వీలుంటే నా నాలుగు లంకెలు ...

7, ఏప్రిల్ 2011, గురువారం

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! - ఈ టపాకు సమాధానం....

11 వ్యాఖ్యలు
హవ్వ హవ్వ! ఆడలేక మద్దెలదరువు అన్నట్లు.

శ్రీ సత్యసాయిబాబా - సగటుమనిషి సంవేదన! (Click here) ఈ టపాకు సమాధానం....

మీ టపా సాయిబాబా గారి ప్రస్తుత పరిస్థితి గురించి రాసారు. మీరు రాసిన దానిపైన మాత్రమే కామెంట్స్ వ్రాసాను. కొన్ని సందేహాలు తెలిపాను...
బాబాగారి శరీరం ఇప్పుడు కష్టంలో వుందా? లేక శిష్య బృందం చెపుతున్నట్లు డాక్టర్ల పరిజ్ఞాణాన్ని పరీక్షీంచుతున్నారా? బాబాగారు పెట్టిన ఈ పరక్షలో (జగన్నాటక సూత్రదారి కదా) డాక్టర్లు నెగ్గుతారా? నెగ్గరా? నెగ్గితే ఏమవుతుంది? నెగ్గగపోతే ఏమవుతుంది?
పైదానికి సమాధానము చెప్పటనికి ఇప్పటివరకు సాహసించని మీరు, ఈ విషయంతో ఏటువంటి సంబందం లేని ఎవరో మధ్యలో వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను అడిగినదానికి సమదానం ఇస్తను అంటున్నారు.  దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?
>>> పైన నే ఉదాహరిచిన నవీన మూఢనమ్మకాలమీద మీరే౦ పోరాటం చేసారో చెప్పండి?
ఇక్కడ చర్చలో పాల్గోన్నవారంతా వారు నమ్మిన సిద్ధాంతాలపై పోరాటాలు చేసినవారైనా? ఇదేమైన ఈ వేగుకు కండిషన్ వుందా? మీరు వేసిన టపాకు ఈ ప్రశ్నకు  ఏమైన సంబదం వుందని భావిస్తున్నారా?
>>>ఆస్థికత్వం/దేవుడుల ప్రసక్తి లేకుండా తమకంటూ ఓ సిద్ధాంతం రూపొందిచ్చుకోవచ్చు
వరెవ్వ! ఎంత తెగింపు? ఆస్థికులంతా సాయిబాబాని కలియుగ దేవుడుగా నమ్ముతున్నట్లు మీరు ఎలా నిర్దారణకు వచ్చారు? సాయిబాబా చెడుని వేలెత్తి చెబుతున్నవారంతా నాస్తికులేనా?

దీనిని విషయ దాటవేత దొరణి కాక మరేమంటారు?

సత్య సాయిబాబా ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల చరలో/కబంద హస్తాలలో బందీగా వున్నారా?

9 వ్యాఖ్యలు

నాకు బాబాగారి మహిమలు మరియు వారి దైవత్వము మీద యించైనా నమ్మకము లేదు. అయితే వారిగొడవ మనకెందుకులే అనుకుందామంటే కుదరడం లేదు, నాకు మీడియా ఫోబియా మరి. మన మీడియా ఎప్పటిలాగే ఈ వార్తను హైజాక్ చేసేసింది వాళ్ళ రేటింగ్స్ కోసమని. ఫుంకాలు ఫుంకాలుగా కథానాలు ప్రసారం చేసెస్తున్నాయి అసలు విషయం ప్రక్కనపెట్టి.

అసలు విషయంపై నాకో సందేహము కలుగుతోంది. రోగి ని (వారిని నమ్మిన వారికి 'రోగీ అని సంభోదిస్తే కోపమొస్తుందేమో! కాని వైద్యులు చికిత్స చెస్తున్నందున మరియు రోగ నిర్దారణ జరగడం వలన మెడికల్ సైన్స్ పరి భాషలో రోగి అనడంలో తప్పులేదు అనుకుంటా!) ఎవ్వరకి చూపించకపోవటం చేత  (మన ముఖ్యమంత్రికి సైతం) వారు  ట్రస్ట్/ఒకరిద్దరు రాష్త్ర మంత్రుల  చరలో  కిడ్నప్/కబంద హస్తాలలో బందీగా వున్నారా అనే ధర్మ సందేహము కలుగుతుంది. ఇది నాఆరోపణ కాదు, కేవలం నా సందేహము మాత్రమే. ఎందుకంటే, ఈవ్యవహారం సుమారు నలభై వేల కోట్ల రూపాయల ట్రస్ట్ ఆస్తులకు వారసత్వముతో ముడిపడివుంది.
సందేహాలకు కారణాలు..
1. క్యాబినేట్ మంత్రులు ఇద్దరు అక్కడే తిష్టవేసారు. ఓకరేమో వారి ఆరోగ్యం కుదిటపడింది అంటారు, యింకొకరేమో యింకా వారి ఆరోగ్యం ఆందోళనకరంగానే వుందంటారు ఒకే సమయంలో.
2. పొంతన లేని అనుమానస్పదపు మెడికల్ బులిటెన్లు.
3. కానరాని ట్రస్ట్ సభ్యులు.
4. రెండు లారీల పూలు తెప్పించారని, స్టేడియంలో  వేదికతో పాటు మెటల్ బారికేడ్లు మరియు స్టేడియంకి "లోపలకి", "వెలుపలకి" ద్వారాలు సిద్ధం చేసారాని మీడియాలో కథనాలు.
5. పొంతనలేని వాదనలతో వారి శిష్యరిక బౄందం, బాబాగారు అతను చెప్పినట్లే 95 సంత్సరాలు బతికే వుంటారు అని కొందరు, లేదు వారికి ఈ మానవజాతి దేహం ఏప్పుడు కావాలంటే అప్పుడు వదిలే అవకాశం వుంది అని మరికోందరు.
6. ముఖ్యమంత్రి గారు పుట్టపర్తి వెళ్ళడానికి చాల హడావిడి చేసారు, కాని వెళ్ళడం రద్దయింది, కారణం మాత్రం చెప్పలేదు.
7. మీడియాను అనుమతించక్కర్లేదు, కనీసం బాబాగారి ప్రస్తుత ఫోటోగాని, వీడియో గాని విడుదల చేయకపోవడం. ఫోటోలు,విడియోలు వల్ల వైరస్ సోకదు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు జరిగినప్పుడు లైవ్ విడియోలు కుడా తీస్తుంటారు.


నా సందేహము ఏమిటంటే, ట్రస్ట్ ఆస్తిపాస్తుల/పంపకాల వ్యవహారం తేలేవరకు, ప్రభుత్వం లోని పెద్దలు గాని ట్రస్ట్ సభ్యులుగాని ప్రస్తుత బాబా గారి మంచి/చేడు చెప్పరేమో?

బాబాగారు కూడా ఎవరు కాదన్నా అవునన్నా మానవ దేహం కలిగి వుండటం చేత, రాష్ట్రంలో ఒక రొగి ఆరోగ్యం/భద్రత  పై యింత గందరగోళం జరుగుతుండటం వలన మానవ హక్కుల సంఘం స్వచ్ఛందం (సుమొటో)గా కేసు తీసుకొని, అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని  ప్రస్తుత యథార్ద స్థితిని తెలపమని కోరితే, వారి భక్తులకు, వారి దేహ సమకాలికులకు సందేహము నివౄత్తి చేసినట్లువుతారు.

ఏదిఏమైన, వారు కోలుకోని ప్రజలకు కనబడాలని ఆశిద్దాం.

11, అక్టోబర్ 2010, సోమవారం

సిగ్గు, లజ్జ లేని అధికార దాహం తొ భాజాపా/కాంగ్రెస్ నాయకత్వం...

2 వ్యాఖ్యలు
వెంకయ్యనాయుడు గారు ఇలా సెలవిచ్చారు... "కర్నాటకాలొ జరిగిన ముఖ్యమంత్రి విశ్వాసతీర్మాన విజయం  ప్రజాస్వామ్య విజయం" ఇంకనయం "రామ రాజ్యం" గెలుపు అనలేదు .

విప్ / ఓట్టింగ్ జరగకుండా పార్టీ ఫిరాయుంపుల చట్టం వర్తిస్తుందా? మూడోవొంతు సభ్యులు వేరే కుంపటి పెట్టుకునే అవకాశము ప్రస్తుత చట్టం కలిపిస్తుంది. స్వపక్షంలో అసమతి మూడొంతులు వుందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి? ఏవిధంగా  నిర్ణయించాలి?  ఎప్పుడు నిర్ణయించాలి? పార్టీ ఫిరాయుంపుల చట్టం స్వతంత్ర  సభ్యులకు ఎలా వర్తిస్తుందో బొత్తిగా బోదపడటం లేదు. ఇప్పుడు కర్నాటకాలో 11 మంది స్వపక్ష సభ్యులను ఐదగురు స్వతంత్రుల శాసనసభ సభ్యత్వం రద్దుచేసారు. అదికూడా విశ్వాస పరీక్షకు ముందు. ఇది ప్రజాస్వమ్యం కు పరాకాష్టంగా భావించొచ్చేమో! రేపు మరే శాసనసభలోనో విపక్ష సభ్యులను కూడా అనర్హత వేటు వేసి ఓట్టింగ్ జరిపించవచ్చేమో (స్వతంత్ర శాసన సభ్యులను అనర్హత వేటు వేసిన మాదిరిగా)!  ఎన్నికలప్పుడు ఎన్నికల అభ్యర్దులను నిలబేట్టేటప్పుడు వారికి పార్టీపై నిబద్దత వుందా లేదా అనేది కాకుండా, కేవలం గెలుపు గుర్రలు అనిచెప్పి ఎంత అవినీతి పరుడైనా, ఎంత అసాంఘిక  శక్తికైనా సీటు ఇచ్చినందుకు ప్రతిఫలమే ఈ ఫిరాయింపులు. మా శాసనసభ్యులను ప్రలొభ పెడుతున్నారు అని ప్రతిపక్షం పై ఏడుపు ఎందుకు? ప్రలొభపడేవాడు వుంటే ప్రలోభ పెట్టేవారూ వుంటారు. క్రితం సారి, ఈ భాజాపాయే కదా కాంగ్రేసు వారిని ప్రలొభ పెట్టి రాజీనామ చేయించి ఎన్నికలుకు వెళ్ళింది.

అవినీతికి మారుపేరైన జనార్ధన రెడ్డి సహాయంతో పాలన కొనసాగిస్తుండటం, భాజాప ని దేశవ్యాప్తంగా రామ పాలన సాధిస్తనికేనా? బాజాప అసలిరంగు ఈ అధికార దాహంతో బయటపడినందుకు దేశప్రజలు ఆనందపడాలి.  యిక కాంగ్రెస్ పార్టీ అధికారదాహం గురించి చెప్పె అంత వయసు నాకు లెదు.. ఎందుకంటే, 125 సంవత్సరాల నుండి దేశ ప్రజలు చూస్తూనే వున్నరు. అయినా వారికే ప్రజలు పట్టం గడుతున్నారు. అందుకేనేమో భాజాపా ధీమా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెసినా ఫర్వాలేదు అనుకుంటుంది.. కుహానా ప్రజాస్వామ్య వాదులంటే వీరుకాక మరెవరైనా వుంటారా?
 వెంకయ్యనాయుడు గారి ఉద్దేశం లోని ఈ ప్రజాస్వామిక విజయాన్ని చూసి మనం సిగ్గుపడదాం! ఎందుకంటే మనకు సిగ్గు లజ్జ వున్నాయి కదా.