేత్త బిరుదు వంటివి నోబుల్ బహుమతైనా సరే మీతెలివి తేటలను బట్టి యివ్వరు.. వాళ్లకు మీరు ఎంత వరకు ఉపయోగపడ్డారు మీజాతిని ఎంత వరకు వాళ్ళకు తాకట్టు పెట్టారు అనేవే వారికి కొలమానం.

 మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!

క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..

మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...

మన సాఫ్ట్‌వేరు రంగ మితృలకు అర్థమయ్యే ఉధాహరణ:

ఒక DELL Laptop కొనాలంటే  హైదరాబాద్ లో అయితే ఏమి చేస్తాము? యిప్పుడున్న స్వదేశీ సంస్థలైన ఏదైనా షాపింగ్ మాల్ కో వెళ్ళి, లేక సికింద్రాబాద్ లో చెన్నెయ్ ట్రేడ్ సెంటర్ కో వెళ్ళి లాప్‌టాప్ కొంటాం..
ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి  చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).

ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం  డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)

కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...