వీలుంటే నా నాలుగు లంకెలు ...

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ప్రత్యేక తెలంగాణ వాద మితృలకు ఒక సూటి ప్రశ్న...

18 వ్యాఖ్యలు
మిత్రపక్షాలు కాదన్నా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారే మన కాంగ్రేస్ ప్రధాని, అటువంటిది ప్రధాన ప్రతిపక్షమైన భాజప సపోర్ట్ యిస్తున్నా తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టని ఈ కాంగ్రేస్ పార్టీ ఢిల్లీ పెద్దల గుమ్మం దగ్గర  చెప్పు లా  పడివున్న కెసిఆర్ మీకు నాయకుడా లేక తెలంగాణ ద్రోహా?

కొడుకు కెటిఆర్ ని బొత్స దగ్గరకి ఎందుకు పంపినట్లు? అతను ఆంథ్రప్రాంతానికి సంబంధించిన వాడు కాదా? ఏమా రహస్య ఒప్పందాలు. యిది ఏమైనా చీకటి వ్యాపార సంబంధాలా?

గమనిక:  కెసిఆర్ అభిమానులు మరియు అతని ఉధ్యమాన్ని సపోర్ట్ చేసినవారు మాత్రమే స్పందించగలరని మనవి. ఎందుకంటే కెసిఆర్ ని వ్యతిరేకించే వాళ్ళు తలో కామెంటు వేసినా గూగుల్ బ్లాగ్ ఓవర్‌లోడ్ అవుతుందేమో...

22, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రధానికి నా బహిరంగ లేఖ...చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవసరమా?

27 వ్యాఖ్యలు
చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పై నిన్న ప్రధాని నన్ను(ప్రజలను) ఉధ్దేశించి మాట్లాడిన తరువాత  ప్రధానికి నా బహిరంగ లేఖ..


ప్రధాని ఉపన్యాస సారాంశం..

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.
2. విదేశీ పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి.
3. చైనాను చూసి నేర్చుకోవాలి.

1. సంస్కరణలు తప్పవు... దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది.

అసలు సమస్య అదేకదా ప్రధాని గారు.. మీరు ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల ఫలితమే కదా ఈ దేశం క్లిష్ట పరిస్థితిలోకి చేరింది. ఆంటే యిప్పటి వరకూ జరిగిన సంస్కరణలు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికే ఉపయోగ పడినవని మీ పరొక్ష అంగీకారమా? సంస్కరణలు ఆ జాతి ని ఉద్దరించాలి గాని పరాయి దేశాలకు జాతిని తాకట్టు పెట్టడం కాదు.


2. విదేశి పెట్టుబడి దారులలో విశ్వాసం కల్పించాలి...

విదేశి పెట్టుబడి దారులేమానా శారీరిక / మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘిక అసమానతలకు లోనవుతున్నవారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, మనమీద నమ్మకాన్ని వారికి ఎందుకు కలింగించాలి?
వ్యాపారం సంస్థలేమి నిశ్వార్థ స్వఛ్చంద సంస్థలేమి కాదు కదా? మీరు చదివిన ఆర్థిక రంగ శాస్త్రాలలో ఎక్కడా చెప్పరు కదా! వ్యాపారం ఆంటే కేవలం లాభ నష్టాల భేరీజు మాత్రమే ఈ విషయాన్నిఅందరూ ఒప్పుకున్నదే. ఆఫ్‌‌ఘనిస్తాన్ లోనైనా వ్యాపారం చేస్తాడు లాభాలు వస్తాయంటే..


3. చైనాను చూసి నేర్చుకోవాలి...

మీరేనా మాట్లాడింది? చైనా ఆర్థిక సంస్కరణలపై చలాసార్లు విమర్శించిన మీరు యిన్నాలకు కళ్ళు తెరిచారా? లేక యిన్నాల్లు మోసంచేశారా?

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ కంపెనీల పై విధానం...
a. చాలా వరకు వసతులు రాయతీలు / ఉచితం గా కల్పించడం జరుగుతుంది (భూమి, నీరు, కరెంటు..)
b. కొంత కాలం (10 సంవత్సరాలు అనుకుంటా) తరువాత, కంపెనీ లో వున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర ని అంతా చైనా ప్రభుత్వానికి అప్పగించాలి.
c. కంపెనీలో అన్ని రంగాలలో స్వదేశీ కార్మికుల కే ఉద్యోగం కల్పించాలి. చాలా క్లిష్టమైన రంగంలో చైనా కార్మికులు లేకపోతే వారికి ట్రైనింగ్ యిచ్చి వారినే ఉద్యోగంలోకి తీసుకోవాలి...

నాకు తెలిసినంత వరకు చైనా అవలంభిస్తున్న విదేశీ పెట్టుబడుల ఆహ్వానం పై విధానం...
a. ఆ కొత్త పెట్టుబడులతొ దేశానికే మైనా శాస్త్రసాంకేతికి పరిజ్ణాణం వచ్చేదయి వుండాలి..
b. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై వుండాలి.
c. ఆ కొత్త పెట్టుబడుల ద్వారా దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించ కలగాలి..

పైన పేర్కొన్న మూడింటిలో కనీసం ఒక్కటి కూడా నెరవేరదు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల ద్వారా.. మరి ఎందుకు విదేశీ పెట్టుబడీదారులలో విశ్వాసాన్ని కలింగించాలి? చైనా నుండి ఏమి నేర్చుకోవాలి?

 ఆమెరికా పెట్టుబడీ దారుల వ్యూహం పలించినట్లు వుంది.. టైమ్స్ పత్రక ద్వరా మీరు అసమర్థులు అనే విషయంతొ మిమ్ములను బాగానే రెచ్చగొట్టారు.. మిరు కోరుకొనే ప్రంపచ స్థాయి ఆర్థిక వేత్త బిరుదు వంటివి నోబుల్ బహుమతైనా సరే మీతెలివి తేటలను బట్టి యివ్వరు.. వాళ్లకు మీరు ఎంత వరకు ఉపయోగపడ్డారు మీజాతిని ఎంత వరకు వాళ్ళకు తాకట్టు పెట్టారు అనేవే వారికి కొలమానం.

 మీ బొగ్గు మసిని బాగానే ప్రక్కదారి పట్టించారు. ఎంతంటే, భజాపాను కమ్యూనిస్ట్‌లు ఒకే వేదికను పంచుకోనేటంత. చిన్న సమస్యను మరో పెద్ద సమస్య సృష్టించడంతో సరి!

క్విట్ ఇండీయా స్పూర్తికి విరుద్ధంగా మరో ఈస్ట్ ఇండియా ప్రవేశ సన్నివేశాన్ని మాకు చూపించి... మా రాబోయే తరానంతటిని ఆర్థిక బానిసలుగా పరాయి దేశానికి అప్పగించే విదానం తప్ప మరోకటి కాదు..

మిమ్ములను గెలిపించిన పాపానిక
మనస్థాపంతో
ఓ భారతీయుడు...

మన సాఫ్ట్‌వేరు రంగ మితృలకు అర్థమయ్యే ఉధాహరణ:

ఒక DELL Laptop కొనాలంటే  హైదరాబాద్ లో అయితే ఏమి చేస్తాము? యిప్పుడున్న స్వదేశీ సంస్థలైన ఏదైనా షాపింగ్ మాల్ కో వెళ్ళి, లేక సికింద్రాబాద్ లో చెన్నెయ్ ట్రేడ్ సెంటర్ కో వెళ్ళి లాప్‌టాప్ కొంటాం..
ఒక్ Rs.40,000/- అయిందనుకోండి..
దానిలో అధిక లాభ శాతము డెల్ కంపెనీకి చేరుతుంది (ఆమెరికాకు)
దానిలో కొంత లాభ శాతం డెల్ తయారు చేసిన కంపెనీకి చేరుతుంది (చైనాకు)
దానిలో ఓ పది శాతం ఆ లాప్‌టాప్ అమ్మిన షాప్‌కి  చేరుతుంది (మన దేశంలో బడా/చిరు వ్యాపారులకు).

ఆంటే మనం ఖర్చు పెట్టే దానిలో ఒక పది శాతమైనా మన దేశ ప్రయోజనాలకు ఉపయోగ పడుతుంది.. (DELL SHOPPE అని పెద్ద డెల్ బోర్డ్ వుంటే అది మొత్తం  డెల్ కంపెనీ ది కాదని గుర్తించంది.. అది డెల్ కి ఆథరైజ్‌డ్ స్వదేశీ రీటైల్ షోరూమ్ మాత్రమె)

కానీ రేపు.. హైదరాబాద్ లో డెల్ కంపెనీనే డైరెక్ట్‌గా రిటైల్ షోరూమ్ ప్రారంభిస్తే పరిస్థితి ఏమిటి.. డెల్ ల్యాప్‌టాప్ ని కంపెనీ షోరూమ్ లోనే కొంటానికి ప్రయత్నిస్తారు. ఆ పది శాతం లాభం కూడా అమెరికాకు తరలిపోలోతుంది. ఇక అన్ని షాప్‌లలో డెల్ ల్యాప్‌టాప్స్ అమ్మక్కర్లేదు..
1. షాపింగ్ మాల్స్ లో సేల్స్‌మ్యన్స్ కూడా అంత మందిని కొనసాగించక్కర్లేదు.. నిరుద్యోగం పెరుగుతుంది..
2. రిటైల్ రంగంలో వచ్చే ఆఖరి లాభం కూడా యితర దేశాలకు చేరుతుంది.
3. కనీసం టెక్నాలజీ కూడా మనకు ఈ రంగంలో కొత్తగా వచ్చేది ఏమీ లేదు...
4. ఫ్యాక్టరీలు కట్టడానికి కావలసినంత పెట్టుబడూలూ ఈ రంగానికి అవసరం వుండదు. ప్రధాని భాషలో చెప్పాలంటే, కేవలం వారికి విశ్వాసం/నమ్మకం కలిగించటానికే నంట దోచుకు పోవడానికి.
5. నిన్న అసమర్థ ప్రధాని అన్న టైమ్స్ మ్యాగ్‌జైన్ నేడు ప్రధాని పదవిని కూడా లెక్క చెయ్యని వీరుడు సూరుడు అని అన్నా ఆశ్చర్య పోవక్కర్లేదు...





16, నవంబర్ 2011, బుధవారం

అవినీతి పరుల అస్త్రం "సహజ న్యాయసూత్రం"

3 వ్యాఖ్యలు
నాటి వార్త: "జగన్ అక్రమార్జన పై హైకోర్ట్ ప్రాదమిక విచారణకు ఆదేశం..."
     వైఎస్సార్ పార్టీ వివిధ సంధర్భాలలో ప్రకటనలు..
  1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.
  2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ.
  3. సిబి‌ఐ అంటే, "కాంగ్రేస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్"
  4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం సహజ న్యాయ సూత్రం. ఆ హక్కు మేము ఒదులుకోం. (చంద్రబాబు మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే తప్పు ఒప్పుకున్నట్లే!)
  5. "2004-2009 మధ్య అక్రమాలు జరిగినట్లయితే...అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ రావు 2010 నవంబర్ వరకు ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ ప్రశ్నించారు. "నాపై వచ్చిన ఆరోపణలకు, శంకర్ రావుకు ప్రత్యక్ష సంబంధం ఏమిటి? ఆయన ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగిందా?'' అని జగన్ ప్రశ్నించారు" (చంద్రబాబు అధికారం పోయి చాలా సంవత్సరాలయింది.. మరి మీ తండ్రి హాయాంలో గోల్లు గిల్లు కుంటూ కూర్చున్నారా?)
  6. " హైకోర్టు నేరుగా తనపై సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం చెల్లదు. "ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకే స్వీకరించకూడదు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడే, హైకోర్టు జోక్యం చేసుకోవాలి. హైకోర్టు నేరుగా సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226ను దుర్వినియోగపరచడమే. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే''.  - సుప్రీంకోర్టులో జగన్ వాదన. (శంకర్రవు లేని నష్టం విజయమ్మకు చంద్రబాబు విషయంలో ఏమి నష్టం వచ్చిందో? దోచినదాంట్లో వాటాలు యివ్వలేదనా)
     తెలుగుదేశం పార్టీ:.
  1. అక్రమ సంపాదన కాదని నిరూపించుకొనే అవకాశం వచ్చింది. స్టే కోసం సుప్రీమ్ కోర్టుకు జగన్ వెళ్ళకూడదు...
  2. జగని చిప్పకూడు తినే రోజులు దగ్గకొచ్చాయి.
  3. వైఎస్‌ఆర్ మంత్రివర్గం పై కూడా సిబి‌ఐ విచారణ చేయాలి.
    కాంగ్రేస్ పార్టీ:
  1. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
  2. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
  1. యిది రాజకీయ కుట్ర
  2. చోటా నాయకులు తప్ప, పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండి స్పందన లేదు.
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:

  1. ఆహ్వానించదగ్గ పరిణామం.
  2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.
నేటి వార్త: "చంద్రబాబు అక్రమార్జన పై హైకోర్ట్  సిబి‌ఐ సమగ్ర విచారణకు ఆదేశం..."
 
     వైఎస్సార్ పార్టీ ప్రకటనలు..
  1. న్యాయం గెలిసింది.. విజయమ్మ పిటీషన్ స్వీకరించింది. (జగన్ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదు)
  2. సోనియా ప్రోద్భలం ఏమిలేదు... హైకోర్టు విషయంలో సోనియా ఎలాగ కలుగజేసుకుంటుంది? (జగని విషయంలో సోనియా ప్రోద్భలంతోనే)
  3. బాబుపై సిబి‌ఐ విచారణ మొదలు పెట్టాలి. (జగన్ పై సిబి‌ఐ దాడులు ఆపాలి)
  4. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళడం అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్లే... (జగన వెళ్ళడం తప్పుకాదు)
     తెలుగుదేశం పార్టీ:.
  1. యిది రాజకీయ కుట్రతో కూడుకున్న పిటీషన్.(జగన్ మీద మాత్రం రాజకీయ కుట్ర కాదు)
  2. సోనియా ప్రోద్భలంతోనే ఈ విచారణ. (జగన్ విషయంలో మాత్రం కోర్టులు బగా పనిచేస్తున్నాయి)
  3. రిలయన్స్, జిఎమ్మార్, ఎల్&టి  తో పాటు వివిధ  సంస్థలు చంద్రబాబు హయాంలో లాభపడ్డాయిని ఆరోపించినప్పుడు మరి ఆ సంస్థలను పిటీషన్‌లో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు..  జిఎమ్మార్ వైఎస్‌ఆర్ లింకులు బయటకొస్తాయనా? 
  4. వైఎస్సార్ 26 కేసులు వేస్తే నిలబడలేదు.. యిప్పుడు కొత్తగా ఏమిలేదు...
    కాంగ్రేస్ పార్టీ:
  1. బాబు తనకు తానుగా హైకోర్టు ఆదేశాలకు ముందుగా సిబి‌ఐ విచారణకోసం కోరలసింది.
  2. హైకోర్టు స్పందిస్తే, సోనియా ప్రోద్భలం అనడం తగదు.
  3. చట్టం తనపని తాను చేసుకుపోతుంది.
    తెరాస పార్టీ:
  1. చేసిన తప్పులకు ప్రతిఫలం (జగని విషయంలో అయితే రాజకీయ కుట్ర)
  2. పోలిట్ బ్యూరో స్థాయి నేతలనుండే స్పందనలు..
  3. సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్ళకూడదు.
  4. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడేమి ఒరుగుతుందని "నమస్తే తెలంగాణ" లో పలుకులు (పై స్టేట్ మెంటుకు భిన్నంగా)
     వామపక్షాలు, లోక్‌సత్త పార్టీలు:
  1. ఆహ్వానించదగ్గ పరిణామం.
  2. సిబిఐ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేయాలి.

అంతామన మంచికేనా? లేక యిదేమైనా రాజకీయ క్రీడా?
ఏదేమైనా జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత సోనియాపై జగన్ లో ఎంతో కొంత మార్పు కొట్టొచ్చినట్లు రాష్ట్ర ప్రజలు గుర్తించే స్థాయిలోనే వుంది. కాకతాళీయమో లేక ప్రోద్భలమో చెప్పలేము గాని, విజయమ్మ వేసిన పిటీషన్ తో హైకోర్టు స్పందనలో నాకు కొంత వ్యత్యాసం కనబడినది. శంకరావు వేసిన పిటీషన్‌ తో హైకోర్టు కేవలం ప్రాధమిక విచారణకు మాత్రమే ఆదేశించినది జగన్ వాదనలను విన్న తరువాత. మరి విజయమ్మ పిటీషన్‌తో ఏకంగా సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినది చంద్రబాబు వాదనలు వినకుండానే! అదే జగని విషయంలో అయితే, సుప్రీంకోర్టులో కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉపయోగించుకున్నాడు "సహజ న్యాయ సూత్రాల ప్రకారం". మరి చంద్రబాబు విషయంలో ""సహజ న్యాయ సూత్రాల" అవకాశం ఉపయోగించకూడదంట. యిది చిన్నపిల్లల తొండాట లాగలేదు?

ఆంతా మనమంచికే అనుకుందాం... ఎలుక ఎలుక రొట్టె కోసం తన్నుకొని పిల్లికి పెట్టినట్లు.. మనకేమైనా లాభం కలుగుతుందోమని చూద్దాం.. ఎందుకంటే తగిన శిక్షలు పడే వరకూ మనం ఏమి నమ్మలేము... ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేము. పుసుక్కున సిబి‌ఐ కేసులను ఉపసంహరించుకోవచ్చు సాక్షాలు లేవని చెప్పి.. నిన్న కాక మొన్న అదే జరిగింది.. కరుణానిధి ఢిల్లీ వెళ్ళి 'అమ్మ‌'  దర్శనం చేసుకొనేటప్పుడుకి సిబి‌ఐ "కనిమొళి" విషయంలో చప్పబడింది కనిమెళి బెయిల్ పిటీషన్ కి ఎదురు చెప్పమని చెప్పింది. కోర్టులు ఈ మధ్య "యాక్టివ్" గా వున్నయి కదా సరిపోయింది. కనిమెళి బెయిల్ కి సిబి‌ఐ అభ్యంతరం చెప్పనప్పటికి కోర్టు బెయిల్ నిరాకరించింది కాబట్టి సరిపోయింది లేక పోతే హాయిగా ఈపాటి ఎసి రూములో వుండేది.

చూద్దాం.. రేపు ఢిల్లీ ఎవరు వెళతారు? ఎవరి కేసులు వీగిపోతాయో!

 నర్మగర్భంగా ఒప్పుకొనేది ఏమంటే..

తన మీద ఆరోపణలు వచ్చినపప్పుడు నిరూపించుకోవలసింది పోయి, కనీసం ఆ ఆరోపణలపై స్పందించకుండా, వారిమీద కేసులేదు, వీరిమీద కేసులేదు నామీదే కేసులు వేసారంటే దానర్థం ఏమిటి? వేరే ఏమైనా చెప్పాలా!


చట్టం తనపని తాను చేసుకుపోతుందిని నమ్మలంటే...వీరందరికి శిక్షలు పడాలి!
సిబి‌&ఐ విచారణలో వున్న ప్రముఖులు..

  1. గనులపేరుతో దోపిడి - గాలి
  2. వ్యాపారం/అధికారం పేరుతో దోపిడి - జగన్
  3. హైటెక్ పేరుతో దోపిడి - చంద్రబాబు
  4. దొంగ లెక్కలతో దోపిడి - రామలింగరాజు
 యింక మిగిలిన నాయకులపై కూడా విచారణ జరగాలి.. మచ్చుగా నాకు బాగా గుర్తున్న కొందరు..
  1. మతం పేరుతో దోపిడి - బ్రదర్ అనిల్ కుమార్
  2. మూఢ విశ్వాసాలతో దోపిడి - సత్యసాయి ట్రస్ట్
  3. స్నేహం పేరుతో దోపిడి -  కెవిపి రామచంద్ర రావు
  4. భూకబ్జాలతో దోపిడి -  సత్తిబాబు
  5. కృత్రమ వర్షాలని దోపిడి - రఘువీరా
  6. నీటి డ్యాముల పేరుతో దోపిడి -పొన్నాల
  7. విధ్యుత్పోత్తి పేరుతో దోపిడి - రాజగోపాల్
  8. సెంటిమెంటు పేరుతో దోపిడి - కెసిఆర్
  9. బ్లాక్‌మెయిలింగ్‌ లతో దోపిడి- కెటీఆర్
  10. సంస్కృతి పేరుతో దోపిడి - కవిత
  11.  మీడియా పేరుతో దోపిడి - రామోజీ రావు
  12. సినిమాల పేరుతో దోపిడి - మగధీర, దూకుడు నిర్మాతలు (యిప్పుడిప్పుడు బయటకొసున్నయి ఏ సినిమామీద ఎంత సంపాదించినది - ఐటి దాడులు చేస్తేగాని అస్సలు లెక్కలు బయటకు రావు)
యిప్పుడు చెప్పండి దోపిడీకి ఏదీ అనర్హం కానిదే కదా? దోపిడి చేయడానికి ప్ర్రాంతీయ భేదాలు లేవు, కుల మతాలసలే లేవు...


4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం - ప్రపంచ శ్రామికులారా ఏకంకండి! తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

103 వ్యాఖ్యలు
భారతదేశ శ్రామికులేకాక, అమెరికా శ్రామికులైనా, పాకిస్తాన్ శ్రామికులైనా మరేదేశ శ్రామికులైనా, ప్రపంచంలో వున్న శ్రామికులందరూ ఏకమై ఈ భూర్జువా భూస్వామ్యవర్గంపై సాయుధ పోరాటంతో సమసమాజం స్థాపించాలని భారతదేశ అతివాద కమ్యూనిస్ట్‌ల ఒక్కపటి అజెండా!

ప్రపంచ శ్రామికులారా ఏకంకండి!
తెలుగు శ్రామికులారా తన్నుకు చావండి!!

యిది యిప్పటి ఆధునిక అతివాద తెలంగాణ కమ్యూనిస్ట్ సిథ్దాంతం. పోనీ తెలుగు (తెలంగాణ Vs తెలంగాణేతర) శ్రామికులు తన్నుకు చచ్చినా ఏమైనా విప్లవం వస్తుందా అంటే అదీ కాదు.

* దసరా పూట సెలవులు వచ్చేవి శ్రామికులకా? పరిశ్రామాధిపతులకా? యింత గొడవలు జరుగుతున్న సందర్భంలో పరిశ్రామాధిపతులు రిస్క్ రీసుకొని ప్రయాణాలు పెట్టుకోరు.. వారికి కావలసినప్పుడు సెలవులు తీసుకుంటారు. ఎంతోకాలంగా సెలవలకోసం వేచి చూస్తూ తల్లి తండ్రులదగ్గరకు పండగ వంకతోనైనా చూసి వస్తానికి వీలు చేయడం అంటే నా దృష్టిలో మానవత్వం లోపించడమే అవుతుంది.

* బస్సులపై జన్మస్థలాలకు దసరా సెలవలకు వెళ్ళేవారు బడుగులూ, మధ్య తరగతి జీవులు కాదా? - హైదారాబాద్ నుండి ఖరీదైనా కార్లలోనో, విమానాలలో వెళ్ళే బడా పారిశ్రామికాధిపతులకు ఏటువంటి ఆసౌకర్యం కలిగించనటువంటి ఈ రోకోలు ఎవరిపై ఎవరికోసం?

* నిన్న ఓ టీవీ ఛానల్‌లో C.P.I (ML) & పౌరహక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రెండు ప్రాంతాల ప్రజలు కొట్టుకొనేలా ప్రభుత్వమే కుట్రపన్నడంవలన ఈ పరిస్థితి దాపురించిందని వాధించారు. ప్రభుత్వాలు కుట్రపన్నుట సహజం అనుకుందాం. ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ముందే తెలిసినా ఈ మేధావులకు, రెండు ప్రాంత ప్రజలు కొట్టుకు చావకుండా ఏ ఒక్క ఎత్తుగడైనా వేశారా? లేకపోతే కొట్టుకు చచ్చిన తరువాత ప్రభుత్వమే దీనికి భధ్యత వహించాలని డిమాండ్లు చీటీలో వ్రాసుకొని దాచుకున్నారా? లేక ఎలాగూ పాపం ప్రభుత్వానిదే కదా, ప్రజల మధ్య చిచ్చుతో చలికాగుతాగుతామనా?

* ప్రజలలో వ్యక్తిగత  రాగ ద్వేషాలాను రోజు రోజుకు పెంచుతూ, అమ్మనా బూతులూ తిడుతూ అదే తెలంగాణ సంస్కృతి అంటూ చేసే నాయకుడి తోక పట్టుకోని, తెలంగాణాలొ ఎంతో కొంత తమ క్యాడర్‌ని పెంచుకోవచ్చులే అనే తపనే తప్ప యింకొకటి కాదనిపిస్తుంది. మీడియా మొఘల్ మరియు ఆర్.ఎఫ్.సి అధినేత పై కట్టలు తెచ్చుకోనే ఆవేశంతో పాటలు, అదే తెలంగాణాలో మరో గులాబి మీడియా మొఘల్ పై సాఫ్ట్ కార్నర్!

 
* ఆంథ్రప్రాంత బడా పారిశ్రామికులతో కలిసి వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ ప్రాంత బడావ్యాపారుల ఊసే వీరికి అక్కర్లేదు.. ఆంథ్రప్రాంతవాసులందరూ (ప్రజలందరూ) దోపిడీదారులూ / బడా వ్యాపారవేత్తలనే తలతిక్క విమర్శలకు వీరి స్పందన కరువు.. ఎవరైన గట్టిగా అడిగితే పెద్ద్ క్లాస్ పీకుతారు.. పలానా సందర్భంలో మేము ఖండించాము.. ఆంథ్రప్రాంతవాసులందరినీ దోపిడీ దారలనడం ఖండనార్హమని. కానీ బహిరంగంగా తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క సందర్భంలోను లౌడు స్పీకర్లలో చెప్పిన దాఖలాలు లేవు. తన్ని తరమండి, లుంగీలు ఊడపీకమని పిప్లవ సాహిత్య పంథాలో కవులు పులలో రూపంలో రెచ్చగొట్టడం అందరికీ తెలిసినదే...

* దోపిడీ వర్గంపై పోరుమాని, కేవలం తెలంగాణా ప్రాంతంకి ముఖ్యమంత్రి పదివి దక్కితే చాలు (పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో) తెలంగాణా ప్రజల జీవితాలు స్వర్గయుగంలోకి వెళ్ళిపోతాయి అనే భ్రమలు కల్పించడం ఏ సిథాంతం ప్రకారం చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టమే...

ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి సహజ లక్షణమయిన సాంఘీక అసమానతలను ఆసరాగా, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంలేక పోయినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకపోయినా, వర్గపోరు మరిచి వ్యక్తిగత రగద్వేషాలను నూరిపోయిడం (వేరే ప్రాంత బడుగు మధ్య తరగతి జీవులపై కూడా) ద్వారా తెలంగాణ ప్రాంతం క్యాడర్ లో వచ్చు ఈ చైతన్యం వాపే అవుతుంది తప్ప బలుపు కాదని గ్రహిస్తే మంచిది. అంతే కాకుండా ఈ ఉధ్యమం ఏ సిథ్దాంత ప్రాతిపదికన చేసున్నదీ తెలియదు. కేవలం ఆంధ్రప్రాంతం వారిని తన్ని తరిమితే ఉధ్యోగవకాశాలు, అన్ని కష్టాలు తెలంగాణా వారికి తీరిపోతాయి అనే ఊహాజనిత భావంతో ప్రేరేపించి జనులను రచ్చగొట్టడం తప్ప యింకొకటి కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణాలోని దోపిడీకి గురవుతున్నవారు వుండరనా వీరి అర్థం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అతివాద కమ్యూనిస్ట్ పార్టీలు మూసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వంపై యిప్పుడు చేస్తున్న పోరాటాలు కొనసాగించ మంటారా? క్లారిటిగా ప్రజలకు వివరిస్తే బాగుండు.

ఒక్క తెలంగాణాను భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగమైన  ఒక రాష్ట్రంగా చేస్తే పెట్టుబడీ, భూస్వామ్య వ్యవస్థ ఎలా కూలుతుందో!

ప్రత్యేక తెలంగాణా అవసరమా, కదా అనే ఆంశంపై రాసిన వ్యాసం కాదు.. కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం  కోసం అలుపెరగకుండా పోరాడుతున్న కామ్రేడ్ల ఆలోచనా పంథాన్ని అవగహానా కోసం రాస్తున్నది....