వీలుంటే నా నాలుగు లంకెలు ...

21, జూన్ 2011, మంగళవారం

I love you mom...

0 వ్యాఖ్యలు

మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తయారు చేసిన ఆల్బమ్ లోని యిది ఒక పాట. దీనికి సంగీతం, రచన మరియు స్వరం అన్ని మహేష్ యాగాటి (ప్రొఫైల్ కోసం యిక్కడ క్లిక్ చేయండి).
మీ సలహాలు సూచనలు ఏమైనా వుంటే ఈ 18 సంవత్సరముల కుర్రాడికి యివ్వగలరు.


4, జూన్ 2011, శనివారం

వేలకోట్ల కుబేరుడు ఆమరణ దీక్షకు దిగె!

34 వ్యాఖ్యలు
అవినీతి, నల్లధనం, ఇంగ్లీషు బోధన, రైతులకు మద్దతు ధరలు... ఇలా ఒకదానితో మరోదానికి పొంతనలేని డిమాండ్లతో వేలకోట్ల కోటీశ్వరుడైన రామ్‌దేవ్‌ బాబా ఆమరణ దీక్ష ప్రారంభమైంది. దీక్షకు మద్దతునివ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న తమ శ్రేణులకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశించింది.

చూస్తుంటే యిదేదో పెద్ద కార్పోరేట్ కుట్రగా వుంది అవినీతిపై పోరాటం అంటే! అవినీతి గురించి మాట్లాడేవారిని చూసి ప్రజలు చీకొట్టే రోజుకోసమ్ వీరి ప్రయాస!

1, జూన్ 2011, బుధవారం

విమాన ఇంధన ధరలు తగ్గింపు

2 వ్యాఖ్యలు
సామాన్యులు ఉపయోగించే వంట గ్యాస్‌,డీజిల్‌,పెట్రోల్‌ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం వేస్తోన్న ప్రభుత్వం, సంపన్నుల కోసం ఉపయోగపడే విమాన ఇంధన ధరలను మాత్రం తగ్గించింది. తీవ్ర నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వ రంగరలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒకవైపు పెట్రోల్‌ ధరలను పెంచుతున్నాయి. ముడి చమురు అంతర్జాతీయ ధరలు తగ్గిన కారణంగా విమాన ఇంధన ధరలను నాలుగు శాతం తగ్గిస్తున్నట్లు అవే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గించిన ధరలను మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.56,466.11గా ఉండగా తగ్గింపు 3.95 శాతం లేదా రూ.2,327.89 గా ఉంది. ఇప్పటివరకు రు.56.46గా వున్న లీటరు విమాన ఇంధనం ధర రు. 54.14కి తగ్గింది. యుపిఎ-2 సర్కారు తీరిదీ!

18, మే 2011, బుధవారం

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

1 వ్యాఖ్యలు
శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు.

ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ బెంగాల్లో వామపక్షాలకు కోటీ 96 లక్షల ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల కంటే ఇవి 11 లక్షలు అధికం. వామపక్ష కూటమి 41 శాతానికి పైగా ఓట్లను సాధించింది. 2009 ఎన్నికల అనంతరం చేపట్టిన దిద్దుబాటు చర్యల వల్లే పార్టీ ఓట్లు పెరిగాయి. ఐతే ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికల్లో 34 లక్షల ఓట్లు అధికంగా లభించాయి. మార్పు కోరుకున్న ప్రజల మనసులను మేం పూర్తిగా మార్చలేకపోయాం. ప్రజలతో మరింతగా మమేకమై, వారి హక్కుల రక్షణ కోసం సిపిఎం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది ' అని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోనే రాష్ట్రంలో ముగ్గురు సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు.