వీలుంటే నా నాలుగు లంకెలు ...

15, జనవరి 2024, సోమవారం

0 వ్యాఖ్యలు

 నా మిత్రులు అడుగుతున్నారు మాల్దీవ్స్-లక్షద్వీప్స్ పైన నా అభిప్రాయం  ఏమిటని?


ఈ ప్రశ్న నన్ను అడగటానికి ఒక్కటే వారిలో బలమైన కారణం నాకు కనబడుతుంది. ఎవరైతే మోది చేస్తున్న ప్రచారార్భాటాలను, జాతీయ వనరులను అతికొద్ది క్కార్పొరేట్స్ కి కట్టబెట్టడాన్ని, అతివాద మత మనోభావాలను రెచ్చగొట్టడాన్ని, రాజకియ అవినీతిని ప్రశ్నిచిన వారిని వాటికి సమాధానాలు లెనప్పుడల్లా ఒక్కటే ఎదురు దాడి వారంతా దేశద్రొహులు / యాంటి నేషనిస్టులు / చైనా-పాకిస్తన్ ఏజంట్లు అనే భావన విపరీతంగా వందలాది కోట్ల రూపాయిల ఖర్చుతో ఫేస్ బుక్,యుట్యుబ్, ట్విట్టర్, వాట్సాప్, హస్తగతం చేసుకున్న పేపర్,ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా యాక్టివ్ గా వుండే ప్రజల మెద్దళ్లొ జొప్పించారు.


చరిత్ర ఒక్క సారి నెమరవేసుకుంటే..

1) 1962 లొ నెహ్రు ప్రధానిగా వున్నప్పుడు చైనా తో యుద్ధం లో మనం ఓడిపొయాము. ఆ పరిస్థితులకు దారితీసిన వ్యవహారాన్ని తప్పు పట్టిన వారిని అప్పట్లొ "దేశ ద్రోహులు", "చైనా ఏజెంట్స్" అని ముద్ర వేశారు.  

2) కార్గిల్ యుద్ధం లో మనకు జరిగిన ప్రాణ నష్టంకు కారణం ను ప్రశ్నించిన వారిని ఇప్పుడు బిజెపి  "దేశ ద్రోహులు", "పాకిస్తాన్ ఏజెంట్స్" అనే ముద్ర వేస్తుంది.

3) మోదీ హయ్యంలొ చైన అరుణచల్ ప్రదేశ్ దగ్గర మన భూభగాన్ని అక్రమించు కున్నదానిలో మన ప్రభుత్వ వైఫల్యన్ని ప్రశ్నిస్తే "చైన ఏజెంట్స్" అనే ముద్ర వెయ్యడం


ఇది కాంగ్రేస్ పార్టికీ ఒక గుణపాఠం.. అప్పుడైనా, ఇప్పుడైనా విదేశీ విధాన లోపాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులు అనే ముద్ర వేసి అసలు సమస్యను ప్రక్క దారి పట్టించడం పరిపాటి గా మారింది.


సో, మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య మీద చర్చ జరుగుతున్నప్పుడు, పైన చెప్పిన భావజాలం నుండి బయటకు వచ్చి విశాల దృక్పథం తో ఆలొచిస్తే నే అర్థం అవుతంది.

 

మాల్దీవ్స్-లక్షద్వీప్స్ సమస్య గురించి మాట్లాడే ముందు గత సంవత్సరం జరిగిన ఇలాంటి ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి..


నుపూర్ శర్మ గుర్తుంది గా? ఆమె బిజెపి అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఎది చెప్పినా బిజెపి చెప్పినట్లుగా మనం భావించాలి, అలానే రాజా సింగ్ ఒక చట్టసభ ప్రతినిధి. వీరిద్దరూ మహ్మద్ ప్రవక మీద ఎవో అభ్యంతకరమైన విమర్శలు చేశారు అని అరబ్ దేశాలు భారత దేశ ప్రభుత్వం కు నిరశన తెలియ జేశారు. (గుర్తు పెట్టుకోడి, ఈ విషయంలో ఏ లౌకికవాది కూడా వారిని తప్పు పట్టలేదు, క్షమాపన చెప్పమనలేదు. భావ స్వేచ వుంది కాబట్టి!). కాని ఇతర దేశాల నుండి వచ్చిన ఒత్తిడి తరుణంలో తప్పని పరిస్ఠితులలో వారి ఇద్దరినీ పార్టి నుండి తొలిగించింది బిజెపి, వారు మాట్లాడినది వారి వారి వ్యక్తిగతం, పార్టికి సంబధం లేదు అని భారత ప్రభుత్వం అలానే బిజెపి వివరణ ఇచ్చింది. ఆ వివరణతో ఇతర దేశాలు సంతృప్తి చెంది, అ విషయాన్ని అక్కడితో ప్రక్కన పెట్టినవి. దానికి దేశాల మధ్య సంబంధాల విషయానికి ముడి పెట్టలేదు. ఎక్కడా దాని ప్రస్తావన తీసుకు రావడం లేదు. ఇది సనస్య పరిష్కార మార్గం. ఈ చిన్న విషయం ద్వారా రెండు దేశాల మధ్య దురం  పెంచకూడదు అనే ఉద్దేశం వుంది కబట్టి సమస్య పరిష్కారం అయ్యింది


యిప్పుడు ప్రస్తుత సమస్య దగ్గరకి వద్దాం..


ఇద్దరు మాల్దివుల మంత్రులు భారత దేశం లోని హోటల్స్ శుభ్రంగా వుండవు అని విమర్శ చేసారు. దానికి మన ప్రభుత్వం ఖండించింది. అలా ఒక దేశాన్ని వేరొక దేశం వారు అంటే ఎవరూ ఊరుకోరు. అలా అనడం ముమ్మటికి తప్పే కూడా.


భారత ప్రభుత్వ అభ్యంతరం, భారత ప్రజల ప్రతిస్పందనల వలన వెంటనే మాల్దీవ్ ప్రభుత్వం ఆ ఇద్దరి మంత్రులను తొలగించింది వివరణ కూడా ఇచ్చింది అది అ దేశ అభిప్రాయం కాదని, భారత్ అంటె వారికి 911 లాంటి ఎమెర్జెన్సి సర్విస్ లాంటిది అని. ఇంతకన్నా ఎవరు ఏమి కోరుకుంటారు ఒక దేశం నుండి? వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మన దేశం కూడా అదే చేసింది కదా నుపూర్ శర్మ విషయం లో..


కాని, బిజెపి కి లాభం ఏమిటి ఆ సమస్య అలా తీరిపోతే? దీనిని కూడ మోది భజన కార్యక్రమానికి వాడుకోవడానికి ఫుంఖాలు ఫుంఖాలుగా కథనాలు మాల్దివుల పై ప్రచారాలు. ఇటువంటి చర్యలతో ఖచ్చితంగా యిరు దేశాల సంబధాలు దెబ్బ తింటాయి. ఇలాంటి చర్యలతోనే మోది అధికారం లోకి వచ్చిన తరువాత మన చుట్టు వున్న అన్ని దేశాలతో మన సంబంధాలు దెబ్బ తిన్నవి.. అంతే కాకుండా మన చుట్టు ప్రక్కల వున దేశాలు చైనా పంచన జేరాడానికి మోది విదేశి విధానం దోహదం చేస్తుంది,చేసింది.


బిజెప్/అర్ ఎస్ ఎస్  ఎత్తుగడ ఒక్కటే, భారత దేశం (హిందువుల) పై ప్రపంచ వ్యాపితంగా దాడి ఎక్కువవుతుంది అని నిరూపించి, దానికి దేశభక్తి కి ముడి పెట్టి హిందూ ఓటు బ్యంక్ సుస్థిర పరుచుకొని ఎల్ల కాలం అధికారం లొ వుండాలి. అంతే తప్ప దీనిలో దేశ భక్తి లేదు హిందు మత ఉద్దరణా లేదు.


- వాసవ్య యాగాటి 

2024-01-12

5, ఫిబ్రవరి 2022, శనివారం

Constitution: రాజ్యాంగ సవరణ/మార్పు అనైతికమా?

0 వ్యాఖ్యలు

రాజ్యాంగం ఏమైనా మత గ్రంథమా?

తప్పులున్నాయని/అసమానతలు వున్నాయి అని తెలిసినా పవిత్రంగా చూసుకోవడానికి? అదేమన్నా పైనుండి ఊడిపడిందా? రాజ్యాంగం అనేది దేశప్రజలందరీ ఓ కామన్ ఎగ్రిమెంట్.. తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.. దానిలో తప్పేంటి? ఉదాహరణకు, ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కార్పోరేట్ అవినీతి, దోపిడికి హద్దులు లేకుండా పోయింది, దానికి కారణం రాజ్యాంగం తప్పుకాదు అని కొందరన్నొచ్చు.. కానీ అధికారం లో వున్న వారికి రాజ్యాంగం అమలు చేయకుండా వుండే వెసులుబాటు రాజ్యాంగం లో వుండ బట్టే కదా దేశంలో యింత అవినీతి పెరగడానికి కారణం.. అలానే, ప్రస్తుత రాజ్యంగం వివిధ రాష్ట్రాల మధ్య కేంద్రం వివిక్ష ధోరణి అవలబించకుండా కట్టడి చెయ్యడానికి కుదరడం లేదు. అలా చాలానే వున్నాయి..

మరి ఇలానే కంటున్యూ చెయ్యాలా?

లౌకిక ప్రజతంత్ర సమాన హక్కులను రాజ్యంగంలో వుంచకూడదు అని ఎవరైన అంటే తప్పు అవుతుంది గాని, రాజ్యాంగంలో వున్న లొసులుగులు తీసేయ్యాలి అంటే అహ్వానించాల్సిందే… మరి ఈ అసమానతలను ఇలానే కంటున్యూ చెయ్యలసిందేనా? రాజ్యాంగ సవరణ అంటే అదేదో అంబెద్కర్ ని అవమానించినట్లు అంబెద్కర వాదులు, బిజెపి వారు ఎలా ముద్ర వేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు..

కెసిఅర్ అన్నదాంట్లో స్పస్టత లేదు, రాజ్యాంగం లో ఏ అంశాలు మార్చాలో అతను చెప్పనేలేదు.. సో .. ఖండించడంలో అర్థం లేదు.. రాజ్యాంగంలో కొన్ని అంశాలు అమలులో లొసుగులు వున్నాయి.. అవి సరి చెయ్యడానికై మార్చుదాం అని కూడా అని వుండచ్చు కదా? అటివంటి మార్పులనూ కూడా వ్యతిరేకిద్దామా?

అసలు జరగవలసిన చర్చను దారి మళ్లిస్తానికి బిజెపి వేసిన ఎత్తుగడ?

కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అసమానతల పాలనలో గత 8 సంవత్సరాలలో తెలంగాణా ఎలా నష్ట పోయిందో కుండ బద్దలు కొట్టినట్లయి జనాలకు బాగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు (గత 7 బడ్జట్ లను, మోడీ చేసిన అన్నింటిని సపోర్ట్ చేసాడు అదే వేరే విషయం, అది అతని రాజకీయ ఎత్తుగడ కావచ్చు). ఈ ఆరోపణలకు సమాధానం చెప్పే స్థితిలో బిజెపి లేదు.. దాంతొ ‘అంబెద్కర్’ కి అవమానం పేరుమీద రచ్చ చేస్తుంది.. ఆ వలలో అంబెద్కర్ వాదూలు పడటం విచారకరం.. విచిత్రం ఏమిటంటే 2002 సం వరకు బిజెపి అసలు మన రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్నీ గుర్తించలేదు. వాజెపెయి అయితే రాజ్యంగం మార్పు పై ఒక కమిటీ కూడా వేసాడు, మరి అప్పుడు అంబెద్కర్ ని అవమానించడం కనబడని బిజెపికి ఇప్పుడు ఎలా కనబడుతుంది?

మార్పు అనివార్యం, మార్పును అహ్వానించాల్సిందే..

సామాజిక దృక్పథం, సామాజిక అవగాహన, జీవ పరిణామక్రమాలు డార్విన్, మార్క్స్ చెప్పినట్లు నిరంతరం మారుతూనే వుంటాయి. మార్పును ఆహ్వానిస్తూ ముందుకు వెళ్ళాలిసిందే! అంబెద్కర్ అధ్యక్ష వహించిన కమిటి రచించిన మన రాజ్యాంగం లో స్పష్టంగా 2/3 మెజారిటి వుంటే రాజ్యాంగం ని మార్చుకోవచ్చు అని రాసివుంది.. రాజ్యాంగం మార్చొద్దు అని ఎవరైనా అంటే వారు నిజమైన అంబెద్కర్ ద్రోహులవుతారు..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అల్వేస్ అనే భావన నుండి భయట పడాలి.. సామాజికి మార్పును ఎవరు ఆపినా ఆగేది కాదు!

వాసవ్య యాగాటి..
2022-02-05

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Trade Unions: ప్రభుత్వ రంగ ఉధ్యోగుల పోరాటాలు ఎవరి కోసం? దేని కోసం?

0 వ్యాఖ్యలు


LIC ని ప్రయివేటు పరం చెయ్యొద్దు అని ధర్నా చేస్తుంటే ఏ టిచర్, ఏ ప్రభుత్వ/ స్టీల్ ప్లాంట్ / RTC / విద్యుత్ / బ్యాంక్ / రైల్వే ఉధ్యోగీ అది తన సమస్య అని భావించడం లేదు.. చూసుకుంటూ వెల్లిపోతాడే తప్ప కనీసం ఆగి ఒక్క నిమషం సంఘిబావం కూడా ప్రకటించడు..

అలానే,
👉 స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరము చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉విద్యుత్ ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చెయ్యొద్దని ధర్నా చేస్తున్నా,
👉ప్రభుత్వ స్కూలను ఎత్తివేయోద్దని ధర్నా చేస్తున్నా,
👉RTC ని ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,
👉రైల్వేలను ప్రయివేటు పరం చెయ్యొదని ధర్నా చేస్తున్నా,

ఆయా సంస్థల ఉధ్యోగుల వరకు మాత్రమే ధర్నాలు, పోరాటాలు చేస్తున్నారే తప్ప, మిగితా సంస్థలలో ఉధ్యోగులు చేస్తున్న దానికి కనీసం సంఘీబావం కూడా ప్రకటించడంలేదు.. పట్టించుకోకపోయిన ఫర్వాలేదు, కానీ మిగితావారు చేస్తున్న ధర్నాలు/పోరాటాలపై చిన్న చూపు కూడాను..

ఈ పరిస్థితి ప్రగతిశీల శక్తులు నాయకత్వం వహిస్తున్న కార్మక సంఘాలలొ వున్న సభ్యులలోనూ చూస్తున్నాం...
ఉదాహరణకు: స్టీలు ప్లాంట్ ప్రయివేటు పరం చేయ్యొదని ప్లాంట్ ఉధ్యోగులు ధర్నా చేస్తుంటే ఎంత మంది టిచర్లు కానీ, RTC ఉధ్యోగులు గాని, విధ్యుత్ ఉధ్యోగులు గానీ ధర్నాలో పాల్గొని వుంటారు?

ఉమ్మడి పోరాటాలు చెయ్యవలసిన ఈ సమయంలో పరిస్థితి ఇలానే కొనసాగితే ఫలితం లేని అసంఘటీత పోరాటాల మాదిరిగానే మిగిలిపోతుంది..

ప్రతీ పోరాటంలో ఆయా ఉధ్యోగులు చెప్పే కామన్ పాయింట్, "మేము పోరాడుతున్నది మా ఉధ్యోగ భద్రత కోసం కాదు, ప్రజల కోసం, ఈ సంస్థ లేకపోతే ప్రజలు నష్టపోతారు" అని చెబుతూనే వుంటారు.. కానీ నా అభిప్రాయం ప్రకారం మెజారిటి ఉధ్యోగులు వారి వారి ఉధ్యోగ భద్రత గురించి మాత్రమే ఆయా ఉధ్యమాలలో పాల్గొంటూన్నారే తప్ప వారి పోరాటంలో ప్రజాహితం శూన్యం! ఇది వింటానికి కఠోరంగా వున్నా మనం అందరం ఒప్పు కోవలసిన పచ్చి నిజం..

ఇప్పుడు టీచర్లు, ఉపాధ్యాయులు యింత భారీ ఎత్తున విజయవాడ తరలి వచ్చారు? దేనికోసం? వారి జీత భత్యాలకోసమే మాత్రమే అని నా ఉద్ధేశం.. అదే రేపు విధ్యుత్ / RTC ఉధ్యోగుల జీతాలలో కోత పెడితే వీరు కనీసం వారి తరుపున మాట్లాడం కూడా టైం వేస్టు అనుకుంటారు..

రేపు టిచర్లకు/ఉధ్యోగులకు డిఏలు ఇచ్చారే అనుకోండి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తారు కూడా (తెలంగాణాలో చూసామూ కూడా).. సో.. *యిటువంటి ఉద్యమాలు వాపే గానే బలుపు కాదు..*

నాకు గ్రౌండ్ రియాలిటి అంత తెలియక పోవచ్చు కానీ, నా వరకు బయటకు కనబడుతున్న నగ్న సత్యం ఇది..
దీనికి అనుగుణంగా కార్మికులలొ ప్రజాహితం నింపకుండా ఎన్ని పోరాటాలు చేసినా సమాజానికి కలిగే విశాల ప్రయోజనం శూన్యం...

వాసవ్య యాగాటి
2022-02-04

23, సెప్టెంబర్ 2019, సోమవారం

భారత ఆర్థిక మందగమనం పై నా విశ్లేషణ - పరిష్కారాలు

2 వ్యాఖ్యలు

మాంద్యం (Recession) అంటే?
వరుసగా రెండు పర్యాలు (Two Consequent terms) స్థూల దేశీయోత్పత్తి (GDP) గాని తగ్గితే దానిని మాంద్యం (Recession) అంటారు.


కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన
భారత అర్థికరంగ మాంద్యమానికి ప్రధాన కారణం "ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గడమే" (Decrease in purchasing power among people)


కేంద్ర ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు
  • ఒక లక్షా నలభై కోట్ల రూపాయిల (₹1.4 Lakh Crores per year)  విలువైన కార్పోరేట్ పన్ను(Corporate Tax) రాయితీ తో కలుపుకుంటే కార్పోరేట్ కంపెనీలకు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యిచ్చిన రాయతీలు అక్షరాల రెండు లక్షల కోట్ల రూపాయిలు (₹2 Lakh Crores).
  • గత ఐదు సంవత్సరాలలో కార్పోరేట్ కంపెనీలు తీర్చలేని రుణాలను, రుణ ఎగవేత దారులు అప్పులను Corporate Non-Performing Assets (NPAs) గా గుర్తించి వాటిని మాఫీ చేసిన మొత్తము అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయిలు (₹5 Lakh Crores).
  • GST రేట్లు పెద్దగా ప్రభావం చూపని వస్తువులపై కొంత మేర తగ్గింపు


కార్పోరేట్ టాక్స్ తగ్గింపు
·           టాక్స్  ఎవరు కడతారు?
ప్రైవేటు లిమిటెడ్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వాటి వార్షిక ఆదాయములో వచ్చే లాభం (Profit) మీద మాత్రమే ప్రభుత్వానికి కట్టే పన్ను.

·           తగ్గింపు ఎవరికి లాభం?
కంపెనీలకి లాభం వస్తేనే కట్టేది ఈ పన్ను, అంటే లాభాలో వున్న కంపెనీలకి యింకా లాభం.  ప్రస్తుతం నష్టాలలో వున్న కంపెనీలకు ఈ పన్ను ఎంత వున్నా నష్టం లేదు. అంటే, నష్టాలలో వున్న కంపేనీలకు ఎటువంటీ లాభం లేదు.

·           కార్పోరేట్ టాక్స్ తగ్గింపు వలన కలిగే లాభాలు..
కంపెనీలకు లాభాలు పెరగడం వలన, పెట్టుబడులు పెరుగుతాయి, ఉధ్యోగాలు పెరుగుతాయి, ఉధ్యోగుల జీతాలు పెరుగుతాయి, వీటిద్వారా ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందిని ప్రజలను నమ్మిస్తుంది.

·           కార్పోరేట్ టాక్స్ యింకా తగ్గాలి
కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే, యింకా తగ్గాలి అనే వారు కూడా వున్నారు.


కార్పోరేట్ టాక్స్ తగ్గింపు పై  నా విశ్లేషణ
  • కొందరు ఈ టాక్స్ తగ్గింపు వలన లాభం చాలా లాభాలు వున్నాయని భావిస్తున్నారు. లాభాలు పెరిగినప్పుడు ఆ లాభాన్ని ఎంప్లాయిస్ కి గాని, ఆ కంపెనీ కష్టమర్ల కు గాని ఆ లాభాన్ని బదలాయించడం/పంచండం (Transfer) ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, జరగదు కూడా.
  •  లాభాలు వచ్చేవానికి ఈ తగ్గింపువలన యింకా లాభాలు ఎక్కువగా వస్తాయి. సంవత్సరం ఆఖరున వచ్చిన లాభాలను పంచుకు తింటారు గాని ప్రజలకు పంచరు.
  • ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం వలన వచ్చిన అధిక ఆదాయం తన ప్రతిభ/శ్రమకు వచ్చిన ఆదాయంగా భావిస్తాడు గాని, ఆ ఆదాయాన్ని దిగువ వానికి బదిలీ (Transfer) చెయ్యాడు. యిది జగమెరిగిన సత్యం.
  • యిలా తగ్గించడం యిదే మొదటి సారి కాదు. 1997 లో కూడా ఒక సారి తగ్గించారు, అప్పట్లో 38.5% నుండి 30% కి తగ్గించారు. దానితో మన ఆర్థిక వ్యవస్తేమి అమాంతం పెరిగిపోలేదు.
  • కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ ఇతర దేశాలతో పోల్చుకుంటే అనే వారు గుర్తు పెట్టుకోవసినది ఏమిటంటే, ఆర్థికం గా బలంగా వున్న దేశాలలో ప్రత్యక్ష పన్ను   (ఆదాయపు పన్ను Income Tax) ద్వారా 60-70% ఆదాయము, మిగిలినది పరోక్ష పన్ను (Indirect Tax - GST, Corp.Tax, Cess, etc.) ద్వారా ఆదాయాని సమకూర్చుకుంటున్నారు.  మనదేశంలో పరోక్ష పన్ను ద్వారా 60-70% సంపాదిస్తున్నాము. ఈ విషయాన్ని దాచి పెట్టి కార్పోరేట్ టాక్స్ భారత్ లో ఎక్కువ అని బూటకపు ప్రచారం చేస్తున్నారు


కార్పోరేట్ మొండి బకాయిలను రద్దు
  • మనలను ఒప్పించేందుకు (convince) ఈ మొండి బకాయలకు చాలా పేర్లు పెట్టారు. ఉధ్ధేశకపూర్వ ఎగవేత, నిరర్ధక అప్పులు (Definitive debts), చెడు రుణాలు (Bad Debts)  వీటినన్నింటికీ ముద్దు పేరే  పనికిరాని ఆస్తులు(Non-Performing Assets).
  • ఎక్కడా కార్పొరేట్  అప్పులను రద్దు చేశాము అని ఎక్కడా చెప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు. NPAs అని, Written off అని, రద్దు చెయ్యలేదు కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో చూపించడం లేదు అని మనకు చెబుతుంటారు.
  • NPA క్రింద చూపిన ఒక్క అప్పు యిప్పటి వరకు బ్యాంకులు రికవరీ చేసిన దాఖలాలు లేవు. 
  • అంటే, డొంకతిరుడు (Indirect) గా రుణాలని మాఫీ చెయ్యడమే!. 

·   
మొండి బకాయిలను మాఫీ పై  నా విశ్లేషణ
  • పారిశ్రామిక వేత్తలు చేసే వ్యాపారలలో వుండే నష్టాలను (RISK) ప్రభుత్వం మీదకు రుద్దడం, లాభాలు వస్తే మాత్రం వారు వివధ మార్గాలు ద్వారా స్వంత ఆస్తులుగా మలుచుకోవడం ఈ దేశంలో జరుగుతూనే వుంది, ఈ ఆదాయాని/లాభాలను  వారి ప్రతిభకు/తెలివి తేటలకు  చిహ్నంగా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.
  • NPAs రుణ మాఫీలు అందరికి వుండదు.. రాజకీయ పలుకుబడి, బడా బాడా ప్రారిశ్రామికి వేత్తలకు మాత్రమే యివ్వడం జరుగుతుంది. 
  • యిలా రుణమాఫీ పొందిన బడా వ్యాపారులు అధికారంలో వున్న పార్టీల ఎన్నికల నిధులు సమకూర్చే వారీగా మారుతున్నారు. అందువలన, ఈ ఋణ మాఫీ అటూ రాజకీయ పార్టీలకు, వ్యాపారస్తులకు ఆభిస్తుంది. ఇదో చైన్ ఎఫెక్ట్. 

స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది? 
  • నా ఉద్ధేశం ప్రకారం స్టాక్ మార్కెట్ మధ్య తరగతి ప్రజల సొమ్ము ఒక పద్దతి ప్రకారం  కాజేయ్యడానికి ఒక వేదిక.
  • షెర్స్ కొన్న వాడు ఎప్పుడూ బాగుపడలేదు (బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కవ లాభం వచ్చింది లేదు. కానీ కంపెనీ అధిపతులు (Board of Directos) ఆస్తులు అనూయంగా పెరిగిపోతాయి. ఒకటి రెండు ఉదాహరణలు కాదు చూడవలసినది. రామారామీగా (Average) గా కూసినప్పుడు షేర్ హోల్దెర్స్ కి నాష్టాలే మిగిల్చాయి సామాన్యులకు .
  • సామాన్య ప్రజలను ఏదో ఒకటి‌ చూపి పెట్టుబడులు పెట్టించడం (షేర్ వాల్యూని క్ఱుత్రిమంగా పెంచి), తరువాత షేర్ వాల్యూని కావాలని తగ్గించడం. నష్ట పోయేది సామాన్య ప్రజలే
  • కొందరు  బాడా బాబులు స్టాక్ మార్కెట్ ని ఓ జూదశాలగా చేశారు.
  • ఈ పెరుగుదల బాడా బాబులు సామాన్య ప్రజలకు వేసిన ఒక బిస్కేట్ మాత్రమే.
  • ఈ స్టాక్ మార్కెట్ జూదంలో అంతిమంగా ఒడేది సామాన్య ప్రజలే  

 బి‌జే‌పి ప్రభుత్వా నికి ఇవ్వన్ని తెలియదా?
  • ఖచ్చితంగా తెలుసు. మరి ఎందుకు? యిదో విష వలయం.  
  • ప్రభుత్వం లోకి రావాలంటే రాజకీయ పార్టీలు  ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టాలి.  మరి ఫండ్ ఎలా వస్తుంది? అందుకే బి‌జే‌పి ప్రభుయత్వం ఎన్నియకల బాండ్లను (Election Bonds)  ప్రవేశ పెట్టిండి.
  • ఈ దేశంలో 1% (1,30,000) మంది దగ్గర 70%  మన దేశ సంపద గుమిగూడి వున్నది. అంటే 99% శాతం ప్రజల సొమ్ము 1% శాతం మంది దగ్గర వుండి అన్నమాట.  అలానే, దేశం మొత్తంలో 100 మంది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను సాశించే స్థాయిలో వున్నారు.
  • ఈ 100 మంది ఎలక్షన్ బాండ్స్ లో కావలసిన పార్టీకి పెట్టుబడులు పెడతారు. దాని ప్రతిఫలం గెలిచిన తరువాత ప్రభుత్వం ఈ బాడా వ్యాపారులకు యిచ్చి తీరాలి.
  • అందుకనే వేలకోట్లు బాకీ వున్న వారి ఆస్తులు ఆటోమాటిక్ జప్తు అయ్యే టట్లు కఠిన చట్టాలు తీసుకు రాలేవు. ఎన్నికల బ్లాండ్ల విష సంస్కృతే ఈ క్విడ్ ప్రోకో (యిచ్చి పుచ్చుకొనే దోరణి) 
  • ఎలానో వుంటారు కొందరు, వీరు కార్పోరేట్స్ కి చేస్ ప్రభుత్వ మేలును, ప్రజలకోసమే చేసినట్లు పిట్ఠకధలు చెప్పటానికి. వారినే "ఇంటలేక్చువాల్స్" అంటారు. వీరు కార్పొరేట్స్ కి బ్రోకర్స్

నా ఉద్ధేశం ప్రకారం ఈ చర్యలు తీసుకోవాలి
  • ప్రజలలో కొనుగోలు శక్తి పెంచాలంటే, కనీస వేతనం (Minimum wage) నెలకు 18 వేలు చెయ్యాలి దేశవ్యాపితంగా 
  • ఎక్కువ మంది వాడే వస్తువులపై GST (Indirect Taxes)  తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని GST పరిధిలోకి తీసుకురావాలి.
  • ఆదాయప పన్ను నుండి మద్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలి.
  • కోట్లాది రూపాయిలు సంపాదించే  వారిపై ఆదాయప పన్ను పెంచాలి.
  • అప్పు ఎగ్గొట్టీన ప్రతీ కార్పొరేటర్ ని డీఫాల్టర్ గా డిక్లర్ చేసి, వారి ఆస్తుయాలను స్వాధీనం చేసుకోవాలి.

వాసవ్య యాగాటి
2019-09-23