వీలుంటే నా నాలుగు లంకెలు ...

10, జులై 2018, మంగళవారం

0 వ్యాఖ్యలు

కత్తి మహేష్ - మనోభావాలు - చట్టాలు


మత మౌడ్యాన్ని, మతోన్మాదాన్ని, మత రాజకీయాలన్ని వ్యతిరేకించాలి తప్ప,

మతాల్ని, మతం నమ్మే వారి మనోభావాలను దెబ్బతగిలేలాగ మాట్లాడటం మంచిది కాదు (ప్రస్తుత చట్టాల ప్రకారం అది నేరం కూడా).

ఈ సున్నితమైన గీతను అర్థంచేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.. దానివల్ల మతోన్మాద శక్తులకు అసంకల్పిత అవకాశం ఇవ్వడమే... కత్తి మహేష్ విషయంలో జరిగింది అదే!!!

మనదేశంలో "మనోభావాలు" దెబ్బతిన్నాయి అని ఎవరైనా అన్నారంటే, దానర్థం అరాచకం చేయడానికి సిధ్దంగా ఉన్నారని భావించాలి...

పరిపూర్ణంద స్వామి కూడా దానికో ఉదాహరణ. 2019 లో నిజమాబాద్ నుండి బిజిపి ఎమ్మెల్యే గా పోటీచేయాలని భావిస్తున్న ఈ స్వామి, ఏమి చేస్తే ఓట్లు పెరుగుతాయో తెలియదా?

చాలా ఆశ్రమలలో మహిళలపై అఘాత్యాలు జరిగినప్పుడు హిందూమత ఉద్ధరుడైన ఈ స్వామి ఏమైనట్లు??? అటువంటి ఆశ్రమల ముందు ప్రదర్శనలు చేయలేదే? నేనొక వీడియో చూసా ఈ స్వామి జి కూడా జీసస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.. అసవుద్దీన ఒవైసి కూడా అంతే, మరి కత్తి మహేష్ విషయంలోనే  కోర్టులు కాకుండా పోలీసులే శిక్షలు వేశారు...

అంతంత మాత్రంగా ఉన్న భావ ప్రకటన స్వేఛ్చను కూడా ఇటువంటి కారణాలు చూపి హరించేస్తారు పాలకులు..

కోర్టులు ఇవ్వాల్సిన తీర్పులు, శిక్షలు ప్రభుత్వాలు పోలీసులు ద్వారా ఇచ్చేస్తాయి.. 



రాముడే దిగొచ్చినా లైంగిక వేధింపులు ఆపలేడు - వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ 


తన రాజకీయ చేతకాని తన్నాని శ్రీరామ చంద్రుడి ప్రతిభ ను సైతం తాకట్టు పెట్టిన ఈ హిందూ మతతత్వ పార్టీ ఎమ్మెల్యే కు నగర బహిష్కరణ శిక్ష వద్దా ఓ హిందూ సోదరా?

మనోభావాలు దెబ్బతినలేదా?

ఎందుకు??  ఎందుకు???

వాసవ్య యాగాటి
2018-07-10

9, డిసెంబర్ 2013, సోమవారం

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?

0 వ్యాఖ్యలు
ఉదాహరణ 1:
హైదరాబాద్ తో 60 సంవత్సారాల 6 కోట్ల సీమాంధ్రవాసుల అనుబంధం (వృత్తి, విద్య, సాంఘిక పరంగ ) మానోభావాలంటే పట్టించుకున్న నాదుడే లేడు.

కాని, 60 సంవత్సారల క్రితం గోదావరి జిల్లాలో భాగమైన భద్రాచలం మాత్రం ఖమం జిల్లా వాసుల బంధం 'పవిత్ర' మైనది.  భద్రాచలాన్ని విడదీస్తే శవాలు గుట్టలవుతాయి!

ఉదాహరణ 2:
భౌగోలికంగా ఖమ్మంకు దగ్గరా, పరిపాలనా ప్రకారం ప్రజలకు సౌకర్యం అంటారు. అదే బాగా వెనకబడిన అనంతపురం, కర్నూలు హైదరాబాదికి దగ్గరవుతాయి రేపు ఏర్పడబోయే నూతన క్యాపిటల కన్నా అంటే మాకు 10 జిల్లాల తెలంగానే కావాలి.. యింకా ఎంతమంది తెలంగాణా బిడ్డలు చావాలి అని యిండైరెక్టుగా అమాయక ప్రజల బలి దనాలను సైతం ప్రేరేపిస్తారు.

ఉదాహరణ 3:
జగన్ వర్గం (అప్పటికి కాంగ్రేస్ ఎమ్మేల్యేలు) రాష్ట్ర శాసన సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పేడితే, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం మద్ధతు యివ్వలేదనటానికి కారణం తెలుగుదేశం-కాంగ్రేస్ మ్యాచ్ ఫిక్సింగని తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపి /కోదండరాం విరుచుకు పడ్డారు.

ఇప్పుడు అదే కాంగ్రేస్ ఎంపీ లు పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టితే, ప్రధాన ప్రతిపక్షం అయిన భజపా ఈ తీర్మానానికి బలపరచక పోతే కాంగ్రేస్-భజపా కుమ్మక్కు అయినట్లానా? తెలంగాణా వాదులు/టి ఆర్ స్ / రాష్ట్ర బిజేపీ అనగలదా?


యిలా ఎన్నో వున్నయి..
నాకు తెలంగాణా యిచ్చినా, యివ్వకపోయినా నాకంటూ ఏమీ లాభనష్టాలు లేవు.  తెలంగాణ రాష్ట్రం అవసరమా కాదా అనేది యిక్కడ చర్చ కాదు.. కాని చేసే వాదనలో పస వుండాలి కదా? లాజిక్ / న్యాయం మిస్ అవ్వకూడదు కదా?    ప్రజల  మానోభావాలే ('సెంటిమెంటు') రాజకీయ శాస్త్రానికి పరమావధి అనుకుంటె అంతకంటే పొరపాటు యింకొకటి లేదు. తాత్కాలిక ప్రయోజనాలకోసం రాజకీయ పార్టీలు తమ దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే!

ఏది వాదం ఏది వితండ వాదం.. ఏదేనా వాదానికి ఒక నిబద్దత/ప్రామానికం వుండక్కర్లేదా?

14, ఆగస్టు 2013, బుధవారం

కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం ముసుగులు తొలగిపోతున్నాయ్..

0 వ్యాఖ్యలు
ఈ రోజు టివి 9 న్యూస్ వాచ్ లో 'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి
కమ్యునిజ 'తెలంగాణ వాద' మేధావి వర్గం యొక్క ముసుగులు క్రమేనా  తొలగిపోతున్నాయి.  నిన్న 'కోదండరాం' నేడు,   'రాజకీయ విశ్లేషకుడు' గా ప్రొ॥ చక్రపాణి

కోస్తా ఆంధ్రలో జరుగుతున్న ఉధ్యమాన్ని ఉక్కుపాదం తొ ఆనిచివేయలేదేమిటని డి.జి.పి నిలదీసిన కోదండరాం. నేడు టివి 9 లో ప్రొ॥ చక్రపాణి , సీమాంద్రలో జరుగుతున్న ప్రభుత్వ ఉధ్యోగుల సమ్మెపై మాట్లాడుతూ, ఈ సమ్మె వల్ల ఏమీ లాభం ఉండదు. మీకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు, మీరు రిటైర్ అయినా సరే మీకు ఫించను సెటెల్ అవ్వదు, మీకు కెరీర్ లో రి మార్క్ ఉండిపోతుందని ఉధ్యోగులను భయపెట్టాలని ప్రయత్నించడం చూస్తుంటే, వీరు ఏ వర్గ స్వభావంతో పనిచేస్తున్నారో అర్థం అవుతుంది. అధికారంలో వున్న పెట్టుబడీ దారులు కూడా సరిగ్గా యిలానే మాట్లాడతారు ఎవరైనా సమ్మె చేస్తే! మరి యిదే ఉపోద్ఘాతం తెలంగాణ ఉధ్యోగులకు 'సకల జనుల సమ్మెలో" మీరు ఎందుకు వివరించలేదు?

జనాలకు మరీ అంత మతి మరుపు వుందనుకుంటే ఎట్లా? తెలంగాణ ఉధ్యమాలలో అసలు అరాచకాలు జరగలేదు, శాంతియుతంగా జరిగాయి అంటే, మీరు మేధావులు ఏంచెప్పినా నిజమే చెప్పుతారని జనులు నమ్ముతారని మీరు భ్రమ్మల్లో వున్నట్లే...  ట్యాంక్ బండపై శ్రీశ్రీ విగ్రహం కూల్చినా తప్పు పట్టని మీరుఇందరాగాంధీ విగ్రహాలు ధ్వంసం ని మీరు చాలా తీవ్రంగా ఖండించడం, తెలంగాణలో ఒక్క ఇందిరా గాంధి విగ్రహమూ కూల్చనట్ట్లు మీరు నటించడం చూస్తుంటే మీకు వున్నది అతితెలివని తెలుస్తుంది.  గత నాలుగు సంవత్సరాలలో "తార్నాక" సెంటర్లో "పెట్ర్లోల్" బంకులను, చుట్టు ప్రక్కల ప్రవేటు కార్లను ఎన్ని సార్లు ధ్వంసం చేశారో ఎవరికి తెలియదు? అంతెందుకు, హైదరబాద్ లో షాంపింగ్ మాల్స్ కి వున్న నెట్స్ (వల)ను తీసే ధైర్యం ఎవరికైనా వుందా? అంటే యింకా భయం భయం గానే వుంది, తెలంగాణా వాదులతో ఏమవుతుందో నని.

నేను ఫ్రొవెసర్ ని మీరు నేను చెప్పేది వినాలి, మీరు చెప్పేది నేను విన్నక్కర్లేదు అని వితండ వాదం తో,  మితి మీరిన అహంభావంతో, అక్కడ వున్నవారినందరినీ శాసించాలనుకోవడం, విశ్లేషకుడిగా తన పరిది మీరి మాట్లాడటం,  ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఈ రోజు టివి9 లో మాట్లాడిన తీరు కడు గర్హనీయం.

మోత్తానికి ఈ మెధావి వర్గం అంతా తెలంగాణా పెట్టుబడీ దారి వర్గానికి "కూరలో కర్వేపాకు" మాత్రమే! సామన్య ప్రజలకు వీరు ఎంత అన్యాయంచేశారో ఎప్పుడు తెలుస్తుందో.. చిన్న చిన్న రాష్ట్రాలతో ఏదేదో సాధించేయ్యొచ్చనే భ్రమలో వీరు "ఫాసిస్ట్" గా మారుతున్నారు.. ఒక కె.సి.అర్  మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు.

చిన్న రాష్ట్రాలతో దోపీడి వర్గానికే అనుకూలం అని తెలిసి వచ్చే రోజు ముందు ముందు వుంది!!

24, జూన్ 2013, సోమవారం

"జ్యోతిష్యం" ఒక శాస్త్రమా? లేక మూఢనమ్మకమా?

1 వ్యాఖ్యలు
ఒకే సమయంలో వందలాది మంది (విమాన, రైలు, బస్సు, వరద ప్రమాదాలలో) చనిపోవడమంటే, చనిపోయినవారి అందరి జాతకాలు ఒకేలాగ తగలడ్డనట్లేనా? వారి వారి ఆ వార ఫలాలు "జ్యోతిష్యం"  లో అ విధంగానే చెప్పబడి/వ్రాయబడి   వుంటాయా? పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారయితే, మంచి చేడు చూసుకోకుండా ప్రయాణాలు చేయరు. మరి ఉత్తారాఖండలో యింత ఘోరం ఎలా జరిగింది? 

ఉదయం లెచినదగ్గర నుండి, టివీ, రేడియో, పత్రికలలో ఒకటే ఊదరదంపు  "జ్యోతిష్యం"/వార ఫలాల కార్యక్రమాలు.. ఈ వారం ఫలానా జాతకం కలవారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని ఉపోద్ఘాతాలు. మరి క్రిత వారఫలాలలో యింత మంది జాతకాలు ఒకేలాగ వున్నాయా? కాని, చనిపోయిన వారందరు వేరు వేరు నక్షత్ర, రాశుల లో జన్మించిన వారై వుండును.  అదేవిధంగా, చనిపోయిన వారిలో పాపులు, పుణ్యులు కూడా వుందురు. మరి అందరి జాతకాలు ఒకేవిధంగా ముగించడం అంటే, "జ్యోతిష్యం"  ఒక మూఢనమ్మకం అని "శాస్త్రం" కానేకాదని ఋజవవుతుంది.

-- వాసవ్య యాగాటి 24.06.2013