వీలుంటే నా నాలుగు లంకెలు ...

Tuesday, July 26, 2011

చిన్న రాష్ట్రాలపై వివిధ పార్టీల లోగుట్టు

జాతీయ పార్టీలు
భాజాపా/ఆర్ ఎస్ ఎస్:
దేశాన్ని 100 రాష్ట్రాలగా విభజించాలని వారి ప్రతిపాదన. భాషాభిమానం/ప్రాంతీయాభిమానం ప్రజలకు పోయి.. అంతా హిందూవులం అనేభావం తో జనాలందరూ ఏకమయి వారికి అధికారం కట్టబెడతారాని వారి అబిప్రాయం. విభజించి పాలించంటంకూడా వీరి ఎత్తుగడే!

కాంగ్రేస్:
విభజించి పాలించాలి, ఎక్కువ ముక్కలు చెయ్యాలని వారి అభిప్ర్రాయం. బ్రిటీషర్స్ వీరికి ఆదర్శం. కాకపోతే సీమాంధ్రలో కాంగ్రేస్ కనుమరుగవుతుందోమని భయంతో తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తుంది. కేంద్రంలో సీమాంధ్రనాయకుల పలుకుబడీ కొంత కారణం.

మావోయిస్టులు:
చిన్న రాష్ట్రాలైతే వారి సాయిధ పోరాటాలకు అడ్డుతక్కువని, ప్రభుత్వాల అరాచకాలను ప్రజలలోకి ఈజిగా తీసుకువెళ్ళవచ్చని వీరి అభిప్రాయం. చిన్నరాష్ట్రాల ద్వారా విప్లవం త్వరగా తేవచ్చని కూడా వీరి అభిప్రాయం.

సిపిఐ:
విశాలాంధ్రకు అనుకూలం, భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది, గాని, తెలంగాణ క్యాడర్ ఎదురు తిరగటం చేత తప్పని పరిస్థితిలో ప్రత్యేక తెలంగాణ బాట. దేశంలో మిగిలిన చోట్ల వేర్పాటువాదానికి వ్యతిరేకం.

సిపియం:
దేశం మరిన్ని రాష్ట్రాలుగా ముక్కలవడం యిష్టంలేదు.. భాషాప్రాయిక్త రాష్ట్రాలకే కట్టుబడివుంది. గూర్ఖలాండ్ విషయంలోగాని,మరే ఏర్పాటువాదానికైనా వ్యతిరేకం.

ప్రాంతీయ పార్టీలు
తెరాసా:
కేవలం తెలంగాణాలో ఏకఛక్రాధిపత్యంతో అధికారం దక్కించుకోవడమే ఏకైక లక్ష్యం అని నిర్మహమోటంగా వేధికలపై ప్రకటించుకున్న పార్టీ. మరో రామోజీరావులాగ మీడియా మొఘల్, ఇంకో డిఎంకే పార్టీ లాగ కుటుంబపాలనకోసం ఎదురుచూపులు చూస్తున్న పార్టీ.

విప్లవ పార్టీలుగా చెప్పుకుంటున్న కొన్ని పార్టీలు (ఎమ్‌‌ఎల్-న్యూడెమక్రసీ, మొ..):
చిన్న రాష్ట్రాలపై సరైన అభిప్రాయాలు ఏదీనూ స్పష్టంగా తెలియజేయనప్పటికి, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలను అసరగాచూపైనా ప్రజాఊద్యమాలతో ప్రజలను చైతన్యపరిచి కమ్యూనిస్ట్ పార్టిని తెలంగాణాలో బలోపేతం చేయడం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకమంలేకపోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రజాస్వామ్య పరిథిలో ఏర్పడాలి.

వామపక్ష మేధావి వర్గంగా చెప్పుకుంటున్న కొంతమంది ఫ్రొఫెసర్లు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అదేదో విప్లవం వచ్చినట్లేనని వీరి ప్రచార ఆర్భాటం. తెలంగాణ వచ్చినా భారత రాజ్యాధికారణ పరిధిలో (ప్రజాస్వాయంలో)పనిచేయాలని తెలిసినా, జనుల సర్వ కష్టాలకు ప్రత్యేక తెలంగానే మందు అనేరీతిలో తెలంగాణాలోని పెట్టుబడీభూస్వామ్య వర్గానికి కొమ్ముకాస్తూ ఉధ్యమాలు చేయడం. పోరాటాల ద్వారా కాకుండా లాబీయింగ్ ద్వారా తెలంగాణ తెస్తామనేవారి చేతిలో పావులు వీరు.

టీడీపి, లోక్‌సత్తా, మిగతాపార్టీలు:
స్థిరమైన అభిప్రాయాలేమీ లేవు.. సమయానుకూలంగా మార్చుకుంటారు. వారివారి తాత్కాలిక వ్యక్తిగత లాభనష్టాల భేరీజుపై అభిప్రయాలు మారతాయి.

సమైఖ్యాంధ్రా నాయకులు:
కేవలం హైదరాబాదును రక్షించుకొనుటయే ఏకైక లక్ష్యంతో కృత్రిమంగా ఏర్పాటైన ఒక అనూహ్యవేధిక. వున్న ఊళ్ళలో అన్ని అమ్ముకోని హైదరాబాద్లో వ్యపారాలు చేస్తున్నవారు, బడాపారిశ్రామికవేత్తలు, రాజకీయ పెత్తందారీస్వభావగ్రస్థులు ఈ ఉధ్యమానికి దశ, దిశ నిర్ధేశుకులు.

ఫైన పేర్కన్న నా అభిప్రాయాలన్నీ నిజం కాకపోవచ్చు. వారివారి రహస్య అజెండాలు, వారి అంతర్గత సాహిత్యం చదివుండకపోవచ్చు, కాని సగటు పాఠకుడుగా వివిధ వార్తా సాధనాల ద్వారా నేను సంగ్రహించినది యిదే!

98 వ్యాఖ్యలు:

  1. చిన్న రాష్ట్రాలకి ఒప్పుకుంటే పశ్చిమ బెంగాల్‌లో గోర్ఖాల్యాండ్‌కి ఒప్పుకోవలసి ఉంటుందని సి.పి.ఎం. ఒప్పుకోలేదు, అంతే కానీ ఇంకొకటి కాదు. 1953లో ముందు సి.పి.ఐ. విశాలాంధ్రని సమర్థించిన మాట నిజమే. అప్పట్లో సి.పి.ఐ.కి తెలంగాణాలో & మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఎక్కువ సీట్లు వచ్చాయి. విశాలాంధ్ర ఏర్పడితే రెండు ప్రాంతాలలోనూ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్నారు. అందుకే సి.పి.ఐ. విశాలాంధ్రని సమర్థించింది. ఈ విషయం సి.పి.ఐ. అనుబంధ సంస్థ విశాలాంధ్ర వారు ప్రచురించిన పుస్తకంలోనే చదివాను. ఇప్పటి పరిస్థితులు వేరు కనుక సి.పి.ఐ. తెలంగాణాని సమర్థిస్తోంది.

    ReplyDelete
  2. సిపిఎం ఒక స్డాండు మీద ఉంది. తన అభిప్రాయాన్ని మార్పు కోవడం లేదు. ప్రభుత్వం తెలంగాణాను ఇస్తే వ్యతిరేకించం. గతంలో తాము వ్యతిరేకించిన శాసనమండలి బిల్లు, చివరకు పార్లమెంటులో సిపిఎం వ్యతిరేకించిన అణు ఒప్పంద బిల్లు కూడా ఆమోదానికి నోచుకుంది. తెలంగాణా కూడా ఇవ్వాలనే చిత్తశుద్ధి పాలకులకు ఉంటే నాన్చుడు ధోరణి అవసరం లేదు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయనవసరం లేదు.

    ReplyDelete
  3. స్టాండ్ అంటే ఏమిటి? పశ్చిమ బెంగాల్‌లో బుద్ధదేవ్ భట్టాచార్య గోర్ఖాల్యాండ్‌కి ఒప్పుకుని ఉంటే ఇక్కడ తెలంగాణా సి.పి.ఎం.కి అడ్డు అయ్యేదా?

    ReplyDelete
  4. ప్రవీణ్,
    నీ ఊహాజనిత అవగాహణకు నీకు నువ్వే సమధానం చెప్పుకో.. 'అలా అయివుంటే, ఇలా అయివుంటే' జరగనివాటిపై చర్చ దారిమళ్ళించడం పధ్ధతేనా? ఈ దేశంలో వార్తలు ఫాలోవుతున్న ఎవరికైనా తెలుసు.. సిపియం భాషాప్రాయిక్త రాష్ట్రాలకు కట్టుబడి వుందని కొన్ని వందల సార్లు యెన్నో వేదికలపై చెప్పింది. అయినా నువ్వు కోరుకుంటున్న ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా కంకణం కట్టుకున్న వారి వదిలి నీకు సిపియం పై వున్న వ్యతిరేకతను సంధర్భరహిరంగా విమర్శించడమే నీక పనా?

    ReplyDelete
  5. గోర్ఖాల్యాండ్ రాష్ట్రం కూడా భాషా ప్రయుక్త డిమాండే. గోర్ఖాలు మాట్లాడేది నేపాలీ భాష. అటువంటప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలని సమర్థించే పార్టీ గోర్ఖాల్యాండ్‌ని ఎలా వ్యతిరేకిస్తుంది?

    ReplyDelete
  6. పార్టిలమాట పక్కన పెడదాము ...పార్టీలెందుకు? ఎలక్షన్ల కోసం ..
    కూరగాయలను ముక్కలుగా ఎందుకు తరుగుతారు ?
    తొందరగా ఉడకాలని !
    ఇంట్లో అందరూ ఒక కంచములో ఎందుకు తినరు ?
    నోర్లనేవి ,రుచులనేవి వేరు వేరు కాబట్టి !
    పెళ్ళి అయిన పిల్లలకు వేరు వేరు ఇండ్లెందుకు?
    ఒకే ఇంటిలో కాపురం చేయలేరని !

    రాష్ట్రా ల విభజన ను విడగొట్టడములా చూసే వారందరూ మనమంతా భారతీయులమని మరిచిపోతున్నరు ..
    ఎనిమిది కోట్ల జనాభా కు ఉన్న పరిపాలనా ...నాలుగు కోట్ల మంది ఉన్నప్పటి పరిపాలనా ఒకటే ఉండాలి అనడం ప్రజలను పట్టించుఖొకపోవడం అవుతుంది
    ముప్పై కోట్లు ఉన్న అమెరికా లో యాభై రాష్ట్రాలు ఉన్నయి ...మనకు పరిపాలన సామాన్య ప్రజానీకానికి అందాలంటె వంద రాష్ట్రాలు కావాలి అప్పుడె జగన్,బాబు,లగటపాటి ,సుబ్బరామి రెడ్డి ,రాయపాటి లాంటి పెద్ద చేపలు తగ్గుతాయి..సి ఎం ...మన పక్కింటి సుబ్బారావు అవుతాడు ..తిక్క తిక్క చేస్తే లాగి రెందూ ఇచ్చుకోవచ్చు ..ఇప్పుడు అలా చేయలేమే...ఎక్కువ రాష్ట్రాలు నేటి పరిపాలనా అవసరం

    ReplyDelete
  7. @NARA SIMHA
    మీరు చెప్పింది బాగుంది. మరి నేను నా జిల్లానో నాఊరునో ప్రత్యేక దేశంగా గుర్తించమంట... దీనిని ఏవిధంగా వ్యతిరేకించగలరు? అలా అయితే మీరు అనుకున్నట్లు ముక్కలే కాకుండా కైమా కూడా చేయూచ్చు. చాలా చిన్నదేశాలు కూడా భారత్ కన్నా అభివృద్ది చెంది వున్నాయి. అప్పుడు 2జి అంత భారీ జాతీయ స్కామ్ ‌లే వుండవు కదా? మన పక్కింటి అప్పారావే ప్రధాని. మన పొరింగింటాయినే రాష్ట్రపతి. జవాబుతారీతనం, అభివృద్ది బాగా జరుగుతుంది కదా?

    మనలను ఉత్తరభారతీయులు ఏలుతున్నప్పుడు, అసలు మనము భారతీయులగా ఎందుకు కలిసి వుండాలో మీరు సూటిగా చెప్పగలరా? చిన్నదేశాలే అబ్బివృద్దికి మూలసూత్రం అనుకున్నప్పుడు, అన్ని ముక్కలూ అబివృధి జరిగితే అంతకన్నాఏమికావాలి? ప్రత్యేక దేశం అయితే, ముఖ్యమంత్రేమి ఖర్మ, ప్రధానిని,రాష్ట్రపతిని కూడా మన బంధువలనే చేసుకోవచ్చు కావలసినవి తన్ని చేయుంచుకోవచ్చు.

    ReplyDelete
  8. ఓసారి తెలకపల్లి రవి గారే ఇన్నయ్యని విమర్శిస్తూ ఇలా అన్నారు "ప్రజలు ఆర్థిక అంశాల గురించి ఆలోచించకుండా చెయ్యడానికి కొందరు మానవవాదం, మానవ విలువలు లాంటి పేర్లు ఉపయోగిస్తున్నారు" అని. అదే విమర్శ భాషా సమైక్యత పేరు చెప్పుకునేవాళ్ళకి ఎందుకు వర్తించదు?

    ReplyDelete
  9. @ప్రవీణ్
    ప్రజలు ఆర్థిక అంశాల గురించి అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక దేశంగా ఎందుకు కోరుకోవడంలేదు... ఢిల్లీలో పాలకులేమి తెలంగాణావారేమీ కాదుకదా? అప్పుడు స్వాభిమానం, స్వపరిపాలన గుర్తుకురావా?

    ReplyDelete
  10. ఒకఱితో నాకు నిమిత్తం లేదు. నాకు సిద్ధాంతాలు లేవు. అభీష్టాలు మాత్రమే ఉన్నాయి. నా మనసులో మాట ఏంటంటే- ఆంధ్రప్రదేశ్ ఇలాగే వేలాది సంవత్సరాల పాటు సమైక్యంగా ఉండాలి. ఈ జాతికి UNO లో సభ్యత్వం ఉండాలి. మనకొక తెలుగు ఎయిర్‌లైన్స్ ఉండాలి. తెలుగు ఈ గడ్డమీద ఏకైక అధికారభాషగా, వ్యాపారభాషగా, విద్యా-పరిశోధనల మాధ్యమంగా ఉండాలి. తెలుగువాళ్ళ ఆదాయం ప్రతినెలా సూట్‌కేసుల రూపంలో ఆయా అధిష్థానాలకు వెళ్ళకుండా తెలుగుప్రజలకే ఉపయోగపడాలి. తెలుగువాళ్ళూ, తెలుగుభూమీ, తెలుగు వనరులూ బయటి రాష్ట్రాలవారికి కాకుండా తెలుగువారికే ఉపయోగపడే రోజు రావాలి.

    ReplyDelete
  11. @వాసవ్య

    ఎందుకంటే ఈ దేశం వలన తమకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు కనుక. ఈ రాష్ట్రంలో తాము ఒక మైనారిటీ ఐపోయి మెజారిటీ వర్గం చేత విచక్షణకు గురి కాబడుతున్నాము, రెండో తరగతి పౌరులుగా మారుతున్నాము అని భావించడం వలన.

    ReplyDelete
  12. @LBS తాడేపల్లి

    >>> తెలుగువాళ్ళూ, తెలుగుభూమీ, తెలుగు వనరులూ బయటి రాష్ట్రాలవారికి కాకుండా తెలుగువారికే ఉపయోగపడే రోజు రావాలి.

    తెలుగువాళ్ళూ, తెలుగుభూమీ, తెలుగు వనరులూ కేవలం ఆంధ్రా ప్రాంతం వారికే ఉపయోగపడుతున్నాయి. అదే మేం స్వంత రాష్ట్రం కోరడానికి కారణం.

    ReplyDelete
  13. @శ్రీకాంతాచారి
    మంచిది... మరి స్వతంత్ర దేశంగా వుండాలని కోరుకోవచ్చుకదా? భారత దేశంలో భాగమైతే, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రనిధుల కెటాయింపులో తేడాలు జరిగితే? అప్పుడు పరిస్థితి ఏమిటి?

    ReplyDelete
  14. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి విసా, పాస్‌పోర్ట్ అవసరం కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడానికి విసా, పాస్‌పోర్ట్ అవసరం ఉండవు కదా. ఒరిస్సా తెలంగాణా కంటే వెనుకబడిన ప్రాంతం. కానీ ఒరిస్సా ప్రత్యేక దేశమైతే అక్కడ ఉన్న మా బంధువులతో మాకు బంధుత్వాలు తెగిపోతాయి కనుక ప్రత్యేక ఒరిస్సా దేశం ఏర్పడితే నాకు నష్టమే. రాష్ట్ర విభజన అంశం అలా కాదు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ఏ ప్రాంతంవాళ్ళకైనా ఏ ప్రాంతానికాఇనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది. బెల్జియం దేశంలో ఉన్న డచ్‌వాళ్ళు హోలాండ్‌లో ఉన్న తమ బంధువులని కలవాలన్నా పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ఇండియాలో అలాంటి పరిస్థితి రాదులెండి.

    ReplyDelete
  15. @ప్రవీణ్
    నేపాల్ వెళ్ళడానికి వీసా అక్కర్లెదు....
    యివ్వన్ని పేపర్ వర్కే కదా వెసులబాటు యివ్వవచ్చులే. అంటే, నీ ఉధేశప్రకారం వీసా, పాస్‌పోర్టులు ఖర్చు తగ్గించుకోవటం కోసం మాత్రమే ప్రత్యేక దేశం కోరుకోవడం లేదనుమాట. బాగా చెప్పావు ప్రవీణ్!

    ReplyDelete
  16. @వాసవ్య,

    "జరిగితే?" అనే ఊహలతో కూడిన ఉద్యమాలు ఎక్కడా జరగవండి, సమైక్యాంధ్ర వంటి కృత్రిమ ఉద్యమాలు తప్ప. ఒకవేళ "జరిగితే" జరిగినప్పుడు ఆలోచిస్తారు.

    ReplyDelete
  17. ఒక దేశం ఏర్పాటు చెయ్యడం ఒక రాష్ట్రం ఏర్పాటు చేసినంత సులభం కాదు. రష్యాలో స్టాలిన్ యూదుల కోసం బిరోబిద్ఝన్ ప్రాంతాన్ని ప్రత్యేక స్వయం పరిపాలిత రాష్ట్రం (autonomous oblast)గా ఏర్పాటు చేశాడు. కానీ దక్షిణ రిపబ్లిక్‌లని ప్రత్యేక దేశాలుగా ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోలేదు. తన సొంత ప్రాంతమైన జార్జియాని కూడా ప్రత్యేక దేశంగా ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోలేదు. అంతర్గతంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నా దేశ సమైక్యతకి ముప్పు రాదు కానీ చిన్న దేశాలు ఏర్పాటు చెయ్యడానికే వంద రకాల ప్రశ్నలు ఉదయిస్తాయి.

    ReplyDelete
  18. ఇలాంటి అసంబద్దమయిన వాదనలు లేవదీసి పొడిగించడం ఏమిటో నాకర్ధం కాదు. ఈదేశం నుండి విడిపోవాలనడం దేశం రాజ్యాంగ, సార్వభౌమ వ్యతిరేక చర్య. ఒక రాష్ట్రం కావాలనుకోవడం రాజ్యాంగబద్దమయిన డిమాండ్. ఒక రాజ్యాంగబద్దమయిన డిమాండ్‌ను వ్యతిరేకించడానికి కారణం దొరక్క మరో రాజ్యాంగ విరుద్దమయిన డిమాండ్ ఎందుకు చెయ్యడం లేదనడంలో హేతువు సీపీఎం మేధావులే చెప్పాలి.

    ఇంకో విషయం..ఈదేశానికి ప్రధానమంత్రిగా ఒక తెలంగాణావాడు ఐదేళ్ళు పని చేశాడు. కానీ ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణావారు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులను సంవత్సరం తిరక్కుండానే గొడవలు సృష్టించి దించివేశారు, మరి సమస్య ఎక్కడుందో మేధావులకే తెలియాలి. కేవలం తమ సొంత పార్టీల రాజకీయలబ్ది కొరకు విశాలాంధ్ర ఉద్యమం లేవదీసిన సీపీఎంకు ప్రజాఉద్యమాలంటే పట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు.

    ReplyDelete
  19. విశ్వరూప్ గారు, 1956లో విశాలాంధ్ర ఏర్పడిన టైమ్‌లో సి.పి.ఎం. పార్టీ లేదు. అప్పట్లో సి.పి.ఐ. ఉండేది. అప్పట్లో విశాలాంధ్ర ఏర్పాటుని సమర్థించిన సి.పి.ఐ. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణాని సమర్థిస్తోంది.

    ReplyDelete
  20. @LBS తాడేపల్లి

    >>> తెలుగువాళ్ళూ, తెలుగుభూమీ, తెలుగు వనరులూ బయటి రాష్ట్రాలవారికి కాకుండా తెలుగువారికే ఉపయోగపడే రోజు రావాలి.

    తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలు గా విడిపోతే వనరులు తెలంగాణాలోని తెలుగువారికి, ఆంధ్రాలోని తెలుగువారికి న్యాయంగా పంచబడతాయి. మీరు నిజంగా తెలుగు జాతి మొత్తాన్ని ప్రేమిస్తున్నట్టయితే ఆ పరిణామాన్ని తప్పక కోరుకుంటారు.

    ReplyDelete
  21. @విశ్వరూప్
    "దేశం రాజ్యాంగ, సార్వభౌమ వ్యతిరేక చర్య. ఒక రాష్ట్రం కావాలనుకోవడం రాజ్యాంగబద్దమయిన"

    ఈ మధ్యకాలంలో తెలంగాణ వెనకబడింది కనుక ప్రత్యేక తెలంగాణకోసం కాకుండా, స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక తెలంగాణ అని వింటున్నా.. మరి ఢిల్లీలో అవి తాకట్టు పెడతానికైతే మీకు ఓకేనా? అసలు దేశ సార్వభౌమాధికారాన్ని /రాజ్యాధికారానికి ఎవరైన ఎందుకు కట్టుబడాలి? స్వపరిపాలన చేసుకోవచ్చుకదా?
    పరిపాలనా సౌలభ్యం/వెనకబడిన ప్రాంతం కోసం ప్రత్యేకం అంటే విషయంవేరు.. కాని తెలంగాణ మేధావులు స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక తెలంగాణ అంటున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక దేశ డిమాండే నయం.

    ReplyDelete
  22. @ప్రవీణ్
    "చిన్న దేశాలు ఏర్పాటు చెయ్యడానికే వంద రకాల ప్రశ్నలు ఉదయిస్తాయి."

    వంద ప్రశ్నలేమి ఖర్మ, వెయ్యప్రశ్నలైనా చర్చలద్వారా పరిష్కరించుకుందాం... స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక దేశం గా నాజిల్లానో నాఊరునో ఎందుకు చేసుకోకూడదో చెప్పు...

    ReplyDelete
  23. @LBS తాడేపల్లి

    ఎన్‌టీఆర్ "తెలుగు-దేశం" పార్టీనే స్థాపించారు. మీరు ఏకంగా తెలుగు 'దేశాన్నే' ఏర్పాటు చేసేటట్లున్నారే!

    ReplyDelete
  24. వెనుకబడ్డంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు.. కానీ ఉద్దేషపూర్వకంగా వెనుకబడేస్తే ఏంచెయ్యాలి? వివక్షతో వెనుకబడేయడం మాత్రమే కాదు, పొరపాటున తెలంగాణ ప్రాంతం వాడు అధికారంలోకొస్తే కుతంత్రాలు పన్ని దింపేస్తుంటే ఏంచెయ్యాలి?

    ఢిల్లీలో అలా జరుగుతుందని మేం భావించడం లేదు, ఒకవేళ మీరు అలా అనుకుంటే, "అసలు దేశ సార్వభౌమాధికారాన్ని /రాజ్యాధికారానికి ఎవరైన ఎందుకు కట్టుబడాలి" అని మీరునకుంటే మీరా ఉద్యమం చెయ్యండీ మీప్రాంతంకోసం, మాకక్కరలేదు. దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ముందే చెప్పుకున్నాం కదా..తెలంగాణవాడు ఐదేళ్ళు ప్రధానమంత్రిగా కాగలిగాడు కానీ ఏడాది ముఖ్యమంత్రి కాలేకపోయాడని..మరి మాకేది అవసరమో మాకు తెలుసు కనక ఎక్కడ స్వయంపాలన కావాలో అక్కడే ఉద్యమం చేస్తున్నాం. మీక్కావాలిస్తే చెయ్యండి..బ్లాగుల్లో ప్రత్యేకాంధ్ర దేశం కావాలనే వారికి తక్కువలేదు, వారితో మీరూ చేరొచ్చు. వాదన అసంబద్దమయినది అని అర్ధమయినతరువాత కూడా ఇంకా పొడిగించడం అవసరమంటారా?

    మీరు స్వతహాగా హేతుబద్దంగానే ఆలోచిస్తారని మీ ఇతర పోస్టులద్వారా తెలుస్తోంది. మన రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం, ప్రాంతీయత హేతువును పక్కదారి పట్టనీయకూడదు.

    ReplyDelete
  25. @విశ్వరూప్
    న్యాయమైన డిమాండైతే రాజ్యాంగాన్ని కూడా మార్చే వెసులుబాటు వుంది కదండీ మనకి. రాజ్యాంగబద్దమయిన డిమాండ్ కాకపోయినా మనం రాజ్యాంగాన్ని మార్చుకుందాం.
    స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక దేశం గా నాజిల్లానో నాఊరునో ఎందుకు చేసుకోకూడదో చెప్పండి. "మరో రాజ్యాంగ విరుద్దమయిన డిమాండ్" అని తప్పించుకోకుండ.

    ReplyDelete
  26. >>స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక దేశం గా నాజిల్లానో నాఊరునో ఎందుకు చేసుకోకూడదో చెప్పండి.>>

    చెయ్యండి..మేమొద్దన్నామా?

    ReplyDelete
  27. @విశ్వరూప్
    అంటే మీ దృష్టిలో స్వపరిపాలన,ఆత్మగౌరవం కోసం ప్రత్యేక దేశ విభజన డిమాండ్ లో న్యాయం ఉందంటారా?

    ReplyDelete
  28. ఆంధ్ర ప్రాంత నాయకులని తెలంగాన వాళ్ళు కుట్రలు చేసి దింపివేసిన సందర్భాలు ఉన్నాయి.బ్రహ్మానంద రెడ్డినిమార్పించింది తెలంగాన వాళ్ళు కాదా?
    ప్రధాని గా ఐదేళ్ళూ తెలంగాన వాడే ఉన్నాడు తెలంగాన వాళ్ళు మా ఆంధ్ర వాడిని ప్రధాని అవ్వకుండా కుట్ర చేశారు అంటే , మీకెలా ఉంటుంది?ఇంతకీ ఐదేళ్ళు ప్రధని గా ఉన్నాయనను ఎం పీ గా పోటీ లేకుండా గెలిపించింది మా ప్రాంతం వాళ్ళే! మరి రాష్ట్రం లో కుట్ర చేసిన మనస్థత్వం ఉంటే, తరువాత ఎలా గెలిపిస్తారు? ఏదో ఒరగబెడతారనా? నంద్యాల కు ఏమి ఒరగబెట్టారు? ఒక జిల్లా పరిషద్ అధ్యక్షులుగా ఓక సంవత్సరం మాత్రమే పని చేసినతను, ముఖ్యమంత్రి గ ఐదు సంవత్సరాలు పని చేస్తే, జిల్లా లెవల్లో అతనికి వ్యతిరేకం గా కుట్ర జరిగింది అనుకోవాలా? ఒక స్థాయి లో ఒక కాలం లో ఉండే పరిస్థితులు వేరొక స్థాయి లో వేరొక కాలం లో ఉండవు.

    ReplyDelete
  29. గూర్ఖా ఉద్యమానికి భాష ప్రాతిపదిక అని ఆ ఉద్యమ నాయకులెప్పుడూ చెప్పలేదు. అది సాంస్కృతిక, అభివృధ్ధి కారణాలతో జరుతునదని మాత్రమే చెప్తున్నారు.ఇంటర్నెట్ మొత్తం వెతికినా ఆ ఉద్యమానికి భాషా ప్రాతిపదిక అని నిరూపించలేరు.

    ReplyDelete
  30. మల్లీ మొదటికి వచ్చారా..మీకు న్యాయమైనదని తోస్తే, మీరు ఒక దేశ సార్వభౌమత్వానికి లోబడి ఉండాలని నమ్మకపోతే మీరు చెయ్యండి అని చెప్పాకదా? అయినా ఆంధ్రా వారు ఏది చేస్తే అదే న్యాయం కదా...న్యాయాన్యాయాలు మన అవసరాలను బట్టి మారుతాయి. మీరు స్వయం పరిపాలన, ఆత్మగౌరవం అనే నినాదాలతోనే మద్రాసు నుండి వేరుపడ్డారు. అదికూడా కేవలం పొలిటికల్ ఈక్వేషన్లవల్ల ఒక్కసారి ఆంధ్రా నాయకులు ముఖ్యమంత్రి కాలేకపోతే.

    1) ఒక ప్రాంతం ఉద్దేషపూర్వకంగా వివక్షకు గురయినప్పుడు, వెనక్కి నెట్టివేయబడినప్పుడు స్వయం పరిపాలన ఆశించడం తప్పుకాదు.

    2) తెలంగాణ ఏర్పాటుకు స్వయంపాలన ఒకానొక కారణం మాత్రమే, అదే కారణం కాదు. దీనికొక చారిత్రక నేపధ్యం ఉంది, ప్రజల ఆకాంక్ష ఉంది, కల్లముందు కనపడే వివక్ష ఉంది, రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలు ఉనాయి, ఎస్సర్సీ సిఫార్సు ఉంది, ఒక స్వతంత్ర రాష్ట్రంగా మనగలిగేన్ని వనరులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని, వాటిపై మీఅవగాహన పెంచుకుని వాదనకు దిగితే బాగుంటుంది.

    ఇప్పటికే మీవాదన అసంబద్దమయినదని మీకర్ధమయిందనుకుంటాను.

    ReplyDelete
  31. @విశ్వరూప్
    "స్వయం పరిపాలన ఆశించడం తప్పుకాదు"
    అదే నాకు అస్సలు అర్థం అవ్వంది. స్వయం పాలన చేసుకోవడానికి రాష్ట్రమే ఎందుకు? స్వతంత్ర దేశానే కోరుకోవచ్చుకదా?

    "చారిత్రక నేపధ్యం ఉంది , ప్రజల ఆకాంక్ష ఉంది"
    నా కోరిక, నా యిష్టం చెల్లదు... దేనికైన శాస్త్రీయ దృక్పథం/ప్రాదిపదిక తో జరగాలిగాని,"ఆకాంక్ష, కోరిక, ఆత్మభిమానం" వంటి ఊకదంపుడు పదాలు ఆపండి.

    పివీ నరసింహారావు ప్రధానిగా అయిదేళ్ళు చేసారు అప్పుడు రాని స్వపరిపాలన,ఆత్మభిమానం యిప్పుడెందుకు గుర్తొచ్చాయో? అయిన అయిదేళ్ళలో ఏమైనా తెలంగాణాకి వెలగబెట్టారా?
    వ్యక్తి ఎక్కడనుండి వచ్చాడు అనేది కాదు ముఖ్యం, ఏ వర్గానికి చెందినవాడు? ఎవరకి ఉపయోగపడుతున్నాడన్నది ముఖ్యం. కేసీఆర్ ని చూడండి. తెలంగాణ ప్రజలు ఏమీ చందాలు వేసుకొని టీవీ చానల్,న్యూస్ పేపర్ పెట్టలే, కేసీఆర్ సంపాదనతో మాత్రమే పెట్టారు. అంత సంపాదన ఈ అనతి కాలంలో ఎలా సంపాదించ గలిగారు? దోపిడీ చేసేది అదేప్రాంతం వాడైతే మీకు ఓకేనా?

    ReplyDelete
  32. తెలంగాణా నుంచి ఇప్పటిదాకా ఇద్దరే ముఖ్యమంత్రులు, వారిని కూడా పూర్తి కాలం ఉండనీయలేదు అనే మిత్రులారా? అంజయ్యది ఏ ప్రాంతమో కాస్త చెప్తారా?

    ReplyDelete
  33. ఆంధ్రుడు గారు, సాంస్కృతిక ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు. కర్నాటకలోని కొడగు, అస్సాంలోని బోడోల్యాండ్ ప్రాంతాలని ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఎందుకంటే ఆ డిమాండ్లు సాంస్కృతిక ప్రాతిపదికన వచ్చిన డిమాండ్లే. సంస్కృతి లేదా జాతి మారినప్పుడు భాష కూడా మారే అవకాశాలు ఎక్కువ. అందుకే గోర్ఖాలు నేపాలీ భాష మాట్లాడడం కనిపిస్తుంది. కొందరు భాష ఒక్కటే ప్రజలని ఏకం చేస్తుందంటున్నారు. అది నిజమైతే గోర్ఖాల్యాండ్‌ని నేపాల్ దేశంలో కలపాలి కదా.

    ReplyDelete
  34. వాసవ్య,

    (దోపిడీ చేసేది అదేప్రాంతం వాడైతే మీకు ఓకేనా? )

    మన ప్రా౦త౦ వాడు అక్కడెక్కడో ప్రభుత్వపెట్టుబడులు పెడుతూ, అక్కడే దోచుకు౦టూ మన ప్రా౦తాలు గాలికి వదిలేస్తే మీకు ఓకేనా .మనదగ్గర దోచుకోడానికే౦ లేదు కనుక, మనవాళ్ళకి అక్కడ కెసిఆర్ తో పాటు దోచుకోనివ్వాలన్నమాట. లేక కెసిఆర్ కన్నా మనవాళ్ళకి దోచుకోడ౦ బాగా వచ్చు కాబట్టి మనవాళ్ళే దోచుకోవాలని మీరు ఆశిస్తున్నారా ?

    ReplyDelete
  35. అజ్ఞాత, అంజయ్య కూడా ఎక్కువ కాలం పని చెయ్యలేదనుకుంటాను.

    ReplyDelete
  36. దోపిడీ ఎవరు చేసినా అది దోపిడీయే కానీ తెలంగాణా అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టకుండా కేవలం హైదరాబాద్ హంగులకే డబ్బులు ఖర్చు పెట్టింది సమైక్యాంధ్ర పాలకులే కదా.

    ReplyDelete
  37. "కేవలం హైదరాబాద్ హంగులకే డబ్బులు ఖర్చు పెట్టింది సమైక్యాంధ్ర పాలకులే కదా."
    పోన్లెండి సమైక్యాంధ్ర పాలకులు హైదరాబాద్ ని అభివృద్ధి చేసినట్టు అంగీకరించారు. ఇక హైదరాబాద్ ఎలాగూ తెలంగాణా లో అంతర్భాగమే అని మీరు అంటారు. అంటే తెలంగాణాని సమైక్యాంధ్ర పాలకులు అభివృద్ధి చేసినట్టు మీరే ఒప్పుకున్నారు.

    ReplyDelete
  38. నిజానికి ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన తెలంగాణా ముఖ్యమంత్రులు

    పి.వి నరసింహా రావు - కరీంనగర్
    జలగం వెంగళరావు - ఖమ్మం
    మర్రి చెన్నారెడ్డి - రంగారెడ్డి జిల్లా
    టంగుటూరి అంజయ్య - మెదక్

    కానీ తెలంగాణా వాదులకి అదేంటోగానీ పి.వి, చెన్నా రెడ్డి మాత్రమే గుర్తుంటారు. మిగిలిన వాళ్ళని కన్వీనియంట్ గా మరిచిపోతారు.

    ReplyDelete
  39. జలగం వెంగళరావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర సోపేరు. వాళ్ళ కుటుంబం నిజాం రాష్ట్రంలో సరిహద్దు గ్రామమైన బయ్యన్నగూడెంలో స్థిరపడింది. జలగం వెంగళరావు బంధువులలో ఎక్కువ మంది ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నారు కానీ ఖమ్మం జిల్లాలో లేరు.

    ReplyDelete
  40. [పోన్లెండి సమైక్యాంధ్ర పాలకులు హైదరాబాద్ ని అభివృద్ధి చేసినట్టు అంగీకరించారు. ]

    అవును అభివృద్ధి పేరుతొ సగ౦ డబ్బు జోబిలో వేసుకొ౦ది కూడా సమైక్య పాలకులే

    ReplyDelete
  41. జలగం వెంగళరావు కెసిఆర్ కులానికి చెందినవాడు కావడం వల్ల అతను పుట్టినది తెలంగాణాలో అనుకున్నట్టు ఉన్నావు. వైజాగ్‌లో జలగం వెంగళరావు కుటుంబ సభ్యుల ఇళ్ళు ఏ వీధుల్లో ఉన్నాయో కావాలంటే చూపించగలను. నేను ఎలాగూ ఉండేది వైజాగ్‌కి వంద కిలోమీటర్ల దూరంలోనే కదా.

    ReplyDelete
  42. @వాసవ్య

    దేశంలో మిగతా ప్రాంతాలన్నీ ఏకమై మాకన్యాయం చేస్తే ప్రత్యేక దేశం అడుగుదాం, ప్రస్తుతానికి మాకు మిగతా ప్రాంతాలు మద్దతిస్తున్నాయి, అన్యాయం చెయ్యడం లేదు. మీరు చేస్తారా ప్రత్యేక దేశం కోసం ఆందోళన?

    మన దేశంలో ఇప్పటిదాకా శాస్త్రీయ దృక్పధంతో ఏర్పాటయిన రాష్ట్రం ఏదయినా ఉందా? భాషా పరంగా చెయ్యడం శాస్త్రీయతా? అలా అయితే ఒక ముప్పై కోట్ల మంది ఒకే భాష మాట్లాడితే ఒకే రాష్ట్రంగా ఉండాలా? ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్ష కంటే ప్రాతిపాదిక ఇంకోటి ఉందా? ఒక శాస్త్రీయ దృక్పధంతో వేసిన ఎస్సర్సీ తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తే కొందరు పెద్దల కారణంగా ఆంధ్రాతో కలిసింది. అలా కలవడం కొన్ని శరతులతో కూడిన ఒప్పందాలద్వారా జరిగింది.. ఆ షరతుల ఉల్లంఘణ ఒక్కటి చాలు రాష్ట్ర ఏర్పాటును సమర్ధించడానికి.

    /**పివీ నరసింహారావు ప్రధానిగా అయిదేళ్ళు చేసారు అప్పుడు రాని స్వపరిపాలన,ఆత్మభిమానం యిప్పుడెందుకు గుర్తొచ్చాయో?అయిన అయిదేళ్ళలో ఏమైనా తెలంగాణాకి వెలగబెట్టారా?**/

    అసలు ఇది మీవాదనకే హైలైటు. తెలంగాణావాడే ప్రధాని అయినప్పుడు ఇంకా స్వయంపాలన కావాలని ఎందుకంటారు? అయినా అప్పుడెందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది అనేది శస్త్రీయ వాదన? అప్పుడు అడిగిఉంటే మీకు న్యాయబద్దమనిపిస్తుందా?

    ఎవరైనా ప్రధానమంత్రి అయితే అతను దేశానికి ప్రధానమంత్రి గా పని చెయ్యాలి. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా పని చెయ్యాలి, ప్రాంతానికి ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో కాదు. పీవీ అలాగే చేశాడు. ఒకరు ఎలా పని చెయ్యాలో అలాగే చేస్తే దానికి కూడా కంప్లైంటా? సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అలాగ చెయ్యడంలేదు కాబట్టే ఇలాంటి డిమాండ్‌లు.

    /** వ్యక్తి ఎక్కడనుండి వచ్చాడు అనేది కాదు ముఖ్యం, ఏ వర్గానికి చెందినవాడు? ఎవరకి ఉపయోగపడుతున్నాడన్నది ముఖ్యం.**/
    పెద్ద పొరపాటు వాదన. ఆఖరుకు మీ సీపీఎం పరిపాలించిన రాష్ట్రంలో కూడా పెట్టుబడీదారులకే కొమ్ముగాశారు, అదిప్పుడే మారదు. కానీ ఒక ప్రాంతం వాడు అధికారంలోకి వస్తే వాడెలాంటివాడయినా నిధులనూ, నీల్లనూ మరో ప్రాంతానికైతే దోచివ్వడు. ఎక్కడి నిధులూ, నీల్లూ అక్కడే ఖర్చు చేస్తాడు. పైగా రాష్ట్రం చిన్నదయితే బలహీన వర్గాలకు అధికారం అందడం సులభమవుతుంది. అది అగ్రకులాల పార్టీ అయిన సీపీఎంకు మిగుడు పడదనేది వేరేవిషయం.

    ReplyDelete
  43. రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత నాయకత్వం కోసం పివి నరసింహారావుకి పదవి ఇచ్చారు కానీ రాజీవ్ గాంధీ బతికి ఉంటే తెలంగాణా వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యేవాడా? ఒక వేళ పివి నరసింహారావు తన ప్రాంతంపై పక్షపాతం చూపిస్తే అతన్ని ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించే అధికారం పార్లమెంట్‌కి ఉంది. అందుకే పివి నరసింహారావు తెలంగాణా ప్రధాన మంత్రిగా పని చెయ్యలేదు.

    ReplyDelete
  44. అజ్ఞాతా మీరు చెప్పినట్టు వెంగళ రావు ఖమ్మం జిల్లా వాడు కాదనుకున్టానండీ అతను ఖమ్మం జిల్లా లో నియోజకవర్గం నుండి ఎన్నికైన మాట మాత్రం వాస్తవం. కొన్ని చోట్ల అతను ఖమ్మం జిల్లాకు చెందిన వాడికిందే ఉంది. ఉదాహరణకి ఈ లింక్ చూడండి.
    http://en.wikipedia.org/wiki/Jalagam_Vengala_Rao

    ReplyDelete
  45. వికీపీడియాని ఎవరైనా ఎడిట్ చెయ్యొచ్చు. జలగం వెంగళరావు చిన్నప్పుడు నివసించిన ఇల్లు సోపేరు గ్రామంలో ఇప్పటికీ ఉంది. రాజాం పట్టణంలో వెంగళరావు కోలనీ పేరుతో ఒక వీధి ఉంది. వైజాగ్‌లో జళగం వెంగళరావు తముళ్ళు, మరదళ్ళు కట్టిన బిల్డింగ్‌లు కూడా ఉన్నాయి. మీలో ఎవరు వైజాగ్ వచ్చినా, రాజాం వచ్చినా చూపిస్తాను. రాజాం శ్రీకాకుళం నుంచి కేవలం 40 కిలో మీటర్లే.

    ReplyDelete
  46. " వైజాగ్‌లో జలగం వెంగళరావు కుటుంబ సభ్యుల ఇళ్ళు ఏ వీధుల్లో ఉన్నాయో కావాలంటే చూపించగలను"
    అజ్ఞాత గారు పూర్తిగా అవాస్తవాలు మాట్లాడలేదు. కొంత వరకు జలగం వెంగళ రావు విషయంలో వారు చెప్పింది కరెక్టే. సందు దొరికింది కదా అని మాట్లాడుతున్నావు కదా వైజాగ్ లో జలగం వెంగళరావు కుటుంబ సభ్యుల ఇళ్ళు ఏ ఏ వీధుల్లో ఉన్నాయో చెప్పు ప్రవీణ్. అలాగే కే.సి.ఆర్ పూర్వీకుల ఇళ్ళు కూడా మీ ప్రాంతంలోనే ఉంది ఉంటాయిగా. బొబ్బిలి నుంచి శ్రీకాకుళం ఎంత దూరమేంటి? ఆ వివరాలు కూడా జనాలకి చెప్తే సంతోషం.

    ReplyDelete
  47. వెలమ దొరలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉన్నారు. తమిళ నాడు, మహారాష్ట్రలలో కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఎన్నికైన వెలమ సర్పంచ్‌లందరినీ ఆంధ్ర ప్రదేశ్‌కి తోలెయ్యడం సాధ్యమైతే కెసిఆర్‌ని కూడా కోస్తా ఆంధ్రకి తోలెయ్యడం సాధ్యమే నాయనా.

    ReplyDelete
  48. ఇదొకసారి చదువు ప్రవీణ్
    http://dc.deccanchronicle.com/hyderabad/kcr-forefathers-andhra-066

    ReplyDelete
  49. ఒక ప్రాంతంలో కరువు కాటకాలొచ్చినప్పుడు ఆ ప్రాంతంవాళ్ళు ఇంకో ప్రాంతానికి వలసవెళ్ళడం మామూలే నాయనా. రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయిన రాజ్యానికి చెందిన సైనికులు కూడా వలసవెళ్ళేవాళ్ళు. ఆ మాటకొస్తే కెసిఆర్ పూర్వికులది నెల్లూరు జిల్లా వెంకటగిరి. వెంకటగిరి వెలమల బంధువైన పెద్దరాయునికి గోల్కొండ కుతుబ్ షాహీలు రాజాం కోటని బహుమతిగా ఇస్తే వెంకటగిరి వెలమలు రాజాంలో స్థిరపడ్డారు. 1757 బొబ్బిలి యుద్ధం తరువాత వీళ్ళలో చాలా మంది ఈ ప్రాంతం వదిలేసి నూజివీడు, తెలంగాణాలకి వలసపోయారు. సోపేరులో మాత్రం కొద్ది మంది వెలమలు మిగిలారు. చరిత్ర నీ కంటే నాకు బాగా తెలుసు నాయనా.

    ReplyDelete
  50. @అగ్నాత

    నేను ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రులను కుట్రజేసి దించారన్నాను గానీ తెలంగాణనుండి ఇద్దరే ముఖ్యమంత్రులయ్యారనలేదు.

    @others
    Jalagam's whereabouts is not relevant here. let us not dilute the topic and divert the attention.

    ReplyDelete
  51. సమైక్యత గురించి కబుర్లు చెప్పేవాళ్ళకి తెలంగాణా ప్రజల మీద ప్రేమ ఉంటే తెలంగాణా వీరుడు తుర్రెబాజ్ ఖాన్ గురించి స్కూల్ పాఠాలలో ఎందుకు వ్రాయలేదో సమైక్యవాద పాలకులనే అడగండి. హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీ పై దాడి చేసి బ్రిటిష్‌వాళ్ళ మోచేతి నీళ్ళు తాగిన నిజాం సైనికులకి ఓ గ్రామంలో దొరికిపోయి తరువాత చెరసాల నుంచి తప్పించుకుని పారిపోతూ నిజాం సైనికుల కాల్పుల్లో నేలకొరిగిన త్యాగధనుడు అతను. అతని గురించి స్కూల్ పాఠాలలో వ్రాయమంటే తెలంగాణావాని గురించి ఏమి వ్రాస్తాం అనుకుంటారు మన పాలకులు. ఆర్థిక అంశాలలోనే కాదు, చారిత్రక అంశాలలో కూడా సమైక్యాంధ్ర పాలకుల కపటత్వం ఇలాగే బయట పడుతుంది.

    ReplyDelete
  52. జలగం వెంగళ్రావ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కు ముందే నిజాం ప్రాంతం లో స్థిరపడ్డాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకర్లతో పోరాటం చేసాడు. మన రాజకీయ ఆరోపణలకు అడ్డు అని చెప్పి ఆయన ప్రాంతాన్ని మార్చటం తెలంగాణ వాదులకు పరిపాటే. జలగం తెలంగాణ వాడు కాకపోతే కేకే కూడా కాడు. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతం నించి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డవాడే.. కాళోజీ కూడా కాదు. ఆయన కుటుంబం కూడా కర్నాటక ప్రాంతం నించి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. 1976/77 ఎన్నికల్లో అనుకుంటా.. కాళోజీ తెలంగాణ వాదం తో జలగం వెంగళ్రావ్ మీద పోటీ చేసి ఓడిపోయాడు.

    మరొక విషయం. 1972 లో పీవీ పదవి పోవటానికి కారణం తెలంగాణ ప్రాంత రెడ్డి వర్గమే కాని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు, జై ఆంధ్ర ఉద్యమం కూడా కొంతకారణం. పైగా పీవీ కి వ్యతిరేకం గా కుట్ర చేయాల్సిన అవసరం రాజకీయంగానే తప్ప ప్రాంతీయ ప్రాతిపదికన అవసరం లేదు. ఎందుకంటే చనిపోయే వరకు కూడా పీవీ సమైక్యవాదే. తెలంగాణ ఉద్యమ ఫలితంగా కాసు, రోశయ్య ఎలా అయితే పదవులు కోల్పొయారో అలానే అలనాటి జైఆంధ్ర వల్ల పీవీ పదవి కొల్పోవలసి వచ్చింది.

    చివరగా.. చెన్నా రెడ్డి విషయం ప్రస్తావించినవాళ్ళు అదే కాలం లో సీమాంధ్ర కి చెందిన ముఖ్యమంత్రులు(కోట్ల, నేదురుమల్లి, భవనం వెంకట్రావ్) కూడా 5 సం|| పదవిలో కొనసాగలేకపోయారనే విషయం కన్వీనియంట్ గా మర్చిపోతారు. అప్పటి ఇందిరాగాంధి రాజకీయ క్రీడ లో భాగం గానే ముఖ్యమంత్రిలు ఇష్టానుసారం మార్చబడ్డారేగానీ ఇందులో ప్రాంతీయ వ్యతిరేకత కి చోటులేదు.

    ReplyDelete
  53. //ఈదేశం నుండి విడిపోవాలనడం దేశం రాజ్యాంగ, సార్వభౌమ వ్యతిరేక చర్య. ఒక రాష్ట్రం కావాలనుకోవడం రాజ్యాంగబద్దమయిన డిమాండ్. ఒక రాజ్యాంగబద్దమయిన డిమాండ్‌ను వ్యతిరేకించడానికి కారణం దొరక్క మరో రాజ్యాంగ విరుద్దమయిన డిమాండ్ ఎందుకు చెయ్యడం లేదనడంలో హేతువు సీపీఎం మేధావులే చెప్పాలి.//

    ఈ దేశం లోనే ఉండకూడదనుకునేవారికి ఈ దేశ రాజ్యాంగానికి లోబడి డిమాండ్ చెయ్యాల్సిన అవసరం ఏంటి? దిక్కరిస్తుందే దేశ సార్వభౌమత్వాన్ని అయినప్పుడు దానికి గౌరవించాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ప్రత్యేక దేశం గురించి కోరటం లేదు. కాని నిర్ణయాలు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలపైనే ఆధారపడాలి అనే మూర్ఖ వాదన అనుసరిస్తే ఎవరైన ఒక దేశం కోరుకున్నా, రాష్ట్రం కోరుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.

    దేశ రాజ్యాంగం పట్ల అంత గౌరవ ప్రపత్తులు కనబరిచే వారు ప్రజాస్వామ్యబద్దం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని వలస పాలన అనటం రాజ్యాంగ వ్యతిరేకత అని తెలీదా? స్వయం పాలన ఏంటి అసలు? ఇప్పుడున్నది స్వయం పాలన కాదా? మీరు ఫలాన వాళ్ళనే ఎన్నుకోవాలని ఎవరైన ఒత్తిడి చేసారా? వలసవాదం, స్వయం పాలన అన్నంత కాలం దీన్ని ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ద డిమాండ్ గానే పరిగణిచాల్సి ఉంటుంది.

    ReplyDelete
  54. //ప్రజల ఆకాంక్ష కంటే ప్రాతిపాదిక ఇంకోటి ఉందా?//

    మరి ఇదే సూత్రం రేపు హైదరాబాద్ కి వర్తింపచేయటానికి అంగీకరిస్తారా? అంటే అక్కడ ప్రజలు తాము తెలంగాణ లో భాగం కాము అని కోరుకుంటే అంగీకరిస్తారా?

    భాషాప్రయుక్త రాష్ట్రాలకి శాస్త్రీయత లేదా? ఇంతకంటే విచిత్ర వాదన లేదు. ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసే ఆనాడు అంబేద్కర్ భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానాన్ని సూచించాడు. 1920ల్లోనే ఆనాటి కాంగ్రెస్ హేమాహేమీలు చర్చించి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మద్దతు తెలిపారు. ఎక్కడో చిన్న చిన్న exceptions (like yanam,barampuram or belgaum) తప్పితే broad based గా భాషా రాష్ట్రాలు పూర్తి శాస్త్రీయ విధానం తోనే ఏర్పడ్డవి. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఈ భాషా రాష్ట్రల విధానానికి అనుగుణంగానే. అంతెకాని తెలంగాణ వాదులు వక్రీకరించినట్లు కాదు. అలానే ఫజలాలీ నివేదిక అంటూ మాట్లాడే వారు ఆ నివేదిక కూడా విస్త్రుత ప్రాతిపదికన భాషా రాష్ట్రాల ఏర్పాటునే సమర్ధించింది. ఆంధ్ర ప్రదేశ్ విషయం లో కూడా భాషా రాష్ట్రన్ని సమర్ధిస్తూనే concrete opinion కోసం 5సం ల కాలపరిమితి విధించింది. తెలంగాణ వాదులు ప్రచారం చేసినట్లు ఫజలాలి విశాలాంధ్ర ని వ్యతిరేకించలేదు. దాన్ని సమర్ధిస్తూ ఎన్నో ఉపయోగాలను తన నివేదికలో పొందుపరిచాడు.

    ReplyDelete
  55. //అలా కలవడం కొన్ని శరతులతో కూడిన ఒప్పందాలద్వారా జరిగింది.. ఆ షరతుల ఉల్లంఘణ ఒక్కటి చాలు రాష్ట్ర ఏర్పాటును సమర్ధించడానికి. //

    పెద్దమనుషుల ఒప్పందానికి చట్టబద్దత లేదు. అది అసలు కేవలం వేరు రాష్ట్రాల్లో ఒకే పార్టీ కి చెందిన నాయకుల మధ్య కుదిరిన అవగాహానా పత్రం. అంతే గాని అది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 'కలవటం' కోసం ఉద్దేస్యించిన ఒప్పందం కాదు. అసలు ఒప్పందాల ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు అనేవిధానమే రాజ్యాంగం లో లేదు. నిజానికి ఆనాటి రాజకీయనాయకులు ఒక అడుగు ముందుకు వేసి మరీ ఇందులో కొన్ని అంశాలకి (రీజినల్ కౌన్సిల్, ముల్కి నిభంధనలు) చట్టబద్దత కలిపించారు. కర్ణాటక, మహారాష్ట్ర లో కలిసిన నిజాం ప్రాంతాలకు కూడా లేని అవకాశం తోటి సోదరుల కోసం ఆంధ్ర ప్రాంతీయులు కల్పించారు. మంచి చేసినవాడ్ని పట్టుకొని వివక్ష అనటం వీరికే చెల్లింది.

    పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కి నిభందనలు 5సం, అవసరమైన పక్షం లో మరో 5సం పొడిగింపు అని మాత్రమే. మరి 1966 లో ఉద్యమించటం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించింది తెలంగాణ వాదులే.

    // ఆ షరతుల ఉల్లంఘణ ఒక్కటి చాలు రాష్ట్ర ఏర్పాటును సమర్ధించడానికి. //

    షరతుల ఉల్లంఘనేమి జరగలేదు. కేవలం ఉపముఖ్యమంత్రి విషయం లో అది కేవలం సంజీవరెడ్డి term లోనే జరిగింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమే కానీ ప్రాంతాలకు సంభందించింది కాదు. అంతేకాక ఉపముఖ్యమంత్రి పదవికి బదులు హోం, ఎక్సైజ్, రెవెన్యూ అనే మూడు కీలక శాఖలు తెలంగాణ కి చెందిన కె.వి. రంగారెడ్డి గారికి అప్పచెప్పారు. ఈ రోజు తెలంగాణ నిధుల మళ్ళింపు అని ఆరోపణ చేసేవారు రెవెన్యు మంత్రి గా పనిచేసిన రంగారెడ్డి ని నిందించరెందుకో తెలీదు. అలానే ఆయన కూడా ఆయన శాఖ కి సంభందించిన నిధుల విషయం ఏనాడు బయటపెట్టలేదెందుకో... సరే.. అదలా ఉంచి, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం లో, రంగారెడ్డి గారు, పీవీ ఉపముఖ్యమంత్రులుగా భాద్యతలు చేపట్టారు.

    తెలంగాణ ప్రాంతం లో విద్యావాకాశాలు మెరుగు పరచాలనే సదుద్దేశం తోనే ఆనాడు జిల్ల పరిషత్ చైర్మన్లు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళి మరీ ఉద్యోగాలకోసం ఆహ్వానించారు. అంతేగానీ అక్కడి నించి వచ్చి మరీ ఎవరూ అక్రమంగా స్థిరపడలేదు. అనాడు అలా అక్రమంగా స్థిరపడ్డారు అని చెప్పిన వాళ్ళ సంఖ్య 97000 ఉద్యోగాల్లో కేవలం కొన్ని వందలు మాత్రమే. దీనికే వలస ని, వివక్ష ని, దోపిడీ అని దురాక్రమణ ని పేరు పెట్టారు. అభివృద్ది చెందిన అమెరికా లాంటి దేశాల్లోనే illegal immigrants కొన్ని వేలల్లో ఉంటారు. ఎన్ని చట్ట పరమైన నిభంధనలు పెట్టినా అగ్రరాజ్యాలకే వీటిని పూర్తిగా అరికట్టటం అసాధ్యం. అలా చట్ట ఉల్లంఘనలకు ప్రాంతీయ దోపిడీ అని పేరు పెడితే ఈ దేశం లో కొన్ని వేల దోపిడీలు అను నిత్యం జరుగుతున్నవే. తెలంగాణ లోనె 610 జీవో ని ఉల్లంఘించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఎన్ని రాష్ట్రాలు ఏర్పరచాలి దీన్ని ఆపటానికి? బజారు ఒక రాష్ట్రం చెయ్యాలేమో..

    ReplyDelete
  56. జలగం వెంగళరావు నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన మాట నిజమే కానీ అతని కుటుంబ సభ్యులు వైజాగ్‌కి తిరిగొచ్చారు కదా. ఆ మాటకొస్తే చిన్నప్పుడు వరంగల్, కరీంనగర్‌లలో ఉండి శ్రీకాకుళం తిరిగొచ్చిన నేను కూడా తెలంగాణా పౌరుణ్ణి అనుకోవాలి.

    ReplyDelete
  57. "చరిత్ర నీ కంటే నాకు బాగా తెలుసు నాయనా"
    నీకు చరిత్ర తెలియదని నేను అన్నానా ప్రవీణూ, నీకు అన్నీ తెలుసు ఒక్కటి తప్ప. ఆ ఒక్కటీ ఏంటో నీకు తప్ప నీ రాతలు చూసే వారందరికీ తెలుసు.

    ReplyDelete
  58. నువ్వు చెప్పేదేమిటంటే నేను మడిసినో, కాదో నాకే తెలియదని. అంతే కదా.

    ReplyDelete
  59. యాందిది పెవీనన్యాయ్.. ఇట్టా రాత్తే బ్లాగుల్లో నీ రిపుటేసన్ ఏం గావాల్నా? మనం మాటాడుకునేది జలగం ఏడ పెరిగాడాని.. ఆయన చుట్టాలు ఏడ్నుంటే మనకేంది.. నేను పుట్టకముందే మా వాళ్ళు షాన మంది హైదరబాద్ కెల్లి ఉన్నారు. అంటే నాది తెలంగాణ నా? కేసీఅర్ కి మనవడు పుడితే వాడి చుట్టాలు అంతా అంధ్ర కెల్లి వునారని ఆడు ఆంధ్రోడు అవుతాడా? కాలోజీ కుటుంబ సభ్యులు ఏడుండారో కూస్తె కనుక్కోని చెప్పరాదు.

    ReplyDelete
  60. @అగ్నాత

    మీవాదనకు ధన్యవాదాలు. వివక్ష ఏయే రంగాల్లో జరిగింది, ఏవిధంగా జరిగింది, పెద్దమనుషుల ఒప్పందం స్కోప్ ఎంత, అది ఎంత అమలయ్యింది అనే విషయాలు ఈబ్లాగులో చర్చించడం కష్టం, కానీ తప్పక చర్చిద్దాం. ప్రస్తుతానికి స్వయంపరిపాలన, ఆత్మగౌరవాలకోసం దేశం ఎందుకు అడగగూడదు, పరిపాలకవర్గం మారక, ప్రాంతం మారితే ఎలా సరిపోదో ఈబ్లాగరు వివరణకోసం వేచిచూద్దాం.

    ఆనాడు భాషాప్రయుక్త రాష్ట్రాలగురించి ఏం చెప్పాడు, ఎలా చెయ్యాలన్నాడొ డాక్యుమెంట్ నెట్లో దొరుకుతుంది, చూడండి. అమేద్కర్ చెప్పిన సారాంశం కావాలంటే ఇక్కడ చూడొచ్చు.
    http://kotiratanalu.blogspot.com/2011/06/blog-post_05.html

    ఒక రాష్ట్రానికి ఒక భాష(మేజర్) అనేది శాస్త్రీయ వాదన కానీ ఒక భాషకు ఒక రాష్ట్రం కాదు, అది అంబేద్కర్ చెప్పలేదు. ఒకవేల అదే సాస్త్రీయత అయితే హిందీక్కూడా ఒకేభాష ఉండాలి, అది అసాధ్యం.

    ReplyDelete
  61. ఒక భాష కి ఒక రాష్ట్రం అని నేనెక్కడా చెప్పలేదు. నేను ఉదహరించింది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన లోని శాస్త్రీయత గురించే..

    అయితే ఇక్కడ వాదన అది కాదు. కేవలం విడిపోయే ప్రాంత అభిప్రాయాల ప్రాతిపదికనే విడగొట్టుకుంటూ వెళ్తే దేశం ఎన్ని ముక్కలవుతుంది? మీరు ఇంకో ప్రశ్న కి జవాబివ్వలేదు. హైదరాబాద్ విషయం లో కూడా మీ విధానం కేవలం హైదరాబాద్ వారి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయించటానికి అంగీకరిస్తారా?

    ఇక్కడ ఇంకోక విషయం. మీరు అంబేద్కర్ ని quote చేస్తూ మీ వాదాన్ని వినిపించారు. సాధారణంగా చాల మంది తెలంగాణ వాదులు అంబేడ్కర్ మాటల్ని quote చెయ్యటం గమనించాను. అయితే ఇదే అంబేద్కర్ బాంబే విషయం లఒ ఏం చెప్పాడో చూద్దామా ?

    I have said that Bombay be given a new area and made into a separate City State.
    ...
    ...
    One is not to allow Bombay to go into the hands of Maharashtrians

    మరి ఇలా చూస్తే అంబేద్కర్ చెప్పినట్లు తెలంగాణ వారికి హైదరాబాద్ రాష్ట్రం ఇవ్వకూడదు. అంబేద్కర్ thoughts on linguistic states అనేది రకరకాల అభిప్రాయాల కలపోత. అది ఆయన ఆలోచన సరళి, ఆ కాలపు ప్రపంచ పరిస్థితిలు, తీసుకున్న ఉదాహరణలు, భవిష్యత్తు ని ఆయన ఊహించిన విధానం మీద ఆధారపడి ఉంటాయి. అందులో కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని కేవలం భయాలు కావచ్చు, కొన్నిటిని trash కింద కొట్టిపడేయచ్చు. కాబట్టి కేవలం అంబేద్కర్ చెప్పాడనో, ఫజాలాలి చెప్పాడనో మనం గతం లోకి వెళ్ళలేము. 2011 లో 1956 లో సూచనను అమలు చెయ్యమనటం ఒట్టి పస లేని వాదన. ఈనాటి పరిస్థితుల ఆధారంగా డిమాండ్ లోని సహేతుకత ని విశ్లేషించి నిర్ణయించటం విఙ్ఞత. ఇందులో సెంటిమెంట్లకో, 3 కోట్లు, మూడున్నర కోట్లు, నాలుగున్నర కోట్లు అంటూ చెప్పే సంఖ్యాబలానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు. వాస్తవాల ఆధారంగా వివక్ష కి గురి అయినట్లు, intentional గా అభివృద్ది జరగకుండా అడ్డుకొన్నట్లు నిరూపితమైతే అప్పుడు ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచించవచ్చు.

    ReplyDelete
  62. అంబేద్కర్ గురించి ప్రస్తావన మొదలుపెట్టింది నేనుకాదు, మీరే. ప్రజల మనోభావాలు ఒక అంశం, ఆత్మగౌరవం, స్వయం పాలన ఈబ్లాగరు చెప్పినట్లు మరో అంశం. కానీ అవే అంశాలు కాదు.

    వివక్ష కావాల్సినంత జరిగింది. ఉద్యోగాల విషయంలో కూడా మీరు చెప్పింది తప్పు. ఉద్యోగాల విషయంలో ఈసమైక్య ప్రభుత్వమే కమిటీలు వేసి అక్కడ అన్యాయం జరిగిందని తేల్చిందీ, అందుకు జీవోలు కూడా విడుదల చేసింది. ఇంకా పరోక్షంగా పైస్థానాల్లో ఉడే అధికారులవల్ల రోజూ జరిగే వివక్ష, ప్రమోషన్లలో జరిగే వీక్షకు అంతులేదు, అది ఉద్యోగులు అనుభవిస్తున్నారు కాబట్టే వారు ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు, బయటివారికి అదేదో చిన్నవిషయంలాగే కనిపిస్తుంది. ఇంకా ముఖ్యమయిన నీటిపారుదలలో జరిగిన వివక్ష, నిధులలో జరిగిన వివక్ష అనేకం.

    దేనికదే ఒక నగరం విడిపోతామనుకుంటే విడిపోవచ్చని నేననలేదు, తెలంగాణకు ఒక చారిత్రక నేపధ్యం ఉంది. హైదరాబాద్ రాష్ట్రం ఆరేల్లపాటు చరిత్రలో ఉంది. హైదరాబాద్ స్టేట్‌లో కొన్ని ప్రాంతాలు విడిపోయాయి గానీ మిగిలిన తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉండడానికి అన్ని అవకాశాలు ఉండేవి, ఒక రాష్ట్రంగా ఉంటే ఇక్కడి ప్రజలకు మేలు జరిగేది.

    మిగతా మరాఠీ, కన్నడ ప్రాంతాలకు లేని ప్రత్యేకత తెలంగాణకు పెద్దమనుషుల ఒప్పందం ద్వారా ఏదో పెద్దమనసుతో ఇవ్వలేదు, తమ రాజధాని అవసరంకోసం కలుపుకోవాలి కనుక, కలవడం విషయంలో తెలంగాణకు అనుమానాలు ఉన్నాయి కనుక. ఇక ఒప్పందం ఐదు సంవత్సరాలకే అనేది కేవలం రెవిన్యూ విషయంలోనే, అది కూడా అమలు జరగలేదు. ఒక్క ఉపముఖ్యమంత్రి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఒప్పందం అమలయ్యిందనేది పూర్తి అవాస్తవం.

    ఫజల్అలి కలిస్తే లాభాలేంటో, నష్టాలేంటో కూడా చెప్పాడు. కలవాలంటే కనీసం వచ్చే ఎన్నిక దాకా ఆగి ప్రజాభిప్రాయం కోసం వేచి చూడాలని చెప్పాడు, కానీ అదేదీ జరగలేదు.

    ఇక పోతే హైదరాబాద్ ఒక రాష్ట్రం కావాలనేది కేవలం సమైక్యవాదులు తెలంగాణ అడ్డుకోవడంకోసం చేసేవాదన తప్ప గ్రేటర్ హైదరాబాద్ మెజారిటీ ఏమీ హైదరాబాద్ రాష్ట్రం కావాలని అడగడం లేదు.అది కేవలం ఒక ప్రాపగాండా తప్ప, దానికేమీ ఉద్యమాలు జరగడం లేదు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేల అభిప్రాయం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అభిప్రాయం కాదు. దానికి ఒక చారిత్రక నేపధ్యం లేదు. హైదరాబాద్‌ను ఒక రాష్ట్రంగా చేస్తే మిగతా అన్ని మెట్రోల్లోనూ అదే నియమం పాటించాల్సుంటుంది, అది జరగని పని. ఒకవేళ అన్ని మెట్రోలనూ రాష్ట్రాలను చేసే పలసీ చేసి హైదరాబాద్‌ను కూడా చేస్తే నాకెలాంటి అభ్యంతరమూ లేదు, నాదీ హైదరాబాదే.

    హైదరాబాద్ ఒక రాష్ట్రంగా మనలేదు. ఆదాయవనరులుండొచ్చు కానీ జలవనరులు లేవు. నదీజలాలకోసం ఇతర రాష్ట్రాలమీద ఆధారపడాలి. కాబట్టి ఇది కేవలం తెలంగాణను ఆపడానికి ఉపయోగపడే నినాదమే తప్ప ఆచరణ సాధ్యమయేది కాదు.

    ReplyDelete
  63. //అంబేద్కర్ గురించి ప్రస్తావన మొదలుపెట్టింది నేనుకాదు, మీరే.//

    మీరే కదా linguistic states గురించి అంబేద్కర్ వ్రాసిన లింక్ ఇచ్చింది.

    //వివక్ష కావాల్సినంత జరిగింది. ఉద్యోగాల విషయంలో కూడా మీరు చెప్పింది తప్పు. ఉద్యోగాల విషయంలో ఈసమైక్య ప్రభుత్వమే కమిటీలు వేసి అక్కడ అన్యాయం జరిగిందని తేల్చిందీ, అందుకు జీవోలు కూడా విడుదల చేసింది. //
    నేను మిమ్మల్ని ఆధారాలు అడుగుతుంటే మీరేమో ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఒక్క తెలంగాణ కు సంభందించి కాదు. presidential order & six point formula మొత్తానికి సంభందించింది. అందులో 610 జీవో ఒక అంశం మాత్రమే. ఇంక ప్రభుత్వం నిర్ధారించింది violations జరిగినాయి అని.. అన్యాయం జరిగింది అని కాదు. సరే.. ఈ జరిగిన violations అయినా ఎంత శాతమో చూద్దాం.

    గిర్గ్లాని నివేదిక ప్రకారం 1975 నించి 2004 మధ్య 28సం!! కాలం లో మొత్తం జరిగిన వయలేషన్స్ 40 నించి 58 వేల మంది. అయితే ఇందులో తెలంగాణ ప్రాంతీయులు ఉన్నారు. దాని గురించి తర్వాత వ్రాస్తాను. ఈ violations కి సంభందించి గిర్గ్లాని ఇలా quote చేసాడు.

    In the various representations to the government and in the Press a figure ranging 40,000 to 58,000 of non-locals working in zones V and VI is being given as those who are working in violation of the Presidential Order. The statistical part of non-locals and locals has been examined by the Commission and it will be seen that the percentage of non-locals in the zones V and VI is negligible and far below the sealing of 20 per cent. Therefore on the statistical aspect there is no question of any action or implementation of the G.O. -- పేరా 18.1.9, గిర్గ్లాని రిపోర్ట్

    మన రాష్ట్ర మొత్తం ఉద్యోగులు 2006 census ప్రకారం ~1299000. ఇందులో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సుమారు 6 లక్షలు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నాన్-లోకల్స్ 20% కి మించరాదు. అంటే సుమారు 120000 వరకు నాన్-లోకల్స్ వరకు ఉండొచ్చు. కాని ఉన్నది కేవలం 58000 మంది. అయితే ఇందులో అంతా ఆంధ్ర ప్రాంతం నించి వచ్చిన వాళ్ళే కాదు. తెలంగాణ లోని 5వ జోన్ నించి జీవో ని ఉల్లంఘిస్తూ 6వ జోన్ లో పని చేస్తున్న వారు ఉన్నారు. ఉదాహరణ కు ఈ వార్త చూడండి.

    http://www.hindu.com/2007/10/05/stories/2007100560130400.htm

    అలానే మీకు దీనికి సంభందించిన మరింత సమాచారం కోసం ప్రభుత్వ వెబ్సైట్ లో కూడా చూడండి. http://go610.ap.gov.in/

    మీరు గిర్గ్లాని రిపోర్ట్ పూర్తి పాఠం ఈ క్రింద లింక్ లో చూడవచ్చు.
    1. http://www.scribd.com/doc/33993039/ONE-MAN-COMMISSION-SIX-POINT-FORMULA-ANDHRA-PRADESH-Vol-1
    2. http://www.scribd.com/doc/33993416/ONE-MAN-COMMISSION-SIX-POINT-FORMULA-ANDHRA-PRADESH-HEADED-BY-Mr-J-M-GIRGLANI-IAS-Retd-Vol-II
    3. http://www.scribd.com/doc/33993518/ONE-MAN-COMMISSION-SIX-POINT-FORMULA-ANDHRA-PRADESH-HEADED-BY-Mr-J-M-GIRGLANI-IAS-Retd-Vol-III

    ఎవరో చెప్పిన తప్పుడు వార్తలు, ఇతర తెలంగాణ వాద వెబ్సైట్ల conclusions ఆధరంగా కాక మీరు సొంతగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  64. // తెలంగాణకు ఒక చారిత్రక నేపధ్యం ఉంది. హైదరాబాద్ రాష్ట్రం ఆరేల్లపాటు చరిత్రలో ఉంది.//

    చరిత్ర లో హైదరాబాద్ రాష్ట్రం ఉంది కాని తెలంగాణ రాష్ట్రం లేదు.

    అలానే హైదరాబాద్ కి మిగతా తెలంగాణ నించి వేరైన సాంస్కృతిక నేపద్యం ఉంది. అయినా రాష్ట్రం గానో, కేంద్ర పాలిత ప్రాంతం గానో, లేక ఇంకేదైన ఏర్పాటు కోరుకుంటారో అది అక్కడి ప్రజల ఇష్టం. మిగతా తెలంగాణ ప్రజల అభిప్రాయం హైదరాబాద్ పై ఎలా రుద్దుతారు? నిజానికి హైదరాబాద్ కి తెలంగాణ కి మించిన చారిత్రక నేపద్యమే ఉంది. తెలంగాణ అనేది వాడుకలో లేని కాలంలోనే గోల్కొండ, ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతం ప్రపంచానికి తెలుసు.

    అయినా రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం వేరు రాష్ట్రం కావాలంటే చారిత్రక నేపద్యం కావలని ఎక్కడా లేదు. హైదరాబాద్ లో కూడా చుట్టు ప్రక్కల తెలంగాణ నించి వచ్చి తెలంగాన ఉద్యమం చేస్తున్నవారే తప్పితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం కూడా ఏమి లేదు. సరే.. అయినా లేని ఉద్యమం కోసం భయమెందుకు? ఫ్లెబిసైట్ పెడితే సరి..

    // హైదరాబాద్‌ను ఒక రాష్ట్రంగా చేస్తే మిగతా అన్ని మెట్రోల్లోనూ అదే నియమం పాటించాల్సుంటుంది, అది జరగని పని.//

    పోనీ ఈ రోజు ఈ తెలంగాణ ఉద్యమం మూలంగా రేపు ఉత్తర తమిళనాడు లోని, దక్షిణ కర్నాటక ప్రాంతం లోను, పశ్చిమ మహారాష్ట్ర లోనూ ప్రత్యేక ఉద్యమాలు రావని గ్యారెంటీ ఏమిటి? వాళ్ళకు కూడా చక్కగా రెడీమేడ్ రాజధానులున్నాయి. వివక్ష అనో, దోపిడీ అనే వాళ్ళూ ఇతర ప్రాంతాల వారిపై విద్వేషం నూరిపోస్తే అది మాత్రం ఎంత సేపు రావటం?

    //హైదరాబాద్ ఒక రాష్ట్రంగా మనలేదు. ఆదాయవనరులుండొచ్చు కానీ జలవనరులు లేవు. నదీజలాలకోసం ఇతర రాష్ట్రాలమీద ఆధారపడాలి.//
    హైదరాబాద్ ఒక రాష్ట్రం గా మనగలదు. డిల్లీ కి జల వనరులు లేవు. అంత మాత్రాన అది ప్రత్యేక రాష్ట్రం గా లేదా?

    ReplyDelete
  65. ఢిల్లీ నగరం పక్కనే యమునా నది ఉంది. ఢిల్లీ నగరంలో దరియాగంజ్ లాంటి ప్రాంతాలు యమునా నదీ తీరానే ఉన్నాయి. ఓసారి ఢిల్లీ మ్యాప్ చూడు అజ్ఞాత బాబు.

    ReplyDelete
  66. నదీజలాలకోసం ఇతర రాష్ట్రాలమీద ఆధారపడాలి.

    So what? Like Teluguganga to Madras city, Hyderabad city will buy water from neighbouring states.

    City State Singapore has no major river. 40% of it's water is imported from neighbouring countries.

    Does your statement makes any sense?

    ReplyDelete
  67. @Praveen Sharma
    Hyderabad too has Moosi river similar to Yamuna and freshwater reservoirs.

    ReplyDelete
  68. హిమాలయాలలో మంచు కరిగి వేసవిలో కూడా నీటితో నిండుగా ఉండే యమునా నది ఎక్కడ, వేసవిలో నీరు తక్కువగా ఉండి నాళంలాగ కనిపించే మూసీ నది ఎక్కడ? నేను తెలంగాణా రాష్ట్రాన్ని సమర్థిస్తాను కానీ హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడానికి మాత్రం ఒప్పుకోను.

    ReplyDelete
  69. పెవీనన్యాయ్, ఇదే నీతో వచ్చిన చిక్కు.. నువ్వు డిల్లీ పోయుండ్లా.. అంత ఎర్ర పుస్తకాలతో వచ్చ&